ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్తో పోరాడి గెలిచిన బాలుని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆ రోజు నుంచీ ఆయనను ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందారు. ఆ తరవాత వెంటిలేటర్తో పాటు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ సపోర్ట్తో బాలుకి వైద్యులు చికిత్స అందించారు. కానీ.. ఒక్కసారిగా బాలు మరణవార్తతో యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమారు 50 రోజుల పాటు బాలు ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ 50 రోజుల కాలంలో బాలుకి కరోనా చికిత్స జరిగింది. ఆయనకు కరోనా వైరస్ తగ్గినట్టు వైద్యులు చెప్పారు. కానీ ఆ తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలు బాలుకి వచ్చాయి. అందుకోసమె బాలుకి వెంటిలేటర్ పెట్టారు. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఐసీయూలో ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి పలుమార్లు ప్రకటించింది. దాంతో ఈ 50 రోజుల ట్రీట్ మెంట్ కి ఎంత ఖర్చయి ఉంటుందనే విషయాన్ని బాలు ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ‘గట్టిగానే వసూలు చేసి ఉంటారు.’ అనే అభిప్రాయాన్ని కొంతమంది ఫాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఎస్పీ బాలుకు అంతగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. ఆయన ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లినట్టుగా వార్త కూడా రాలేదు. కానీ.. ఆయనకు కరోనా సోకిన దగ్గర్నుండి ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా మారడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటె.. బాలు ఆరోగ్య పరిస్థితి కరోనా సోకిన తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడానికి కారణం మరొకటి ఉంది అని తెలిసింది. గత సంవత్సరం బాలసుబ్రహ్మణ్యం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట. అదే ఇప్పుడు ఆయనకు తిరగబడిందట. బాలు బరువు ఎక్కువగా ఉంటారని అందరికీ తెలిసైనా విషయమే.!
వయసు మీదపడుతున్న కొద్దీ ఆయన బరువు తగ్గకపోవడంతో ఇంకా బరువు పెరిగితే సమస్యలు వస్తాయేమోనన్న సందేహంతో ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట. అందుకే ఆ మధ్య ఆయన కాస్త సన్నబడ్డట్టు కనిపించారు. అయితే.. ఈ సర్జరీ వల్ల కొన్ని అవయవాలు దెబ్బతిని.. సర్జరీ తర్వాత కొన్ని సమస్యలు కూడా వచ్చాయట. అయినా మళ్లీ క్యూర్ అయ్యే టైంలో ఇప్పుడు కరోనా మహమ్మారి రావడం.. అది కూడా వీక్ గా ఉన్న అవయవాలను అటాక్ చేయడం జరిగిందట. అందుకే బాలు ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.