టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కొందరు రెస్టారెంట్లు, జిమ్ లు అంటూ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పలురకాల వ్యాపారాలు చేస్తూ బిసినెస్ మెన్ అనుకుంటున్నాడు. ఇప్పటికే నిర్మాణ రంగంలో తో పాటుగా ఏఎంబి మల్టీ ప్లెక్స్ మరియు టెక్సటైల్ రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్న మహేష్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

తాజాగా మహేష్ బాబు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. దీనిపై ఒక భారీ నిర్మాణ సంస్థతో కలిసి ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనున్నాడట. ఈ విషయంపై మహేష్ బాబు నుంచి క్లారిటీ రావాల్సివుంది. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి అడుగుపెట్టిన మెగా నిర్మాత అల్లు అరవింద్ “ఆహా” అనే యాప్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఆహా మంచి లాభాల్నే తెచ్చిపెడుతోందట. ఇప్పుడు ఇదేకోవలోకి మహేష్ కూడా రాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాని రెడీ చేసేపనిలో పడ్డాడట. డైరెకర్ట్ పరశురాంతో సినిమాను పట్టాలెక్కించనున్నాడట.




























