Tag Archives: balakrishna

Tarakaratna: బాలయ్య కొండలా అండగా నిలిచారు.. చాలా మిస్ అవుతున్నా… అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

Tarakaratna: నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా ఈయన మరణించడంతో తన భార్య అలేఖ్యరెడ్డి ఎంతో కృంగిపోయారు. ఇక ఈయన మరణించి దాదాపు నెలరోజులు కావస్తున్న ఇంకా తన భర్త మరణం నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తుంది.

ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే తనకు ఎలాంటి కష్టం రాకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బాలయ్య తన కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలుతోపాటు తారకరత్న ఫోటోని కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మా కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే…మేం కష్టంలో ఉన్నప్పుడు కొండల మాకు అండగా నిలిచారు. నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఒక తండ్రిగా నీ వెంటే ఉన్నారు. ఇక నువ్వు ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు పక్కనే కూర్చుని ఒక తల్లిలా లాలి పాడారు.

Tarakaratna: నీకోసం కన్నీళ్లు పెట్టుకున్నారు…

ఎవరు లేని సమయంలో నీకోసం ఏడ్చారు. తన సిల్లీ జోక్స్ తో నిన్ను నవ్వించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ చివరి క్షణం వరకు ఆయన నీ వెంటే ఉన్నారు. ఓబు నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈ సందర్భంగా అలేఖ్య తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balakrishna: ఆస్కార్ వచ్చిన తీరు మార్చుకొని బాలయ్య… ఎక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదుగా?

Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్ ఈ సినిమా గత ఏడాది విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది.

ఇందులోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నామినేషన్స్ లో నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఇందుకు కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇంత గొప్ప అవార్డు రావడంతో ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఈ పాట ఆస్కార్ సాధించడానికి కారణమైనటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.

Balakrishna: ఇద్దరి మధ్య మనస్పర్ధలే కారణమా…

ఇకపోతే నందమూరి వారసుడు ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఇలాంటి గొప్ప అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు కాలర్ ఎగరేసే సమయం కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తుంది. అయితే ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి లేఖలో ఈయన హీరోల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం. నందమూరి బిడ్డ ఎన్టీఆర్ నటించిన సినిమాకి గొప్ప అవార్డు రావడంతో సంతోషించాల్సిన బాలయ్య కనీసం తన పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడంతో ఆస్కార్ వంటి గొప్ప అవార్డు వచ్చిన బాలయ్య వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనడానికి ఇది కూడా నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు.

Simham Navvindi: సింహం నవ్వింది సినిమాకు 40 ఏళ్లు పూర్తి.. అందుకే ఫ్లాప్ అయిందంటూ బాలయ్య సెటైర్స్?

Simham Navvindi: నందమూరి బాలకృష్ణ ఎక్కువగా పూజించే దేవుళ్ళలో లక్ష్మీనరసింహస్వామి ఒకరు. ఈయన లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఎక్కువగా ఈయన సినిమాలలో సింహ అనే పేరు రావడానికి ఈయన సెంటిమెంట్ గా భావిస్తూ ఇలాంటి టైటిల్స్ రావడానికి లేదంటే సినిమాలలో సింహం డైలాగులు ఉండడానికి బాలయ్య ఇష్టపడుతుంటారు .

ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన సినిమాలలో సింహ అనే టైటిల్ ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. బొబ్బిలి సింహం, సమరసింహ రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, జై సింహా, సింహ, వీర సింహారెడ్డి వంటి సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ నరసింహ అని టైటిల్ పెట్టుకున్నటువంటి సినిమాలు కూడా రెండు ఫ్లాప్ గా నిలబడ్డాయి.

ఇలా సింహ టైటిల్ తో వచ్చే ప్లాప్ అందుకున్న సినిమాలలో సీమ సింహం ఒకటి కాగా 1983 మార్చి మూడవ తేదీ విడుదలైనటువంటి సింహం నవ్వింది సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించగా, డి యోగానంద్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తాజాగా బాలయ్య ఈ సినిమా గురించి సెటైర్లు వేయడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.


Simham Navvindi: సింహం నవ్వడం ఏంటయ్యా…

ఈ సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీరిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ సరదాగా బాలయ్యతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సింహం నవ్వింది సినిమా గురించి టాపిక్ రావడంతో సింహం నవ్వడం ఏంటయ్యా… అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ బాలయ్య తన సినిమా గురించి తానే సెటైర్ వేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నందమూరి తారకరామారావు మొదటి హీరోగా నటించిన బాలయ్య సెకండ్ హీరోగా నటించారు.

Actor Sameer: చూస్తావా ఎలా వెళ్తానో అంటూ డోర్ తీసి తోసేసారు… బాలయ్య పై నటుడు సమీర్ షాకింగ్ కామెంట్స్!

Actor Sameer: బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా సుమ అడ్డా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి శనివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి నటుడు సమీర్ హేమ గిరిధర్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారని తెలుస్తోంది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఎప్పటిలాగే వారితో పాటు కలిసి సందడి చేశారు. అయితే సుమ ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సమీర్ ను ఓ ప్రశ్న వేశారు. బాలయ్యతో కలిసి సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంట కదా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమీర్ సమాధానం చెబుతూ లెజెండ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అందరం ఓ ఈ వెంట్ కు వెళ్ళాం అయితే అక్కడ థియేటర్ గేట్ దగ్గరకు వెళ్లాలి అంటే బస్సు అక్కడి వరకు వెళ్లదు.కొంత దూరం దిగి అక్కడి వరకు నడిచి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Actor Sameer: భారీగా తరలి వచ్చిన అభిమానులు…

ఇక జనాలు చూస్తే థియేటర్ గేట్ వరకు చాలామంది ఉన్నారని ఆ జనాలను చూసి ఇంత మంది జనాలు ఉన్నారు అసలు మీరు ఎలా వెళ్తారు అంటూ బాలకృష్ణ గారిని అడగగా ఆయన మాత్రం చూస్తావా నేను ఎలా వెళ్తానో అంటూ బస్సు డోర్ తీసి ఒక్కసారిగా తోసేశారు అంటూ అప్పటి సంఘటన ఈ సందర్భంగా నటుడు సమీర్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సమీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Balakrishna: బాలయ్య కాలు తొక్కానని షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు… ఆయనకు కోపం ఎక్కువ… నటి సంచలన వ్యాఖ్యలు!

Balakrishna: నందమూరి బాలయ్యను చూస్తే ఎంతో గంభీర్యంగా కనిపిస్తారు కనుక ఈయనకు చాలా కోపం ఎక్కువ అని అందరూ భావిస్తారు. అయితే ఆయనతో పని చేస్తున్న వాళ్లు మాత్రమే బాలయ్య మంచితనం తన మనస్తత్వం గురించి చెబుతూ ఉంటారు. ఇప్పటికే బాలకృష్ణతో పని చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు బాలయ్య గురించి మాట్లాడుతూ బాలయ్య కోపిష్టి అని చాలామంది అంటారు కానీ ఆయన మనసు చాలా మంచిదని ఇప్పటికే బాలయ్య పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా నటి లయ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలయ్యతో విజయేంద్ర వర్మ సినిమాలో కలిసి నటించే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య బాబుతో కలిసి ఓ పాటలో నటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో నా వెనుక బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనని నేను చూసుకోలేదు పొరపాటున తన కాలు తొక్కానని తెలిపారు.

ఇలా తన కాలు తొక్కగానే వెంటనే వెనక్కి తిరిగి చూసి అయ్యో సారీ సార్ చూసుకోలేదు అంటూ తనకు క్షమాపణలు చెప్పాను. కానీ బాలయ్యకు కోపం ఎక్కువ అని నేను విన్నాను .ఆ టెన్షన్ నన్ను మరింత భయానికి గురి చేసింది. ఇలా కాలు తొక్కగానే బాలకృష్ణ గారు వెంటనే ప్యాకప్ అని చెప్పేశారు. దాంతో నాకు మరింత భయం పెరిగింది. నావల్ల షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది అంటూ చాలా బాధపడ్డాను.

Balakrishna: బాలయ్యది మంచి మనసు…

ఆ సమయంలో బాలకృష్ణ నా వద్దకు వచ్చి నేను కంగారు పడుతూ ఉండగా సరదాగా అన్నాను మరేం భయపడాల్సిన పనిలేదు అంటూ మాట్లాడారు అయినప్పటికీ నాలో భయం తగ్గలేదు.అయితే నన్ను తిరిగి మామూలు స్థాయికి తీసుకురావడం కోసం ఆయన సరదాగా మాట్లాడుతూ జోకులు కూడా వేశారని లయ తెలిపారు. అందరిలాగే బాలయ్యకు కోపం ఎక్కువ అని నేను కూడా అనుకున్నాను కానీ ఆయనది అది కోపం కాదు అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ మంచితనం తన వ్యక్తిత్వం గురించి లయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tarakaratna Wife: రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అలేఖ్య రెడ్డి… తారకరత్న కోరికను తీర్చబోతున్నారా?

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా ఆయన కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు.ఇలా ఉన్నఫలంగా తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఒక్కసారిగా తన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ముఖ్యంగా తన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

తారకరత్న బ్రతికున్నప్పుడు కూడా బాలయ్య అండదండలు తారకరత్నకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన మరణం తరువాత తారకరత్న కుటుంబ బాధ్యతలను బాలయ్య తన భుజాలపై వేసుకున్నారు. ఇక తారకరత్న లేరనే వార్తను జీర్ణించుకోలేక అలేఖ్య రెడ్డి ఏకధాటిగా కంటతడి పెట్టడం అందరిని కలిచి వేస్తోంది.ఈ క్రమంలోనే ఆమెను ఈ బాధ నుంచి బయటకు తీసుకువచ్చి తనని తన జీవితంలో బిజీగా ఉంచడం కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో కలిసి అలేఖ్య రెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తారకరత్నకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఉండేది అయితే తన కోరికను తన భార్య అలేఖ్య ద్వారా తీర్చబోతున్నారని తెలుస్తోంది.

Tarakaratna Wife: వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…

ముందుగా అలేఖ్య రెడ్డిని ఈ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమెకు తెలుగుదేశం పార్టీలో ఏదైనా మహిళ విభాగంలో ఒక పదవిని ఇప్పించాలని అనంతరం వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tarakaratna: నందమూరి తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా అడుగు పెట్టారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఈయన సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలలోకి రావాలని భావించారు. ఇలా పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా తారకరత్న మరణించడంతో నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా కొంతకాలం పాటు ఈయన తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయితే బాలకృష్ణ విషయంలో జోక్యం చేసుకొని తనని కుటుంబ సభ్యులకు దగ్గర చేశారు.

ఈ విధంగా బాలకృష్ణ తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధముందే అయితే ఈయన గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తారకరత్న వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tarakaratna: భారీగా ఆస్తులు కూడ పెట్టిన తారకరత్న…

ఇక తారకరత్న హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయనకు మాత్రం బయట బిజినెస్ లు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి మోహనకృష్ణ కలిపి హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్స్‌తో పాటు తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్‌లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ల ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్‌లు ఉన్నట్టు సమాచారం వీటి విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే వారు ఈమె పేరు కూడా సుమారు 250 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న ఆస్తులు సుమారు 1500 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

Balakrishna: తారకరత్న పిల్లలతో బాలయ్య… వైరల్ అవుతున్న రేర్ పిక్స్!

Balakrishna: నందమూరి వారసుడు తారకరత్న అనారోగ్య సమస్యలతో గత 23 రోజులుగా పోరాడుతూ చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. తారకరత్న అతి చిన్న వయసులోనే మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అమాయకంగా తన తండ్రి వైపు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు అందరికీ కన్నీరు పెట్టిస్తున్నాయి.

ఇలా తారకరత్న గుండెపోటుకి గురై ఆస్పత్రిలో చేరిన క్షణం నుంచి ఆయనని ఎలాగైనా ప్రాణాలతో దక్కించుకోవాలని నందమూరి నటసింహం బాలకృష్ణ పడిన తపన ఆరాటం చూస్తుంటే వీరిద్దరికీ ఎంతో మంచి అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన బాలయ్య తనని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు.

ఇలా తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఈయన బెంగుళూరులోనే మకాం మారుస్తూ నిత్యం డాక్టర్లతో మాట్లాడుతూ అతనికి ఎంతో మెరుగైన వైద్య చికిత్సలు చేయించారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ విధి చేతిలో తారకరత్న ఓడిపోవాల్సి వచ్చింది. ఇక తారకరత్న మరణించడంతో తన పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.


Balakrishnaతారకరత్న పిల్లల బాధ్యతలు తీసుకున్న బాలయ్య…

ఇక తారకరత్నతో బాలయ్యకు ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ తారకరత్న ఎంతో ఆప్యాయంగా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని తెలుస్తోంది. ఇలా బాలయ్యకు తారకరత్నకు మధ్య ఉన్న అనుబంధంతోనే తనని ఎలాగైనా బ్రతికించుకోవాలని బాలయ్య ఆరాటపడ్డారు.ఇక బాలయ్యకు తారకరత్న పిల్లలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న పిల్లలతో బాలయ్య కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Balayya -Vijayasai Reddy: అలేఖ్య కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య విజయ్ సాయి రెడ్డి… నిజంగా గొప్పోళ్ళు?

Balayya -Vijayasai Reddy: తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను అభిమానులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సినిమా ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి విధి ఆడుతున్న వింత నాటకంలో తలవంచక తప్పలేదు. ఈ విధంగా తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక నందమూరి తారకరత్న పాదయాత్రలో భాగంగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆ క్షణం నుంచి తన వెంటే ఉంటూ ఆయన బ్రతికి రావాలని అహర్నిశలు పోరాడుతూ నిత్యం డాక్టర్లను తన ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ తనని బ్రతికించడం కోసం ఎంతో కష్టపడ్డారు నందమూరి బాలకృష్ణ. తారకరత్నకు బాలకృష్ణ వరుసకు బాబాయ్ అయినప్పటికీ తనకు తండ్రి సమానులు.పెళ్లి కారణంగా తారకరత్న కుటుంబానికి దూరం కావడంతో బాలకృష్ణ నందమూరి కుటుంబంతో తారకరత్నను కలిపారు. ఈ కారణంతోనే తారకరత్న బాలకృష్ణ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె. ఇలా అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.ఆ తారకరత్న అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారని తెలియగానే పార్టీ విభేదాలను పక్కనపెట్టి తారకరత్న కోసం విజయసాయిరెడ్డి కూడా ఎంతో కష్టపడ్డారు. నిత్యం డాక్టర్లకు టచ్ లో ఉంటూ ఈయన ఎప్పటికప్పుడు తారకరత్న పరిస్థితి ఆరా తీసారు.

Balayya -Vijayasai Reddy: అలేఖ్యకు అండగా బాలయ్య… విజయ్ సాయి రెడ్డి

ఈ విధంగా తారకరత్న బ్రతికించుకోవడం కోసం ఒకవైపు తారకరత్న బాబాయ్ బాలకృష్ణ రెడ్డి పెదనాన్న విజయసాయిరెడ్డి ఎంతో కష్టపడినప్పటికీ చివరికి కఠినమైన బాధాకరమైన విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.ఇక తారకరత్న మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన విజయసాయిరెడ్డి తన నివాసానికి చేరుకొని అక్కడ అన్ని తానే చూసుకున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వారందరినీ స్వయంగా ఆహ్వానించారు. ఇలా తారకరత్న మరణించడంతో అలేఖ్య తన పిల్లల బాగోగులను వీరిద్దరూ చూసుకోబోతున్నట్లు తెలియజేశారు.ఇలా కష్ట సమయంలో వారి మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి అలేఖ్య కుటుంబానికి మద్దతుగా నిలబడటంతో నిజంగా బాలకృష్ణ విజయసాయిరెడ్డి ఇద్దరు ఎంతో గొప్ప మంచి మనసు ఉన్న వాళ్ళని అభిమానులు వీరి వ్యవహార శైలిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna: తారకరత్న మరణంతో పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బాలయ్య?

Balakrishna: నందమూరి తారకరత్న మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తోంది. ఒకవైపు నందమూరి ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీస్తోంది.గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నప్పటికీ క్షేమంగా బయటకు రాలేకపోయారు.

ఇలా మృత్యువుతో పోరాడుతూ చివరికి విధి చేతిలో తారకరత్న ఓడిపోయి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇక తారకరత్న మరణ వార్త నందమూరి నటసింహం బాలకృష్ణకు తీవ్ర విషాదంగా మిగిలిపోయింది.చిన్నప్పటినుంచి తారకరత్నతో బాలకృష్ణకు ఎంతో మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమాభిమానాలను చూపుకుంటారు..

ఈ విధంగా బాబాయ్ అబ్బాయి మధ్య ఎంతో ప్రేమ ఉండడంతో తారకరత్న కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడుతూ ఎలాగైనా తనని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు. అయితే చివరికి బాలకృష్ణ తారకరత్న మరణ వార్త విని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక తారకరత్న మరణంతో బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Balakrishna: పిల్లల పూర్తి బాధ్యత నాదే….


తారకరత్న అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన మరణించడంతో తారకరత్న పిల్లల బాధ్యతలను పూర్తిగా బాలకృష్ణ తన చేతులలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా తెలియజేశారు.తన పిల్లలకు ఏ లోటు లేకుండా వారి బాధ్యతలను తానే చూసుకుంటానంటూ బాలయ్య హామీ ఇవ్వడంతో బాలయ్య మనసు బంగారం అంటూ అభిమానులు బాలయ్య నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.