Connect with us

Featured

పెద్ద పతివ్రత కబుర్లు చెప్పారుగా ఇప్పుడు ఏమయింది..? రకుల్, మంచులక్ష్మి లపై శ్రీరేడ్డి సంచలన వ్యాఖ్యలు..

Published

on

టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన శ్రీరెడ్డి నటిగా ఎవరికీ పెద్దగా తెలియదు కానీ కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రం ఆమె పేరు బాగా వినిపించింది. అస్సలు మొహమాటం, సిగ్గు అనేది లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. అప్పుడే సంప్రదాయ చీరకట్టులో పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుంది.

ఏంటో.. ఈ శ్రీ‌రెడ్డి! ఎవరికి అర్థం కాద‌నిపిస్తుంది. 2019లో “సుచీ లిక్స్” పేరుతో దక్షిణాది తారల వ్యక్తిగత విషయాలను గాయని సుచిత్ర బయటపెట్టినట్లే “శ్రీ లీక్స్” పేరుతో నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలనమైన కామెంట్స్ చేసి టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.! కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించడమే కాకుండా.. తనకు సినిమా ఛాన్స్ లు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. టాలీవుడ్ లో ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నానిలను టార్గెట్ చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేరు మారుమ్రోగిపోయేలా చేసింది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం శ్రీరెడ్డి చేస్తోందని కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరోపించింది.

అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్‌తో పాటు మంచు లక్ష్మీలపై కూడా తన దైన స్టైల్ లో ఫైర్ అయింది శ్రీరెడ్డి. “తాను కేవలం పబ్లిసీటీ కోసం మీడియా ముందుకు రావడం లేదని రకుల్ ప్రీత్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘రకుల్ ప్రీత్.. చెత్త చెత్తగా మాట్లాడవద్దు.. నిన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తారు.. కానీ కాస్టింగ్ కౌచ్ గురించి మేము మాట్లాడింది అబద్దమని పిచ్చి, పిచ్చి కామెంట్స్ చెయ్యకు.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే నీకు, మా లాంటి వాళ్ల బాధ ఏం తెలుసు.. అప్పట్లో నేను టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తోన్నపుడు నువ్వొచ్చి.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వంటివి గానీ, డ్రగ్స్ కానీ ఏమి లేవు. ఇక్కడ ఎవరు ఎవరినీ తిట్టరు అంటూ పెద్ద క్యాండిల్ ర్యాలీ చేసావుగా.. టాలీవుడ్ లో నీకు కోట్లు కుమ్మరిస్తుంటే పాపం.. నువ్వు టాలీవుడ్ గొప్పతనం గురించి చెప్పకపోతే ఏం చెప్తావులే.. జిమ్‌లు పెట్టి వ్యాపారం కూడా చేస్తున్నావు, ఇదంతా తెలుగు ప్రేక్షకుల డబ్బు.. అప్పనంగా తింటున్నావు.. ఇక్కడ సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూసే వందలాది మంది కార్మికులు ఉన్నారు.. గుర్తించుకో.! నీలాంటి వాళ్లను టాలీవుడ్ లో ఉంచకూడదనే మా ప్రయత్నం. ఎక్కువ మాట్లాడితే, తెలుగోళ్లం అందరం కలిసి నీ తాట తీస్తాం.. ఖబడ్దార్ బిడ్డా’ అంటూ హెచ్చరించింది.

ఇదే సందర్భంలో మరో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి మాట్లాడుతూ.. మంచు లక్ష్మి ఏమో.. మా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయా.? కాస్టింగ్ కౌచ్ ఉందా.? అందాల మేడలో ఉన్న మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? అంటూ గతంలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ను శ్రీ రెడ్డి గుర్తు చేసింది. ఈ రోజు డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు బయటకు వచ్చింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చెప్పిన రకుల్.. బాలీవుడ్‌లో మాత్రం అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉండకూడదంటూ చెప్పడం తన 2 నాల్కల ధోరణికి నిదర్శనం కాదా.? అలాగే డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు ఎలా బయటికి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు నా గురించి ఏదేదో చెత్త వాగుడు వాగిన రకుల్ అసలు రహస్యాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నాకేలాగో చెడ్డ పేరు వచ్చింది. ఎవరు చేసిన కర్మను వాళ్లు అనుభవించక తప్పదు అంటూ వేదాంతం వల్లించింది శ్రీ రెడ్డి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!