Tag Archives: Goa

Shruthi Hassan: నానికి జోడిగా శృతిహాసన్ …నాని 30 లో షూటింగ్లో పాల్గొన్న నటి!

Shruthi Hassan: కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ ఈ ఏడాది రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శృతిహాసన్ ఎలాంటి సినిమాలను ప్రకటించలేదని భావించారు. అయితే ఈమె నాని హీరోగా నటిస్తున్న తన 30 వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా శృతిహాసన్ పాల్గొన్నారు.

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శృతిహాసన్ నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో శృతిహాసన్ నానికి జోడిగా నటిస్తున్నారా.. లేక ఏదైనా కీలకపాత్రలో నటిస్తున్నారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం శృతిహాసన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Shruthi Hassan: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్…


నాని నటించిన దసరా సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో నానికి ఒక కూతురు కూడా ఉండబోతుందని ఈ సినిమా తండ్రి కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Actress Soundarya: నటి సౌందర్యకు కొడుకు ఉన్నారా… వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు?

Actress Soundarya: వెండితెరపై మహానటి సావిత్రి తర్వాత అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇలా ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తన స్నేహితుడు రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికే ఈమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.ఇలా ఈమె రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం ఆయన పేరు మీద రాసేశారు.అయితే సౌందర్య మరణించిన తర్వాత ఆస్తి విషయం గురించి రఘు సౌందర్య తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

ఇక సౌందర్యం మరణించిన తర్వాత కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నటువంటి రఘు అనంతరం రెండవ వివాహం చేసుకొని ప్రస్తుతం ఈయన గోవాలో స్థిరపడ్డారు.అయితే సౌందర్య చనిపోక ముందే ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించారని అయితే ఈ విషయాన్ని సౌందర్య రహస్యంగా దాచిపెట్టారనే వార్త వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈ బాబు బాగోగులు అన్నింటిని కూడా తన తండ్రి రఘు చూసుకుంటున్నారట.


Actress Soundarya: సౌందర్యకు పిల్లలు లేరు


సౌందర్యకు కొడుకు ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ విషయం గురించి సౌందర్య సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. సౌందర్య పెళ్లి తర్వాత రెండు సంవత్సరాల వరకు పిల్లలు వద్దని భావించారట. అయితే సౌందర్య కొడుకు ఉన్నారని వచ్చే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ సౌందర్య సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తూ అసలు విషయం తెలియజేశారు.

Nagarjuna: గోవాలో అక్రమ నిర్మాణాలను ఆపేయాలి… హీరో నాగార్జునకు నోటీసులు జారీ!

Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన గోవాలో కమర్షియల్ వినియోగం కోసం కొన్ని నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాలను తక్షణమే ఆపాలంటూ నాగార్జునకు గోవా అధికారులు నోటీసులు జారీ చేశారు.

గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలను చేపడుతున్నారని అందుకే ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలి అంటూ సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.

ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కూడా మాండ్రేమ్ సర్జంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు నోటీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాగార్జునకు గోవాలోని నిర్మాణాలకు భారీగా షాక్ తగిలిందని చెప్పాలి.

Nagarjuna: నిర్మాణం ఆపకపోతే చర్యలు తప్పవు…


ఇకపోతే నాగార్జున ఈ విధమైనటువంటి అక్రమనిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన తెలంగాణలో ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టడంతో అప్పుడు కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు గోవాలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Jabardasth: మరోసారి డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన జబర్దస్త్ కమెడియన్స్.. దారుణమైన బూతు పదాలతో రచ్చ!

Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం అంటేనే డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్డా అని చెప్పాలి. మొదటి నుంచి ఈ కార్యక్రమంలో పరోక్షంగా డబుల్ మీనింగ్ డైలాగులతో ఒకరిపై మరొకరు సెటైర్లు వేస్తుంటారు.ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ కార్యక్రమం మొదట్లో కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పుడు జబర్దస్త్ అంటేనే డబ్బులు మీనింగ్ డైలాగులు అని అందరూ అలవాటు పడ్డారు.

జబర్దస్త్ కార్యక్రమంలో ఈ మధ్య కాస్త ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు తగ్గినప్పటికీ మరోసారి ఈ కార్యక్రమం రేటింగ్ కోసం పెద్ద ఎత్తున బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులతో పంచ్ లు వేస్తున్నారు.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు . ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ స్కిట్ కాస్త పరిధి దాటిందని చెప్పాలి.

తాగుబోతు రమేష్ తన భార్యతో కలిసి హనీమూన్ కోసం గోవా వెళ్దామని చెబుతారు. ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ హనీమూన్ బదులు హ్యాపీ మోడ్ అని స్టేటస్ పెట్టడంతో తన భార్య ఏవేవో ఊహించుకొని తెగ సిగ్గు పడిపోతుంది.ఈ క్రమంలోనే గోవాకి హనీమూన్ వెళ్లి ఏం చేస్తారండి అని ప్రశ్నించగా అందుకు తాగుబోతు రమేష్ సమాధానం చెబుతూ గోవాలో సముద్రతీరాన పొట్టి పొట్టి దుస్తులు ధరించి మూన్ ను చూస్తూ.. హనీ నాకడం అంటూ సమాధానం చెబుతారు.

Jabardasth: ఈ మాత్రం దానికి గోవా వెళ్లాలా…

ఈ విధంగా తాగుబోతు రమేష్ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా తన భార్యకు కోపం రావడంతో ఈ మాత్రం నాకడానికి గోవా వరకు వెళ్లాలా అంటూ పరోక్షంగా బూతు పదాలతో రెచ్చిపోయారు. మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి బూతు పదాలు వాడినప్పటికీ అవన్నీ కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.

Samantha: గోవాలో బికినీతో సమంత రచ్చ.. అభిమానులకు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా!

Samantha: భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సమంతకు సంబంధించి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే విడాకుల తర్వాత ఆమె ఎక్కువగా సినిమాలపై శ్రద్ధ వహిస్తూ.. ఫుల్ బిజీ అయ్యారు. పెళ్లికి ముందు ఎలాంటి స్కిన్ షో చేయని సంమత.. మొదటి సారిగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించారు.

Samantha: గోవాలో బికినీతో సమంత రచ్చ.. అభిమానులకు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా!

ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న సాంగ్ ఏదైనా ఉందంటే.. ‘ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా సాంగ్..’’మాత్రమే. అయితే ఈ పాట తర్వాత ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేశారు. శాకుంతలం సినిమా తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్లో చేయనున్నట్లు టాక్.

Samantha: గోవాలో బికినీతో సమంత రచ్చ.. అభిమానులకు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా!

అయితే తాజాగా ఆమెకు సంబధించి కొన్ని గోవా ఫొటోలు వైరల్ గా మారాయి. గోవా నుంచి సమంత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె ఈ ఫొటోలో బికినీలో కనిపించింది. ఆమెతో పాటు తన స్నేహితులు డిజైనర్ శిల్పా రెడ్డి మరియు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గోవా విహారయాత్రలో ఉన్నారు. 2022 కొత్త సంవత్సరం వేడుకులకు ఆమె గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.

బికినీ ధరించిన సమంత.. ఫోటోలు వైరల్!

Samantha: గోవాలో బికినీతో సమంత రచ్చ.. అభిమానులకు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా!

సాధారణంగా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సామ్ నాగ చైతన్యతో కలిసి విదేశాలకు వెళ్తుంది. ఈ సంవత్సరంలోనే వాళ్లిద్దరు విడాకుల ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక ఈ సారి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోడానికి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఆమె తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ ఫ్లాన్ చేసింది. అక్కడ ఆమె బికినీ ధరించి ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఎవరు ఈ లోబో.. చిన్నప్పుడు దొంగతనంతో మొదలైన ప్రయాణం.. బిగ్‌బాస్‌ వరకూ వచ్చిందని మీకు తెలుసా?

లోబో అంటేనే అందరికీ టక్కున అతని వేషధారణ గుర్తుకొస్తుంది. విచిత్రమైన వేషధారణలో అందరినీ సందడి చేస్తూ ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోతారు. కెరియర్ మొదట్లో యాంకర్ గా పరిచయమైన లోబో ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈయన పేరును మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేదు. యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేసిన లోబో ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే బిగ్ బిగ్‌బాస్‌ లోకి అడుగుపెట్టిన లోబో గురించి నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. లోబో ఎవరు.. ఏంటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.. లోబోగా అందరికీ పరిచయమైన ఇతని అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం. ఇతను పక్క హైదరాబాద్ వాసి. ప్రస్తుతం ఇతని వయస్సు 39 సంవత్సరాలు. 8వ తరగతి వరకు చదువుకున్న లోబో తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్లో ఏదో దొంగతనం కారణంగా తనకి టీసి ఇచ్చి పంపించారు.

ఈ విధంగా పైచదువులకు నోచుకోని లోబో హీరోయిన్ కాజోల్ అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఆమెను కలవడం కోసం ఇంట్లో కొంత డబ్బును దొంగలించి ముంబైకి వెళ్ళాడు. అలా ముంబైకి వెళ్లిన లోబో హీరోయిన్ కాజోల్ ను కలవకపోగా తన వెంట తీసుకెళ్లిన డబ్బులు మొత్తం అయిపోయాయి. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలను అనుభవించిన అతను ముంబై నుంచి కొందరి సహాయంతో గోవా చేరుకున్నారు.

ఈ విధంగా గోవాలో టాటూ వేయడం నేర్చుకున్న లోబో తిరిగి హైదరాబాద్ చేరుకొని టాటూ బిజినెస్ పెట్టారు. ఇలా టాటూ వేసే సమయంలో ఒక రష్యన్ యువతి ఇతను వేసిన టాటూ బాగా నచ్చడంతో అప్పటివరకు మహమ్మద్‌ ఖయ్యూంగా కొనసాగుతున్న అతనికి రష్యన్ యువతి ఎంతో ముద్దుగా లోబో అనే పేరును పెట్టింది. అయితే ఆ పేరు తనకి నచ్చడంతో అప్పటి నుంచి లోబోగానే కొనసాగుతున్నారు. లోబో పేరు ద్వారా యాంకర్ గా పరిచయమైన ఇతను ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి లోబో బిగ్‌బాస్‌ హౌస్ ద్వారా ఎలాంటి పాపులారిటీని దక్కించుకుంటారో వేచి చూడాలి.

మద్యం ప్రియులకు ఝలక్.. అక్కడ మందు తాగితే రూ.10,000 జరిమానా..?


మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల నిర్లక్ష్యం వల్ల గోవా తీర ప్రాంతాలలో భారీ సంఖ్యలో మద్యం సీసాలు చేరాయి. దీంతో గోవా పర్యాటక శాఖ బీచ్ లలో మద్యం తాగే వ్యక్తులకు 2 వేల రూపాయలు, గుంపులుగా మద్యం తాగే వ్యక్తులకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొంది.

గతంలోనే గోవా పర్యాటక శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. అయితే అప్పట్లో సవరణలు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి గోవా పర్యాటక శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. బీచ్ లలో మద్యం తాగకూడదని గోవా పర్యాటక శాఖ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ కమిషనర్ తమ శాఖకు సిబ్బంది ఉంటే సొంతంగానే ఈ నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.

పర్యాటక శాఖ పోలీసుల ద్వారా గోవాలో ఈ చట్టం అమలు కానుందని తెలుస్తోంది. మద్యానికి సంబంధించిన నిబంధనలతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి. సాధారణంగా కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కువమంది గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

సెలబ్రిటీలు సైతం కొత్త సంవత్సరం వేడుకలను గోవాలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం గురించి మద్యం ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.