Tag Archives: ajith

Ajith: హీరో అజిత్ కు బ్రెయిన్ ట్యూమర్.. నాలుగు గంటలు కష్టపడి చికిత్స చేసిన వైద్యులు?

Ajith: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఇక అజిత్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయనకు ఏ మాత్రం విరామం దొరికిన బైక్ రైడింగ్ వెళుతూ ఉంటారు. అంతేకాకుండా తన ఆరోగ్యం పై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇలా ఎప్పటికప్పుడు జనరల్ చెకప్ చేయించుకొని అజిత్ ఇటీవల అపోలో హాస్పిటల్ కి వెళ్లి జనరల్ చెకప్ చేయించుకున్నారు అయితే ఈ చెకప్ లో భాగంగా  ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

అజిత్ బ్రెయిన్ లో చిన్న క్లాట్ ఉందని వెంటనే దానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్లో దాదాపు నాలుగు గంటల పాటు ఈయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని ఇలా సర్జరీ చేసిన అనంతరం వైద్యులు ట్యూమర్ తొలగించారని తెలుస్తోంది.

సర్జరీ విజయవంతం..
ఈ విధంగా ఈయన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా కోలుకొని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

Hero Ajith: అజిత్ కి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి… నటుడు కామెంట్స్ వైరల్!

Hero Ajith: హీరో అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా సినిమాలంటే అమితమైన ప్రేమ ఉన్నటువంటి అజిత్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఎంతటికైనా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు.

అజిత్ నటిస్తున్న సినిమాలు పూర్తి అయితే ఆ సినిమా ప్రమోషన్లకు ఈయన హాజరుకారు ఎంచక్కా బైక్ రైడింగ్ వెళ్తూ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా హీరోగా ఇంత మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన పక్షపాతానికి గురవుతారు అంటూ హీరో అబ్బాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి అబ్బాస్ అజిత్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అజిత్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు ఈయన ఏ విషయాన్ని అయినా మనసులో పెట్టుకోకుండా తనకు తోచిన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తారు. తనలో నాకు నచ్చిన అంశం ఇదేనని అబ్బాస్ తెలిపారు. ఇక అజిత్ కు సినిమాలన్న బైక్ రైడింగ్ అన్న చాలా ఇష్టం. ఇలా సినిమాలలో నటిస్తున్న సమయంలోను బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలోను ఎన్నోసార్లు ప్రమాదానికి గురయ్యారు.

Hero Ajith: సర్జరీలు కావడమే కారణం..


ఈ ప్రమాదంలో భాగంగా ఈయనకు చాలా సర్జరీలో జరిగాయి అయితే ఇలా ఎక్కువ సర్జరీలు చేయటం వల్ల భవిష్యత్తులో తాను పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెప్పినట్టు ఈ సందర్భంగా అబ్బాస్ తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన అజిత్ తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రేక్షకుల కోసం సినిమాలలో నటిస్తున్నారని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bichagadu: బిచ్చగాడు పాత్రకి మహేశ్ బాబు కరెక్ట్ గా సెట్ అవుతాడు… విజయ్ ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు..?

Bichagadu: ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి తెలియని వారంటూ ఉండరు. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరోగా విజయ్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమాని రూపొందించారు.

ఈ సినిమా మే 19వ తేదీన తెలుగు,తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు . ఈ క్రమంలో బిచ్చగాడు2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సినిమాలో హీరో బిచ్చగాడి పాత్రలో నటించడం వల్ల సినిమాకు బిచ్చగాడు 2 పేరు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ సినిమాకి 2016లో విడుదలైన బిచ్చగాడు సినిమాకి ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఆ సినిమాలు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చక్కగా చూపించాము. ఇక బిచ్చగాడు 2 లో అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని తెలిపాడు. ఇక ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Bichagadu: మహేష్ బాబు కరెక్ట్ గా సెట్ అవుతాడు…


ఇక ఈ ఈవెంట్ లో ..’ఒకవేళ బిచ్చగాడు సీక్వెల్‌ చిత్రాల్లో మీరుకాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటారు? అని విజయ్ ఆంటోనీని ప్రశ్నించగా… తెలుగులో సూపర్ స్టార్‌ మహేశ్‌బాబు అయితే బిచ్చగాడు 2 కి బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చాడు. అలాగే తమిళంలో అయితే విజయ్‌ దళపతి లేదా అజిత్‌ బాగా సూట్‌ అవుతారని చెప్పుకొచ్చారు. అయితే బిచ్చగాడు పాత్రకి మహేష్ బాబు సెట్ అవుతాడని విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.

Nayanatara: భర్తను అవమానించిన హీరోతో నటించను… షాకింగ్ డెసిషన్ తీసుకున్న నయనతార?

Nayanatara: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విగ్నేష్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని సమాచారం.

ఇలా తన సినిమాకు తన భర్తను ఎంపిక చేసి అనంతరం ఆ సినిమా నుంచి తొలగించడంతో నయనతార ఈ విషయంలో చాలా ఫీలయ్యారని దీంతో ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భర్తను అవమానించిన హీరోతో తాను జీవితంలో సినిమా చేయకూడదని నిర్ణయాన్ని నయనతార తీసుకున్నట్టు సమాచారం.ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఇకపై అజిత్ సినిమాలలో నటించకూడదని నయనతార నిర్ణయించుకున్నారట.

Nayanatara: జవాన్ సినిమాతో బిజీగా నయనతార…

ఇలా అజిత్ సినిమాల విషయంలో నయనతార తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఇక నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Actress Trisha: విజయ్.. అజిత్ లలో నెంబర్ వన్ ఎవరు.. నెంబర్ వన్ హీరో ఎవరో చెప్పేసిన నటి?

Actress Trisha:కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. విజయ్ నెంబర్ వన్ హీరో అనడంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే దక్షిణాది సిని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె నటించిన చిత్రం రాంగి.ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

హీరో విజయ్ అజిత్ ఇద్దరూ కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు.వీరిద్దరిలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పడం చాలా కష్టమని వీరిద్దరూ కూడా ఒకే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలని ఈమె సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా తనకు నెంబర్ గేమ్స్ పై ఏమాత్రం నమ్మకం లేదని తెలిపారు.

Actress Trisha: దిల్ రాజు వ్యాఖ్యలపై త్రిష కామెంట్స్…


మనం నటించిన చివరి సినిమా విజయం అందుకుంటే మనమే నెంబర్ వన్ అని లేదంటే ఆ స్థానంలోకి మరొకరు వస్తారని తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అజిత్ విజయ్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్టార్డం ఉన్న హీరోలుగా పేరుపొందారు. ఇలా ఈ ఇద్దరు హీరోలలో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కష్టమని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష షాకింగ్ కామెంట్స్ చేశారు.

Dil Raju: కోలీవుడ్ స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టిన దిల్ రాజు… అవి చూసి తట్టుకోగలరా?

Dil Raju:తెలుగు చిత్రపరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రతి ఏడాది సంక్రాంతికి తన నిర్మాణంలో ఏదో ఒక సినిమా విడుదల చేయడము లేదా ఇతర సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి దిల్ రాజుకు పెద్దగా కలిసి వచ్చినట్టు లేదేమోనని పలువురు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈయన నిర్మాణంలో వస్తున్నటువంటి వారసుడు సినిమా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. దిల్ రాజు విజయ్ హీరోగా వరిసు సినిమాని తమిళంలో నిర్మించి తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేస్తున్నారు.అయితే గతంలో ఒకసారి సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజు చెప్పిన మాటలనే ఇప్పుడు తిరిగి ఆయనకే సూచించడం గమనార్హం.

దిల్ రాజుకు మద్దతుగా పలువురు టాలీవుడ్ నిర్మాతలు నిలబడి తెలుగు రాష్ట్రాలలో కూడా వారసుడు సినిమాకి తగినన్ని థియేటర్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళంలో వరీసు సినిమాతో పాటు అజిత్ తునివు సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రావడంతో ఈయనకు మరో సమస్య వచ్చి పడింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడంతో ఇద్దరికీ థియేటర్లో సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు సమాచారం. అయితే విజయ్ సినిమాకు ఆధారంగా మరికొన్ని థియేటర్లు కావాలని కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ నెంబర్ వన్ హీరో కనుక అతను సినిమాకు మరికొన్ని థియేటర్లు అదనంగా ఇవ్వాలని కోరారు.

Dil Raju:

ఈ విధంగా అజిత్ ను తక్కువ చేసి విజయ్ ను పొగడటంతో అజిత్ ఫాన్స్ ఈ విషయంలో తీవ్రస్థాయిలో దిల్ రాజు పై మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం దిల్ రాజు చెన్నై వచ్చినప్పుడు అజిత్ ఫ్యాన్స్ పవర్ ఏంటో తనకు చూపించాలని అజిత్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ విషయం దిల్ రాజు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారని అవి చూసి దిల్ రాజు తట్టుకోలేరని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే దిల్ రాజు చాలా సామరస్యంగా ప్రవర్తించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Dil Raju: విజయ్ నెంబర్ వన్ హీరో… అజిత్ ఫ్యాన్స్ ను గెలికిన దిల్ రాజు?

Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా మారిన రాజు ఆ సినిమాని తన పేరుగా చేసుకొని దిల్ రాజుగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సినిమా థియేటర్ల విషయంలో వివాదాలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వారసుడు సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు థియేటర్లో కేటాయించామని కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు సినిమా థియేటర్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా అనేది ఒక వ్యాపారం.. ప్రస్తుతం నేను తమిళ హీరో తో తీసిన సినిమా విడుదల చేయడానికి థియేటర్ల కోసం ప్రయత్నిస్తున్నాను అని వెల్లడించాడు.

సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమాకి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీగా నిలుస్తున్నాయి. ఇక తమిళ్ భాషలో అజిత్ నటించిన సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ కన్నా విజయ్ కి ఎక్కువ పాపులారిటీ ఉంది. అందువల్ల మాకు మరొక 50 థియేటర్లు ఎక్కువగా కావాలని అడుక్కుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.

Dil Raju: దిల్ రాజు వ్యాఖ్యలకు ఫైర్ అవుతున్న అజిత్ ఫ్యాన్స్…

చెన్నైలో మొత్తం ఎనిమిది వందల థియేటర్లో ఉండగా వీరికి సగం కేటాయించారు. అయితే విజయ్ పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని మరొక 50 థియేటర్లు ఎక్కువ కేటాయించమని దిల్ రాజు ఆ సినిమా నిర్మాతలను వేడుకోనున్నాడు. అజిత్ నటిస్తున్న సినిమాని ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నాడు. నేను ఆయన్ని కలిసి మాట్లాడుతానని దిల్ రాజు అన్నారు. అయితే అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్ హీరో అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. అజిత్ ని తక్కువ చేస్తూ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదం చెలరేగేలా ఉంది. అజిత్ పాపులారిటీ గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

Rajamouli-Ajith: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ ప్రమోషన్లను ముందుండి నడిపిస్తున్నారు.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చిల్లో ప్రమోషన్లు నిర్వహించారు. ఇటీవల చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తమిళంలో వాలిమైకి పోటీగా RRR రానుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా వాలిమై తెరకెక్కింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో అజిత్ ప్రస్తావన రాగానే కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజమౌళి.

నాకు ఆశ్చర్యం వేసింది..రాజమౌళి..

ఒకసారి రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుతున్న సమయంలో అజిత్ తో మరిచిపోలేని అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నారు రాజమౌళి. ఓసారి రామోజీ ఫిలిమ్ సిటీలో భోజనం చేసేందుకు సితార రెస్టారెంట్ వెళ్లానని.. అక్కడే భోజనం చేస్తూ అజిత్ కనిపించారని.. ఎవరో నేను వచ్చానిని చెబితే భోజనం మధ్యలో ఆపేసి నాదగ్గరకు వచ్చి లోపలికి తీసుకెళ్లారని.. అంత పెద్ద స్టార్ ఇలా వ్యవహరించడం నాకు ఇబ్బందిగా అనిపించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. తరువాత నాభార్య రమ వస్తుందని తెలిసి.. తనను తాను పరిచయం చేసుకుని లోపలికి తీసుకెళ్లారని అజిత్ సింప్లిసిటీ గురించి చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్  గా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన అన్నారు.ఇటీవల తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అజిత్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇకపై తన పేరు ముందు ‘తల’ అని పిలవద్దని ఫ్యాన్స్ కు సూచించారు. అజిత్ లేదా ఏకేగా పిలవాలని కోరిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపై నన్ను ఎవరూ ఆ పేరుతో పిలవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసిన అజిత్!

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏ మనందరికీ సుపరిచితమే. అజిత్ కు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అజిత్ తన కెరిర్ లో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తున్నారు. అజిత్ నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ కావడంతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.ఇకపోతే అజిత్‏ను ఆయన అభిమానులు తల అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. అయితే తాజాగా అజిత్ ఇకపై తనను తల అని పిలవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

కేవలం అభిమానులు మాత్రమే కాకుండా మీడియా సైతం ఆయన పేరుకు ముందు తల అని సంభోదిస్తుంది.తల అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్‌, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను తల అని పిలవోద్దని మీడియా, పబ్లిక్‌, ఫ్యాన్స్‌ను కోరారు.

ఇదే విషయాన్ని అజిత్‌ మేనేజర్‌ సురేశ్‌ చంద్ర ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు.గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే ఇకపై ఎవరూ కూడా నన్ను తల.అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి.

మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ అజిత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అజిత్‌ ఈ ప్రకటన ఇవ్వడం వెనక అంతర్యం ఏంటి, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.