Social activist Krishna Kumari : నవంబర్ 15 తెల్లవారుజామున కృష్ణ గారు ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించారు. ఇక ఆయన మరణానంతరం జరిగిన సంఘటనల గురించి చర్చ మొదలయింది. ముఖ్యంగా అన్నీ తానే అన్నట్లు నరేష్ ఉండటం, నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ అక్కడే ఉండటం, కుటుంబ సభ్యురాలిలాగా అన్ని విషయాలనూ చూసుకోవడం వంటివి చాలా మందికి నచ్చక ఆమెను సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ గారిని కడసారి చూడటానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి రావడం, ఒక మూలాన కొడుకుతో కలిసి కూర్చోవడం అక్కడ పవిత్ర లోకేష్, నరేష్ ఉండటం అందరినీ ఆకర్శించింది. ఇక ఈ విషయాల మీద సామాజిక వేత్త కృష్ణ కుమారి ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు.

కృష్ణ గారి అంత్యక్రియల సమయంలో ఏమిటా పనులు…
కృష్ణ కుమారి మాట్లాడుతూ కృష్ణ గారు మరణించిన వెంటనే ఆయన కుటుంబం ఆయనకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడికి కూడా పవిత్ర లోకేష్ ను నరేష్ తీసుకెళ్లడం కుటుంబ సభ్యురాలిగా ఆమెను చూపించడం ఏమిటి అంటూ కృష్ణ కుమారి గారు అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణ గారి పార్థివ దేహం వద్ద పవిత్ర లోకేష్ ఇంటి సభ్యురాలు అన్నట్లు వ్యవహరించడం, ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వచ్చినపుడు నరేష్ పవిత్ర లోకేష్ తో చేతులేసి మాట్లాడటం, రమ్య ఎక్కడో మూలన కూర్చొని ఉంటే పవిత్ర లోకేష్ ను ముందు వరుసలో బంధువుల మధ్యలో కూర్చోబెట్టడం, కళ్ళతోనే ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా సార్లు మీడియాలో ఫోకస్ అయ్యారు.

కళ్ళతో సైగలు చేసుకుంటూ నరేష్ తరచూ పవిత్ర వద్దకు రావడం మాట్లాడటం ఏమిటా పనులు, అక్కడ ఉన్నవాళ్లంతా చీదరించుకునేలా వారి ప్రవర్తన ఉంది. ఇక మహేష్ బాబు కి బాగా కోపం వచ్చినట్టు అతను వీళ్ళిద్దరినీ చూసిన తీరుకే తెలిసిపోతుంది. రమ్య రఘుపతితో విడాకులు తీసుకుని ఉంటే నువ్వు ఇంకో మహిళాతో అలా ఉన్నా నీ భార్య ముందు తప్పు లేదు కానీ విడాకులు ఇవ్వకముందే తన ముందు ఇంకో మహిళతో అలా ప్రవర్తించడం హర్షనీయం కాదు. రమ్య రఘుపతి ఈ విషయంలో కేసు పెట్టొచ్చు నరేష్ మీద ఇంకో మహిళతో నా ముందే తిరుగుతూ మానసికంగా వేధిస్తున్నాడని అంటూ కృష్ణ కుమారి గారు అభిప్రాయపడ్డారు.


































