Tag Archives: hyper aadi

వామ్మో.. మంచు విష్ణుని దారుణంగా ట్రోల్ చేసిన హైపర్ ఆది .. వీడియో వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా విష్ణు ఎన్నికల ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మీడియా ఎదురుగా మంచు విష్ణు మాట్లాడిన మాటలు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా బుల్లితెర చానల్స్ పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈటీవీ దీపావళి పండుగ పురస్కరించుకుని తగ్గేదేలే అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఒకే వేదికపై చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మంచు విష్ణు ఇమిటేట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది రోజాతో మాట్లాడుతూ అన్ని మీకే తెలిసినట్టు మాట్లాడతారు ఇందాక మా సైడ్ నుంచి ప్రియమణి వచ్చి ఏమన్నారంటే అని హైపర్ ఆది అనగా.. అందుకు రోజా ఏమన్నారు అని అడగగా.. వెంటనే రాంప్రసాద్ హైపర్ ఆదిని పట్టుకుంటాడు.

https://youtu.be/0uIvHaXam30

ఈ క్రమంలోనే వారిని విడిపించుకునేందుకు హైపర్ ఆది
లెట్ దెమ్ నో అంకుల్..లెట్ దెమ్ నో అంటూ మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలను ఇమిటేట్ చేశారు. అలాగే స్కిట్ లో గెటప్ సీను లేకపోవడం సరిపోయింది. ఆయనే కనుక ఉంటే మీకు మంచి గుణపాఠం చెప్పే వారని ఆది డైలాగులు వేశాడు. ఇలా హైపర్ ఆది వేదిక పై మంచు విష్ణును టార్గెట్ చేస్తూ చేసిన ఈ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోజాతో గొడవ పెట్టుకున్న హైపర్ ఆది… ఏం మాట్లాడుతున్నావ్ అంటూ గట్టిగా అరవడంతో అందరూ షాక్..!

ఎన్నో సినిమాలలో స్టార్ హీరోయిన్గా నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న రోజా పై హైపర్ ఆది తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సాధారణంగా ఏదైనా పండుగలు వస్తే ఈ టీవీ కార్యక్రమం స్పెషల్ ఈవెంట్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ఈ టీవీ తగ్గేదేలే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా, ఇంద్రజ, పూర్ణ, ప్రియమణి ఇతర నటీనటులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సైగల ద్వారా సినిమా పేర్లను తెలియచేయాలి అనే టాస్క్ చేశారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది సైగలు చేయడంతో అతని టీమ్ సభ్యులు సరిగ్గా సినిమా పేర్లను చెప్పారు. ఇలా హైపర్ ఆది అండ్ టీమ్ సినిమా పేర్లను కరెక్ట్ గా చెప్పడంతో ఈ విషయంపై రోజా స్పందించారు.

ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ మీరు అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండానే ఆడారు అంటూ తెలిపారు. ఈ మాటకు హైపర్ ఆది మాట్లాడుతూ… ఆ.. మీరు ఇచ్చేది మాత్రమే ఎక్స్ప్రెషన్స్ మేము ఇచ్చేది ఎక్స్ప్రెషన్ కాదు.. ఏం మాట్లాడుతున్నావ్? అంటూ అందరి ముందు రోజాపై గట్టిగా అరిచాడు. హైపర్ ఆది ఎలా ఒక్కసారిగా రోజాపై అరవడంతో అందరూ షాక్ అయ్యారు.

వామ్మో..హైపర్ ఆది ఇంత ఆస్తి సంపాదించాడ..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సుపరిచితమే. ఈ నా జబర్దస్త్ షో లో తనదైన కామెడీ పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఒకవైపు జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ, మరొకవైపు ఢీ షోలో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.

చాలామంది జబర్దస్త్ షోను హైపర్ ఆది స్కిట్స్ కోసం చూస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హైపర్ ఆది వేసిన పంచులు ఎవరైనా కడుపుబ్బ నవ్వాల్సిందే. కొన్నిసార్లు హైపర్ ఆది డబల్ మీనింగ్ పంచులు కూడా వేస్తుంటారు. ఈ సందర్భంలోనే ఈ సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆది పై ట్రోలింగ్స్ చేస్తుంటారు నెటిజన్లు. జబర్దస్త్ షో కమెడియన్స్ నుంచి అనసూయ, జడ్జి రోజా వరకు ప్రతి ఒక్కరి పై కౌంటర్లు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు.

హైపర్ ఆది పంచులకు సుడిగాలి సుదీర్ తోడైతే ఇక అంతే సంగతులు. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో హైపర్ ఆది సంపాదనపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది సంవత్సరానికి కోటి రూపాయల దాకా సంపాదిస్తాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జబర్దస్త్, మరొకవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా పలు చూడ లో పాల్గొంటూ బాగానే సంపాదించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

హైపర్ ఆది ఎంత సంపాదించాడు, అతడికి రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది అన్నా విషయాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. హైపర్ ఆది సంపాదన ఏడాదికి కోటి దాటిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల ఒక ఈవెంట్లో తాను తన ఊరిలో కొన్ని ఎకరాలు కొనుగోలు చేసినట్లు హైపర్ఆది స్వయంగా వెల్లడించారు.

అరగంటకు హైపర్ ఆదికి బిగ్ బాస్ చెల్లించిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్ స్టేజిపై ఉన్న తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరిపై పంచ్ డైలాగులు వేస్తూ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హైపర్ ఆది ఈసారి బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

బిగ్ బాస్ వేదికపైకి పోలీస్ ఆఫీసర్ పాత్రలో హౌస్ సభ్యుల గురించి ఇన్వెస్టిగేట్ చేశానని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి హైపర్ ఆది తనదైన శైలిలో పంచులు వేశాడు.ఇలా బిగ్ బాస్ వేదికపై అడుగు పెట్టిన ఆది నాగార్జునతో సహా ప్రతి ఒక్కరిపై పంచు డైలాగులు వేస్తూ అందరిని నవ్వించాడు. ఇలా అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి నిర్వాహకులు పెద్ద మొత్తంలోనే పారితోషికం చెల్లించి ఉంటారని సమాచారం వినబడుతుంది.

అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ఆదితో ఒప్పందం కుదుర్చుకుని బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఫాలో కావలసిందిగా చెప్పారు.ఇలా తనను బిగ్ బాస్ ఫాలో కమ్మని అతనితో కమిట్మెంట్ తీసుకొని తనని ఈ షోకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ని హైపర్ ఆదికి అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసినందుకుగాను అతనికి బిగ్ బాస్ నిర్వాహకులు ఏకంగా 1.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే హైపర్ ఆది మరోసారి కూడా బిగ్ బాస్ వేదికపైకి రానున్నట్లు తెలుస్తోంది.19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్ లు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

‘మీ బతుకులు చెడ అంటూ’ హైపర్ ఆది ట్వీట్.. ఎందుకంటే..

శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అతడి ప్రమాదానికి గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందని వార్తలు రాగా.. దానిని పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలను న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడంపై అటు అభిమానులు, ఇటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

గత రెండు రోజుల నుంచి మీడియా అంతా ఆ మెగా హీరో చుట్టే తిరుగుతోంది. అతడు బైక్ నడుపుతున్న సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో నడిపారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. కానీ అంత స్పీడ్ గా వెళ్లే రోడ్లుగానీ.. అంత అవకాశం గానీ హైదరాబాద్ లో లేవు. కానీ ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై జబర్దస్త్ హైపర్ ఆది ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేశారు.

అన్నా.. నిన్ను అలా చూస్తుంటే ఏడుపు వస్తుంది.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన బాధను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు హైపర్ ఆది. దీంతో పాటు మీడియాలో తప్పుడు కథనాలపై కూడా తన రేంజ్ లో విరుచుకుపడ్డాడు.. తప్పుడు ప్రసారం, ప్రచారాలు చేయడం వల్ల నిజాలను చెప్పినా.. మున్ముందు నమ్మే స్థితిలో ఉండరని అన్నారు.

హైదరాబాద్ రోడ్లపై సూపర్ మాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడ్‌తో వెళ్ళలేడు.. మీరు ఎక్కడ దొరికారురా మాకు.. మీ బతుకులు చెడ అంటూ ట్వీట్ చేశాడు హైపర్ ఆది. అతడు తెలుగు మీడియాపై తప్పుడు వార్తలు చెబుతున్నారంటూ.. ట్వీట్ చేయడంతో నెటిజన్లు కూడా అతడికి సపోర్టు పలికారు.

‘ఆర్ యూ వర్జిన్’అంటూ బోల్డ్ క్వశ్చన్ చేసిన హైపర్ ఆది .. ఆ విషయంలో ఫైర్ అయిన రష్మీ..!

బుల్లితెరపై ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో చెప్పుకునేది సుధీర్, హైపర్ ఆది మరియు రాంప్రసాద్. అయితే ఇందులో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్ లతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. గత 12 సీజన్ల నుంచి కొనసాగుతున్న ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13 వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నడుస్తోంది. దీనిలో కామెడీని కూడా జోడించేందుకు సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆదీ, రష్మీ, దీపికాలు ప్రత్యేక ఆకర్షణగా గా నిలుస్తున్నారు. డ్యాన్స్ పర్మామెన్స్ తర్వాత మధ్యలో ఏర్పడే గ్యాప్ లో వీళ్ల సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి యాంకర్ గా ప్రదీప్ తోడై కామెడీని పీక్ కు తీసుకెళ్తుంటారు.

అయితే తాజాగా.. ఢీ ప్రోమో ఒకటి వైరల్ గా మారింది. సాధారణంగా ఇందులో కింగ్స్ తరఫున ఆది, సుధీర్ లు లీడర్లుగా ఉంటారు. క్వీన్స్ తరఫున రష్మీ, దీపికా ఉంటారు. కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్మామెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు విన్ అయితే వారు మిగతా టీమ్ లీడర్లకు టాస్క్ ఇస్తుంటారు. ఈ ప్రోమోలో కూడా క్వీన్స్ ఒక డ్యాన్స్ కంటెస్టెంట్ గెలవగా.. కింగ్స్ కు టాస్క్ ఇవ్వాలి.

ఇలా సుధీర్, ఆది టీమ్ టాస్క్ చేయాలని కోరారు రష్మీ టీం. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ ఈ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అయితే తమకు మూడ్ లేదు.. మేము టాస్క్ చేయమని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు ఆది. సుధీర్ అతడిని ఒప్పించే క్రమంలో “ఆర్ యూ వర్జిన్” అంటూ షాకింగ్ క్వచ్చన్ వేశాడు ఆది.

దీంతో సుధీర్ కు నోటి నుంచి మాట రాలేదు. ఆ క్వచ్చన్ కు జడ్జిలు సైతం షాక్ అయ్యారు. ఇలా రెండు సార్లు ఆది అదే ప్రశ్న అడగడంతో సుధీన్ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇదిలా ఉండగా తము ఇచ్చిన టాస్క్ ఎందుకు చేయరని రష్మీ ఆగ్రహంతో గొడవ గొడవ చేసేసింది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పెళ్లి మాత్రమే చేస్తారా.. శోభనం కూడా చూపించండి.. జబర్దస్త్ స్కిట్స్‌పై ఫైర్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో మొదట్లో మంచి ఆదరణ పొందింది. కానీ రాను రాను రేటింగ్ కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది. ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో పై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ షోని చూసి మరిన్ని బుల్లితెర షోలు కూడా తమ రేటింగ్ కోసం బాగా దిగజారుతుంది.

ఇప్పటికే జబర్దస్త్ లో రేటింగ్ కోసం యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ను జోడిని ముందుంచారు. ఇక వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు మొదలయ్యేలా చేశారు. అంతేకాకుండా గతంలో వీరి పెళ్లి కూడా బుల్లితెర వేదికగా చేయగా అదంతా నిజం కాదని కేవలం రేటింగ్ కోసమని ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారు. నిజానికి ఏదైనా ఒక్కసారి చేస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఆ షో విమర్శలు ఎదుర్కోక తప్పదు.

jabardasth

ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఇందులో కూడా మళ్లీ పెళ్లి స్కిట్ చేశారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. ఇందులో వీరికి జంటగా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి, యాంకర్ రష్మీ పెళ్లి కూతుర్ల గెటప్ లో కనిపించారు. వీళ్లను చూసి సుధీర్, ఆది తమ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. సుధీర్ మరింత ఓపెన్ గా మాట్లాడుతూ పదిన్నర అయింది ఏమీ లేదా అని అనడంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. హైపర్ ఆది రాసిన ఈ స్కిట్ కు మల్లెమాల పై కూడా టార్గెట్ పడినట్లు తెలుస్తుంది.

ఇక నెటిజన్లు ఇటువంటివి చూడలేక.. మల్లెమాల అంటే మల్లెలు, మాలలు అర్థం వచ్చేటట్లు.. మల్లెమాలా? పెళ్లిళ్ల బ్రోకరా? అంటూ శోభనం చేసేది కూడా పెట్టండి అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షో లలో ఇటువంటివి స్కిట్ లను చేయడం సరైనది కాదని గతంలో జబర్దస్త్ కు విమర్శలు ఎదురుగా మళ్లీ అలాంటి స్కిట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మళ్లీ వెనకనుంచి వచ్చి పట్టుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్.. వీడియో వైరల్!

మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఎంటర్ అవడంతో ఈ కార్యక్రమానికి అమాంతం క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ కార్యక్రమం మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ వంటి జబర్దస్త్ కమెడియన్ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా జులై 11 ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ కమెడియన్లు చేసిన కామెడీ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఈ వారం కమెడియన్స్ అందరూ శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకొనే కాన్సెప్టుతో చేశారు. ఈ కాన్సెప్ట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ శ్రీమంతుడు దర్శనమిచ్చాడు.పోరా శ్రీమంతుడా అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పృథ్విరాజ్ వచ్చి రాగానే తనదైన శైలిలో పంచ్ లు వేసి అందరిని నవ్వించారు.

ఈ విధంగా స్టేజ్ పైకి వచ్చిన పృథ్విరాజ్ వచ్చీరాగానే…. ఆది… వెనక నుంచి వచ్చానని కంగారు పడ్డావా? అని అడగగా అందుకు ఆది” మీరు వెనక నుంచి వస్తారని మాకు తెలుసు…కానీ మా కోసం వస్తారు అని మాత్రం తెలియదు అంటూ” తనదైన శైలిలో పంచ్ వేశాడు. అయితే గతంలో పృథ్వి రాజ్ ఎస్వీబీసీ చైర్మన్‌గా చేసిన పృధ్విరాజ్ ఓ మహిళతో ఫోన్ కాల్ అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఫోన్ కాల్ లో భాగంగా పృద్విరాజ్ మహిళతో వెనుక నుంచి వచ్చి పెట్టుకుందాం అనుకున్నా అంటూ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు లీక్ అవడంతో అప్పటినుంచి వెనకనుంచి పట్టుకొని పృథ్వి రాజ్ అయ్యాడు.అయితే ఈ వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్ కావాలని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమంలో ఓ స్కిట్లో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రజల సమస్యలను తీర్చి గ్రామ అభివృద్ధికి కృషి చేసే కాన్సెప్ట్ ద్వారా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే.

మంచం రెడీగా పెట్టు అన్న హైపర్ ఆది… సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. అసలు ఏమైంది?

బుల్లితెర పైప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఎంతో మందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు కమెడియన్లు చేసే స్కిట్ ల ద్వారా ఎనలేని అభిమానులను సంపాదించుకుని వెండితెరపై కూడా మంచి అవకాశాలతో రాణిస్తున్నారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు.

జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది తన స్కిట్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రతి వారం తన స్కిట్ లో భాగంగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి హైపర్ ఆది ముగ్గురమ్మాయిలతో ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళతో పాటే యాంకర్ అనసూయని కూడా స్కిట్ లో భాగం చేశాడు. వీరందరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. ఆ సమయంలో నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా.. మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా అన్నాడు. ఈ క్రమంలోనే అనసూయ వైపు చూస్తూ నీతో అన్నబోయే సరికి ఆమె చంపేస్తా అంటుంది. దీనికి అందుకే మీతో ఏం చేయట్లే అంటూ హైపర్ ఆది బదులిచ్చాడు. ఆ తరువాత హైపర్ ఆది అనసూయను నువ్వు మంచం రెడీ చేసి పెట్టు అని అన్నాడు. అలాగే డాన్సర్ తేజస్వితో నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు… అనగా అప్పుడు పక్కనే ఉన్న రోహిణి మరి నేనేం చేయాలి అని అడగగా అందుకు హైపర్ ఆది నువ్వు బయటకు వెళ్లి తలుపు గొళ్లెం పెట్టు అంటూ పంచులు వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

బయట పడిన హైపర్ ఆది లవ్ లెటర్.. వేదికపైనే ముద్దు పెట్టిన పూర్ణ!

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వెండి తెర స్టార్ హీరోయిన్లు రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణా వంటి వారు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ షోలను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వేదికగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా, ఢీ వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఢీ 13 ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమోలో చూపించిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రోమోలో భాగంగా తగ్గేది లేదంటూ …సుడిగాలి సుధీర్ పంచ్ డైలాగులు వేయగా… హైపర్ ఆది లవ్ లెటర్ బయటపడింది.అదేవిధంగా కంటెస్టెంట్ చేసిన డాన్స్ ఫర్ఫార్మెన్స్ కు పూర్ణ ఏకంగా ఆ కంటెస్టెంట్ కు ముద్దు పెట్టడం వైరల్ గా మారింది.

ఒకప్పుడు పలు కార్యక్రమాలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే వారు కేవలం కంటెస్టెంట్ ల నైపుణ్యాన్ని పరిశీలించి వారికి మార్కులను వేసేవారు. అయితే ప్రస్తుతం ఉన్న జడ్జిలు కంటెస్టెంట్ లతో చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. కంటెస్టెంట్ లతో రొమాన్స్ చేయడం, కంటెస్టెంట్ లు కూడా జడ్జీల పై జోకులు వేయడం వంటివి మనం కార్యక్రమాలలో చూస్తున్నాము.

తాజాగా నటి పూర్ణ ఈ షోలో భాగంగా చేసిన పర్ఫామెన్స్ కు ఫిదా అయ్యి అతనికి లవ్ సింబల్ చూపించడమే కాకుండా ఏకంగా అతని వద్దకు వెళ్లి వేదికపైనే ముద్దు పెట్టింది.అదేవిధంగా హైపర్ ఆది లవ్ లవ్ లెటర్ బయటపడటంతో యాంకర్ ప్రదీప్ లవ్ లెటర్ ని మొత్తం చదివి వినిపించగా… అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అయ్యారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి పూర్తి ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేసింది. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.