Suriya : గజినీ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సూర్య తమిళం అప్పటికే మంచి నటుడుగా గుర్తింపు ఉన్న హీరో. ఇక గజినీ సినిమా తరువాత తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సూర్య తమిళంలో తాను నటించిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి తన మార్కెట్ పెంచుకున్నారు. అయితే సూర్య ఈ మధ్య కాలంలో తీసిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లాయి.

అరుదైన గౌరవం అందుకున్న సూర్య…
ఆస్కార్ అవార్డు సినిమాల్లో ఉన్న ఏ నటుడికైనా ఒక పెద్ద కల. అయితే ఇప్పటి వరకు ఏ భారతీయ హీరోను ఆస్కార్ వరించలేదు. ప్రతి ఏడాది ఏడో ఒక సినిమా ఆస్కార్ ముంగిట్లో నిలబడడం వెనక్కు రావడం సాధారణం అయింది. ఇక సూర్య నటించిన ఆకాశమే నే హద్దురా, జై భీమ్ సినిమాలు కూడా అలానే ఊరించి ఉసూరుమనిపించాయి. అయితే సూర్య మాత్రం అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ఆస్కార్ కమిటీకి రావాలని ఆస్కార్ – అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సూర్యను ఆహ్వానించింది. ఆస్కార్స్ 2022, ఈ ఏడాది పురస్కార వేడుక కమిటీలో మొత్తం 397 మందికి చోటు కల్పించారు.

క్లాస్ ఆఫ్ 2002గా పిలవబడే ఈ కమిటీలో సూర్య శివకుమార్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, ఫిమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియానుండి ప్రతినిధులుగా వెళ్ళనున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి తొలిసారి ఈ గౌరవాన్ని అందుకున్న నటుడుగా సూర్య అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ విషయం బయటికి రాగానే సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమాను హిందీ లో నిర్మిస్తూ ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్. ఇక మాధవన్ సినిమా రాకెట్రీ: నంబి ఎఫెక్ట్ లో కూడా అతిధి పాత్రలో చేసాడు. బాల దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నారు.


































