Connect with us

Featured

ఓటీటీ స్టార్ సత్యదేవ్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా ?

Published

on

కేవలం టాలీవుడ్ పరిశ్రమ మాత్రమే కాకుండా భారతదేశ చలనచిత్ర రంగంలో ఎంతో మంది హీరో హీరోయిన్స్ కు లక్కీ గాడ్ ఫాదర్ ఉన్నవారే. ఈ విషయాన్ని ప్రతి సినిమా అభిమాని ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రతి ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే వారు సినిమాలలో ఒక మెట్టు ఎదిగి ప్రస్తుతం హీరోలుగా చలామణి అవుతున్నారు.

ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఎదిగిన హీరో ఎవరు అంటే సత్యదేవ్ అనే పేరు వినిపిస్తుంది. విశాఖపట్నం లో పుట్టి పెరిగి కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సత్యదేవ్ బెంగళూరు నగరంలోని ఐబీఎం కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. ఆయనకు సినిమాల పట్ల విపరీతమైన ఇష్టం ఉండడంతో సెలవు లభించే శని, ఆదివారాల్లో బెంగళూరు నుండి హైదరాబాదుకు వచ్చి మరి ఏ చిన్న ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్లి అటెండ్ అయ్యాడు. అయితే 2016 సంవత్సరంలో ఆయన ఉద్యోగం నుండి పూర్తిగా తప్పుకొని ఈ చిన్న పాత్రలు వచ్చినా సరే సినిమాలో నటించడానికి మొహమాటపడకుండా అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. ఇలా ఆయన తాను చేసిన ప్రతి క్యారెక్టర్ ను తన విజయానికి ఒక మెట్టు గా మార్చుకొని ఎవరు గమనించ లేని పాత్రలను సైతం చేసుకుంటూ ముందుకు కదిలాడు.

సత్య దేవ్ మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో, అలాగే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తో దెబ్బలు తినే పాత్రలో కూడా ఆయన నటించాడు. ముకుంద సినిమా లో వరుణ్ తేజ్ స్నేహితుడుగా కూడా నటించాడు. ఆ తర్వాత ఏకంగా 500 మంది ఆర్టిస్టులను ఆడిషన్స్ చేయగా జ్యోతిలక్ష్మి సినిమా కు లీడ్ రోల్ కుసెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమాలో చార్మి క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నప్పటికీ సత్యదేవ్ తన పాత్ర మేరకు బాగా నటించి మంచి మార్కులు పొందగలిగాడు. ఆ తర్వాత చాలా సినిమాలలో మెయిన్ రోల్ చేయకపోయినా సరే పెద్దపెద్ద హీరోల సరసన నటించగలిగాడు. ఓటిటి ఫ్లాట్ఫామ్ లో విడుదల అయిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా వరకు సత్యదేవ్ మెయిన్ హీరోగా ఏ సినిమాలో కూడా నటించలేదు.

అయితే ఆయన నటనకు మాత్రం మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. ఇదివరకు బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ను తెరకెక్కించిన అది పెద్దగా ఆడకపోవడంతో నిరాశ పడ్డాడు. కరోనా సమయంలో నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ఫామ్ ద్వారా ఉమామహేశ్వర ఉగ్రరూపం సినిమాతో మంచి మార్కులను సంపాదించాడు. ఆ తర్వాత కూడా జి ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో కూడా 47 డేస్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్, సరిలేరు నీకెవ్వరు, అంతరిక్షం, ఘాజీ ఎటాక్, బ్రోచేవారెవరురా అలాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన అవి ఆయన విజయానికి మెట్ల లాగా ఉపయోగించుకున్నారు. ఈయన కేవలం దక్షిణ భారతదేశ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. సత్య దేవ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి విజయం సాధించాడు. తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ ద్వారా విడుదలైన ఆకాశమే హద్దు అనే సినిమాకు తెలుగు వర్షన్ లో హీరో సూర్యకు గాత్ర దానం చేశాడు.

సత్యదేవ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను సైతం వదలట్లేదు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించిన అవి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే హీరో సత్యదేవ్ కృషి వెనకాల అతడి భార్య దీపిక కృషి, తోడ్పాటు మాత్రం ఎంతో దాగి ఉంది. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో కష్టపడి కేవలం వారాంతరంలో బెంగళూరు నుండి హైదరాబాదుకు వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే ఆయన తిప్పలు చూడలేక సత్యదేవ్ కి ఉద్యోగం వదిలి వేయమని కుటుంబాన్ని మొత్తం చూసుకుంటానని ఆవిడ ఆయనకు భరోసా ఇచ్చింది. సతీదేవ్ భార్య దీపిక ఓ ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని సత్యదేవ్ విజయంలో కీలక పాత్ర పోషించిఇది. ఈమె విషయంలో హీరో సత్యదేవ్ ఈ ప్రపంచంలో తాను ప్రేమించి గౌరవించేది తన భార్యను మాత్రమే అంటూ గర్వంగా చెప్తాడు. ప్రస్తుతం సత్యదేవ్ ఇక గుర్తుందా శీతాకాలం అనే సినిమా లో నటిస్తున్నాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!