Tag Archives: lobo

కవలపిల్లలకు జన్మనిచ్చిన లోబో భార్య.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..!

లోబోగా ప్రసిద్ధి చెందిన మహమ్మద్ ఖయ్యూమ్.. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న యాంకర్ గా.. నటుడిగా అందరికీ తెలిసిందే. లోబో తన అసాధారణ డ్రెస్సింగ్ , మేకప్‌కు ప్రసిద్ధి చెందాడు. అంతే కాకుండా అనేక టీవీ షోలలో కనిపించాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్‌లలో అతను కూడా ఒకడు .

అతను ప్రేక్షకులను డీసెంట్‌గా అలరించాడు.. హౌజ్ లో ఉన్నన్నీ రోజుల ప్రేక్షకులనూ బాగానే నవ్వించినా.. రియాలిటీ షో నుండి ముందుగానే బయటకు వచ్చాడు. అతడు కొన్ని సందర్భాల్లో తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన భార్య గర్భవతి అని.. ఈ సమయంలో తాను ఆమె పక్కన ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు ఎక్కువగా బాధ పడలేదు. కానీ.. తన భార్య వద్దకు వెళ్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. లోబో భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.
లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు.. అతడే ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోబో కొన్ని సినిమాల్లో నటించాడు. అతను నాని నటించిన పైసాలో కనిపించాడు.. ఈ సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకరి పాత్రను పోషించాడు. లోబో హైదరాబాద్‌లో టాటూ పార్లర్‌ని నడిపిస్తున్నాడు. అంతే కాకుండా అతడు జీవనాధారంగా ఓ షాప్ ను కూడా నడిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోబోకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్ లో నటిస్తున్నాడు.

షన్ను జోలికి వస్తే బాగోదు.. వార్నింగ్ ఇచ్చిన లోబో.. వైరల్ వీడియో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్లలో ఒకరు లోబో. హౌస్ లో తనదైన కామెడీతో అందరినీ నవ్విస్తూ.. ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హౌస్ లో ఉండాలంటే.. ఒక్క ఎంటర్ టైన్ మెంట్ ఒక్కటే కాదు.. గేమ్ లు కూడా ఆడాలని ప్రేక్షకుల ఫీలింగ్. అందుకే అతడు తొందరగా బయటకు వచ్చేశాడు.

అప్పటికే లోబోకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని.. సీక్రెట్ రూంకి పంపించాడు. తర్వాత హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా అలానే ప్రవర్తించాడు. అతడి గేమ్ లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ తర్వాత వారం ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత లోబో రవికి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రవి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

అతడి ఎలిమినేషన్ ఫేక్ అని కూడా తన అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే రవి రీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి కానీ.. అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒకానొక సమయంలో లోబో కూడా అతడిని అన్యాయంగా బయటకు పంపించారని కూడా విలేకరులకు చెప్పాడు. ఇక ప్రస్తుతం లోబో హౌస్ లో ఉన్న షణ్ముఖ్ కు మద్ధతుగా నిలుస్తున్నాడు.

హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరితో తాను కనెక్ట్ అయ్యానని.. అందులో ఎక్కువగా షణ్ముఖ్ తో కనెక్ట్ అయ్యానని చెప్పుకొస్తున్నాడు లోబో. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్‌ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే.. షణ్ముఖ్ కు సపోర్ట్ చేయండంటూ.. అతడికి ఓట్లు వేయండంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం లోబో వీడియో వైరల్ గా మారింది.

ఏనిమిది వారాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన కంటెస్టెంట్ లోబో రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లోకి 19మంది కంటెస్టెంట్ లలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లోబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబో ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్ ఉమాదేవితో ఎంతో చనువుగా ఉంటూ ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక ఉమాదేవి ఎలిమినేషన్ తర్వాత లోబో, రవి ఇద్దరూ కలిసి గేమ్ ఆడేవారు.

ఇలా ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లోబో ఒక వారం పాటు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. ఇలా హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక 8వ వారం నామినేషన్ లో ఉన్న లోబో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎనిమిది వారాలకు గానీ బిగ్ బాస్ లోబోకు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ముందుగా బిగ్ బాస్ లోబోతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం అతనికి రోజుకు పాతిక వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే లోబో వారానికి లక్షన్నర నుంచి రెండులక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ ప్రకారం చూస్తే ఎనిమిది వారాలకు గానీ లోబో 15 నుంచి 20 లక్షల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం మాత్రమే కాకుండా, బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు లోబో అందించిన కంటెంట్ ను దృష్టిలో ఉంచుకొని అతనికి మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ ద్వారా లోబో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతనేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో చూస్తుండగానే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ 8వ వారం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.యాంకర్ రవి వరుసగా ఎనిమిది వారాలు నామినేషన్స్ లో ఉండటం గమనార్హం.ప్రతి వారం నామినేట్ అవుతూ, అలాగే సేఫ్ అవుతున్న కంటెస్టెంట్ రవి మాత్రమే.

ఇక ఈ వారం నామినేషన్స్ లో కూడా రవి ఉన్నాడు. ఉచితంగా ఈ వారం కూడా రవి సేఫ్ అవుతాడు. ఎందుకంటే అవి కి బయట ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిందే. రవితో పాటు జశ్వంత్, లోబో, సిరి, శ్రీరామ్, మనసులు నామినేషన్ లో ఉన్నారు.ఓటింగ్ పరంగా చూసుకుంటే షణ్ముక్, రవి అందరికంటే ముందు ఉన్నారు. ఇద్దరికీ భారీగా ఓట్లు పడుతున్నాయి. వీరితోపాటు శ్రీరామ్,మానస్ లు కూడా ఈ వారం సేఫ్ జోన్ లో ఉండడం కాయం.

ఇది ఇలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే నలుగురు కాగా డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే. వారు లోబో, సిరి. ఈ ఇద్దరిలో కూడా ప్రత్యేకంగా డేంజర్ జోన్ లో ఎక్కువగా ఉన్నది మాత్రం లోబో నే. ఎందుకంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారందరూ కూడా అమ్మాయిలే. దీంతో బిగ్బాస్ కేవలం అబ్బాయిలకు కోసం పెట్టారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు అబ్బాయిలలో కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మిగిలిన వారందరూ కూడా ఆడవారే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎటు చూసుకున్నా కూడా ఈ వారం రోబో డేంజర్ జోన్ లో లోబో ఉన్నాడు.

లోబో సీక్రెట్ రూంలో అవసరమా అంటున్న నెటిజన్లు.. బిగ్ బాస్ ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్..!

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంటర్ టైనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన లోబో తన కామెడీని మాత్రం పండించలేకపోతున్నాడు. ఆరోవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ శ్వేతను ఇంటికి పంపి.. లోబోను ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూంలో ఉంచాడు. కానీ లోబో సీక్రెట్ రూంలో ఉంచడం నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ ను అర్థరాత్రి అందరినీ నిద్ర లేపి సీక్రెట్ రూంకి పంపించారు.

అందులో అభిజిత్ ను టార్గెట్ చేసి పులి, మేక అనే ఎపిసోడ్ ను పండించడంలో బిగ్ బాస్ విజయవంతం అయ్యాడు. కానీ లోబో విషయంలో అలా జరగడం లేదు. లోబో ద్వారా బిగ్ బాస్ ఏమైనా రాబట్టాలని చూస్తున్నాడా.. లేదా లోబోను ఇంకాస్త ఎంటర్ టైన్ చేసే విధంగా ట్రైన్ చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు.

ఇక లోబో మాత్రం నిన్నటి ఎపిసోడ్ లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు కానీ.. ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ఉలుకు లేదు.. పలుకు లేదు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తిపోతోంది. అస్సలు సీక్రెట్ రూంలోకి లోబోను ఎందుకు పంపించారో అర్థం అవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో లోబో మాటలను బట్టి చూస్తే.. అతడు బయటకు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నట్లు అర్థం అవుతుంది.

ఏదేమైనా లోబో తన టాలెంట్ కు తగ్గట్లు ప్రవర్తించడం లేదనేది తెలుస్తోంది. దానికి వ్యక్తిగంతంగా కొన్ని బాధలు కూడా అయి ఉండవచ్చు. తన భార్య ప్రెగ్నెన్సీ అని చాలాసార్లు చెప్పాడు.. బహుషా అతడికి అది మైండ్ లో బాగా ఆడుతున్నట్లు ఉంది. ఏదేమైనా లోబో సీక్రెట్ రూం ప్లాన్ అట్టర్ ప్లాప్ అయినట్లు కనిపిస్తోంది. అతడికి బదులు వేరే వాళ్లను సీక్రెట్ రూంకి పంపించినట్లయితే బాగుండనేది నెటిజన్ల అభిప్రాయం.

బిగ్ బ్రేకింగ్.. ఏడో వారంలో నామినేషన్లో ఉన్నది వీళ్లే..

తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు వారాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ సారి నామినేషన్లు జరగుతున్నాయి.

బిగ్ బాస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నా.. లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడు కాబట్టి ఇక 12 మంది మాత్రమే ఆట ఆడుతున్నారు. కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతున్నా కొలది ఆటలో కూడా మజా పెరిగిపోతోంది.ముగ్గురు వేట‌గాళ్ల చేతిలో నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

దీనిలో ప్రియాంక ఎంతో అగ్రెసివ్ గా కనిపిస్తుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చిందులు వేస్తుంది. అయితే నామినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం 9 మంది ఉన్నట్లు లీకురాజాల ద్వారా తెలిసింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్‌, ప్రియ‌, యానీ, ర‌వి, పింకీ, కాజ‌ల్‌, జెస్సీ, సిరి నామినేట్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

మొదటి నుంచి కూడా బిగ్ బాస్ నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా ఇది నిజమైతదో .. లేదో తెలియాలంటే ఈ రోజు వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక 13 మందిలో ఆ 9 మంది నామినేట్ కాగా మిగిలిన వారు నామినేషన్లో లేరని తెలుస్తోంది.

ఈ వారం హౌస్ నుంచి శ్వేత అవుట్..! సీక్రెట్ రూంకి లోబో…

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు.. ఏ సమయంలో ఏం జరుగుతుంతో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. చిన్న చిన్న కారణాలతో ఎలిమినేట్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఆరో వారు ఎండింగ్ కు వచ్చేసింది.

ఈ సారి నామినేషన్లో 10 మంది అంటే.. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు. ఇందులో ఎక్కువగా శ్వేత, లోబో, విశ్వ డేంజర్ జోన్ లో ఉన్నట్లు మూడు రోజుల నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. అందరి కంటే వాళ్లకు ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చాయని తెలిసిందే.

అయితే ఈ వారం హౌస్ నుంచి శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీక్ రాజాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి కూడా ఆదివారం ప్రసారమయ్యే షోలో మాత్రమే అందరికీ తెలుస్తుంటుంది. కానీ లీక్ రాజాల వల్ల ఒకరోజు ముందుగానే ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలిసిపోతోంది. సరయు దగ్గర నుంచి మొన్న ఎలిమినేట్ అయిన హమిదా వరకు కూడా అంతా చెప్పినట్లుగానే జరిగింది. ఇది కూడా నిజం కావొచ్చనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక శ్వేత ఈ వారం రవి చెప్పినది చెప్పినట్టుగా చేసి.. అడ్డంగా బుక్ అయిపోయిందనేది తెలుస్తోంది. అయితే మరో విషయం ఏంటంటే.. లోబో, ప్రియాలల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారట. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నమాట. అంటే.. ప్రియా, లోబోలల్లో లోబో ఫేక్ ఎలిమినేట్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అతడిని సీక్రెట్ రూంకి పంపించినట్లు తెలుస్తోంది. అస్సలు హౌస్ లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

రవి వేసిన ప్లాన్ కు.. దారుణంగా బలైన శ్వేత..!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో ఒక్కో వారం గడుస్తుంటే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా నామినేషన్ సమయం వచ్చింది అంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాళ్లే..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఎలాంటి కారణాలతో నామినేట్ చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంటారు.

ఇలా ఐదు వారాలు గడిచిపోయింది. ఆరో వారం కూడా చివరకు చేరుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో గొడ‌వ‌లు, కొట్లాట‌ల‌కు కొద‌వ లేకుండా పోయింది. కెప్టెన్స్ కంటెడర్స్ టాస్క్ అయిన బీబీ బొమ్మల ఫ్యాక్టరీలో యానీ మాస్ట‌ర్‌, శ్వేత‌లు బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోయారు. బిగ్ బాస్ పంపించే బొమ్మలు, అందులో వాడే దూదిని వాడాల్సి ఉంటుంది అందరు.

కానీ శ్వేత, లోబా మాత్రం బిగ్ బాస్ ప్రాపర్టీ అయిన కుషన్స్ చింపి అందులో ఉన్న దూదిని వాడారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ బిగ్ బాస్ వారిపైన సీరియస్ అయ్యారు. వారు ఆ పని చేస్తుంటే అడ్డుకోలేకపోయిన సంచాలకులు సిరి, కాజల్ పై కూడా బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. రవి టీం మరియు సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ ను కెప్టెన్ అయ్యేందుకు అనర్హులుగా ప్రకటించారు.

అయితే కుషన్స్ చింపేసింది లోబో, శ్వేత అయినప్పటికీ.. ఆ ఐడియా రవి. దీంతో నీవల్లే ఇదంతా జరిగిందని రవిని మందలించింది శ్వేత. రవి ఐడియా విఫలం అయినందు అతడు అందరి ముందు స్వారీ కూడా చెప్పాడు. అయితే రవి ఇచ్చిన ఐడియాను వదిలిపెట్టి శ్వేతకు వరెస్ట్ ప‌ర్ఫామ‌ర్‌ గా ఎన్నుకున్నారు. రవి కారణంగానే శ్వేత బలైందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించి అవమానించిన లోబో.. నేనైతే వేలు నరికేసేదాన్ని..!

బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగు వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5వ వారం ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మరింత గొడవలు వివాదాల నడుమ కొనసాగుతోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్ ఎవరి ఫుడ్ వాళ్లు చేసుకోవాలని చెప్పడంతో సిరి గ్యాంగ్, శ్రీరామ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇలా ఒకరిపై ఒకరు కోపంతో భోజనం పై అలుక చూపి పస్తులు పడుకున్నారు. ఇక ఇక మరుసటి రోజు ఉదయం గొడవలు కొట్లాటలు మరిచిపోయి అందరూ కలిసి టిఫిన్ లాగించారు.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లో కాజల్, రవి మధ్య మరోసారి గొడవ చోటు. ఈ క్రమంలోనే కాజల్ పాట పాడుతూ దానిని సాగదీస్తూ గత నెల రోజుల నుంచి లోబో, రవి వాష్ రూమ్ క్లీనింగ్ కే పరిమితమయ్యారని, కిచెన్ వైపు అసలు చూడటం లేదని డాన్సులు చేస్తూ చెప్పడంతో అందుకు స్పందించిన రవి మజాక్ అనేది కొంత వరకు అయితే బాగుంటుంది అంటూ తనకి వార్నింగ్ ఇచ్చాడు.

ఇక కాజల్ అన్న మాటలకు లోబో స్పందిస్తూ ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. లోబో అలా మిడిల్ ఫింగర్ చూపించడంతో హర్ట్ అయిన కాజల్ లోబోను నిలదీసి తప్పు అంటూ వాదించింది. ఇదే విషయాన్ని కాజల్ ప్రియాంక దగ్గర చెబుతూ బాధ పడటంతో అందుకు స్పందించిన ప్రియాంక నేనైతే ఆ వేలు విరిచేసేదాన్ని అని అనగా అందుకు కాజల్ బిగ్ బాస్ హౌస్ లో హింసకు తావు లేకపోవటం వల్ల తాను కూడా ఏమీ చేయలేక పోయానని చెప్పింది.

ఇక ఈ విషయంపై రవి నెలరోజుల నుంచి నేను కిచెన్ లో పని చేయలేదని నువ్వు ఎలా చెబుతావు అంటూ తనతో గొడవకు దిగాడు. దీంతో మాట మార్చిన కాజల్ నేను కేవలం మీకి కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే చెప్పానని మాట మారుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవటంతో మానస్ ఇన్వాల్వ్ అవుతూ ఎందుకలా అరుస్తున్నారు అంటూ మాట్లాడతాడు లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే అలా చేయకూడదని చెప్పకుండా తనకు సపోర్ట్ చేస్తున్నావ్ అని కాజల్ అనడంతో రవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ విషయంపై లోబోను హెచ్చరించానని తెలియజేశాడు. ఇలా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ చోటు చేసుకుంది.

బిగ్ బాస్ దారుణం.. ఆకలికి తట్టుకోలేక చెత్తకుప్పలో ఎరుకొని..?

బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా రన్ అవుతోంది. మూడు వారాలు పూర్తి చేసుకొని.. ముగ్గురిని బయటకు పంపించి ఇక మిగిలిన 16 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం హౌస్ నడుస్తోంది. ఇప్పటికే లావుతగ్గాల్సిందే అన్న టాస్క్ లో భాగంగా ఇద్దరు కలిసి ఒక జంటగా ఏర్పడి టాస్క్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో లావు తగ్గాలన్నా కాన్సెప్ట్ తో మొదట టాస్క్ మొదలైన విషయం కూడా విధితమే.

ఇందులో ఇప్పటికే ఆకలికి తట్టుకోలేక చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా లోబో పరిస్థితి చూస్తే.. చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. ఈ టాస్క్ లో భాగంగానే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులను ఆకలితో అలమటించేలా చేశాడు. ఆకలి బాధ అంటే ఎంటో ఇంట్లో సభ్యులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. ఆకలి బాధను తట్టుకుని ఎవరు నిలబడతారో పరీక్షించాడు.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‏లో మాత్రం ఇంటి సభ్యులకు ఫుడ్ కట్ చేసి.. ఆకలి బాధ అంటే ఎంటో రుచి చూపించాడు. ఇలా టాస్క్ ల మధ్యలో అప్పుడప్పుడు ఫుడ్ పంపించి అందులో ఉన్న వారికి కాస్త ఆకలి తీరుస్తున్నాడు. దీనిని చూస్తుంటే నిన్న చాలామంది ఆకలితో అలమటించినట్లు అనిపించింది. ఇదంతా ఇలా ఉండగా.. నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాచి పెట్టిన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేశాడు..ఎవరూ చూడకుండా అందులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు.

అయితే ఆ విషయాన్ని రవి పసిగట్టి.. రేయ్ ఏం చేస్తున్నావ్ రా అని వారించాడు. అయితే సీన్ చూసిన నటరాజ్ మాస్టర్ ఇలా చేయొద్దు నేను గేమ్ వదిలేస్తున్నా నువ్ తినెయ్ అని చెప్పాడు. ఇది బయట నుంచి చూసిన ప్రేక్షకులకు ఎంతో బాధ వేసింది. ఇలాంటి టాస్క్ లు పెట్టకుండా ఉండటమే మంచిది అంటూ బిగ్ బాస్ ను నెటిజన్లు వేడుకున్నారు.