శ్రియ సరన్ పరిచయం అవసరం లేని పేరు.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ స్టార్ గా వెలిగిన కథానాయిక. లేటు వయసులో కూడా అందాల ఆరబోతలో కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనే ఇస్తోంది. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అడపాదడపా కొన్ని సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. అయితే అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే ఆండ్రీ అనే రష్యన్ కుర్రాడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉండటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

తాజగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు నడుంకట్టింది శ్రియ శరన్. ఒక స్వచ్చంద సంస్థతో కలిసి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. కేవలం 200 రూపాయిలు చెల్లించి తనతో యోగ మరియు డాన్స్ చేయొచ్చు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ హాట్ హీరోయిన్. అయితే శనివారం సాయంత్రం 8గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉన్నట్టు తెలిపింది. కరోనా బాధితుల కోసం “ది కైండ్నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్ఫోర్స్” అనే స్వచ్చంద సంస్థలతో కలిసి విరాళాలు సేకరిస్తున్నారు తెలిపింది శ్రియ. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం ఈ విరాళాలు సేకరిస్తున్నారు తెలిపింది. ఈ క్రమంలో తనతో డాన్స్ చేయాలంటే http://www.thekindnessproject.in అనే వెబ్సైటు లో 200 రూపాయిలు చెల్లించి ఆ రశీదును give@thekindnessproject.in
కు ఇమెయిల్ చేయాలని పేర్కొంది.




























