Star Heroins : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో ముందుకు కొనసాగాలంటే ఎన్నో త్యాగాలను చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం మనగడ ఉండదు. ఈ క్రమంలోనే హీరోయిన్లుగా ఉన్న సమయంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలంటే గ్లామర్ షో చేయడం తప్పనిసరి.
అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తే తప్ప వారికి అవకాశాలు వచ్చే దాఖలాలు కనపడడం లేదు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోస్ లేకుండా ఇండస్ట్రీలో అగ్రతారలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిన గ్లామర్ షో మాత్రం చెయ్యమని తెగేసి చెబుతున్నారు. ఇలా గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే….
సౌందర్య: అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ ఎంతో సాంప్రదాయపద్ధంగా చీరలు కట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిల ప్రతి సినిమాల్లో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇలా తెలుగులో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు మిగిలింది.
లయ: తెలుగు చిత్ర పరిశ్రమలో లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కూడా ఎలాంటి స్కిన్ షో చేయకుండా కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామన్నా కానీ సినిమాల నుంచి తప్పుకున్నారు తప్ప స్కిన్ షో చేయడానికి ఒప్పుకోలేదు.
స్నేహ: సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ అచ్చం సౌందర్య లాగే కట్టుబొట్టుతో ఆమెను తలపించారు. అయితే ఈమె కూడా ఎలాంటి స్కిన్ షో చేయకుండా ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ కొంతకాలం మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగారు.
నిత్యామీనన్: మలయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ సైతం స్కిన్ షో కి దూరంగా ఉండే సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇదే కోవలోకి నటి కీర్తి సురేష్ కూడా వస్తారని చెప్పాలి. ఈమె కూడా మితిమీరిన స్కిన్ షో చేయకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
సాయి పల్లవి: ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి గ్లామర్ షోకు పూర్తిగా వ్యతిరేకి. ఈమె గ్లామర్ షో చేయాల్సి వస్తే తాను ఇండస్ట్రీకి దూరం అవుతానా కానీ గ్లామర్ షో మాత్రం చేయనని ఖరాఖండిగా చెప్పారు.గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా ఈ నటీమణులు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.