Tag Archives: childrens

Anasuya: నాకు పిల్లల్ని కనాలని ఉంది… ఆ విషయంలో తృప్తిగా లేనట్టు షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ?

Anasuya: బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అనసూయ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కానీ పిల్లల విషయంలో అనసూయ తృప్తి పొందలేదని తెలుస్తుంది ఈమెకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంది అంటూ తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారని కాకపోతే తనకు కూతురు కావాలని కోరిక ఎప్పటినుంచో ఉంది కానీ వీలు కాలేదు అంటూ అనసూయ తెలిపారు. తనకు కూతురు కావాలని కోరిక ఉందని ఆ కోరిక తీరలేదని ఈమె తెలిపారు.

కూతురు లేని లోటు ఉంది..

ఇద్దరు కొడుకులు పుట్టినప్పటికీ కూతురు లేదు అన్న అసంతృప్తి తనలో అలాగే ఉంది అంటూ పిల్లల గురించి అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె మరోసారి ప్రెగ్నెంట్ అయ్యే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తాను మరొక బిడ్డకు కూడా జన్మనివ్వడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ థాంక్యూ బ్రదర్ సినిమా ప్రమోషన్ల టైం లో పిల్లల్ని కనడం గురించి కూడా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Rajeev Kanakala: విడాకుల వార్తల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!

Rajeev Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సుమా – రాజీవ్ కనకాల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ కి అవకాశాలు లేకపోవడం, సుమతి రోజురోజుకీ స్టార్డం పెరిగిపోవటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఇప్పటికే సుమ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక తాజాగా రాజీవ్ కనకాల కూడా విడాకుల వార్తలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కి విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది.ఈ క్రమంలో రాజీవ్ స్పందిస్తూ..’ మేము విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఆ వార్తలలో వాస్తవం లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఈ వార్తలు అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే వారు ఇంకా బాధపడేవారు. ఇలాంటి వార్తల గురించి సుమ పెద్దగా పట్టించుకోదు. కానీ నేను తనలా కాదు. మేమిద్దరం కలిసే ఉన్నామని చెప్పటానికి తనతో పాటు కలిసి షోస్ కి కూడా వెళ్ళాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు .

Rajeev Kanakala: అమ్మ నాన్న ఉంటే మరింత బాధపడేవారు..


అలాగే ” ఈ విడాకుల వార్తల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. స్కూల్ లో వాళ్లకు ఎదురయ్య ప్రశ్నల వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారు.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారు ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. మా ఇద్దరి మధ్య గొడవలు లేవని క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది ” అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా సుమ ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటూ ఇండస్ట్రీలోని నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. ఇక మరొకవైపు రాజీవ్ కూడా ఇటీవల మంచి మంచి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విరూపాక్ష సినిమాలో కూడా రాజీవ్ కీలకపాత్ర పోషించాడు.

Alia Bhatt: పిల్లల గురించి ఈ ప్రశ్న హీరోలను అడగగలరా.. ఫైర్ అయిన అలియాభట్!

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఆలియా గతేడాది నవంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కూతురితోనే పూర్తి సమయాన్ని గడుపుతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో గడిపిన సమయం గురించి అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తాజాగా మెట్ గాల ఫ్యాషన్ ఈవెంట్ కోసం నాలుగు రోజులపాటు కూతురికి దూరంగా ఉన్న ఆలియా.. తన కూతురుని బాగా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా కి పిల్లల గురించి ఒక ప్రశ్న ఎదురవగా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో.. కెరీర్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తల్లి అవ్వాలని ఎందుకు అనిపించింది? అని విలేకరులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆలియా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ..’ పాప నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పాపకి సంబంధించిన ఎన్నో విషయాలు రణబీర్ ని అడిగారు. కానీ.. కెరీర్ ప్రారంభ దశలో బిడ్డను కనటం ధైర్యమైన నిర్ణయమా ? అని రణబీర్ ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇలాంటి ప్రశ్నలు కేవలం హీరోయిన్స్ ని ఎందుకు అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Alia Bhatt: నాకు నచ్చిన పని చేస్తాను….

నా కెరియర్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు బిడ్డని కనటం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలైనా, వ్యక్తిగత జీవితమైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనది అనిపిస్తేనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. గతంలో పెద్దపెద్ద సినిమాలలో నాకు అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాను. నాకు నచ్చని పనిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. దయచేసి ఇలాంటి ప్రశ్న మరొకసారి నన్ను అడగద్దు అంటూ ఆలియా సమాధానం ఇచ్చింది. దీంతో ఆలియా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Actress Chhavi Mittal: పిల్లల కు లిప్ కిస్ ఇచ్చిన నటి చవిమిట్టల్… బుద్ధుందా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Actress Chhavi Mittal: సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని విషయాలలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. తమ పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ కొన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి చవి మిట్టల్ ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.

తాజాగా ఈమె తన పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె తన పిల్లలకు లిప్ కిస్ ఇస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున ఈ విషయం పై ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇలా తన కుమారుడికి లిప్ కిస్ పెట్టడంతో పలువురు ఈ ఫోటోపై స్పందిస్తూ… అసలు చిన్నపిల్లలకు ఇలా లిప్ కిస్ పెడుతూ వారికి ఏం నేర్పుతున్నారు…అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు బుద్ధుందా పిల్లలకు ఇలా లిప్ కిస్ పెడతారా అంటూ ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా తన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ రావడంతో నటి వీటిపై స్పందించారు.

Actress Chhavi Mittal: ప్రేమను ఇలా కూడా చూపించవచ్చు…


ఈ క్రమంలోనే ఈమె ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా తన పిల్లలతో ఎంతో సరదాగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పిల్లల మీద తనకు ఉన్న ప్రేమను చూపించేందుకు ఇదో పద్ధతి అని ఛవి తన చర్యను సమర్థించుకుంది. ఇలా ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Upasana: పనిలేని వాళ్లే పిల్లల్ని కంటారు.. సద్గురు మాటలకు షాక్ అయిన ఉపాసన?

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ సుపరిచితమే. ఈమె పది సంవత్సరాల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పిల్లల కోసం ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పిల్లల గురించి ఉపాసనను ఎప్పుడు ప్రశ్నించిన ఆమె ఆ ప్రశ్నలు దాటవేస్తూ సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటున్నారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఇకపోతే తాజాగా ఉపాసన సద్గురును కలిసి పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.చాలామంది పిల్లల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు.నన్నే అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురు ముందు తన సందేహాలను బయటపెట్టింది. నా పెళ్లి జరిగి 10 సంవత్సరాలవుతుంది 10 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా ఇలా అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నలు వేస్తున్నారని ఉపాసన వెల్లడించారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఉపాసన మాటలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారో అలాంటి వారికి తాను ఒక బహుమతి ఇస్తానని ఈ జనరేషన్లో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని సద్గురు సమాధానం చెప్పారు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే పులి పిల్లనే కను ఈ భూమిపై పులి పిల్లలు అంతరించిపోతున్నాయి. అయితే ఈ భూమిపై మానవజాతి భూమ్మీద లెక్కకు మించి ఉంది.

పనిపై దృష్టి పెడితే అలాంటి ఆలోచనలు రావు…

పని చేయాలనే ఆలోచన పనిపై మనం దృష్టి పెడితే పిల్లల్ని కనాలి పెంచాలి అనే ఆలోచనలు కూడా రావు. ఎవరికైతే పనీపాట లేకుండా ఉంటారో అలాంటి వారిలో ఇలాంటి ఎక్కువ హార్మోర్లో ఉంటాయని పని పాట లేని వారే పిల్లల్ని కంటారు అంటూ సద్గురు షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం విన్న ఉపాసన ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అత్తమామల నుంచి మీకు ఫోన్ వస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పగా..నాకు ఎంతోమంది అత్తమ్మ వాళ్ళ నుంచి ఇలాంటి ఫోన్లు వచ్చాయని సద్గురు సమాధానం చెప్పారు.

Ramcharan -Upasana: పది సంవత్సరాలైనా రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేకపోవడానికి కారణం ఇదేనా?

Ramcharan -Upasana:టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా వారసుడిగా అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇకపోతే రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని అనే అమ్మాయిని ఐదు సంవత్సరాలపాటు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

Ramcharan -Upasana: పది సంవత్సరాలైనా రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేకపోవడానికి కారణం ఇదేనా?

వీరి వివాహం 2011 జూన్ 14వ తేదీ దేశం మొత్తం మాట్లాడుకునేలా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక వీరి వివాహం తర్వాత రామ్ చరణ్ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రహీరోగా పేరుపొందారు. అదేవిధంగా ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ విధంగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ జంట తమ పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

Ramcharan -Upasana: పది సంవత్సరాలైనా రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేకపోవడానికి కారణం ఇదేనా?

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పెళ్లి రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు వీరికి పిల్లలు లేకపోవడమే మెగా అభిమానులను కాస్త నిరుత్సాహ పరుస్తుంది.

ఆ విషయంలో భయపెడుతున్న ఉపాసన..

రామ్ చరణ్ తో పాటు పెళ్లి చేసుకున్న హీరోలకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఈ జంట మాత్రం పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడానికి కారణం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు. ఇక వీరిద్దరు ఇప్పుడే పిల్లలు వద్దని కోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది.ఉపాసన ఇది వరకు ఎంతో శరీర బరువు ఉండేది ఇప్పుడిప్పుడే ఆమె తన శరీర బరువు తగ్గడమే కాకుండా తనకు గర్భం దాల్చాలంటే ఎన్నో భయాందోళనలు ఉన్నాయని, అయితే పిల్లలు గురించి సరైన సమయం వచ్చినప్పుడే ఆలోచిస్తామని తెలిపారు.ఇక రామ్ చరణ్ కూడా చిరంజీవి అభిమానులను సందడి చేసే విషయంలో కొన్ని గోల్స్ ఉన్నాయని పిల్లలు ఉంటే అతను తన లక్ష్యాన్ని చేరుకో లేనని పలు సందర్భాలలో వెల్లడించారు. ఇలా వీరికున్న గోల్స్ చేరుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

S.S Thaman: ఎస్ ఎస్ తమన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమన్ ఈ మధ్య సినిమా అవకాశాలను అందుకొని ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. తాజాగా ఈయన సంగీత సారథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్, భీమ్లా నాయక్, అఖండ వంటి సినిమాలు మ్యూజికల్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

ఇకపోతే తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కూడా మంచి మ్యూజికల్ హిట్ కావడంతో తమన్ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఎప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించని తమన్ తాజాగా తన భార్యా పిల్లల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భార్య శ్రీ వర్దిని గురించి ఆయన పలు విషయాలను తెలిపారు.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

శ్రీ వర్దిని ప్లేబ్యాక్ సింగర్ గా పని చేస్తారని ఆమె ఇప్పటివరకు తన సినిమాలలో నాలుగు పాటలు పాడారని అలాగే, గతంలో యువన్ శంకర్ రాజా, మణి శర్మ వంటి వారి సినిమాలకు పాటలు పాడారని తెలిపారు. అయితే గాయనిగా తనకు ఇంకా మంచి గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు వచ్చినప్పుడు తనతో తప్పకుండా స్టేజ్ షోలు చేస్తానని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

S.S Thaman: నాలుగో గ్రేడ్…

ఇక తన కుమారుడు గురించి మాట్లాడుతూ నా ట్యూన్స్ ముందుగా తన కొడుకుకి వినిపిస్తానని ఈ సందర్భంగా తమన్ వెల్లడించారు. పియానోలో నాలుగో గ్రేడ్‌ కూడా పూర్తి చేశాడని తమన్ వెల్లడించారు. ఇక పోతే తన కుమారుడికి ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటంలో మంచి పట్టు ఉందని , పెద్దయిన తర్వాత తాను ఏ రంగం వైపు అడుగులు వేస్తాడో తనకు తెలియదని ఆ విషయం పూర్తిగా తన నిర్ణయానికే వదిలేస్తానని ఈ సందర్భంగా తమన్ తన కొడుకు గురించి తెలిపారు.

Poonam Kaur: పూనమ్ కౌర్ కి సంతానం అంటూ ప్రచారం.. ఊపిరి తీసుకొనివ్వండి అంటూ క్లారిటీ ఇచ్చిన నటి!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియా వార్తలలో ఎక్కువగా నివసిస్తుంటారు. ఈమె సినిమాలలో నటించింది తక్కువ అయినప్పటికీ ఎన్నో వివాదాలలో నిలుస్తూ వైరల్ అవుతున్నారు.ఇప్పటికే ఈమె గురించి పెద్ద ఎత్తున ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

Poonam Kaur: పూనమ్ కౌర్ కి సంతానం అంటూ ప్రచారం.. ఊపిరి తీసుకొనివ్వండి అంటూ క్లారిటీ ఇచ్చిన నటి!

తాజాగా నటి పూనమ్ ఇద్దరు పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోపైనెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నటి పూనమ్ కి ఇదివరకే పెళ్లి అయిందని,ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది అంటూ వార్తలు వచ్చాయి. ఆమె సంతానమే ఈ పిల్లలు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

Poonam Kaur: పూనమ్ కౌర్ కి సంతానం అంటూ ప్రచారం.. ఊపిరి తీసుకొనివ్వండి అంటూ క్లారిటీ ఇచ్చిన నటి!

సోషల్ మీడియాకు థాంక్స్…

ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు. వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను నన్ను కాస్త ఊపిరి తీసుకొని, బతకనివ్వండి అంటూ తన గురించి వస్తున్న వార్తలపై ఈమె క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా పూనమ్ కౌర్ పిల్లల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

Online Game: తాజాగా చెన్నైలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యాంకు ఉద్యోగి భార్య పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణికందన్ అనే వ్యక్తి పారూర్ లోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉండటంతో మణికందన్ కూడా మంచి జీతమే వస్తూ ఉండేది.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

అతను సంవత్సరానికి దాదాపు 28 లక్షల జీతం తీసుకునే వాడు. ఇక సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లోని సెవెంత్ ఫ్లోర్ లో తన భార్య తారా, కొడుకు తరుణ్, మరొక కొడుకు దహన్ తో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
ఈ మధ్యకాలంలో మణికందన్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటకి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే లక్షల జీవితం వస్తున్నా కూడా, ఆ ఆట కోసం లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల పాలయ్యాడు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

ఈ క్రమంలోనే ఒక రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్న మణికందన్ కు, అతని భార్య తారా కి మధ్య కి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భార్యతో గొడవలు, మరొకవైపు అప్పులు తీసుకున్న వాళ్లు నుంచి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మణికందన్, క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

అప్పుల బాధలు తట్టుకోలేక..

ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 31న ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మణికందన్ కు అప్పు ఇచ్చిన అతని స్నేహితురాలు తరచూ ఫోన్ చేస్తుండటంతో.. ఏదో ఒక కారణం చెప్పాలి అని మణికందన్ తన భార్యతో ఫోన్ మాట్లాడించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా మణికందన్ మొదట తన భార్యా పిల్లలను చంపి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక జనవరి 1న వీరు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నట్టింట్లో తారా, ఆమె పిల్లలు విగతజీవులుగా కనిపించారు. మణికందన్ కిచెన్ లో ఉరి వేసుకొని కనిపించాడు. మణికందన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి, తన పిల్లలను గొంతునులిమి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

పిల్లలలో కోపం,చిరాకు ,మొండితనానికి కారణం తల్లిదండ్రులని మీకు తెలుసా….?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు డబ్బు సంపాదన ఉరుకుల పరుగుల జీవితంతో పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి కష్టపడుతూ వారి బాగోగులు కూడా చూడకుండా డబ్బు సంపాదన పడిపోయారు. కానీ డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలం అనుకుంటే అది పొరపాటే.

తల్లిదండ్రులు రాత్రి పగలు ఉద్యోగాలు అంటూ పిల్లల్ని కేర్ టేకెర్స్ దగ్గర వదిలి వెళ్లడం, వారి చదువు కోసం పిల్లల్ని ఉదయమే స్కూల్ కి పంపించడం రాగానే మరి ట్యూషన్ కి పంపడం వారితో సమయమే గడపకుంటే మీ పిల్లల మొండి తనానికి ,చిరాకుకి మీరే కారణం అవుతారు.

ఉద్యోగాల పనిలో పడి పిల్లలతో సమయం గడపకుండా ఉంటున్నాము. కానీ మన పనిని కాస్త పక్కన పెట్టి వారితో ప్రేమగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలతో సమయం కేటాయిస్తూ వారిని బయటికి తీసుకుని వెళుతూ ఉండాలి. రోజుకి కొద్ది సమయం పిల్లలతో గడిపి వారి బాగోగులు వారి ఇబ్బందులు గురించి తెలుసుకోవాలి.

పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో వారి సమస్యలు గురించి మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటే వారు ఎటువంటి ఒంటరితనాన్ని ఫీలవకుండా ఉంటారు. అలాగే తల్లిదండ్రుల పై ఎలాంటి కోపం చిరాకు లేకుండా మనతో ఎంతో స్నేహభావం గా ఉంటారు.