కరోనా ఉదృతి నేపధ్యంలో, లాక్ డౌన్ ఉన్న కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి అండగా నిలిచాడు. వేలాది మందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుత సెకండ్ వేవ్ లో కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు సోనూసూద్.

ఏపీ లోని కర్నూలు మరియు నెల్లూరు జిల్లాల్లో మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. మరోవైపు సోనూసూద్ అభిమానులు ఆయన కటౌట్కు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాలను వృధా చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు సోనూసూద్. పాలు అవసరమైన వారి కోసం వాటిని అందజేయాలని, అంతే గానీ ఇలా పాలను వృధా చేయొద్దని తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పాలాభిషేకాలు చేస్తున్న వీడియోలను ట్యాగ్ చేస్తూ పాలను పేదరికంలో ఉన్న వారికి అందజేయాలని సూచించారు.
Humbled ❣️
— sonu sood (@SonuSood) May 24, 2021
Request everyone to save milk for someone needy.???? https://t.co/aTGTfdD4lp































