Shivaji raja : కళ్ళు సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన శివాజీ రాజా ఆ తరువాత చాలా సినిమాల్లో చిన్న సైజు విలన్ గా నటించాడు. నెగెటివ్ పాత్రలే కాకుండా సహాయక పాత్రలతోను మెప్పించాడు. కమెడియన్ గాను అలరించిన శివాజీ రాజా హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా మంచి గుర్తింపు నిచ్చింది. ఆయనకు నంది అవార్డు, అలాగే ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన సినిమాలలో నటనకు వచ్చాయి. ప్రస్తుతం మా సినిమా సంఘం లో కీలక పాత్ర పోషిస్తున్న శివాజీ సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు.
చిరు అభిమాని అవడం వల్ల కెరీర్ పోయింది….

దర్శకుడు వంశీ మొదట హీరోగా నన్ను చుసాడని శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్ సినిమాలో మొదట హీరోగా నన్నే అనుకున్న చివర్లో మార్చి నరేష్ ను పెట్టుకున్నారని చెప్పారు . ఇక మొదట హీరో ని చేసింది ఎమ్ వి రఘు గారని తెలిపారు. ఇక సీనియర్ నటుడు రంగనాథ్ గారు మొదటి నుండి నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనీ భావించేవారిని అలానే మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా తీశామని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 35ఏళ్ళు సినీ కెరీర్ లో అవకాశాలు రాలేదని, అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి కానీ బయటకు చెప్పకూడదని ఈ తరం వారికి సలహా ఇస్తానని చెప్పారు. చిరు అభిమాని అని చెప్పడం వల్ల వాళ్ళ మనిషి అనుకుంటారని ఇక మిగతా వాళ్ళు పట్టించుకోరు, ఇక మెగాస్టార్ వాళ్ళింట్లో మనోడే కదా అని పట్టించుకోరు అలా ఎటు కాకుండా పోయానని, ఈ విషయం తెలుసుకోడానికి 35 ఏళ్ళు పట్టిందని చెప్పారు.

మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరో సినిమాలోనూ ఇంతవరకు చేయలేదని చెప్పారు. మెగాస్టార్ తో ఇంతవరకు నటించలేదని, ఇకపై ఒకవేళ ఆయనే పిలిచి అడిగినా నటించనని ఆ ఓపిక, కసి ఇప్పుడు లేవని తెలిపారు. కానీ చాలా సినిమాలు ఇతర హీరోలతో చేసానని గుర్తుచేసుకున్నారు. ఇక బుల్లి తెర మీద అమృతం , ఆలస్యం అమృతం విషం, పండు మిరపకాయ్, నాన్న కుచ్చి వంటి సీరియల్స్ తో అలరించారు శివాజీరాజా. ఇక ఈమధ్య అర్జున ఫాల్గుణ సినిమాలో నటించారు.



































