Singer Kousalya : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా…. రా రమ్మని రారా రమ్మని అంటూ తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్న సింగర్ కౌసల్య. 99లో పాడుతా తీయగా సింగింగ్ షోలో విన్నర్ గా నిలిచి ఆపైన సినిమాల్లో అవకాశాలను అందుకుని సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య నిజ జీవితంలో మాత్రం భర్త వేధింపులకు చాలా బాధపడింది. చివరకు 2015లో విడాకులు తీసుకుని ప్రస్తుతం తాను ఒక్కతే కొడుకును చూసుకుంటూ కెరీర్ లోనూ ముందడుగు వేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన వ్యక్తిగత జీవితం గురించి అలానే తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.

నా కొడుకే పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు…
జీవితంలో ఒక పెళ్లి ఫెయిల్ అయ్యాక చాలా మంది కుటుంబం పిల్లలు బాధ్యతల దృష్ట్యా ముఖ్యంగా ఆడవాళ్ళు రెండో పెళ్లి గురించి ఆలోచించరు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు, మారుతున్న కాలాన్ని బట్టి మనుషుల ఆలోచన తీరు మారుతోంది. అందుకే ఇప్పుడు పిల్లలే ఒంటరిగా ఉన్న తమ పేరెంట్స్ గురించి అలోచించి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.

అలా రెండో పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్న వారు ఎంతో మంది. ఇప్పుడు సింగర్ కౌసల్య విషయంలో కూడా తన కొడుకు కార్తికేయ అదే చెబుతున్నాడట. తాను ఒంటరిగా మిగిలిపోకూడదని తనకు ఒక తోడు ఉండాలంటూ చెబుతున్నాడట. పెళ్లి చేసుకో పిల్లా నీకేంటి అంటూ చెబుతుంటాడు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో కౌసల్య పంచుకున్నారు.

































