రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్కు ముగింపు పలకాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు యధావిధిగా కొనసాగించేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇక భారీగా జనాలు గుమిగూడే జరిగే అవకాశం ఉండడంతో థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటిని కూడా యధావిధిగా మూసివేయనున్నారు. ఇక పెళ్ళిళ్ళు, అంత్యక్రియల వంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది.

ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్డౌన్తో కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే విషయంతో పాటూ ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి సీఎం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.





























