Tag Archives: comment

బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేసిన యాంకర్ రవి.. నా విషయంలో అదే జరిగిందంటూ..?

బిగ్ బాస్ సీజన్ 5 లో 12వ వారంలో యాంకర్ రవి అనూహ్యంగా బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అతడి ఎలిమినేషన్ ఫేక్ అంటూ బయట అతడి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. తను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు రవి. బిగ్ బాస్ ఇంటి నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు.

యాంకర్ రవితో పాటు, బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెట్లు సైతం ఎవ్వరూ ఎలిమినేషన్‌ను ఊహించలేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ చివరి వరకు పోటీలో ఉండాల్సిన రవి ఇలా బయటకు రావడం ఏంటని అంతా ఆలోచనలో పడ్డారు. రవి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఏ బేస్ పై ఉంటుంన్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. మొన్న టాస్క్ లో 100 శాతం ఇచ్చి ఆడుతున్న విశ్వా బయటకు వచ్చాడు.. అయితే అతడికి బయట ఫ్యాన్స్ లేరనుకుందాం.

మరి యాంకర్ రవి విషయంలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయినా అతడు ఎలిమినేట్ అయ్యాడు. దీనికి గల కారణం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు రవి ఫ్యాన్స్. ఇక బయట ఫ్యాన్ ఫాలోయింగ్.. సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన తీరు చూసి షాక్ అయ్యాడు రవి. తన ఎలిమినేషన్ పై అనుమానాలు ఉన్నాయంటూ.. ఇన్ స్టా వేదికగా లైవ్ లోకి వచ్చి మరీ చెప్పాడు.

బిగ్ బాస్ పై అతడు పరోక్షంగా ఆరోపణలు చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటి బయటకు చూపించేది ఒకటి అని రవి అన్నాడు. తాను చేసింది ఒకటి.. బయటకు మాత్రం ఇంకోలా ప్రొజెక్ట్ చేశారంటూ రవి అన్నాడు. ఇక హౌస్ లోకి వెళ్లేముందు తనపై మీమ్స్ , ట్రోల్స్ చేయండంటూ చెప్పానని.. కానీ తన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క రెండు వేల రూపాయలు ఇస్తే.. వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా ట్రోల్స్ చేసే బ్యాచ్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“పవన్ రాజాకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత..” సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమని.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.

ఇక.. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను.

అలాగే జ‌రిగింది.. అని ఆయ‌న తెలిపారు. అవ‌న్నీ అచ్చం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌ర‌గ‌డం విశేషం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే జగనే ఉంటారని జోస్యం చెప్పాడు. ఒక వేళ జగన్ ను టార్గెట్ చేయాలంటే.. 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలన్నారు. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2019 లో జగన్ కు జాతకపరంగా మంచి స్టార్ట్ కాగా.. అది 2020 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుందన్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

సునీల్‌తో కలిసి చేసిన సీన్లన్నీ తీసేశారు: ఆర్టిస్ట్ జయవాణి

రెండు, మూడు రోజులు షూటింగ్ చేశాక, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, డబ్బింగ్‌కి కూడా తనని పిలవలేదని ప్రముఖ నటి జయవాణి తెలిపారు. అది అందరివాడు సినిమా అన్న ఆమె, ఒకవేళ ఆ సీన్ ఆ సినిమాలో అన్‌వాంటెడ్‌ అని తీసేసి ఉంటారేమో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సినిమాలో చేసినందుకు గానూ కనీసం డబ్బులు కూడా రాలేదని ఆమె అన్నారు.

ఇలా సినిమాలో యాక్ట్‌ చేసి, తర్వాత కొన్నింటికి డబ్బులు కూడా రావని, దానికి చాలా కారణాలుంటాయని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదా ? లేదంటే మేనేజర్స్ ఇవ్వలేదా ? లేదా ఇంకేదైనా కారణమై ఉండొచ్చని జయవాణి తెలిపారు. ఇంకా అదీ కాదంటే ప్రొడక్షన్‌ వాళ్లకే ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు అని ఆమె అన్నారు. కొందరైతే తనకు ఫోన్ చేసి ఈ సీన్‌కి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అంటే, ఓకే సర్ అని డబ్బింగ్ కూడా చెప్పి వస్తూండేదాన్ని అని ఆమె స్పష్టం చేశారు.

తనకు అలా డబ్బు ఇవ్వమని చెప్పిన సినిమాలు తనకు చాలా మిస్సయ్యాయని ఆమె వివరించారు. కానీ దాని గురించి తనకు అంత ఇబ్బందేం అనిపించేది కాదని ఆమె చెప్పారు. తానెప్పుడూ డబ్బుల గురించి గానీ, ఇంకే విషయానికి గానీ తాను ఎవ్వరితోనూ గొడవ పడడం అలాంటివేం చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

ఇలా తానే అర్థం చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయేదాన్ని ఆమె చెప్పారు. వీలైతే తరువాతి సినిమాలో మీ బ్యానర్‌లో ఏమైనా సినిమా తీస్తే మాత్రం తనకు అవకాశం ఇవ్వండని మాత్రం చెప్పేదాన్నంటూ ఆమె అన్నారు. అలాగే ఆంధ్రుడు సినిమాలో కూడా నేను సునీల్‌తో చేసిన సీన్లు అన్నీ తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బే కావాలంటే.. మరో స్థితిలో ఉండేదాన్ని.. నేను అలా చేయాలనుకోలేదు: పూర్ణ

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ఢీ’ రియాల్టీ డ్యాన్స్ షోలో ఒక జడ్జిగా పూర్ణ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె తెలుగులో ‘సీమ టపాకాయ్’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అల్లరి నరేష్ తో జతకట్టారు. అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తర్వాత పలు క్రేజీ సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అవును’ సినిమా చేస్తున్న సమయంలో తనకు బోయపాటి నుంచి ఆఫర్ వచ్చిందని.. అనుకోని కారణాల వల్ల వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుతం ‘అఖండ’లో ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ఇలా మాట్లాడారు. నిజానికి ఇప్పుడీ చిత్రంలో నేను పోషించిన పాత్రను తొలుత మరో నటిచేయాల్సింది. తర్వాత ఆ పాత్రకు నన్ను సంప్రదించగానే షాకయ్యా.

ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాది ఓ చిన్న పాత్రై ఉంటుందేమో అనుకున్నా. బోయపాటి సర్‌ కథ గురించి.. నా పాత్రకున్న ప్రాధాన్యత గురించి చెప్పాక చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ఇక మంచి చెడులను తెలుసుకుంటూ.. కేరళ నుంచి వచ్చిన తాను తెలుగులో సంపూర్ణంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇక సెలెబ్రిటీలు అనే వాల్లు పబ్లిక్ ప్రాపర్టీ అని.. ఎదుకంటే.. వాళ్ల వళ్లనే సెలెబ్రిటీ హోదా వచ్చిందని చెప్పుకొచ్చారు.

నెగిటివ్ .. పాజిటివ్ కామెంట్లను ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక డబ్బే కాలవాలంటే.. తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసి ఉండాలని.. కెరీర్ సాఫీగా కొనసాగాలంటే.. మంచి పాత్రల్లోనే నటించాలని చెప్పింది. ఏదేమైనా ఇప్పుడు బోయపాటి – బాలకృష్ణల కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ చిత్రంలో నేను భాగమయ్యా. ఎంతో సంతృప్తిగా ఉందన చెప్పారు.

హీరో నాని చేసిన ఆ పనికి తాను బాధపడ్డాను.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తమన్..

సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసినా.. ఆ సినిమాలోని పాటలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయే అందరికీ తెలిసిందే.

అలా అతడు ప్రస్తుతం తన సంగీతంతోనే తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. సౌత్ లోనే అతడి హవా కొనసాగుతోంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్న తమన్ ఇటీవల విడుదలైన నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. అతడు ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే నానికి నచ్చలేదు.. దీంతో గోపీసుందర్ ర్ తో చేయించుకున్నారని తెలిపారు.

ఇక తనకు బాలీవుడ్ కు ఉన్న సంబంధాన్ని గురించి తెలిపాడు. బాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా చేయడం వేరు.. సౌత్ లో సంగీతం అందించడం వేరు అని అన్నాడు. బాలీవుడ్ లో సంగీతం ఒక్కడే అందిచడం అనేది ఉండదని.. ఒక్క సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేస్తారన్నారు. అంతే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరొకకు ఇస్తారంటూ చెప్పాడు.

ఒకే సినిమాకు సంబంధించి మొత్తం సంగీతం అనేది ఒక్క దర్శకుడికి ఇస్తేనే బాగా చేయగలం.. ఇలా ఇద్దరు ముగ్గురికి ఇస్తే సంగీతం కంపోజ్ చేయడం తన వల్ల కాదు అని.. అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి సౌత్ కు వచ్చినట్లు చెప్పాడు. అతడు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను గుర్తు చేశాడు.

షణ్ముఖ్ పాలప్యాకెట్లు ఎత్తుకుపోయేవాడు.. యూట్యూబర్ పై మండిపడిన అఖిల్..!

అఖిల్ సార్దక్.. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇదిలా ఉండగా 12 వ వారంలో యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

అతడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడి ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఫేక్ ఎలిమినేషన్ చేశారంటూ.. బిగ్ బాస్ పై చిర్రెత్తిపోతున్నారు. పింకీ, సిరి కంటే తక్కువగా యాంకర్ రవికి ఓట్లు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ప్రాంతీయ బేధం చూపించారని తెలంగాణ జాగృతి సభ్యులు ఆరోపించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు కానీ.. బయట ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు.

తాజాగా ఓ యూట్యూబర్‌ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది… పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్‌ నీలాగే ఉంటడు షణ్ను..’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను అఖిల్‌ సార్థక్‌ తన ఇన్ స్టాలో ట్యాగ్ చేసి ఇలా అన్నాడు.

గేమ్ ను గేమ్ లాగే చూడండి.. దయచేపి తప్పుగా మాట్లాడకండి అంటూ అన్నాడు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం కోసం అవతలి వాళ్లను కించపరచడం అనేది తప్పు అంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీనిపై దీప్తి సునయనా స్పందించారు. షణ్ముఖ్ జశ్వంత్ కొరకు స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా హౌస్ లో కంటే..ఫ్యాన్స్ మధ్యే హీట్ విపరీతంగా పెరిగిపోతోంది.

బిగ్ బాస్ లో అతను తప్ప అందరూ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన 7 ఆర్ట్స్ సరయు..!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెవెన్ ఆర్ట్స్ సరయు ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన ఈమె బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో రెచ్చిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇకపోతే తాజాగా సరియు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈమె రవి ఎలిమినేట్ అవుతాడని చేశారా లేక పోతే తనకు సపోర్ట్ చేయమని చేశారో తెలియదు కానీ ఈమె రవికి సపోర్ట్ చేయమని పోస్ట్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా ఫేక్ అని ఒక రవి తప్ప అంటూ రవి గురించి కామెంట్ చేశారు. కనుక రవికి మద్దతు తెలపండి అంటూ ఈమె తన అభిమానులను వేడుకుంది. అయితే సరయు రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఇలా ఎందుకు కామెంట్ చేశారన్న విషయం తెలియడం లేదు. అతను ఎలిమినేట్ కాడన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి కామెంట్ చేశారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

అయితే బిగ్ బాస్ 12వ వారంలో భాగంగా రవి ఎలిమినేట్ కావడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా అతను ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులను ట్రోలింగ్ చేస్తున్నారు.

50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ప్రియాంక!

బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలిచినటువంటి వారికి ప్రైస్ మనీ 50 లక్షల రూపాయలను అందిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం 50 లక్షల ప్రైస్ మనీతో పాటు 25 లక్షల విలువచేసే సువర్ణభూమి 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.

ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో 50 లక్షల రూపాయకు గెలిస్తే ఎవరు ఏం చేస్తారని నాగార్జున అడిగారు. ఇలా నాగార్జున అడగడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి అమ్మలకి ఇస్తామని ,మరికొందరు అప్పులు కడతామని, కొందరు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తామని తెలిపారు.

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్ ప్రియాంక మాత్రం తను అమ్మను అవుతానని షాకింగ్ కామెంట్ చేశారు.తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉందని అయితే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని సూచించారని ప్రియాంక తెలిపారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో లో 50 లక్షలు గెలిస్తే తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టించి అనంతరం తను ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకు అమ్మ అవుతానని ప్రియాంక తెలిపారు. ఇలా బిగ్ బాస్ ద్వారా తన కోరికను నెరవేర్చుకుంటానని ప్రియాంక తెలిపారు.

మీ బొందరా.. మీ బొంద నా జీవితంలో ఇలాంటి చిల్లర పనులు చేయను ..షాకింగ్ కామెంట్స్ చేసిన దీప్తి సునైనా!

బిగ్ బాస్ హౌస్ లో గత శనివారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు సర్ ప్రైజ్ చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ షణ్ముఖ్ కోసం తన అన్నయ్య దీప్తి సునయన వేదిక పైకి వచ్చారు. ఇలా దీప్తి సునయన వేదికపైకి వచ్చి షణ్ముక్ కి మరింత ధైర్యం చెప్పిందని తప్పకుండా నువ్వే గెలవాలి అంటూ అతనిని ఎంకరేజ్ చేసింది.

ఇక దీప్తి సునయన మాట్లాడుతూ మరో మూడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండమని చెబుతూ అతని పై ముద్దుల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ విషయంలో దీప్తి సునైనా కంటెస్టెంట్ షణ్ముఖ్ కి ఒక హింట్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

దీప్తి సునైనా వేదికపైకి రాగానే తన రెండు వేళ్ళతో మైక్ పట్టుకోవడం చూస్తుంటే తను ఇండైరెక్టుగా షణ్మఖ్ కి తను టాప్ టు లో ఉన్నట్లు చెప్పిందని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షణ్ముఖ్ కూడా దీప్తి సునైనా వైపు చూసి చూడనట్లు ఉన్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరగడంతో ఈ విషయంపై దీప్తి సునైనా స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీబొందరా..మీ బొంద నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర పనులు చేయను. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా దృష్టిలో షణ్ముఖ్ ఎప్పుడు విన్నర్ అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీప్తి సునయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకరిని ప్రేమిస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ హాన్!

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంట్లోకి పంపించి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా హౌస్ మేట్స్ ను మరొకసారి సర్ ప్రైజ్ చేయడానికి మళ్లీ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను మరొకసారి స్టేజ్ పైకి పిలిపించారు. దీనితో హౌస్ మెట్స్ మరొకసారి ఫుల్ ఖుషి అయ్యారు.అయితే హౌస్ మెట్ వాళ్లకు కావాల్సిన వాళ్ళు స్టేజి పైకి రావాలి అంటే వారికి ఎంతో ఇష్టమైన వస్తువును సాక్రిఫైస్ చేయాలి అనే ట్విస్ట్ పెట్టాడు నాగార్జున.

దీంతో హౌస్ మేట్స్ కూడా అందుకు ఓకే అన్నారు. ఈ క్రమంలోనే సిరి తనకు కాబోయే భర్త శ్రీహన్ కానుకగా ఇచ్చిన బ్రాస్లెట్ ను త్యాగం చేసింది. అనంతరం నాగార్జున శ్రీహాన్ ను స్టేజిపైకి పిలిపించడంతో శ్రీహన్ ను చూసి ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది సిరి. చాలా రోజుల తర్వాత శ్రీహాన్ కనిపించడంతో కనీసం అతన్ని తలెత్తి కూడా చూడలేకపోయింది. శ్రీహన్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

సరదాగా శ్రీహాన్ నన్ను వదిలేస్తావా అనగా… వెంటనే తిరిగి గుంజీలు తీసింది. అది చూసిన ఆమె ప్రియుడు తట్టుకోలేక,నువ్వు తప్పు చేయలేదు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ తిరిగి సిరి ముఖంలో చిరునవ్వు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె బాత్రూంలో తల బాదుకుని సీన్ రిపీట్ చేస్తూ ఎందుకు బాత్రూం గోడలు పగల కొడుతున్నావు అని సరదాగా ఏడిపించాడు.

అనంతరం 8మంది కంటెస్టెంట్ లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారో చెప్పాలి అని శ్రీహాన్ ని నాగ్ ప్రశ్నించగా.. సన్నీ టాప్ వన్ లో, షణ్ముఖ్ ని రెండవ స్థానంలో ఉంచాడు. రవీని మూడవ స్థానంలో, శ్రీరామ్ నాలుగు స్థానంలో ఉంచాడు. అనంతరం శ్రీహాన్ తాను ఒకరిని ప్రేమిస్తున్నానని, రెండు రోజుల క్రితమే ప్రపోస్ చేశాను మెసేజ్ కూడా పెట్టాను అంటూ సిరి గుండెల్లో గుబులు లేపాడు. ఆ ప్రపోజల్ కు థాంక్యూ శ్రీహన్ మామ అని రవి కూతురు రిప్లై ఇచ్చింది అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. చివరగా సిరిని సేవ్ చేసి వెళ్ళాడు.