తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందంటే దానికి కారణం కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, చక్రపాణి, విటలాచార్య, డి రామానాయుడు ఇలా చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఐతే తెలుగు సినిమా పరిశ్రమ యొక్క నాలుగు పిల్లర్లలో దగ్గుబాటి కుటుంబాన్ని ఒక పిల్లర్ గా వర్ణించవచ్చు.
మూవీ మొగల్ గా పేరు సంపాదించిన డాక్టర్ డి.రామానాయుడు ప్రముఖ నిర్మాతగా అవతారమెత్తి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సినిమాలను సమర్పించి అరుదైన రికార్డులను నెలకొల్పారు. పెద్ద హీరోలను, హీరోయిన్లను, దర్శకులు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఒక్క డి.రామానాయుడు గారికే దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. తన తనయులు వెంకటేష్ హీరోగా, సురేష్ బాబు నిర్మాతగా తెలుగులో ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పుకోవచ్చు.
దగ్గుబాటి వంశం మూడవ తరం కూడా రానా రూపంలో దివ్యంగా వెలిగిపోతుంది. డాక్టర్ డి. రామానాయుడు తన జీవితంలో… బ్రతుకు బ్రతికించు అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు. ఇతరులకు కూడా ఆ సిద్ధాంతం చెబుతూ తాను కూడా అదే పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు డి. రామానాయుడు. అయితే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటుంటారు. డి.రామానాయుడు విజయాల వెనుక కూడా అతని సతీమణి ఉన్నారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉన్న వ్యవసాయాన్ని వదిలేసి సినిమా నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు అందరూ అతనిని నిరుత్సాహపరిచారు కానీ అతని భార్య రాజేశ్వరి అతని వెన్నంటే ఉండి ముందుకు నడిపించారు.
రాజేశ్వరి డి.రామానాయుడు మేనమామ కూతురు కాగా… అతను తన బంధువైన ఒకరి ఇంట్లో ఉంటూ ఎస్ఎస్సి చదువుకుంటున్న రోజుల్లో తన మేనమామ ఇంటికి తరచూ వెళ్తుండేవారు. ఆ సమయంలోనే రాజేశ్వరిని చూసి ఆమెపై మనసు పారేసుకున్నారు రామానాయుడు. అప్పటికే రామానాయుడు పార్ట్ టైం కాంపౌండర్ గా పని చేస్తున్నారు. మనసుకు నచ్చిన రాజేశ్వరి ని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్న రామానాయుడు నేరుగా తన తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. దీంతో కొడుకు కోరికను కాదనలేక తన తండ్రి అతడిని రాజేశ్వరికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానంతరం రామానాయుడు గారిని చాలా చక్కగా చూసుకున్నారు రాజేశ్వరి.
ఆ కాలంలోనే రామానాయుడు గారికి వందల ఎకరాల్లో సేద్యపు భూమి ఉండేది. ఆమె కూడా రామానాయుడు గారితో కలిసి పొలాలకు వెళ్లేవారు. కూలీలతో పని చేయించడంతో పాటు తాను కూడా కాయకష్టం చేసేవారు. పంట పండించి విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బుల్లో మూడోవంతు డబ్బుని దాచి పెట్టేవారు. ఆ విధంగా లక్షల రూపాయలను దాచిపెట్టిన రాజేశ్వరి తన భర్త సినిమా రంగంలో అడుగుపెడుతున్నారని తెలిసి అతనికి డబ్బులు మొత్తం ఇచ్చేసింది. తన భార్య లక్షల రూపాయలను ఇస్తుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన రామానాయుడు తర్వాత విషయం తెలిసి ఆమెను తెగ మెచ్చుకున్నారు. ఈ విధంగా భార్య చెమటోడ్చి పొదుపు చేసిన డబ్బులతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తిరుగులేని నిర్మాతగా ఎదిగారు రామానాయుడు. భార్య చేతి మహిమో ఏమో కానీ తాను ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్ చిత్రంగా మారిపోయేది. సింపుల్ గా చెప్పాలంటే అతను పట్టిందల్లా బంగారమే అయ్యింది.
Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Advertisement
ఆల్ ది బెస్ట్ మై లవ్.. మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.
Advertisement
ఆడబిడ్డకు సాయం.. ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
సినిమా విజయం కోసమే పూజలు.. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.