Sunny leone : ఒకప్పటి నీలి చిత్రాల తార నేటి బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. కెనడాలో పుట్టి అమెరికా లో పెరిగి ఒక పోర్న్ స్టార్ గా, నగ్న ఫోటోలను మ్యాగజైన్స్ మీద కవర్ ఫోటో గా వచ్చిన నటి ఇండియా కు ఎలా వచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది. పోర్న్ వైపు నుండి సినిమాల వైపు వచ్చిన సన్నీ కెరీర్ పరంగా చాలా మందికి నచ్చక పోయినా రియల్ లైఫ్ లో మాత్రం ఆమె చేస్తున్న సేవకు ఫిదా అవ్వాల్సిందే. మహారాష్ట్రలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని వసతులను అందిస్తోంది. అలాగే కాన్సర్ తో బాధపడుతున్నవారి కోసం మారతాన్ అలాగే పెట్స్ రక్షణ కోసం పనిచేస్తోంది. అలాగే పెటా సభ్యురాలిగా కూడా కొనసాగుతున్న సన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.
మోడల్ గా పోర్న్ స్టార్ గా…
సన్నీ లియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ వోహరా. ఆమె ఇండియా సంతతికి చెందిన సిక్కు కుటుంబానికి చెందిన ఆమె. అయితే సన్నీ పుట్టింది కెనడాలో అయితే ఆమెను క్యాథలిక్ గా తల్లిదండ్రులు స్కూల్ చేర్పించేటపుడు రిజిస్టర్ చేయించారు. ఇక గ్రాండ్ పేరెంట్స్ కోసం క్యాలిఫోర్నియా కు సన్నీ కుటుంబం వెళ్లారు. ఇక అక్కడే చదువుకున్న సన్నీ నర్సింగ్ కోర్స్ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసే సమయంలో మోడల్ కావాలని ఆశపడేది. అదే సమయంలో నగ్నంగా నృత్యం చేసే ఒక మహిళ పరిచయం అవడం ఆమెతో మాట్లాడక అలాంటివి ప్రొఫెషన్ అని తెలుసుకున్న సన్నీ అటువైపు అడుగులేసింది. ఆమె ద్వారా పరిచయమైన ఒక ఏజెంట్ ద్వారా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద మొదటి సారి నగ్నంగా ఫోజులిచ్చింది. ఆమె పేరును వర్క్ కోసం సన్నీ లియోన్ గా మార్చుకుంది. ఇక అతని ద్వారా వివిడ్ అనే కంపెనీ కి చెందిన వ్యక్తి పరిచయం అవడం అక్కడ పోర్న్ సినిమాలను చేయడానికి కాంట్రాక్టు రాసుకోవడంతో సన్నీ కెరీర్ మలుపు తిరిగింది.
Advertisement
సినిమాలకు ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు పోర్న్ సినిమాలను చేసినందుకు ఫీల్డ్ లో సన్నీకి వరించింది. ఇక అలా పోర్న్ సినిమాలను చేస్తూనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే రైట్స్ తీసుకుంది సన్నీ. ఆ తరువాత తన పేరుతో వెబ్సైటు పెట్టగా ఆ వెబ్ సైట్ కి ఇండియా నుండే 80 % ఆదాయం వచ్చేదట. అలా ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన సన్నీ అక్కడి నుండి బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంది. మొదట్లో ‘జిస్మ్’ సినిమా చేసి మళ్ళీ అమెరికా వెళ్లిన సన్నీ తరువాత ఇండియాలో తనకొస్తున్న ఆఫర్స్ క్రేజ్ చూసి పోర్న్ సినిమాలు చేయడం తన జీవితం కాదని డిసైడ్ అయి రిటైర్మెంట్ ప్రకటించి ఇండియా వచ్చేసింది. ఇక ఇక్కడ హిందీ, తెలుగు, మరాఠి, తమిళం ఇలా పలు భాషల్లో నటించడంతో పాటు ఇండియా మొత్తం భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె బయోగ్రఫీ సినిమాగా తీయగా అందులో సన్నీ నటించింది. ఆ సినిమా విడుదల సమయంలో పోర్న్ సినిమాలు చేయాలనే తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల తన తల్లిదండ్రులు బాధపడ్డారని, ఆ బాధతోనే మరణించారని సన్నీ ఎమోషనల్ అయింది. ఇక సన్నీ, డేనియల్ వెబర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదట ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఆ అమ్మాయికి నిషా సింగ్ వెబర్ అని పేరు పెట్టారు. ఇక మళ్ళీ సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలు యాషర్ సింగ్ వెబర్, నోఆ సింగ్ వెబర్.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.