Connect with us

Featured

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి… అలా ఎందుకన్నారో తెలుసా ?

Published

on

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను ఎప్పుడైనా విన్నారా.? అలా ఎందుకు అన్నారు.. దాని వెనుక కధ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా పులస చేప మన గోదావరి జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది. దీని ఖరీదు కేజీ సుమారు 3 వేల నుండి 5 వేల వరకు ఉంటుంది ఒక్కోసారి డిమాండ్ బట్టి 8 వేల రూపాయలు కూడా ఉంటుంది. దీనిని అమ్మెటప్పుడు వేలం పాట వేస్తారు. ఒక్కొకరు వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి ధర పెట్టి పాడుకుంటారు.

ఈ చేప గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, న్యూజిలాండ్ వస్తుంది అక్కడ నుండి టాంజినీయా దేశం దాటినా తర్వాత హిందూ మహాసముద్రంలో కలిసి అక్కడ నుండి బంగాళాఖాతంలోకి వస్తుంది. ఎప్పుడైతే గోదావరిలో ఎర్ర నీరు వస్తుందో ఆ శ్రేష్టమైన మంచినీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో ఇవి ఎదురీది గోదావరిలోకి వస్తాయి. ఇక్కడ కొన్ని గుడ్లు కూడా పెడతాయి ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఆ విధంగా గోదావరిలోకి ఎదురిదుతూ వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసే మధ్యలో మన జాలర్లు వీటిని పట్టుకుంటారు. ప్రవాహానికి ఎదురీదే పులస చేపలు మాములుగా అలా ఎదురు ఈదే చేపలు చాలా వరకు చచ్చిపోతాయి. వీటికి ముల్లులు ఎక్కువగా ఉండటం వలన అలా ఎదురు ఈదగలుగుతుంది. కాని ఒక్కసారి వలలో పడగానే పులస చనిపోతుంది. సముద్రంలో ఉన్నపుడు దీనిని ఇలస అని అంటారు.

ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని పులస అంటారు. ఇలసగా ఉన్నప్పుడూ దీని ధర కేవలం 70 నుండి 120 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ పులసగా మారిన తర్వాత దీని రేటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అని ఊరికే అనలేదు దీని రుచి అలాంటిది మరి. ధర గురించి కాదు కానీ రుచి పరంగా ఒక్కసారి పులస చేప కూర వండుకుని తింటే ఇంకా మిగతావి అన్నీ దీని ముందు బలాదూర్ అనిపిస్తాయి. పుల్సాకున్న డిమాండ్ ను గుర్తించిన కొందరు జాలర్లు ఒరిస్సా నుండి అచ్చం పులసలాగే ఉండే చేపలను ఆంధ్రాకు తీసుకొచ్చి బురిడీ కొట్టించి అమ్మేస్తుంటారు. వీటి డిమాండ్ ను క్యాష్ చేసుకోవడం కోసం వీటిని గుర్తించడం చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అందులోనూ పెద్దవాల్లైతే బాగా గుర్తిస్తారు. ముఖ్యంగా ఇవి వెండి రంగులో మెరుస్తుంటాయి. వీటి నోరు పసుపు రంగును పోలి ఉంటుంది.

ఈ పులసలలో కూడా మళ్ళీ 2 రకాలుంటాయి. 1. పోతు పులస 2. సెన పులస… దీనిలో ఆడ పులస అంటే సెన పులసి కి మరింత డిమాండ్ ఎక్కువ. పులస తెచ్చేస్తే సరిపోదు అండి అది వండే విధానం కూడా తెలియాలి. పులస కూరలో లేత బెండకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అలానే పక్కన పెట్టేసి ఆ తర్వాత రోజు తినాలి. వండిని రోజు కంటే ఆ రోజు వదిలేసి తర్వాత రోజు తింటే పులస రుచిని జన్మలో మర్చిపోరు. ఏంటి కూర కి అంత బిల్డప్ అవసరమా అనుకుంటారేమో… దాని రుచి అలాంటిది మరి. కావాలంటే మీరు కూడా ఒకసారి తిని చూడండి. నిజంగా చాలా బాగుందంటారు. చివరిగా ఒక చిన్న విషయం.. ఈ పులస చేపలు సంవత్సరంలో దొరికేది 3 నెలలు మాత్రమే.. అది కూడా జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో మాత్రమే వీటి కోసం మన గంగపుత్రులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీటిని పట్టుకుంటారు. ఆడండి మన పులస చేపల కథ..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!