Tag Archives: comments viral

Kumari Aunty: నేనేంటో నాకే తెలియదు… ఈ ప్రపంచాన్ని నాకు చూపించారు: కుమారి ఆంటీ

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె హైదరాబాద్లో ఒక ఫుడ్ స్టాల్ బిజినెస్ చేస్తూ ఎంతో మంది ఆకలి నింపడమే కాకుండా ఆ బిజినెస్ ద్వారా తన ఫోటో కూడా నింపుకునేవారు ఇదే జీవనోపాధిగా కొనసాగుతూ ఉన్నటువంటి కుమారి అంటే ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు.

ఇలా ఈమె మాట తీరుతో ఏకంగా ఒక డిజే సాంగ్ కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా కుమారి ఆంటీ ప్రెస్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఇక ఇటీవల కాలంలో ఈమె బుల్లితెర కార్యక్రమంలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాదులో జరిగిన డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కుమారి ఆంటీ మాట్లాడుతూ అసలు నేనెక్కడున్నాను ఏం చేస్తున్నాను అనే విషయాల గురించి నాకే సరిగా తెలియదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం సోషల్ మీడియా అంటూనే ఈమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చదువు పని లేదు..
ఇలా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయినటువంటి కుమారి అండి అనంతరం ఒక పద్యాన్ని కూడా పాడారు ఈ పద్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాలి మనిషికి ఒక ఆశయం ఉంటే చదువుతో పనిలేదని ఆశయ సాధన కోసం కష్టపడితే లక్ష్యాన్ని చేరుతారని ఈమె ఒక పద్యం రూపంలో ఎంతో స్ఫూర్తి దాయకమైనటువంటి వ్యాఖ్యలను చేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jyothika: నా భర్త సినిమాలు చూస్తే గర్వంగా ఉంటుంది.. అలాంటి సినిమాలే ఎంచుకుంటారు: జ్యోతిక

Jyothika: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతిక నటుడు సూర్య ఒకరు. వీరిద్దరూ కూడా తమిళం తెలుగు భాష చిత్రాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ జంట పలు సినిమాలలో నటిస్తూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా పెళ్లి తర్వాత హీరోయిన్ జ్యోతిక పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ సినిమా సైతాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన భర్త సూర్య సినిమాల గురించి మాట్లాడుతూ గొప్పగా చెప్పారు. తన భర్త ఎప్పుడూ కూడా మహిళలకు మంచి ప్రాధాన్యత ఉండే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటారని ఈయన తెలిపారు. ఆయన నటించే సినిమాలలో మహిళలను కించపరచకుండా వారిని ఎంతో మంచిగా చూపించే సినిమాలలోనే నటిస్తారు

మహిళలను కించపరచరు…
కథ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా మహిళా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సూర్య పెద్దగా పట్టించుకోరని అందుకే తన భర్తను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా జ్యోతిక తన భర్త నటుడు సూర్య సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rakul Preeth Singh: అలా ఉండమని మగాళ్లకు ఎందుకు చెప్పరు.. వస్త్రధారణ పై రకుల్ హాట్ కామెంట్స్!

Rakul Preeth Singh: రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే .దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఫిబ్రవరి 21వ తేదీ ఈ జంట గోవాలో ఎంతో ఘనంగా తమ పెళ్ళిని జరుపుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత కూడా రకుల్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేకాకుండా తన భర్తతో కలిసి పలు అకేషన్ లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు అయితే పెళ్లి అయిన తర్వాత కూడా ఈమెలో పెద్దగా మార్పు ఏమి రాలేదని తెలుస్తుంది. పెళ్లికి ముందు ఏ విధంగా అయితే పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేసేదో పెళ్లి తర్వాత కూడా అలానే గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

అత్తారింట్లో స్వేచ్ఛ ఉంది..
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురయింది. మీ ఇంట్లో మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని సలహా ఇవ్వలేదా అంటూ ప్రశ్నించగా నాకెవరు అలాంటి సలహా ఇవ్వలేదు అయితే నేను పుట్టింట్లో ఎలా ఫ్రీగా ఉన్నాను అత్తారింట్లో కూడా నాకు అలాంటి ఫ్రీడం ఉందని తెలిపారు. ఇక పెళ్లి తర్వాత పద్ధతులు మార్చుకోవాలని అమ్మాయిలకి ఎందుకు చెబుతారు ఇదే విషయం మగాళ్లకు ఎందుకు చెప్పరు అంటూ ప్రశ్నిస్తూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

Niharika: అన్యాయంగా నన్ను ఇరికించారు.. పబ్ ఇష్యూ పై మొదటి సారి స్పందించిన నిహారిక?

Niharika: నిహారిక పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు. అయితే అక్కడ కూడా ఈమె తన వైవాహిక బంధాన్ని కొనసాగించలేక విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి ఇలియానా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా నిహారిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈమె తన పబ్ అరెస్టు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిహారిక రాడిసన్ పబ్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది. అప్పట్లో ఈ అరెస్టు గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి అయితే తాజాగా నిహారిక ఈ వార్తలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిజానికి నాకు పబ్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ చాలా రోజుల తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్ రావడంతో వారితో కలిసి అక్కడికి వెళ్లానని తెలిపారు అయితే అక్కడ పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటే కంఫర్ట్ గా లేకపోవడంతో బయటకు రావాలని బిల్ పే చేసాము ఇక బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే పోలీస్ రైడ్ జరిగి వారితో పాటు మమ్మల్ని కూడా అరెస్టు చేశారని తెలిపారు.

ఆలస్యంగా అర్థమైంది..
ఇలా మమ్మల్ని చాలా అన్యాయంగా అరెస్టు చేశారని అయితే ఇక ఈ మీడియా కూడా రచ్చ చేస్తూ ఏవేవో వార్తలు రాశారని నిహారిక తెలిపారు. నిజానికి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతోని రైడ్ చేశారు.. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసిందని, నేను ఒక తప్పును ప్రదేశంలో ఉన్నాను అనే విషయాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్నాను అంటూ పబ్ ఘటన గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Anchor Shyamala: అర్ధరాత్రి ఫోన్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు .. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

Anchor Shyamala: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్లుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో సీరియల్ నటిగా పలు సీరియల్స్ చేశారు. అనంతరం యాంకర్ గా స్థిరపడ్డారు. ఇప్పటికీ పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇక శ్యామల చివరిగా విరూపాక్ష సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కెరియర్ మొదట్లో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లవ్ ప్రపోజ్ చేశారు…
తాను తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో చాలామంది తనకు ప్రపోజ్ చేశారని, చాలామంది నన్ను విసిగించారని ఈమె తెలిపారు. ఇక నేను నటిస్తున్నటువంటి ఒక సీరియల్ కెమెరామెన్ అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడు ఒకరోజు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగా ఇంట్లో అసలే మగదిక్కు లేరు. నేను ఏమైనా చేయగలను మీ కూతురు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారని శ్యామల తెలిపారు. ఆ దెబ్బతో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కొంతమంది చెప్పిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించిందని శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: బ్రో సినిమా విషయంలో నేను ఎన్నో తిట్లు తిన్నాను.. పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలపై ఎంతో ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉంది. ఇలా రాజకీయాలలో భాగంగా ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపొందలేకపోయారు. అయితే ఈసారి మాత్రం పక్క గెలవాలని ఉద్దేశంతో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజకీయ పార్టీలలో జనాలు లేకపోతే పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ లను ఉపయోగిస్తూ జనాలను పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు సినిమాలలో కూడా గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని తెలిపారు.

గ్రాఫిక్స్ ఇష్టం లేదు…
ఇలా సినిమాలలోనే నాకు గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని అయినప్పటికీ బ్రో సినిమా విషయంలో తాను ఎన్నో తిట్లు తిన్నానని తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగాలేదు అంటూ చాలామంది నన్ను తిట్టారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: ఇలా మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అవుతుంది.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు తన నటనతో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

ఈ విధంగా హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం సినిమాలు విడుదలైన సమయంలో ఆ సినిమాలు కనుక తనకు నచ్చితే ఆ సినిమాల పైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మాత్రమే ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలుకి తెలుగులో భారీ స్పందన వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు తెలుగు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పట్ల మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

యాక్టింగ్ ఇరగదీశారు…
ప్రేమలు సినిమాను తెలుగు ఆడియన్స్‌కి చూపించినందుకు కార్తికేయకి పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా.. అసలు చివరిసారిగా ఓ సినిమా చూసి నవ్వుకొని చాలా రోజులైంది. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. ఈ చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ అంటూ మహేష్ బాబు చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Ananya: ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్నా.. అలాంటి ఫోటోలు షేర్ చేసేది అందుకే: అనన్య నాగళ్ళ

Ananya: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ప్రస్తుతం తంత్ర పొట్టేలు వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఈమె నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

అనన్య నటించిన తంత్ర సినిమా మార్చి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె రీతూ చౌదరి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి దావత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీతు అడిగే ప్రశ్నలకు అనన్య చెప్పినటువంటి సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మీరు అందంగా కనిపించడం కోసం సర్జరీ చేసుకున్నారా నిజమేనా అంటూ ప్రశ్న వేయడంతో అవును తాను పెదాలకు సర్జరీ చేయించుకున్నానని ఈమె అసలు విషయం వెల్లడించారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అవకాశాల కోసమే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుంటారు. డైరెక్టర్ కు మేము బోల్డ్ సీన్స్ చేయడానికి సిద్ధమే అని చెప్పడానికి ఈ ఫోటోలు షేర్ చేస్తారా అని ప్రశ్నించారు.

అవకాశాల కోసం..
ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ చాలామంది అలాగే చేస్తున్నారని అవకాశాల కోసమే ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇంకా వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి అని పూర్తి విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Thamannah: ఆ ప్రశ్నకి ఇంకా రాజమౌళి సమాధానం చెప్పలేదు.. తమన్నా కామెంట్స్ వైరల్!

Thamannah : నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఇంత బిజీగా గడుపుతున్నారు. కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు..

ఇక ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో ఈమె అవంతిక పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక రాజమౌళి ఒక పాత్ర కోసం ఎవరినైనా ఎంపిక చేశారు అంటే ఆ ఎంపిక చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా ఈ విషయం గురించి పలు విషయాలను వెల్లడించారు. బాహుబలి సినిమాలో రాజమౌళి గారు నన్ను అవంతిక పాత్రకు ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం నాకు ఇప్పటివరకు తెలియడం లేదు ఇదే విషయాన్ని నేను రాజమౌళి గారి వద్ద ఎన్నోసార్లు అడిగాను అసలు నన్ను ఎందుకు అవంతిక పాత్రకు ఎంపిక చేశారు అని అడుగుతూనే ఉన్నాను.

అవంతిక…
ఈ విధంగా నేను అవంతిక పాత్రకు ఎందుకు ఎంపిక చేశారు అని రాజమౌళిని ప్రశ్నించినప్పటికీ ఆయన మాత్రం నవ్వుతూ వెళ్లిపోతారే తప్ప ఇప్పటివరకు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటూ తాజాగా తమన్నా అవంతిక పాత్ర గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారు దీంతో బాలీవుడ్ పైన ఫోకస్ కూడా ఎక్కువగా పెట్టారు.