Singer Rahul sipliganj : తెలంగాణ హైదరాబాద్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన ‘రంగ రంగ రంగస్థలాన’ పాట. ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సింగర్ కాలభైరవ తో కలిసి పాడిన ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

కోటి గారు ఆదరించారు… కానీ నా గాడ్ ఫాదర్ కీరవాణి…
చిన్నప్పటి నుండి సంగీతం మీద మక్కువతో తండ్రి ప్రోత్సాహంతో మ్యూజిక్ వైపు వెళ్లిన రాహుల్ గజల్స్ నేర్చుకుని ఆపైన సంగీతం మీద పట్టు పెంచుకున్నాడు. అలా సింగర్ గా ఎదిగిన తనకు మొదట ఎంకరేజ్ చేసింది కోటి గారే, అయినా అవకాశాలు ఇచ్చి అన్నం పెట్టింది మాత్రం కీరవాణిగారు అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన నాకు గాడ్ ఫాదర్ అంటూ తెలిపారు. కోటి గారు అవకాశం ఇచ్చారు. మణిశర్మ గారు పని నేర్పించారు.

అయితే కీరవాణి గారి వద్ద పాడటంలో మెలకువలు అలాగే అందరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా నేర్చుకున్నాను అందుకే ఆయన నాకు గాడ్ ఫాదర్. అదీ కాక దాదాపుగా కొన్నేళ్లుగా ఆయన కాంపౌండ్ లో పాటలు పాడుతూ డబ్బు కొంత సంపాదించుకోగలిగాను. నేను సెటిల్ అయ్యానంటే అది ఆయన చలవే. అందుకే ఆయన నాకు గాడ్ ఫాదర్ అని చెబుతాను. ఆయన గురించి చెబుతున్నానంటే కోటి గారు, మణి శర్మ గారు తక్కువ అని కాదు ఎవరికి వారే అంటూ చెప్పారు.


































