Connect with us

Featured

అయన చిరకాల కోరిక తీరకుండానే కన్నుమూసిన బాలు !! థియేటర్ లో విగ్రహం..

Published

on

తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరమే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం. పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు. బాలుగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకున్నారు. ఆయా భాషల్లోని మాటల భావాత్మని తన గొంతులో పలికించారు. ఆ భాషల శ్రోతలకు గళపరిమళాన్ని పంచి, స్వర సామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగారు. అలాంటి బాలు మన తెలుగువాడు కావడం మనం మరీ మరీ మురిసిపోవలసిన విషయం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన ఆఖరి కోరిక తీరకుండానే స్వర్గంలోని ఆ దేవతలను తన గానామృతంతో అలరించడానికి తుదిశ్వాస విడిచారు. బతికి ఉండగానే చూడాలనుకున్నది చూడకుండానే కన్నుమూశారు. ఇంతకీ.. మన గాన గంధర్వుని చివరి కోరిక ఏమిటో తెలుసా?

2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు కరోనా సోకకముందే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ఇష్టపడి తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 25 సెప్టెంబర్ 2020 న చెన్నయ్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.! అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం జీవం పోసుకుంటోంది. బాలసుబ్రహ్మణ్యం ఏడాది క్రితమే తన విగ్రహం తయారు చేయించుకోవాలనే కోరిక కలగటంతో కొత్త పేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్‌ను సంప్రదించారట. 2019 నవంబర్ నెలలో బాలు తన తండ్రి పండితారాద్యుల సాంబమూర్తి విగ్రహాన్ని తయారు చేయించడానికి కొత్తపేటకు వచ్చారు. ఆ సందర్భంలోనే తన విగ్రహాఁ కూడా తయారు చేయించుకోవాలని ముచ్చట పడిన బాలు తన విగ్రహం తయారు చెయ్యడానికి కావాల్సిన ఫొటోలను కూడా తీయించుకున్నారు. అలా తయారైన విగ్రహాన్ని చెన్నైలోని బాలు ధియేటర్‌లో పెట్టుకోవాలనేది ఆయన చివరి కోరిక. కానీ ఈమధ్యనే బాలుకి కరోనా వైరస్ సోకడంతో విగ్రహం పూర్తి కాకుండానే బాలు మృతి చెందారు.

ఆయన కరోనాతో హాస్పిటల్‌ లో చేరారని తెలిసిన వెంటనే శిల్పి రాజ్ కుమార్ వడయార్ విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టారు. బాలు సజీవంగా ఉండగానే విగ్రహం తయారు చేసి ఇవ్వాలని శిల్పి రాజ్ కుమార్ ఎంతగానో శ్రమించి గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఆ ప్రతిమకు ప్రాణం పోస్తున్నారు. కానీ.. ఆ విగ్రహం పూర్తయ్యేలోపే బాలు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణం తనను మానశికంగా ఎంతగానో బాధిస్తుందని, వీలైనంత త్వరగా బాలు గారి విగ్రహాన్ని పూర్తి చేసి చెన్నై పంపిస్తానని శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తెలియజేసారు. రాజకుమార్ వడయార్ ఇదివరకే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి మంచి పేరు సంపాదించారు. ఎంజీఆర్‌, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. అలాంటి శిల్పి చేత మన బాలు తన విగ్రహాన్ని తయారుచెయ్యమని చెప్పడం నిజంగా సంస్కారవంతమైన లక్షణమని చెప్పాలి.

వాస్తవానికి బాల సుబ్రహ్మణ్యం గారి చివరి కోరిక ఇదే అవుతుందని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. సెప్టెంబర్ 25న మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వర స్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది. సంగీత లోకాన చిరయశస్సుతో జీవించాలని తపన పడ్డ గానతపస్వీ. ఈ గాన గంధర్వుడి ప్రస్థానం నిర్విరామంగా కొనసాగాలని అశేష అభిమానుల విశేష ఆకాంక్షించారు. కానీ విధి రాతలో అందరూ పాత్రధారులే కదా ఏమైతేనేం బాలు చిరస్మరణనీయుడు, స్వరస్మరణీయుడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!