కరోనా కోరల్లో చిక్కున్న ప్రముఖ సింగర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తాజగా కరోనా మహమ్మారిని జయించారు. తాజగా జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించారు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం విదేశీ వైద్యుల సూచనల మేరకు ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. ఎమర్జెన్సీ చికిత్సా విభాగంలో వెంటిలేటర్ మరియు ఎక్మో పరికరం సాయంతో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.

కాగా.. ఆగష్టు 5వ తేదీన కరోనా తో ప్రముఖ సీనియర్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అయన ఆరోగ్యంగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో అయన ఆరోగ్యం కాస్త విషమించినా ప్రస్తుతం అయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు త్వరగా కోలుకుని అయన గానంతో మరిన్ని పాటలు పాడాలని దేశవ్యాప్తంగా అయన అభిమానులు కోరుకుంటున్నారు.




























