Tag Archives: harish shankar

Pawan Kalyan: అలాంటి కండిషన్లతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు తనకు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుని కలెక్షన్ల పరంగా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కు ఆఖరి సినిమా అని ఈయన రాజకీయాలలో బిజీ కాబోతున్నారని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉంది.

ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇంతకుముందే ప్రారంభమైనటువంటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలోనే ఉండిపోయింది. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ప్రారంభించుకోలేదు. ఈ సినిమాలలో ఓజీ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఎలక్షన్ల తర్వాతనే షూటింగ్ పనులు ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీష్ శంకర్ ఉస్తాది భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Pawan Kalyan: 30 రోజులలో షూటింగ్ పూర్తి చేయాలి….


ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఎలక్షన్ల ముందు ఈ సినిమా విడుదలయితే తనకు కూడా కొంతమేర కలిసి వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే డైరెక్టర్ శంకర్ కి కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తుంది. తన వద్ద కేవలం 30 కాల్ షీట్స్ మాత్రమే ఉన్నాయని, 30 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట.సరైన హిట్టు లేక బాగా ఆకలితో ఉన్నటువంటి హరీష్ శంకర్ కు 30 రోజులు అంటే చాలా ఎక్కువ సమయం అని చెప్పాలి అయితే ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.

Allu Arjun: ఆ సినిమాలో నటించడం కోసం అల్లు అర్జున్ చికెన్ తినడమే మానేశారనీ మీకు తెలుసా?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయనకు ఇంత మంచి పేరు రావడానికి గల కారణం నటన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి తాను నటించే పాత్రలకు వంద శాతం న్యాయం చేయడమే కారణమని చెప్పాలి.

ఈయన ఏ సినిమాలో అయినా ఒక పాత్రకు కమిట్ అయ్యారు అంటే పూర్తిగా ఆపాత్రకు న్యాయం చేస్తారు. సినిమాల కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంటారనే సంగతి ఇప్పటికే నిరూపితమైంది. పుష్ప సినిమాలో ఈయన నటించిన తీరు అందుకు నిదర్శనం అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించడం ఏకంగా చికెన్ కూడా మానేసారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఈయన చికెన్ అసలు ముట్టుకోలేదని చికెన్ తన దరిదాపులలోకి కూడా రానివ్వలేదంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఏ సినిమా కోసం చికెన్ తినడం మానేశారు అనే విషయానికి వస్తే…

Allu Arjun: బ్రాహ్మణులకు గౌరవం ఇస్తూ…


అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి కుర్రాడు పాత్రలో నటిస్తారు.ఇక బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారిని గౌరవిస్తూ ఈ పాత్రలో నటించినన్ని రోజులు అల్లు అర్జున్ కూడా చికెన్ ముట్టుకోకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ సినిమా కోసం చికెన్ మానేసారని తెలియడంతో నటన పట్ల ఈయనకు ఉన్నటువంటి డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Poonam Kaur: ఇది నిర్లక్ష్యమా… అహంకారమా పవన్ సినిమా పోస్టర్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్!

Poonam Kaur: వెండితెర సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు సంపాదించుకున్న దాని కన్నా సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి పూనమ్ కౌర్. ఈమె హీరోయిన్ గా నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇతర సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.ఇలా పలు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పోస్టర్లు సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ కాళ్ల వద్ద ఉంది ఈ విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ ఇది మీ అహంకారమా లేక నిర్లక్ష్యమా.భగత్ సింగ్ వంటి ఒక గొప్ప నాయకుడి పేరును ఇలా కాళ్ళ కింద పెట్టడం అంటే ఆ నాయకుడిని అవమానపరచడమే అంటూ ఈమె కామెంట్ చేశారు.

Poonam Kaur: కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటి…


ఈ విధంగా పూనమ్ కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అటెన్షన్ సీకర్ అంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసే ఫస్ట్ గ్లింప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈమె ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త డిస్టర్బ్ అయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం పూనమ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: విజయ్ దేవరకొండ బర్త్ డే అనసూయకు కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్!

Anasuya: అనసూయ గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన పోస్ట్ కారణంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ఖుషి సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా అందులో ది విజయ్ దేవరకొండ అని ఉంది.

ఇది చూసిన అనసూయ పరోక్షంగా వామ్మో ది అంట ఈ పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మరికొందరైతే నువ్వు కూడా ఆంటీ పక్కన ది అని పెట్టుకో ఎవరైనా వద్దన్నారా అంటూ మరోసారి అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు యాంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ …

Anasuya: అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చాడుగా…


ది ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు. అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.. విజయ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు. దీంతో కావాలనే చేశావా? తెలిసే చేశావా? అంటూ విజయ్, ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అనసూయకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు అన్న అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Malla Reddy: పవన్ కళ్యాణ్ కు విలన్ గా నటించమని హరీష్ శంకర్ గంట బ్రతిమలాడారు: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మేమే ఫేమస్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యువతను ఉద్దేశించి పలు విషయాలను తెలియజేశారు.తెలంగాణలో యువత చాలా మంది ఉన్నారని అయితే వారందరూ కూడా చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలు చుట్టూ తిరిగితే ఫేమస్ కారని కష్టపడి పని చేస్తేనే ఫేమస్ అవుతారని తెలిపారు.

నేను కూడా ఒకప్పుడు పాలు అమ్ముకుంటూ బ్రతికేవాడిని కానీ కేసీఆర్ దయవల్ల మంత్రిని అయ్యానని తెలిపారు. ఇక సినిమాల గురించి మల్లారెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తాను తెలంగాణ యాసలో కొన్ని సినిమాలను నిర్మిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని అవకాశాలు కూడా కల్పించారని ఈయన తెలిపారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఆయనకు విలన్ గా నటించాలని కోరారు. ఇలా దాదాపు హరీష్ శంకర్ ఒక గంటపాటు నన్ను ఈ సినిమాలో నటించమని బ్రతిమలాడారు అంటూ మల్లారెడ్డి వెల్లడించారు.అయితే తాను సినిమాలలో నటించడానికి నో చెప్పానని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Malla Reddy: పవన్ సినిమాకు నో చెప్పిన మంత్రి…

ఇక పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సినిమాని చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయనతో తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోబోతుంది.

Harish Shankar: హీరోయిన్ ను మర్చిపోయారు.. డైరెక్టర్ హరి శంకర్ ట్విట్ పై స్పందించిన రెజీనా.. సారీ డియర్ అంటూ డైరెక్టర్ రిప్లై!

Harish Shankar: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ అనంతరం పలువురు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెజీనా కసాండ్రా హీరో హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమా విడుదల అయి ఏడు సంవత్సరాలు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా ఈ సినిమాలో నటించిన కొందరు నటీనటుల పేర్లను ప్రస్తావిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అప్పటి విషయాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.అయితే అందరి పేర్లు ప్రస్తావించిన డైరెక్టర్ హీరోయిన్ పేరు ప్రస్తావించడం మర్చిపోయారు ఈ క్రమంలోనే రెజీనా ఈట్వీట్ పై స్పందిస్తూ… బహుశా మమ్మల్ని డైరెక్టర్ మర్చిపోయినట్టున్నారు అంటూనే థాంక్స్ చెప్పారు.

సీతతో అంత ఈజీ కాదు అనే పాత్రను డిజైన్ చేసినందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ క్రమంలోనే రెజీనా చేసిన ట్వీట్ పై హరీష్ శంకర్ స్పందిస్తూ సో సారీ డియర్ నీతో అంత వీజీ కాదని ప్రూవ్ చేసావ్. సీత పాత్రలో బాగా చేసినందుకు థాంక్స్ అని చెప్పడమే కాకుండా మీతో పని చేయడం చాలా బాగుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.

Harish Shankar: స్పెషల్ థాంక్స్ చెప్పిన సాయి ధరమ్

ఇలా ఈ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ పై మెగా హీరోస్ సాయి ధరంతేజ్ కూడా స్పందిస్తూ థాంక్స్ చెప్పారు.ఇక హరీష్ శంకర్ చాలా కాలం నుంచి ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఏ మాత్రం పట్టాలెక్కలేదు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా గురించి పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.

Allu Arjun: బాలీవుడ్ హీరోలను తలదన్నేలా అల్లు అర్జున్ మాస్ లుక్… వైరల్ లుక్?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రోజురోజుకు విపరీతమైన అభిమానులు పెరిగిపోతున్నారు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో తన స్టైల్, మాస్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ లుక్ లోఅల్లు అర్జున్ చెవికి పోగులు సైడ్ హెయిర్ కట్ స్టైల్ నోట్లో సిగార్ పెట్టుకొని అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నారు. నిజం చెప్పాలంటే బాలీవుడ్ హీరోలను తలదన్నేలా అల్లు అర్జున్ న్యూ లుక్ ఉందని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఉన్నఫలంగా ఇలా తన లుక్ చేంజ్ చేయడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం తన లుక్ చేంజ్ చేసుకున్నారా అంటూ అభిమానులు ఆరాతీస్తున్నారు.

Allu Arjun: బొద్దుగా తయారైన బన్నీ.. వడా పావ్ అంటూ ట్రోల్ ..ఫోటో వైరల్!

అయితే ఈ లుక్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం కాదు. ఈయన తాజాగా నటిస్తున్న ఒక యాడ్ కోసం ఇలాంటి లుక్ లో సందడి చేశారు. హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాడ్ కు సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ లుక్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇలాంటి లుక్ అల్లు అర్జున్ సినిమాలలో కనుక ఉంటే ఆ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్…

ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోగా రోజురోజుకు తన స్టైల్ మేనరిజంతో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు సైతం అభిమాన హీరోగా మారిపోయారు. ఇప్పటికే ఎంతోమంది అల్లు అర్జున్ అంటే తమకు ఇష్టమని తనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ తో జతకట్టనున్న బుట్టబొమ్మ.. నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే కాంబో మరొకసారి రిపీట్ కానుందని చిత్ర బృందం ప్రకటించారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్‌సింగ్‌”అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ అఖిల్ పూజా హెగ్డే నటించినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ… హీరో అఖిల్ ని అభినందించిన ఆయన పూజాహెగ్డేను మాత్రం ప్రత్యేకంగా అభివర్ణించాడు. కరోనా సమయంలో అందరూ ఖాళీగా ఉన్నప్పటీకీ పూజ మాత్రం ఎంతో బిజీగా ఉన్నారని శంకర్ పూజ గురించి తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈమె వరుసగా అఖిల్, బన్నీ, చెర్రీ, పవన్ కళ్యాణ్, మహేష్ అంటూ టకటక హీరోల పేర్లు చెబుతూ నోరు జారారు. తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందన్న విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయటపెట్టారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ అధికారికంగా తెలియజేశారు.

ఆ కంటెస్టెంట్ మాటలు వింటే షణ్ముఖ త్వరలోనే బయటకు వస్తాడు: ఉమాదేవి

బుల్లితెరపై బిగ్ బాస్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి వారం సరియు హౌస్ నుంచి బయటకు రాగా రెండవ వారం ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఉమాదేవి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమాదేవి హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాదేవి.. సిరి, షణ్ముఖ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏంటి..? అంటూ వారి గురించి కామెంట్ చేయగా అనీ మాస్టర్ గురించి ఎంతో కన్నింగ్ గా గేమ్ ఆడుతోందని తెలియజేశారు.ఇక యాంకర్ రవి గురించి మాట్లాడుతూ తనతో బాగా గొడవ పడదామని నిర్ణయించుకున్నప్పటికీ తన ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని తెలిపింది.

ఇక సిరి ఉంటే పక్కన కచ్చితంగా షన్ను ఉండాల్సిందే.. అదేవిధంగా షణ్ముఖ్ ను ఉద్దేశించి ఈ అబ్బాయి కనుక సిరి మాటలు వింటే మాత్రం.. ఖచ్చితంగా హౌస్ నుంచి కొద్దిరోజులలో ఎలిమినేట్ అవుతాడని… సిరి చెప్పిన మాటలు కారణంగా ఇతను హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఉమాదేవి షణ్ముఖ్ జస్వంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

షణ్ముఖ్ సిరితో కాకుండా తన గేమ్ తను ఆడితే తను ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటాడని.. సిరి మాటలు వింటే మాత్రం కచ్చితంగా బయటకు వస్తాడు అంటూ తెలియజేసింది. ఉమాదేవి హౌస్ లో ఉన్నన్ని రోజులు బూతులు మాట్లాడుతూ టాస్క్ లలో పాల్గొని అందరినీ నవ్విస్తూ… లోబోతో ప్రేమ వ్యవహారం జరిపిన తనను ఎలిమినేషన్ నుంచి కాపాడలేకపోయాయని చెప్పవచ్చు.

సాయి ధరమ్ తేజ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ టీవీ9 జర్నలిస్ట్ మధ్య వాగ్వాదం.. ట్వీట్స్ వైరల్..

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి ధరమ్ ను ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి తరలించగా అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో అతన్ని పరీక్షించిన వైద్యులు అంతర్గత గాయాలివే కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు.

ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారంటూ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు కథనాలు రాస్తూన్నటువంటి మీడియా పై తీవ్రస్థాయిలో ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్ హాట్సాఫ్ బ్రదర్… నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు రాతలు రాస్తూ ఆ వార్తలను అమ్ముకొని బతుకుతున్న అందరూ బాగుండాలి వారికి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నా అంటూ ట్విట్టర్ వేదికగా పలు మీడియా సంస్థలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ కి టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ స్పందిస్తూ ఆయన ట్వీట్ కు రీట్వీట్ చేశారు.

ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.. తప్పుడు కథనాలతో హింసను ప్రేరేపిస్తూ సినిమాలు తీసి మీరు కోట్లు సంపాదించవచ్చు కానీ, మేము వార్తలు రాస్తే మాత్రం తప్పుడు వార్తలు అంటూ ప్రచారం చేస్తారు. మీరు అతివేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావడమే కాకుండా మరికొందరు ప్రాణాలను కూడా ముప్పు తెస్తున్నారంటూ రమేష్ హరీష్ శంకర్ ట్వీట్ కి బదులిచ్చారు.

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ స్పందిస్తూ నేను “తప్పుడు వార్తలు” రాసే వారికి అంటూ క్లియర్ గా చెప్పాను. మరి మీరు ఎందుకు అనవసరంగా భుజాలు తడుముకున్నారు అంటే.. మీరు తప్పుడు రాతలు రాస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా అంటూ హరీష్ శంకర్ వెల్లడించారు. మేము హింసాత్మక చిత్రాలను చేస్తే మాకు సెన్సార్ ఉందిమేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము మరి మీరు ఎవరికీ సమాధానం చెప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నేను మీ వ్యవస్థను తప్పు పట్టడం లేదు మీ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాను అంటూ ఈ విధంగా హరీష్ శంకర్ టీవీ9 జర్నలిస్ట్ రమేష్ మధ్య సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ ట్వీట్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.