Tag Archives: evaru meelokoteswarulu

ఎన్టీఆర్ షోలో సెలబ్రెటీలు 25 లక్షల కంటే ఎక్కువ గెలవలేరా? అదంతా స్క్రిప్టేనా ?

బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. అలాంటి వాటిలో ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా ఒకటి. ఈ షోకు ఇప్పటికే నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుండగా, ఈ షోలో ఈ సారి కొద్దిగా మార్పులు చేసి దీనిని జెమినీ టీవీ వాళ్లు ప్రసారం చేశారు.బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటివరకు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి సందడి చేశారు.ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అద్భుతంగా ఆడుతూ ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, ప్రేక్షకులను అలరిస్తూ 25 లక్షలు గెలుచుకున్నారు.

అనంతరం తదుపరి ఎపిసోడ్ కి డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరిద్దరూ కూడా 25 లక్షల రూపాయల గెలుచుకున్నారు. అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ షో లో కనిపించి సందడి సందడి చేసింది. సమంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 25 లక్షల రూపాయలు తీసుకుంది. ఇక చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షో కి వచ్చారు.ఈ క్రమంలోనే తన సినిమాలకు సంబంధించి, ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు కూడా 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఈ షో కి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రేట్ ఇప్పుడు 25 లక్షలు గెలుచుకోవడం ఏమిటి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ షో కి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కేవలం 25 లక్షలు మాత్రమే గెలుచుకోవడంతో ఈ కార్యక్రమం గురించి ముందుగానే తెలియజేశారు అన్నా సందేహాలు తలెత్తుతున్నాయి. సెలబ్రిటీలకు ముందుగా సమాచారం ఇవ్వడంతో 25 లక్షల వరకు మాత్రమే ఈ షోలో గెలుచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు సెలబ్రిటీలకు కేవలం 25 లక్షలు గెలుచుకున్న అంత తెలివి మాత్రమే ఉందా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నార

చివరి అతిథిగా ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న.. సూపర్ స్టార్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి అతిథిగా వచ్చి తనదైన శైలిలో ఇందులో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం రేటింగ్స్ పెంచడం కోసం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను అతిధులుగా ఆహ్వానించారు. మెగా పవర్ స్టార్ తర్వాత ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.

ఇక దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత వచ్చారు. విడాకుల తర్వాత సమంత మొదటిసారిగా బుల్లి తెరపై సందడి చేయడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే సమంత ఎపిసోడ్ ప్రసారం కావడంతో కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి అతిథిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయం తెలియడం లేదు.

బాలకృష్ణ సినిమా చూసి కుర్చీలను విరగ్గొట్టిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా తారక్ ఈ కార్యక్రమానికి వచ్చే కంటెస్టెంట్ లతో తన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే తాజా ఓ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కంటెస్టెంట్ కి ఒక వీడియో క్లిప్ చూయించి అది ఏ సినిమాలోది అనే ప్రశ్న వేశారు.

అందుకు అతను వెంటనే బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రంలోనిది అని కరెక్ట్ సమాధానం చెప్పారు.ఇలా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రం అనగానే తనకు గతంలో జరిగిన ఓ సన్నివేశం గుర్తుకు వచ్చి ఈ సందర్భంగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం. బాలకృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమాను ఎన్టీఆర్ చూసేవారు. ఇలా నరసింహనాయుడు సినిమా విడుదలైనప్పుడు మొదటిరోజే ఈ సినిమాను చూడటానికి థియేటర్ కి వెళ్లానని చెప్పారు.

ఈ సినిమా చూసేటప్పుడు వచ్చిన ఎమోషన్ తట్టుకోలేక ముందున్న కుర్చీని ఒక్క తన్ను తంతే ఆ కుర్చీ విరిగిపోయిందని, అందులో కూర్చున్న వ్యక్తి కింద పడ్డారని ఈ సందర్భంగా తారక్ గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

షోలో ఎన్టీఆర్ కు చుక్కులు చూపించిన సమంత.. ఆమె ఎంత గెలుచుకున్నారో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా అప్పుడప్పుడు సెలబ్రిటీల సందడితో కొంత కలర్ ఫుల్ గా నడుస్తోంది. ఈ షో ఓపెనింగ్ కు రామ్ చరణ్ హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజమౌళి, కొరటాల శివ కలసి ఈ షోలో పాల్గొన్నారు. తర్వాత దసరా సందర్బంగా సమంత ఎపిసోడ్ లో సందడిగా కనిపించింది.

ఆమె ప్రత్యూష ఫౌండేషన్ కోసం డబ్బు గెలుచుకునేందుకు ఆమె ఈ షోకి అతిథిగా పాల్గొన్నట్లు తెలిపింది. ఎన్టీఆర్, సమంత మధ్య వినోదం ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించాయి. ఇలా ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెబుతూ.. చివరకు ఆమె రూ.25 లక్షలు గెలుచుకుంది. ఆ షోలోని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఆమె కాజల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పొకొచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కాజల్, సమంత హీరోహీరోయిన్లుగా బృందావనం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారివురికి మంచి ర్యాపో ఉంది. ఒకరంటే ఒకరికి మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో సమంత ఏమాత్రం బెరుకు లేకుండా సమాధానాలు చెప్పి.. అలరించింది. ఇక ఏమాయ చేసావే చిత్రం గురించి సమంత మాట్లాడింది. డార్లింగ్, ఏమాయ చేసావే రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయని ఆమె చెప్పింది.

ఎన్టీఆర్ కు సరదాగా సమంత విసుగు తెప్పించింది. సమాధానం చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకపోవడం.. ఫిక్స్ చేయమంటారా అంటే.. ఏం సమాధానం రాకపోవడం ఇలా అతడికి విసుకు పుట్టించింది సమంత. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసమే అని తెలిసిపోయింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. టీజర్ లో మీ వాయిస్ బుగుందంటూ మెచ్చుకున్నారు.. అప్పటి సావిత్రిలో ఉన్న నటన ప్రస్తుతం మీలో చూస్తున్నట్లు ఎన్టీఆర్ కితాబిస్తాడు. ఇలా షోలో సమంత సందడి సందడిగా గడిపింది.

ఎన్టీఆర్ షో లో సందడి చేసిన సమంత.. నాగచైతన్య గురించి ఏం చెప్పిందంటే?

గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వీరి గురించి వచ్చిన వార్తలు నిజమేనని అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇలా చైతన్య సమంతలు తమ విడాకుల విషయాన్ని ప్రకటించడంతో నెటిజన్లు వీరు విడాకులకు కారణం ఇదేనంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

విడాకుల తర్వాత సమంత నాగచైతన్య బాగా రిలీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి విడాకుల విషయం గురించి పెద్దగా స్పందించకపోవడమే కాకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో బుల్లితెరపై సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో ప్రసారం కాబోయే మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి అతిథిగా వచ్చారు.

సమంత పాల్గొన్న ఈ కార్యక్రమం వచ్చేవారం ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొన్న సమంత సుమారు పాతిక లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో కలిసి సమంత దాదాపు మూడు సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించారు. విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారిగా బుల్లితెరపై సందడి చేసిన సమంత నాగచైతన్య గురించి ఏ విధమైనటువంటి విషయాలు తెలియజేసిందనే విషయం తెలియాలంటే మనం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి, సమంత కలిసి మరొక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మరి కొన్ని కథలను వింటున్నారని తెలుస్తోంది.

ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేసిన హీరోలు.. ఆసక్తికర విషయాలను చెప్పిన రామ్ చరణ్..

కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ లో ఆదివారం నుంచి ప్రారంభం అయింది. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి హాట్ సీటులో కూర్చున్నారు. ఆర్ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో ఫస్ట్ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దీనిని త్రివిక్రమ్, కళ్యాణ్ కృష్ణ కురసాల లాంటి దర్శకులు తెరకెక్కించారు. వీటికి సంబంధించి ఎట్రీలను ఈ సంవత్సరం మార్చిలోనే తీసుకున్నారు.

కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సీజన్ కోసం దాదాపు 13 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోను కూడా భారీ స్థాయిలో లాంఛ్ చేశారు. దీనిలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తిగా సమాధానాలు చెప్పారు.

దీనిలో ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. ఈ సందర్భంగా అతడు తన దగ్గర ఆరు కుక్కలు ఉన్నాయని.. మరో వైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో ఓ గుర్రాన్ని రామ్ చరణ్ బాద్ షా అంటూ పిలవడం మనం చూశాం. అతడు పెంచుకుంటున్న గుర్రాల్లో అది కూడా ఒకటి ఉందని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్. రామ్ చరణ్ బోర్ గా ఫీలయినప్పుడల్లా అదుర్స్ సినిమా చూస్తూ ఉంటారని.. అందులో ఎన్టీఆర్ కామెడీ అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్‌గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.

వీడియో వైరల్: బుల్లితెరపై సందడి చేయనున్న ఇద్దరు స్టార్ హీరోలు.. విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమో!

బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న కార్యక్రమం “ఎవరు మీలో కోటీశ్వరుడు”. బుల్లితెరపై ఇదివరకే “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో కొన్ని సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా “ఎవరు మీలో కోటీశ్వరుడు” గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ కార్యక్రమంపై అంచనాలు పెంచాయి.

గత కొద్ది రోజుల నుంచి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ కు
సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలు ఇద్దరు స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఎంట్రీ ఇవ్వడం ప్రోమోకి హైలెట్ అయిందని చెప్పవచ్చు.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఒకే వేదికపై కనిపించడంతో ఈ కార్యక్రమం దద్దరిల్లిపోతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో రికార్డు స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రోమోలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తి కరంగా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఏది హాట్ సీట్, ఏది హోస్ట్ సీట్ తారక్ చెర్రీకి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు చెర్రీ దీర్ఘంగా ఆలోచిస్తూ సమాధానాలను తెలియజేస్తున్నారు.

https://youtu.be/SINxvviCKTo

ఈ విధంగా వీరిద్దరి మధ్య సాగిన మొదటి ఎపిసోడ్ ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే సందడి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.