Silk Smitha : సిల్క్ స్మిత.. మత్తు కళ్ళతో కుర్రకారుని పడేసిన ఒకప్పటి శృంగార దేవత. సిల్క్ ఒక్కసారి సినిమాలో కనిపిస్తే ఆ సినిమ హిట్ అనేంతలా క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కీ బ్యూటి అసలు శృంగార తారగా ఎలా మారింది… 400 పైగా సినిమాల్లో నటించిన సిల్క్ అంతే త్వరగా తన జీవితాన్ని ఎలా ముగించుకుంది. ఆమె మరణించినా ఎవరూ ఆమెను ఎందుకు పట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ లో ‘డర్టీ పిక్చర్’ సినిమాతో మరో సారి ఆమె తెర పైకి వచ్చింది. సిల్క్ అసలు స్టోరీ ఏమిటి… ఎందుకంత ఆమె పాపులర్ ఈ విషయాలను తెలుసుకుందాం….
సిల్క్ కొరికిన ఆపిల్ ఇరవై ఐదు వేలు…
సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సిల్క్ స్మిత ది ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు లో 1960 డిసెంబర్ 2న జన్మించింది. నాలుగో తరగతి వరకు చదివిన ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు ఆపేసింది. చిన్న వయసు నుండే సినిమాలంటే పిచ్చి ఉన్న విజయలక్ష్మి సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా అనుకుంది. ఇక అదే సమయంలో వాల్ ఉరి దగ్గర సినిమా షూటింగ్ జరుగుతొంటే అక్కడికి వెళ్లి డైరెక్టర్ ను రోజూ బ్రతిమాలడంతో ఒక చిన్న అవకాశం అందుకుంది.
Advertisement
ఇక ఆ తరువాత అక్కడ ఉంటే సినిమా హీరోయిన్ అవ్వలేనని చెన్నై వెళ్లాలని డిసైడ్ అయి తనని పెంచిన పెద్దమ్మను తీసుకుని చెన్నై వెళ్ళిపోయింది. ఇక అక్కడ నటి ఛాయా దేవి ఇంట్లో అద్దెకు ఉంటూ ఆమె తో పాటు షూటింగలకు వెళ్తూ అవకాశాల కోసం ప్రయత్నించింది. అదే సమయంలో టచ్ అప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అలా దొరికినా చిన్న అవకాశాలను చేస్తూ వెళ్తున్న విజయలక్ష్మి ని సిల్క్ గా మార్చిన చిత్రం 1979 లో విడుదల అయిన వండిచక్రం. ఆ సినిమాలో విజయలక్ష్మి నటించిన పాత్ర పేరు సిల్క్ అలా ఆమె ఫేమస్ అయింది. ఇక మలయాళం సినిమాలో అవకాశం వచ్చి అక్కడ సినిమా చేసిన సమయంలో డైరెక్టర్ ఆంటోనీ ఆమె పేరును స్మిత గా మార్చారు. అలా సిల్క్ స్మితగా మారిన విజయలక్ష్మి ఇక వెను దిరిగి చూసుకోలేదు.
వాంప్ పాత్రలకు బాగా ఫేమస్ అయిపోయి ఒకానొక దశలో సిల్క్ తో ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా హిట్ అనే దశకు చేరుకుంది. అలా దాదాపు రెండువందలకు పైగా నటించిన సిల్క్ క్రేజ్ ఎంతగా ఉండేదంటే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటి అప్పట్లో. అలాగే ఆమె కొరికిన ఆపిల్ వేలం వేస్తే ఇరవై ఐదువేలు పలకడం అప్పట్లో సంచలనం. అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ నా అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఒక మేనేజర్ ను బాగా నమ్మి మోసపోయిందని వార్తలు వినిపించాయి. అలాగే కొందరు డైరెక్టర్లు ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసారు. ఇవన్నీ కాక సొంత నిర్మాణంలో సినిమాలను తీసి నష్టపోయింది.
కెరీర్ పడిపోయి సిల్క్ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో 93 లో మళ్ళీ సినిమాలు చేసిన సిల్క్ అప్పటికే తనను చాలా మంది మోసం చేయడం, మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణ ఆమెను మోసం చేయడం తో 1996 సెప్టెంబర్ 23 న స్మిత తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. స్మిత వాంప్ పాత్రలను చేసినా తాను మృధుస్వభావి అని తనతో పనిచేసిన వారు చెబుతారు. ఆమె ఆస్తిని మేనేజర్ తన పేరు మీదకు మార్చుకున్నాడనే వాదన ఉంది. ఏదేమైనా చీకటిలో మళ్ళీ వెలుగు వస్తుందని ఎదురుచూడక అర్థాంతరంగా తన జీవితాన్ని ముంగించింది సిల్క్.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.