Tag Archives: etv

Vishnu Priya: మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతా… తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయినా విష్ణు ప్రియ!

Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు విష్ణు ప్రియ యాంకర్ గా కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలు చేసిన అనంతరం ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఇకపోతే విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఇలా తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ విష్ణు ప్రియ చేసినటువంటి పోస్టులు అందరినీ ఎంతగానో కలిచి వేసాయి. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రియమైన అమ్మకు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరినీ వారి తల్లులతో ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఇందులో రాకింగ్ రాకేష్ నూకరాజు ఒక స్కిట్ చేశారు. ఆ కొడుకులు ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల తన తల్లి చనిపోతుంది ఇలా తల్లి చనిపోవడంతో తమవల్లే చనిపోయిందని ఆ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తారు.

Vishnu Priya: నీకు కూతురుగానే పుడతాను…


ఈ సన్నివేశం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ సన్నివేశం చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతానమ్మా ఐ లవ్ యు సో మచ్ అమ్మ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే విష్ణు ప్రియని చూసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలోకి రాకముందు సీరియల్ లో కూడా నటించాడని మీకు తెలుసా..?

Jr NTR: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. బాల రామాయణం సినిమా ద్వార చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత నిన్ను చూడాలని ఉంది అనే సినిమాతో హీరోగా మారాడు. ఇలా ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి ఎన్నో సూపర్ హీట్ సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గతే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమాలలోకి రాకముందు ఎన్టీఆర్ బుల్లితెర మీద ప్రచారం అయిన టీవీ సీరియల్ లో నటించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలకు పోస్టుగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా మారక ముందే సీరియల్లో నటించాడని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ నటించిన ఆ సీరియల్ వివరాలలోకి వెళితే…

ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో భక్త మార్కండేయ అనే సీరియల్ ప్రసారం అయింది. ఈ సీరియల్ లో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించాడు. ఈ సీరియల్ కొంతకాలం మాత్రమే ప్రచారం అయినప్పటికీ శివుడి భక్తుడిగా ఎన్టీఆర్ అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఎన్టీఆర్ మార్కండేయుడు గెటప్‌లో ఉన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.

Jr NTR:బుల్లితెర సీరియల్స్ లో నటించిన తారక్…

కొరటాల శివ దర్శకతవంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Comedian Komaram: ఆ ఐదేళ్లు నరకం అనుభవించా… ఆ కష్టాలు ఎవరికీ రాకూడదు: కమెడియన్ కొమరం

Comedian Komaram: బుల్లితెరపై ప్రసారమవుతున్న. కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ కొమరం ఒకరు.బహుశా కొమరం అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ కొమరక్క అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు.

జబర్దస్త్ కార్యక్రమంలో కొమరక్క పాత్రలో నటించిన కొమరం ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆ చీర కట్టు బొట్టు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. బయటకు ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని కొమరక్క అని పిలుస్తారని అలా పిలవడం తనకు చాలా ఆనందంగా ఉంటుందని తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కొమరం మాట్లాడుతూ తాను కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపారు. కోటిలో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు గొడుగులు అమ్ముకుంటూ ఉండేవాడినని తెలిపారు అలాగే ఒక రెస్టారెంట్లో కూడా తాను పనిచేశానని కొమరం వెల్లడించారు. ఇలా పనులన్నింటినీ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించానని అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కాస్త ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

Comedian Komaram: కోటిలో వస్తువులు అమ్ముకునే వాడిని

ఇక నా జీవితంలో ఒకానొక దశలో ఐదు సంవత్సరాలు పాటు చాలా కష్టంగా గడిచిందని కొమరం తెలిపారు. ఐదు సంవత్సరాలు నరకం అనుభవించానని ఆ కష్టాలు మరి ఎవరికి రాకూడదని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తాను పనిచేస్తున్నటువంటి బుల్లితెర కార్యక్రమం ఆగిపోవడంతో కొమరక్క టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని తెలిపారు.అలాగే సినిమా అవకాశాలు రావడంతో బిజీగా ఉన్నానని తెలిపారు. తాజాగా నాని కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలో కూడా నటించానని ఈయన తెలిపారు.

Racha Ravi: చెల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రచ్చ రవి.. ఒకసారి వచ్చి పోవమ్మా అంటూ?

Racha Ravi: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రచ్చ రవి కూడా ఒకరు. జబర్దస్త్ లో తన పంచులతో సెటైర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రచ్చ రవి.. తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఓకే ఒక్క డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటి ఎక్కడ చూసినా కూడా ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది.

ఇలా జబర్థస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి అటు వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన బలగం సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాడు. సినిమా విడుదల అయిన తరువాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రచ్చ రవి తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జీవితంలో ఎంత సంపాదించినా కూడా మన అనే వారు తోడుగా లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఇక ఈ ఇంటర్వ్యు లో రచ్చ రవి మాట్లాడుతూ..”ప్రతీ రాఖీ పండక్కి చెల్లి దగ్గరికి పోయి రాఖీ కట్టించుకునేవాడిని. కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు నాతో మాట్లాడం లేదు. మా ఇంటికి రావడం లేదు. 2016లో జరిగిన నా ఇంటి గృహప్రవేశానికి ఆఖరిసారిగా ఇంటికీ వచ్చింది.
అప్పటి నుండి నా ఇంటి గడప తోక్కలేదు ఈ రోజు నేను ఇంత సంపాదించి ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులతోపాటు నా చెల్లెలు కూడా కారణం.

Racha Ravi: ఇంత సంపాదించిన చెల్లి మాట్లాడలేదు…

సినిమాల మీద ఉన్న ఇష్టంతో సొంత ఊరిని వదిలి పట్నానికి వచ్చేటప్పుడు తను ఇచ్చిన రూ. 123 రూపాయల తీసుకునే నేను హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు నా ఎదుగుదలను కోరుకున్న నా చెల్లెలు ఇప్పుడు నేను జీవితంలో పైకి ఎదిగి ఇంత సంపాదించిన తర్వాత నాకు దూరం అయింది. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా చెల్లెలు నా ఇంటికి రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకనైనా అన్నీ మరిచిపోయి ఇంటికి రా చెల్లి అంటూ తన చెల్లిని వేడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అచ్చం బలగం సినిమాలో జరిగిన సన్నివేశం లాగే ఉంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Sudigali Sudheer: శ్రీదేవి డ్రామా కంపెనీలో షోలో సందడి చేసిన సుధీర్… సంతోషంలో రష్మి!

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా సందడి చేస్తున్న ఈయన అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ వచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను ఈ ముగ్గురు ఒకే టీం గా సందడి చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.ఇలా రోజు రోజుకు సుధీర్ క్రేజ్ పెరిగిపోతూ ఉండడంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా సినిమాలతో బిజీ కావటం వల్లే ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే సుధీర్ వెళ్లిపోవడంతో సుదీర్ లేని లోటు స్పష్టంగా కనపడుతుంది.

ఈ క్రమంలోనే ఎలాగైనా సుధీర్ ఈ కార్యక్రమాలలో సందడి చేయాలని అభిమానులు కోరుకున్నారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ సందడి చేయడంతో ఒక్కసారిగా వేదికపై ఉన్నటువంటి రష్మీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది.


Sudigali Sudheer: పర్మినెంట్ గా ఉండిపోతారా…

ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రష్మీ మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే కేవలం షో రేటింగ్ కోసమే వీరి మధ్య ఇలాంటి లవ్ ట్రాక్ క్రియేట్ చేశారని తెలిసినప్పటికీ నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒకటైతే బాగుండేదని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత సుధీర్ ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సుధీర్ పర్మినెంట్ గా ఈ కార్యక్రమంలో కొనసాగడం కోసం వచ్చారా లేకపోతే గెస్ట్ మాదిరిగా ఈ కార్యక్రమంలో సందడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Comedian Venu: ఎట్టకేలకు జబర్దస్త్ వీడడం పై నోరు విప్పిన వేణు… ఆ కారణంతోనే బయటకు వచ్చానంటూ కామెంట్స్!

Comedian Venu: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎందరో స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఇందులో సందడి చేసినటువంటి వారిలో వేణు ఒకరు. వేణు టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్ ఫర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు ఉన్న ఫలంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వేణు బయటకు రావడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈయన కూడా బయటకు వచ్చారని అందరూ భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వేణు పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించలేదు. అయితే ఈయన దర్శకుడిగా మారి తాజాగా బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని మనస్పర్ధలు కారణంగా బయటికి రాలేదని తెలియజేశారు.

Comedian Venu: సినిమాలపై పిచ్చే కారణం…

సినిమాలపై ఉన్న పిచ్చే తనని జబర్దస్త్ నుంచి బయటకు నడిపించిందని తెలిపారు.ఎలాగైనా సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన కసి అని తెలిపారు.అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సినిమా వేటలో పడ్డానని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు పేరు డబ్బు వస్తున్న కూడా వదిలేసి బయటకు వచ్చానని, ,అంతకుమించి తాను జబర్దస్త్ వదిలి రావడానికి మరే కారణాలు లేవంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Sridevi Drama Company: వేదికపై కొట్టుకున్న సీరియల్ ఆర్టిస్టులు… అవమానంతో వెళ్లిపోయిన నటి కరుణ!

Sridevi Drama Company: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది ప్రతి ఆదివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఇక వచ్చే ఆదివారం ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా యాంకర్ రష్మీ టీవీ నటిమలు అయినటువంటి భావన కరుణ మధ్య ఒక చిన్న పోటీ పెట్టారు. మ్యూజిక్ ఆగేలోపు ఎవరైతే ఆ బంతి తెచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళే విన్ అయినట్టు అని చెబుతారు ఈ ఆటలో భాగంగా భావన గెలిచారు. ఇలా ఈ ఆటలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వారికి చెంప దెబ్బ అయిన కొట్టాలి లేదా వారిని హగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే భావన మీరు గెలిచారు కనుక చెల్లిని హగ్ చేసుకుంటారా లేదా కొడతారా అని చెప్పడంతో భావన తనని కొట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చి వేదికపై కరుణను లాగిపెట్టి చెంపపై కొట్టారు.ఇలా ఎక్కడో జరిగిన విషయాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ తనని కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆర్గ్యుచేసిన కరుణ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Sridevi Drama Company:టిఆర్పి రేటింగ్ కోసమేనా…

ఇలా వేదికపై ఈ ఇద్దరు కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ కావడంతో కేవలం ఎపిసోడ్ పై హైలెట్ అవ్వడం కోసం ఎపిసోడ్ రేటింగ్ పెరగడం కోసమే మల్లెమాలవారు ఇలా ప్రోమో కట్ చేసి ఉంటారంటూ మరోసారి మల్లెమాల వారి వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తున్నారు.మరి భావన ఎపిసోడ్ రేటింగ్ కోసమే అలా కొట్టారా లేదంటే నిజంగానే కొట్టారా అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి తట్టుకోవడానికి వారిద్దరే కారణం… అసలు విషయం బయటపెట్టిన అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా గతంలో అనసూయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోందని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గతంలో వెల్లడించారు.

తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం తన ఇద్దరు కుమారులేనని చెప్పేశారు.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలతోను తాను బిజీగా గడుపుతూ తన సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోతున్నానని తెలిపారు.

Anasuya Bharadwaj: పిల్లలకు సమయం కేటాయించలేకపోవడమే కారణం…

ఇలా సినిమాలలో నటించడం వల్ల తనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే జబర్దస్త్ లో చేసిన మరికొంత ఆదాయం వస్తుంది కానీ పిల్లలతో కలిసి సమయం గడపడానికి కుదరకపోవటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి పూర్తిగా తప్పుకున్నాననీ ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comedian Ali: చిరంజీవి గారి మొహం చూడటం ఇష్టంలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కమిడియన్ అలీ..!

Comedian Ali: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లుగా ఎంతోమంది గుర్తింపు పొందారు. ఇలా కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో అలీ కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ కొన్ని వందలకు పైగా సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలీ ఇప్పటికీ వరుస సినిమాలను నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు.

ఇలా సినిమాలలో నటిస్తూ వాటిని నిర్మించటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ అనే షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల సుమ హోస్ట్ గా సరికొత్త టెలివిజన్ షో ప్రారంభమైంది. “సుమ అడ్డా” పేరుతో ఈటీవీలో ఈ షో ప్రసారం కానుంది. యాంకర్ గా బాగా పాపులర్ అయిన సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో సందడిగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో షోలలో హోస్ట్ గా వ్యవహరించిన సుమ సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో అలీ, పోసాని కృష్ణ మురళితో పాటు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా సందడి చేశారు. అందరిని తన మాటలతో నవ్వించే సుమ ఈ షో లో కూడా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో ఒక ఆట ఆడుకుంది. ఇక అలీ పోసాని కృష్ణమురళి గారిని కూడా విచిత్రమైన ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో అలీ గారితో మాట్లాడుతూ.. చిరంజీవి గారు మీరు కలిస్తే అందరినీ నవ్విస్తారంట? అని అడగగా..అలీ స్పందిస్తూ..

Comedian Ali: చిరంజీవిని ఎక్కువసేపు చూడలేను…


చిరంజీవి గారిని కలిసినప్పుడు నేను ఎక్కువసేపు ఆయన మొహం చూడలేను. ఎందుకంటే నన్ను చూడగానే ఆయన ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అందువల్ల నేను ఆయన మొహం చూడను అంటూ చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక పోసాని కృష్ణమురళి గారిని కూడా తనదైన ప్రశ్నలు వేసి ఒక ఆట ఆడుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sudigali Sudheer: మల్లెమాలవారు సుదీర్ ను రానివ్వడం లేదా…. ఆది మాటలకు అర్థం అదేనా?

Sudigali Sudheer: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్.

Hyper Aadi -Sudigali Sudheer: ఆ విషయంలో హైపర్ ఆది.. సుధీర్ నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందా?

ఇలా ఈయనకు బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన సుధీర్ ఏ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి అయితే గత ఏడాది ఈయన నటించిన గాలోడు సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ అవడంతో సుధీర్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈయన సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సుధీర్ తాను మల్లెమాల వారితో అనుమతి తీసుకునే బయటకు వచ్చానని త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పారు.అయితే ఈ మాట చెప్పి దాదాపు రెండు మూడు నెలలు అవుతున్న సుధీర్ ఇంకా జబర్దస్త్ కార్యక్రమంలోకి రాలేదు.

Sudigali Sudheer: సుధీర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టిన మల్లెమాల…


ఇకపోతే తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ కనుక చూస్తుంటే మల్లెమాల వారి కార్యక్రమాలలో పాల్గొనడం కోసం వారిని సుదీర్ బ్రతిమలాడుతున్నట్టు తెలుస్తోంది.ఓ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రష్మితో మాట్లాడుతూ మీవాడు తిరిగి రావాలని తెగ బ్రతిమలాడుతున్నాడు అంట కదా అంటూ కామెంట్ చేశారు.దీంతో మల్లెమాలవారు సుదీర్ఘ తమ కార్యక్రమాలలో పాల్గొనడానికి అంగీకరించలేదా తనకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుదీర్ సినిమాలతో పాటు అహాలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.