Tag Archives: hema

Actress Hema: లావణ్యని పూరి జగన్నాథ్ లేపుకొచ్చాడు.. నేను మా ఆయనే పెళ్లి చేశాం.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఎన్నో సినిమాలలో పిన్ని, వదిన, అక్క పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ తన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు. ఇండస్ట్రీలో తాను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనే విషయాల గురించి తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నయ్య లాంటి వాడని హేమ పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

లావణ్యను లేపుకొచ్చిన పూరి జగన్నాథ్ ..నేను మా ఆయన పెళ్లి చేశాం: నటి హేమ

ఇండస్ట్రీలో తాను కెమెరా మెన్ జాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని,పెళ్లి తర్వాత మేము ఒక చిన్న ఇంటిని కొనుక్కొని అక్కడ నివసిస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ కూడా మా ఇంటి కింద అద్దెకు ఉండే వారని తెలిపారు. ఈ సమయంలోనే పూరి జగన్నాథ్ దగ్గరికి తేజ, కృష్ణవంశీ, ఎంతో మంది డైరెక్టర్లు రావడంతో అందరితో మంచి పరిచయం ఉందని తెలిపారు.

కాళ్లు కడిగి కన్యాదానం చేశారు…

ఇక పూరి జగన్నాథ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించారని వీరి పెళ్లికి ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో ఏకంగా పూరి జగన్నాథ్ లావణ్యని లేపుకొచ్చినట్లు నటి హేమ తెలిపారు. ఇలా లావణ్యను తీసుకు వచ్చిన తర్వాత దగ్గరుండి మేమే తనకు పెళ్లి చేశామని, నేను మా ఆయన పూరి జగన్నాథ్ అన్నయ్య పెళ్లికి పెళ్లి పెద్దలమని తెలిపారు. ఇక జాన్ తనకు తండ్రి స్థానంలో ఉండి కాళ్లు కడిగి కన్యాదానం చేశారని హేమ తెలిపారు. అందుకే ఇప్పటికీ లావణ్య తన భర్తను డాడీ అంటూ పిలుస్తుందని పూరిజగన్నాథ్ భార్య గురించి ఆసక్తికరమైన విషయాలను హేమ ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

స్టేజ్ మీద బూతులతో రెచ్చిపోయిన నటి హేమ.. ముక్కున వేలేసుకున్న నెటిజన్లు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ముగ్గురు అమ్మాయిల జీవిత కథ ఆధారంగా మ్యాగీ దర్శకత్వంలో మారుతి పర్యవేక్షణలో తెరకెక్కిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో పాయల్‌ రాజ్‌పుత్‌, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే విశేషమైన ఆదరణ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి నటి హేమ కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హేమ మాట్లాడుతూ దర్శకుడిని ఉద్దేశించి బాబు చిట్టి అంటూ బోల్డ్ గా మాట్లాడటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ క్రమంలోనే నటి హేమ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏంటి హేమ ఇలా మాట్లాడింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హేమ ఇటీవల మా ఎలక్షన్లలో కూడా నానా హంగామా చేస్తూ వార్తల్లో నిలిచారు.

నటి హేమకు షాక్..షోకాజ్‌ జారీచేసిన “మా”..!

గత రెండు రోజుల క్రితం నటి హేమ “మా” అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని, మా అసోసియేషన్ కు నిధులు సమకూర్చుకుండా ఉన్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారంటూ ప్రస్తుతమున్న మా అధ్యక్షుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎలక్షన్లు జరగకుండా మరికొన్ని రోజులపాటు తానే అధికారంలో ఉండాలని మా అధ్యక్షుడు భావిస్తున్నారని హేమ ఆరోపించారు.

ఈ క్రమంలోనే హేమ మా అధ్యక్షుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆడియో టేప్ బయటకు వచ్చింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు జరగాలని హేమ సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై సోమవారం మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ నటి హేమకు కౌంటర్ వేశారు.

ఈ క్రమంలోనే మా పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. ఈ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేస్తూ మా ప్రతిష్టను దిగజారుస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని తక్షణమే ఎన్నికలు జరపాలంటూ చిరంజీవి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడంతో వెంటనే క్రమశిక్షణ సంఘం స్పందించి నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు నరేష్ పై చేసిన ఆరోపణలకు ఆమెను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు కూడా జరిగేలా చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం తెలియజేసింది. అయితే ఈ సారి మా ఎలెక్షన్ బరిలో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, హేమ,సీవీఎల్‌ నర్సింహ రావు తదితరులు పోటీలో నిలబడ్డారు.

నటి హేమకు కౌంటర్ ఇచ్చిన ‘మా’ అధ్యక్షుడు నరేష్.. చర్యలు తీసుకుంటామంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా కొనసాగిన నటి హేమ “మా”నిధులను దుర్వినియోగం చేశారంటూ మా అధ్యక్షుడు పై ఆరోపణలు చేశారు.కావాలనే మా అధ్యక్షుడిగా మరికొన్ని రోజులు కొనసాగాలనే ఉద్దేశంతోనే మా ఎన్నికలు జరగడం లేదంటూ నటి ఆరోపణలపై తాజాగా మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందు మాట్లాడిన నరేష్ నటి హేమ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు..

గత రెండు సంవత్సరాల నుంచి “మా” లో ఏం జరిగింది అనే విషయాలను గురించి నరేష్ మీడియా ముందు సవివరంగా వివరించారు. ఈ క్రమంలోనే నటి హేమ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. మా డబ్బులను గోల్ మాల్ చేశామని నటి ఆరోపించడంతో స్పందించిన నరేష్ “మా”డబ్బులలో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని ఇప్పటికీ “మా”లో సరిపడే డబ్బులు ఉన్నాయని తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితులలో సినీ కార్మికుల కోసం పలువురు సెలబ్రిటీలు డొనేట్ చేసిన డబ్బులు కూడా భద్రంగా ఉన్నాయని ఈ సందర్భంగా నరేష్ వివరించారు.ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల ఈ ఎలక్షలను వాయిదా వేస్తున్నారు.ఈ క్రమంలోనే పరిస్థితులు చక్కబడ్డాక తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు నరేష్ మీడియా ముందు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ హేమ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత వుండే ఈ కరోనా పరిస్థితులలో ఎవరిని ఫండ్ అడుగుతామని ఆమె నిలదీశారు.గతంలో కొత్త కమిటీ ఏర్పడినప్పుడు పెద్ద హీరోలు అందరూ వారి రెమ్యూనరేషన్ లో కొంత శాతం మా అసోసియేషన్ కి ఇస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం వారిని డబ్బులు అడుగలేని పరిస్థితిలో ఉన్నామని జీవిత తెలియజేశారు. ఇకపోతే ఆగస్టు 22వ తేదీ ఏజీఎం నడుపుతామని, ఆ రోజు సభ్యులంతా ఎలక్షన్లు ఎప్పుడు జరపాలి అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జీవిత వెల్లడించారు.

మా అధ్యక్షుడు నరేష్ చేసిందేమీ లేదు.. ఉన్న డబ్బులను ఖర్చు చేస్తున్నారంతే.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల హడావిడి జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు, హేమ, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు పోటాపోటీగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ మా అధ్యక్షుడిగా ఉండి చేసిందేమీ లేదు..కేవలం ఎలక్షన్లు జరపకుండా అతనే అధ్యక్షుడిగా కొనసాగాలని చూస్తున్నారు అంటూ ఆమె నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం నరేష్ మా అధ్యక్ష పదవి పూర్తి అయ్యింది. ఈ క్రమంలోనే ఎలక్షన్లు జరిగి కొత్త అధ్యక్షుడుని నియమించాల్సి ఉంది. అయితే కరోనా కారణం వల్ల ఎలక్షన్లు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు అదుపులో ఉంటే సెప్టెంబర్ నెలలో మా ఎన్నికలు జరిగేలా చూడాలని మా సభ్యులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికి తరువాత ఎలక్షన్లు జరిగి కొత్త అధ్యక్షునికి బాధ్యతలు చేపట్టే వరకు పూర్తి అధికారాలు అతనికే ఉంటాయి కనుక ఎలక్షన్లు జరపకుండా అతనే అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ చూస్తున్నట్లు ఆరోపించారు. ఇతను అధ్యక్షుడిగా ఉండడం వల్ల అతను “మా” కోసం ఏమి కష్టపడలేదని, ఉన్న డబ్బులు కాస్తా ఖర్చు చేస్తున్నారు అంటూ అతని పై తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

మా అకౌంట్లో దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి అలాంటిది ప్రస్తుతం మూడు కోట్లు మాత్రమే ఉన్నాయని,ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే రేపు నటీనటులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడానికి కూడా మా అసోసియేషన్ దగ్గర డబ్బులు ఉండవని, వీలైనంత త్వరగా ఎలక్షన్లను జరిపి కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు ఇవ్వాలని హేమ ఆరోపించారు.

5 కోట్ల నిధులలో 3 కోట్లు మాత్రమే నరేష్ ఖర్చు చేశారు.. హీరో నరేశ్​పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ నటుడు నరేశ్‌పై నటి హేమ పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలను వాయిదాకు నరేశ్​ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరకుండా చూసి తిరిగి ఆయనే అధ్యక్ష పదవిలో కూర్చోవాలని చూస్తున్నారన్నారు. మా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ 200 మంది అసోసియేషన్ సభ్యులకు లేఖలు రాశారు హేమ.

MAA సంబంధించిన రూ.5 కోట్ల నిధులలో రూ.3 కోట్లు నరేష్ ఖర్చు చేశారని… ఇక ఆ కుర్చీ దిగకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు,” అని హేమ నరేష్‌పై మండిపడ్డారు. ఇక MAA Elections సెప్టెంబర్​ 12న జరపాలని కార్యవర్గ సభ్యులు నిర్ణియించారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావు పోటీ చేస్తున్నారు.