Tag Archives: comment

ప్రొడ్యూసర్ పెద్ద తేడా.. ఆయనతో మాట్లాడలేదని నా సీన్స్ అన్నీ తీసేశారు: నటి అర్చన

ఒక తమిళ్ సినిమాలో తాను ఓ బ్యూటిఫుల్ రోల్‌ తాను నటించానని ప్రముఖ నటి అర్చన తెలిపారు. తనకు, తన మదర్‌కి ఓ కోడ్ లాంగ్వేజ్ ఉండేదని వీడు తేడా అని మాట్లాడుకుంటారని ఆమె అన్నారు. అలా సెట్లో ఉన్నపుడు వీడి బిహేవియర్ కొంచెం తేడాగా ఉందని అలా అనుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపోతే కొందరు షూటింగ్‌ సెట్లో అర్చన గారు ఉండాలి అంటారు. తీరా వెళ్లాక సిల్లీ బిహేవియర్ కనిపిస్తూంటుందని ఆమె చెప్పారు. అప్పుడు తాను మమ్మీ వీడు కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే, అవును. సరే వదిలేసేయ్ అని తన మదర్ అన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా షూటింగ్ కోసం హాంకాంగ్‌ వెళ్లానని, తనతో పాటు తన మదర్ కూడా వెంట వచ్చినట్టు ఆమె తెలిపారు. అక్కడ బ్యూటిఫుల్ సాంగ్ షూట్ చేశామని, మంచి ఫుటేజ్ షూటింగ్ కూడా అయిందని ఆమె అన్నారు.
కానీ ఆ ప్రొడ్యూసర్ చాలా యూజ్‌లెస్ ఫెలో అని ఆమె అన్నారు. వాడిని చూస్తే సినిమా తీయాలి, ఫ్యాషన్ కోసం ఏమీ రాలేదని, తన దగ్గర చాలా బ్లాక్‌ మనీ ఉంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టేయాలి అనేసి వచ్చినట్టు తనకు అనిపించిందని అర్చన తెలిపారు.

ఒక రెండు మూడు సార్లు అతను మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదని ఆమె అన్నారు. అయినా కూడా చూసీ చూడనట్టు ఉండి, అవేమీ తాను పట్టనట్టే ఉన్నానని ఆమె తెలిపారు. కానీ డైరెక్టర్‌కి మాత్రం తనపై మంచి ఒపీనియన్ ఉందని ఆమె చెప్పారు. చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్‌ కూడా అని ఆమె అన్నారు.

ఇకపోతే ఆ సినిమా రిలీజైంది. ఆ తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని అర్చన అన్నారు. అదేంటంటే, తాను చేసిన సాంగ్ మొత్తం ఆ సినిమా నుంచి తీసేసారని ఆమె వాపోయారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పై ప్రత్యేక అభిమానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ..!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనగానే గుర్తుకు వచ్చేది రామ్ గోపాల్ వర్మ. వివాదాలు కావాలనే స్పష్టించుకుంటాడు. వైఫైలా తన చుట్టే తిరగాలని కోరుకుంటాడు. తాజాగా అతడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వర్మ దర్శకత్వంలో వర్మ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. ఈ ట్రైలర్ గురించి
సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

ఈ ట్రైలర్ లో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ కోణంలో తీసినట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్లు స్ఫష్టంగా అర్థం అవుతోంది. ముఖ్యంగా ఇందులో టీడీపీ, జనసేన పార్టీల అభిమానులకు కోపం వచ్చే విధంగా ఉందంటూ.. ఆ పార్టీల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వర్మ టీడీపీ, జనసేన పార్టీల అభిమానులకు కోపం వచ్చే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాత్రం ఏనాడు కామెంట్లు చేయలేదు. అలాంటి సీన్స్ కూడా ఎక్కడా కనిపించలేదు. అతడు చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా రియల్ హీరో జగన్ అంటూ కామెంట్లు చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అతడిపై సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించగా.. అతడు ఈ విధంగా స్పందించాడు.. జగన్ నాయకత్వ లక్షణం నిజమైన నాయకుడికి ఉండాల్సిన విధంగా ఉంటాయని.. అతడి బిహేవియర్ తనకు నచ్చుతుందని.. అందుకే అతడిపై స్పూఫ్ చేయడానికి స్కోప్ లేదంటూ వర్మ అన్నారు.

ఈ కారణంగానే జగన్ పై సూఫ్ లాంటివి చేయలేదన్నారు. అంతేకానీ జగన్ పై ఎటువంటి ప్రత్యేక అభిమానం లేదని చెప్పాడు. ఈ కామెంట్ పై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా అతడి ట్విట్టర్ ఖాతాలో జగన్ రియల్ హీరో, చంద్రబాబు రీల్ హీరో అంటూ ఓ పోస్టు చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.. ఎలా అయినా హ్యాపీనే..

బ్రహ్మానందం.. తెలుగులో ప్రతీ ప్రేక్షకుడు అతడి కామెడీ అంటే పడి చచ్చిపోతాడు. అంతలా కామెడీని పండించడంలో దిట్ట. అస్సలు కామెడీ అనేది అతడే స్పష్టించాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అంతలా అతడి హావభావాలు ఉంటాయి. అతడు ఆ సినిమాలో ఉన్నాడంటే.. సినిమా హిట్ అనేది మినిమం గ్యారెంటీ. గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

దానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయంటూ అతడు ఇటీవల ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరై తెలిపాడు. దానికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోలో బ్రహ్మానందం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కమెడియన్ అలీ అడిగిన ప్రశ్నలకు అతడు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు.

లెక్చరర్‌గా ఉన్న తాను నటుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజలను నవ్వించగలనని నమ్మిన వ్యక్తి కీర్తి శేషులు జంధ్యాలని చెప్తూ బ్రహ్మానందం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తాను భగవంతుడు, తల్లిదండ్రుల తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాల్సింది జంధ్యాల గారికేనని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కన్నెగంటి బ్రహ్మానందం.. ఎక్కడ పుట్టారు..? ఎక్కడ పెరిగారు..? ఎక్కడ చదివారు..? ఎక్కడ సెటిల్‌ అయ్యారు..’? అని అలీ అడగ్గా..

బ్రహ్మానందం ఇలా సమాధానం చెబుతారు.. ఇవన్నీ ఎందుకురా అంటూ నవ్వుతూ అంటాడు. ఇక బ్రహ్మానందం అంటే హ్యాపీనా..? బ్రహ్మిగాడు అంటే హ్యాపీనా..? అన్న ప్రశ్నకు ఎవరు పిలిచినా పలకడం మన బాధ్యత కదా. మీమ్స్‌ క్రియేట్‌ చేసిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.. నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే కదా అంటూ సమాధానం చెబుతాడు బ్రహ్మానందం.

అసెంబ్లీ ఘటనపై స్పందించిన భువనేశ్వరి.. దిగజారిన వారు ఎలా అయినా మాట్లాడతారు అంటూ షాకింగ్ కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు అవమానకరంగా మాట్లాడటంతో సభ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున విలపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఘటన అనంతరం నందమూరి హీరోలు ఈ ఘటనపై ఘాటుగా విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈమె ఈ విషయం గురించి స్పందించారు. తాజాగా భువనేశ్వరి ఈ విషయంపై మాట్లాడుతూ టీవీలో తన భర్త చంద్రబాబునాయుడు ఏడవడం చూసి ఆమె ఇంట్లో ఏడ్చారని సమాచారం. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంటికి రావడంతో వారిని చూసి ఈమె మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘటన అనంతరం బయటపడిన భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని మనసులో నుంచి తుది చేయమని ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకని చెప్పారు. దిగజారిన మనుషులు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అలాంటివి మనసులో పెట్టుకోకూడదని భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ విధమైనటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో నాన్న గారి హయాంలో కూడా ఇలాంటి వారు ఎన్నో మాటలతో మనసును ఎంతో ఇబ్బంది పెట్టారని, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కనపెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని ఈమె సూచించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మీపార్వతి.. ఆస్కార్ అవార్డును మించిన నటనంటూ కామెంట్స్..!

ఇటీవలే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ఆయన భార్యను కూడా వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో చంద్రబాబు ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయం పై పలువురు టీడీపీ నేతలు, నందమూరి ఫ్యామిలీతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ విషయం పట్ల వైసీపీ తీరును ఖండిస్తున్నారు. తనను మాత్రమే కాకుండా, తన కుటుంబం పైనా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవమానించారంటూ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైన విషయం తెలిసిందే.

దీనితో చంద్రబాబు కన్నీరు చూసి టిడిపి నేతలు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో టిడిపి నేతలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలకు గురయ్యాయి.రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం వైసిపి నేతలను దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు.ఇదిలా ఉంటే వైసీపీ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు చంద్ర‌బాబు తీరుని ఖండిస్తున్నారు.

శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తల్లి,చెల్లి, బాబాయ్‌,గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్‌ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదన్నారు.తాజాగా ఈ విషయం పై ల‌క్ష్మీ పార్వ‌తి స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో చేసినట్లుగానే అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆమె తెలిపారు.అక్కడ ఏమి జరగకపోయినప్పటికీ మసిపూసి మారేడుకాయ చేశారని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు గుప్పించింది.

అయితే తాను ఒక వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చానని తెలిపారు. నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు మాయలో పడొద్దని కోరుతున్నా ఆ ఫ్యామిలీలో బాలయ్య బాబు మంచివాడని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని ఓ నిజం చెబుతున్నా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని అన్నారు. ఇది నిజమో కాదో బాలయ్య చంద్రబాబును అడగాలని లక్ష్మీపార్వతి తెలిపారు.చంద్రబాబు కన్నీళ్ళని నాటకాలనే ఇతను ఆస్కార్ అవార్డును దాటిపోయి నటిస్తున్నారంటూ ఈమె విమర్శలు చేశారు.

అసెంబ్లీ ఘటనపై స్పందించిన తారక్.. అరాచక పరిపాలనకు నాంది అంటూ షాకింగ్ కామెంట్స్..!

నిన్న అసెంబ్లీ లో వైఎస్ఆర్ సీపీ నాయకులు, టిడిపి నాయకుల మధ్య జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన భార్యను అవమానించారని మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ స్పందించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.అయితే తాను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని ఒక దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని తెలియజేసిన ఎన్టీఆర్ స్త్రీలపట్ల పరుషంగా మాట్లాడటం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

మనదేశంలో స్త్రీలను గౌరవించడం సంస్కృతి అని ఈ అరాచక పరిపాలనను పక్కనపెట్టి సమస్యలపై పోరాడి రాబోయే తరానికి బంగారు బాట వేయాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అసెంబ్లీ ఘటన పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యలకు పలువురు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలబడగా మరికొందరు ఆయన మాటలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఎన్నో అరాచకాలు జరిగాయని ఎంతో మంది మహిళా ఉద్యోగుల పై దాడులు కూడా జరిగాయని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇండస్ట్రీలో వీక్ గా ఉన్న అమ్మాయిలను తొందరగా ట్రాప్ చేస్తారు: నటి అర్చన షాకింగ్ కామెంట్స్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు ఆర్టిస్టులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా నటి అర్చన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తెలుగు బాపుగారి దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అయితే అదే సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చిన్న పాత్ర రావడంతో అందుకు ఒప్పుకొని ఎంతో మంచి సినిమాను వదులుకున్నానని అలా జరిగిపోయింది అంటూ అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె సినీ కెరీర్లో తనకు జరిగిన అనుభవాలను, అవమానాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా తన కెరియర్ లో జరిగిన ఒక బ్యాడ్ సిచువేషన్ గురించి తనకు ప్రశ్న ఎదురవడంతో అర్చన షాకింగ్ కామెంట్ చేశారు.తెలుగులో ఒక డైరెక్టర్ ఉన్నారని ఆయన స్క్రిప్టు చెప్పేటప్పుడు ఒక విధంగా చెప్తారు షూటింగ్ చేసే సమయంలో ఆ స్క్రిప్ట్ ,డైలాగులు మారుస్తూ ఎంతో ఇరిటేషన్ తెప్పిస్తారని అయితే ఇది ఏంటి అని ప్రశ్నించినప్పుడు తను చెప్పే కబుర్లు వింటే మనమే తప్పనే భావన కలుగుతుందని తెలియజేశారు.

అదేవిధంగా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి మైండ్ సెట్ వీక్ గా ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఎంతో మంది ఉంటారని, అలాంటి అనుభవం తనకు ఎదురైందని అయితే ఈ విషయంలో నేను తొందరగా రియాక్ట్ కావడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడ్డానని తెలిపారు. ఇండస్ట్రీలో వీక్ గా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎఫ్‌3తో ఆ బాధ పోతుంది.. విక్టరీ వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం దృశ్యం 2. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేష్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. దృశ్యం1 లో మాదిరిగానే రాంబాబు క్యారెక్టర్ ఉంటుందన్నారు.

అంతకంటే ఎక్కువగా అతడు ఫ్యామిలీ కోసం చేస్తాడు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. ముఖ్యంగా అతడి ఉద్దేశ్యం మాత్రం ఫ్యామిలీని కాపాడుకోవడమే. ఇలాంటి పాత్రలో మళ్లీ నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తన అదృష్టం కొద్దీ సినిమా రంగంలోకి వచ్చాన్నారు. ప్రేక్షకుల అభిమానం దొరికిందని.. నాపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు.

వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు. ఇక దృశ్యం 3 వస్తుందా అన్న ప్రశ్నకు స్పందించిన వెంకటేశ్‌.. ‘మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చన్నారు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవ‌స‌రం లేదని తెలిపారు. ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయన్న బాధ ఎఫ్‌3తో పోతుందని తెలిపాడు.

విజయం, అపజయం అనేది ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక యంగ్ దర్శకుల నుంచి చాలా కథలు వింటున్నానని.. కానీ ఏ సినిమాకు సంతకం చేయలేదన్నారు. ప్రస్తుతం రానాతో ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ లో చేస్తున్నట్లు చెప్పాడు.

ఇంట్లో ఉన్న నన్ను తీసుకెళ్లి ట్రాప్ చేశారు.. నన్ను బాధ పెట్టిన వారు ఏ ఒక్కరు బాగుపడలేదు.. నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ నటిగా అందరికీ సుపరిచితమైన వారిలో నటి జ్యోతి ఒకరు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె వాంప్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో నటి జ్యోతి గురించి గతంలో డ్రగ్స్ కేసులో ఈమె ఇరికించడంతో అప్పట్లో ఈ విషయం ఎంతో సంచలనంగా మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి ఈ విషయం గురించి స్పందించారు.ఈ విషయంలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని ఇంట్లో ఉన్న నన్ను తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని ఆమె వెల్లడించారు. ఒకవేళ ఆ తప్పు నేను చేసి ఉంటే సాక్షాలు చూపించండి అంటూ ఈ సందర్భంగా ఈమె నిలదీశారు.

అప్పుడే నా భర్త నుంచి విడాకులు ఇవ్వడం, తన తండ్రి మరణంతో తను ఎంతో డిప్రెషన్లో ఉన్నానని, ఇలా డిప్రెషన్ లో ఉన్న నన్ను ఈ విధంగా ట్రాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అప్పటికింకా నాకు కేవలం రెండు సంవత్సరాల బాబు ఉన్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. కేవలం ఒక కేసును తప్పుదోవ పట్టించడం కోసం కావాల్సిగానే నన్ను ట్రాప్ చేసి హైలెట్ చేశారని, అయితే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారో ఇప్పుడు వాళ్లు చాలా అనుభవిస్తున్నారని ఈమె వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన తల్లి రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి మృతి చెందింది. తన భార్య మరణించి ఎంతో బాధ అనుభవిస్తున్నారని నా గురించి చెడుగా మాట్లాడిన వారు నాకు అన్యాయం చేయాలనుకున్న వారందరూ పూర్తిగా అనుభవిస్తున్నారని, కర్మ ఎప్పుడూ కూడా తన అడ్రస్ మర్చిపోవదంటూ ఈ సందర్భంగా జ్యోతి డ్రగ్స్ కేసు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

సావిత్రి లాగా నేను కూడా మోసపోయాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ షాకింగ్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి ఎన్నో వందల చిత్రాలలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తను పుట్టడమే డైమండ్ స్పూన్ తో పుట్టానని, చివరికి అల్యూమినియం స్పూన్ కూడా దొరకని పరిస్థితికి వెళ్లానని తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులు గురించి వెల్లడించారు.

తనకు 4అన్నయ్యలు ఒక తమ్ముడు అని ఎక్కడికి వెళ్లిన వారు తనను ఎంతో బాగా చూసుకునే వారని సుధ వెల్లడించారు. అయితే తన తండ్రికి క్యాన్సర్ రావడం వల్ల ఉన్న డబ్బులు మొత్తం నాన్నకు చికిత్సకు సరిపోయాయని ఆ సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించామని అలా నాన్నకు అనారోగ్యం చేయటం వల్లే కుటుంబం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని సుధా తెలియజేశారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునప్పటికీ తాను బాగా మోసపోయానని వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు షూటింగుకి వెళ్తే ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చే దాన్ని ఆ సమయంలో తనకు కావలసిన పనులను చేయడం కోసం పూర్తిగా మరొకరిపై ఆధారపడ వలసి వచ్చిందని ఇలా వేరొకరిని నమ్మి వారి చేతుల్లో తాను సంపాదించిన డబ్బులు పెట్టడం వల్ల పూర్తిగ మోసపోయానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

అప్పట్లో సావిత్రి ఏ విధంగా అయితే ఇతరులను నమ్మి తన సర్వస్వం కోల్పోయిందో ఒకానొక సమయంలో నేను కూడా అలాగే ఎంతో డబ్బును నష్టపోయానని సుధా వెల్లడించారు. అయినా నా కష్టాన్ని దోచుకొని తిన్న వారికి ఏమాత్రం సహించదని, ఇది తప్పుని వారు తెలుసుకున్నప్పుడే ఈ విధమైనటువంటి తప్పులు జరగవని ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.