Tag Archives: Jabardast programme

Comedian Satya: ఇండస్ట్రీలోకి రాకముందు కమెడియన్ సత్య ఎలాంటి పనులు చేసేవారో తెలుసా?

Comedian Satya: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఒకప్పుడు కమెడియన్ అంటే బ్రహ్మానందం,అలీ వేణుమాధవ్ సుధాకర్ వంటి వారు మాత్రమే గుర్తుకొచ్చేవారు. ప్రస్తుత కాలంలో కమెడియన్స్ అంటే వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య వంటి తదితరులు గుర్తుకొస్తారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సత్య ఒకరు తాజాగా ఈయన నాగశౌర్య హీరోగా నటించిన రంగ బలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య కామెడీ చాలా హైలెట్ అయిందని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో సక్సెస్ అయినటువంటి సత్య ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయానికి వస్తే…

ఈయన సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జీవనం కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూనే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ అవకాశాల కోసం ప్రదక్షిణలు చేసేవారట. ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఈయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తెలుస్తుంది అయితే అప్పటికే ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమంలో కూడా కొనసాగే వారు.

Comedian Satya:జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్…


ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి సత్యని ఆహ్వానించి ఆయనకు అవకాశాలు కల్పించారు. ఇలా కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ తనని తాను నిరూపించుకున్నటువంటి సత్యం అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన పిల్ల జమిందార్ అనే సినిమా ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించారు అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు.

Anchor Anasuya: రెండో పెళ్లి చేసుకోమన్న నేటిజన్.. ఆలోచనలో పడ్డ అనసూయ.. వైరల్ అవుతున్న పోస్ట్!

Anchor Anasuya: బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం అదే పాపులారిటీతో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.

ప్రస్తుతం అనసూయ వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇలా అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనసూయకు ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే అనసూయను ప్రశ్నిస్తూ ఎన్నిసార్లు నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి. ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా అనసూయకు నేటిజన్ నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ కి గురైంది.

Anchor Anasuya: అలా సమాధానం చెప్పిన అనసూయ…

ఈ క్రమంలోనే నేటిజన్ కి రిప్లై ఇస్తూ..మౌనంగా ఉన్నటువంటి ఎమోజీని షేర్ చేయడమే కాకుండా తను ఆలోచనలో ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ రెండో పెళ్లి గురించి అనసూయ ఆలోచనలో పడ్డారా…ఈ పోస్ట్ కు అదే అర్థమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అనసూయ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Anchor Anasuya: నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకుంటున్నావా.. అనసూయ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇకపోతే అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవినీ జైలుకు పంపించే ఒక రిపోర్టర్ పాత్రలో నటించారు. ఈ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు గాడ్ ఫాదర్ సినిమాలో మంచి పాత్రలో నటించిన సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించారు.

ఇలా సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించగా అనసూయ చాలా సిల్లీ రీసన్ చెప్పారు. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని ఈమె సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఈమె చెప్పిన రీజన్ విన్నటువంటి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అనసూయని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మెగా ఫ్యాన్స్ నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Anasuya: మరోసారి ట్రోలింగ్ కి గురైన అనసూయ..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటున్నటువంటి అనసూయ ఇలాంటి మంచి పాత్రలు నటించినప్పుడు అలాగే స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పుడు ప్రమోషన్లలో పాల్గొంటే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్ విషయంలో మరోసారి ఈమెకు నెటిజెన్ల నుంచి చేదు అనుభవం తప్పలేదు.

Sudheer -Anasuya: ఏంటి అనసూయ.. సుధీర్ పరిస్థితి ఇలా అయ్యింది.. పూర్తిగా బుల్లితెరకు కనుమరుగయ్యారుగా?

Sudheer -Anasuya:బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ సుడిగాలి సుదీర్ వంటి వాళ్లు కూడా ఒకరు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనసూయ వెండితెర అవకాశాలను అందుకొని పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సుధీర్ సైతం వెండితెర అవకాశాలను అందుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై స్టార్ మా కార్యక్రమంలో సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సుడిగాలి సుదీర్ అనసూయ ఏ కార్యక్రమాలలోనూ సందడి చేయడం లేదు. ఇలా వీరిద్దరూ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారనే చెప్పాలి.ఇక స్టార్ మా ఏదైనా ప్రత్యేక ఈవెంట్లు చేసినప్పుడు మినహా వీరిని ఆహ్వానించడం లేదు. ఇక ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది.

Sudheer -Anasuya: జబర్దస్త్ వదిలేసి తప్పు చేశారా…

ఈ క్రమంలోనే వీరిద్దరూ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో కొందరు నెటిజెన్స్ ఈ విషయంపై స్పందిస్తూ జబర్దస్త్ వీడి తప్పు చేశారు. అందుకే ఏ ఒక్క షో కూడా వీరి చేతుల్లో లేకుండా పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తిరిగి వీరు ఏదైనా బుల్లితెర కార్యక్రమ అవకాశాలను అందుకుంటారా లేకపోతే హైపర్ ఆది గెటప్ శీను తరహాలోనే తిరిగి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

Anchor Anasuya: అత్తా పితా అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. కోడలైన సరే అలా పిలవకూడదు: అనసూయ

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావటం వల్ల ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఎత్తున వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ సైతం తనదైన శైలిలో కౌంటర్ వేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి ఈ ఆంటీ అనే వివాదాన్ని అనసూయ తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ తాజాగా సుమ వ్యవహరిస్తున్నటువంటి క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ తనకు వంట రాదని చాలామంది అనుకుంటారు కానీ తాను ఎలా వంట చేస్తానో ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తానని చెప్పారు.

Anchor Anasuya: అత్త అని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆంటీ అనే విషయం గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ నన్ను ఎవరైనా అత్తా పిత్తా అంటే అసలు ఊరుకోను.అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు చివరికి నా కోడలైనా సరే నన్ను ఆంటీ అని పిలవకూడదు కేవలం అను అని పిలిస్తే చాలు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Actress Indraja: కెవ్వు కార్తీక్ టీం పై మండిపడిన ఇంద్రజ… ఏకంగా షో మధ్యలోనే బయటికి వెళ్లిన జడ్జ్!

Actress Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కొందరు కమెడియన్స్ బయటకు వెళ్లిపోవడంతో కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ తిరిగి ఈ కార్యక్రమానికి హైపర్ ఆది గెటప్ శ్రీను వంటి వారు రావడంతో ఈ కార్యక్రమం పై మరికొన్ని అంచనాలు పెరిగాయి.

ఇకపోతే ఈ కార్యక్రమానికి జడ్జిగా రోజా, నాగబాబు ఉండే వారు. అయితే రోజాకు మంత్ర పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈమె స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా ఉండిపోయారు అయితే నాగబాబు స్థానంలో ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు.ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా కుష్బూ ఇంద్రజ న్యాయ నిర్ణేతలుగా సందడి చేశారు.

కంటెస్టెంట్లు అందరూ ఎప్పటిలాగే తమ పెర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కెవ్వు కార్తీక్ వెరైటీగా జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో చూపించారు.అయితే ఈ స్కిట్ అయిపోయిన అనంతరం జడ్జిమెంట్ టైంలో ఇంద్రజ మాట్లాడుతూ ఏంటి కెవ్వు కార్తిక్ ఈమధ్య మరి దారుణంగా తయారయ్యారు అంటూ ఇంద్రజ కెవ్వు కార్తీక్ కి షాక్ ఇచ్చారు.

Actress Indraja: రేటింగ్ కోసమే మరో ట్రిక్..

ఇంద్రజ మాట్లాడుతూ జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మీరు చూపించారు అలాగే టీం లీడర్స్ వల్ల జడ్జెస్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ స్కిట్ చేయండి అప్పుడే ఈ రెండింటికి కలిపి జడ్జిమెంట్ ఇస్తాను అంటూ ఆమె ఏకంగా కెవ్వు కార్తీక్ పై మండిపడటమే కాకుండా షో మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు.అయితే ఇది నిజంగానే జరిగిందా లేకపోతే రేటింగ్ కోసమే మరోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Chalaki Chanti: నీ టాలెంట్ కు ఇదే ఎక్కువ అని అవమానపరిచారు… మల్లెమాల వారిపై చలాకి చంటి షాకింగ్ కామెంట్స్!

Chalaki Chanti: చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో నటుడుగా నటించిన ఈయన అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చలాకి చంటి తాజాగా బిగ్ బాస్ 6 లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా చలాకి చంటి మల్లెమాల వారి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక తాను బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఎప్పుడైనా నాగార్జున గారి నోటి నుంచి చంటి అని పిలిపించుకోవాలని ఉంది అంటూ వెల్లడించారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనకు జబర్దస్త్ వల్ల పేరు ప్రఖ్యాతలు రాలేదని ఇతర సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న అనంతరమే జబర్దస్త్ అవకాశం వచ్చిందని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఏ మాత్రం సరిపోలేదని, రెమ్యూనరేషన్ పెంచమని ఎంతో రిక్వెస్ట్ గా అడిగితే నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ దారుణంగా అవమానపరిచారని ఈ సందర్భంగా చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chalaki Chanti: తనకు పొగరు ఈగో అనే ముద్ర వేశారు…

ఇక తాను ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడతానని ఈ క్రమంలోని తనకి పొగరు, ఈగో, కోపిష్టి అనే ముద్ర వేశారని, అయితే ఇవన్నీ కూడా జబర్దస్త్ నుంచి నన్ను బయటకు పంపడానికి కారణమయ్యే అంటూ ఈ సందర్భంగా చలాకి చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా చంటి కామెంట్ చేయడంతో ఈయన కూడా పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారని తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ నుంచి వచ్చిన ఈయన బిగ్ బాస్ ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

Actor Krishna Bhagwan: జబర్దస్త్ పర్మనెంట్ జడ్జిగా కృష్ణ భగవాన్.. ఎంట్రీతోనే అదరగొట్టారుగా.. ప్రోమో వైరల్!

Actor Krishna Bhagwan: మల్లెమాల వారి నిర్మాణంలో బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్లెమాల వారు నిర్వహిస్తున్నటువంటి వాటిలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమంలో భాగంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న ఈ కార్యక్రమంలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.

ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు రోజా ఈ కార్యక్రమానికి రెండు కళ్ళల ఉండి ముందుకు నడిపించారు.ఇకపోతే కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా కీలకంగా మారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించింది. ఇక నాగబాబు స్థానంలో తరచు కొందరు జడ్జిలు వస్తూ వెళ్తూ ఉన్నారు.

ఇక రోజాకి కూడా మంత్రి పదవి రావడం చేత ఆమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రోజా ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో రోజా స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు.ఇక ఇంద్రజ ఈ కార్యక్రమానికి పర్మినెంట్ జడ్జిగా ఉన్నప్పటికీ నాగబాబు స్థానంలో ఇప్పటివరకు పర్మనెంట్ జడ్జి రాలేదు.ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Actor Krishna Bhagwan: జడ్జిగా ఆకట్టుకున్న కృష్ణ భగవాన్…

ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు స్థానంలో పర్మనెంట్ జడ్జిగా నటుడు సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ ను ఈ కార్యక్రమానికి పర్మనెంట్ జడ్జిగా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా విడుదలైన ప్రోమోలో ఈయన ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఇవ్వడమే కాకుండా ప్రోమో లోనే తన కామెడీ పంచ్ డైలాగులతో అదరగొట్టారు. ఇలా కమెడియన్లపై సెటైర్లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇది చూసిన ఎంతోమంది అభిమానులు మొత్తానికి ఎంతో మంచి జడ్జ్ నీ తీసుకువచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.