Tag Archives: manchu lakshmi

Manchu Lakshmi: అక్కడ టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. ఎక్స్ పోజ్ చేయడానికే అంటూ ట్రోల్స్?

Manchu Lakshmi:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డాటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు లక్ష్మి ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు ఎలాగైనా అవకాశాలు వస్తాయి ఇక్కడ నేను ఒక స్టార్ కిడ్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కాదని అక్కడ నేను అవకాశాలను సృష్టించుకోవాలని అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంటుందని ఈమె పలు సందర్భాలలో తెలియజేశారు ఇక మంచు లక్ష్మి ముంబై వెళ్ళిన తర్వాత ఆమె వ్యవహార శైలిలో కూడా కాస్త మార్పులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోషూట్ లో నిర్వహిస్తూ ఉంటారు.

ఈ విధంగా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే మంచు లక్ష్మి ఇటీవల చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఈమె వెనుక వీపు భాగంలో ఒక టాటూ వేయించుకొని కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ వెళ్ళిన మంచు లక్ష్మి…
ఇక ఈమె వీపు భాగంలో వాట్ యు సి సీకింగ్ యు అని ఇంగ్లీష్ అక్షరాలతో ఈమె టాటూ వేయించుకున్నారు అయితే ఈ టాటూ ద్వారా ఈమె ఏదో సందేశం ఇవ్వాలనే ప్రయత్నాలు చేశారు కానీ ఈ టాటూ వైరల్ గా మారడంతో చాలామంది ఈమెపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా టాటూలతో ఒళ్ళు చూపించుకోవాలనే ప్రయత్నం తప్పా ఇక్కడ ఏమి లేదంటూ పలువురు ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు.

Manchu Lakshmi: ఇకపై వాటి జోలికి వెళ్ళను.. ఆ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న మంచు లక్ష్మి?

Manchu Lakshmi: మంచు లక్ష్మి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవడం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు అయితే ముంబై వెళ్ళిన తర్వాత మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా తరచూ బికినీ ఫోటో షూట్ లు చేయడం స్విమ్ సూట్ ఫోటోషూట్ లు చేయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో మంచు లక్ష్మి ఒక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇలా తాము ఏదైనా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి అంటూ అల్లు అర్జున్ సలహా ఇచ్చారని అందుకే తాను ఈ విషయాన్ని బయట పెడుతున్నానని ఈమె తెలిపారు.

2024వ సంవత్సరం మొదలు కావడంతో తాను ఇకపై రైస్ నాన్ వెజ్ అసలు తినను అంటూ ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నానని,చూడాలి మరి ఎన్ని రోజులపాటు నేను వీటిని తినకుండా ఉంటానో అంటూ ఈమె ఈ విషయాన్ని వెల్లడించారు.

రైస్ నాన్ వెజ్ తినను..

మంచు లక్ష్మి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈమె పోస్టుకు రిప్లై ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి వారందరూ ఒకేసారి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే ఎలా లక్ష్మక్క.. ఇది సాధ్యమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మంచు లక్ష్మి సాధారణంగా భోజన ప్రియురాలు అనే విషయం మనకు తెలుసు. అలాంటి భోజనం మానేస్తున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Manchu Lakshmi: హైదరాబాద్లో నన్ను చూస్తే లేచి నిలబడతారు… వైరల్ అవుతున్న మంచు లక్ష్మి కామెంట్స్!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మంచు లక్ష్మి ఇండస్ట్రీలో ఒక నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ వదిలి ముంబై మకాం మార్చారు.

ఇలా ముంబై వెళ్లినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా సినిమా అవకాశాలను అందుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముంబైలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ముంబైలో నేను ప్రతి ఒక్కరికి తనని తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

హైదరాబాద్లో అయితే నన్ను చూస్తే లేచి నిలబడతారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపించగా మరికొందరు మాత్రం మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా…

మరి ముంబై వెళ్ళినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా అవకాశాలు అందుకొని సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మంచు హీరోల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మంచు మనోజ్ వాటిది ఫిష్ అనే సినిమాతో పాటు మరోవైపు టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మంచు విష్ణు సినిమాలో విషయానికి వస్తే ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం న్యూజిలాండ్ లో షూటింగ్ పనులు జరుపుకుంటున్నారు.

Manchu Lakshmi: నలుగురు పిల్లలని కనాలనుకున్నాను… కానీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఇక్కడ సక్సెస్ కావడం కోసం కృషి చేస్తున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె సరైన స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో ఈమె తీసుకున్నటువంటి బాధ్యతల గురించి తెలియజేశారు మనోజ్ మౌనికల వివాహం చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం నాన్నకి ఉండేది.

ఇక నాన్నను పెళ్ళికి ఒప్పించడం నావల్ల కాలేదు అందుకే ఓసారి యాదాద్రి వెళ్లినప్పుడు ఎలాగైనా వీరి పెళ్లికి నాన్నను ఒప్పించు దేవుడా అంటూ భారం మొత్తం తనపై వేశానని తెలిపారు మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం జరిగిపోయిందని అందుకే వారిద్దరిని యాదాద్రి తీసుకెళ్లానని తెలిపారు.ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారని ఇప్పుడు వేరుగా ఉంటున్నారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

Manchu Lakshmi: రాజకీయాలపై ఆసక్తి లేదు…


ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే చేసి పెడతారని తనకు చాలా సాయంగా ఉంటారని తెలియజేశారు.ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ తాను నలుగురు పిల్లలని కనాలని అనుకున్నాను కాకపోతే దేవుడు నాకు ఒకరిని ఇచ్చారు అంటూ తెలియచేశారు. ఇక రాజకీయాల గురించి ప్రశ్నలు రావడంతో అసలు తనకు రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi: మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదా… ఆసక్తికర సమాధానం చెప్పిన లక్ష్మి మంచు!

Manchu Lakshmi: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలో మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే మంచు ఫ్యామిలీలోని ఈ ముగ్గురు పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేదని చెప్పాలి.

ఇకపోతే కెరియర్ పరంగా ఎలా ఉన్నా వీరు వ్యక్తిగత కారణాల వల్ల మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం మనోజ్ విష్ణు ఏకంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు చుట్టం చూపుగా వచ్చారు. అయితే ఆల్రెడీ పెళ్లి జరిగి ఒక కుమారుడు ఉన్నటువంటి అమ్మాయి భూమ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణువుకి ఇష్టం లేకపోవడంతోనే తన తమ్ముడు పెళ్లికి చుట్టం చూపుగా వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి అభిమానులతో ముచ్చటించారు.

Manchu Lakshmi: విష్ణుకి ఇష్టం లేదా…


ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదు కదా అంటూ ప్రశ్నించారు.మంచు లక్ష్మి అవునని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు విష్ణుకి ఇష్టం లేదంటే వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కూడా నిజమేనని పలువురు ఈ గొడవ గురించి చర్చలు జరుపుతున్నారు.

Manchu Lakshmi: అలాంటి వారితో మాట్లాడటం దండగా…మంచు లక్ష్మి పోస్ట్ వైరల్!

Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో ఎంతో బాక్గ్రౌండ్ ఉన్నటువంటి మంచు కుటుంబం గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. మంచు మనోజ్ పెళ్లి కారణంగా మంచు ఫ్యామిలీ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇలా వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెల్లిపోయింది అయితే మన పెళ్లి తర్వాత కొద్ది రోజులకే మంచు విష్ణు మనోజ్ మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది.విష్ణు మనోజ్ అనుచరులపై మనోజ్ పై దాడికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో సంచలనంగా మారింది.

ఇక ఈ వీడియో ద్వారా ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో వాటిని కవర్ చేయడం కోసం విష్ణు నానా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మంచూరియాలిటీ షో కోసమే ఇదంతా చేశాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈయన ఫ్యామిలీతో చనువుగా ఉన్నటువంటి పలువురు వీరి మధ్య విభేదాలు ఉన్నాయనేది వాస్తవమే అంటూ చెప్పుకొచ్చారు.

Manchu Lakshmi:విషయం గురించి అవగాహన ఉందా…

ఇలా ఈ గొడవ తర్వాత మంచు కుటుంబ సభ్యులు ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్స్ షేర్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.మీరు ఒకరితో ఏ విషయం గురించి అయినా మాట్లాడే ముందు వారికి ఆ విషయం గురించి పూర్తి అవగాహన ఉందా? పలుకోనాల్లో తరచి చూడగలిగే పరిజ్ఞానం ఉందా అనే విషయం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి లేదా అలాంటి వారితో మాట్లాడటం దండగ అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేశారు అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Manchu Lakshmi: ఒకప్పటి క్యూట్ ఫోటోలను షేర్ చేసిన మంచు లక్ష్మి…మరీ ఇంత అందమా… ఫోటోలు వైరల్!

Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఈమె వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు టాక్ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్నటువంటి మంచూ లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మంచు లక్ష్మి రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ వీడియోలు తన పర్సనల్ విషయాలను కూడా వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసారు. ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే మంచు లక్ష్మి తాజాగా ఒకప్పటి తన ఫోటోలను షేర్ చేశారు.


Manchu Lakshmi:ఎంత క్యూట్ గా ఉన్నారో….

ఇలా ఈమెకి ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో దిగిన ఫోటోలను అలాగే తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో మంచు లక్ష్మి చూడటానికి ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉన్నారు. ఇలా అప్పట్లోనే ఎంతో అందంగా ఉన్నటువంటి మంచు లక్ష్మి తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికీ అదే స్థాయిలో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi -Manoj: మంచు రియాలిటీ షో నిజం కాదా… కవర్ చేయడానికి విష్ణు తంటాలు పడుతున్నారా?

Manchu Lakshmi -Manoj: మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ వార్తలకు అనుకూలంగానే వీరిద్దరూ మనోజ్ అనుచరుడు ఇంటిలో పెద్ద ఎత్తున గొడవకు దిగిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై మోహన్ బాబు సీరియస్ కావడంతో గొడవ సర్దుమనిగిందని తెలుస్తుంది.

ఇకపోతే ఇది నిజమైన గొడవ కాదని మంచూస్ రియాలిటీ షోలో భాగంగా చేసింది అంటూ విష్ణు మరొక వీడియోని షేర్ చేశారు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అసలు రియాలిటీ షో ఏంటి ఇలా గొడవ పడడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోని మంచు లక్ష్మి మనోజ్ మాత్రం షేర్ చేయకపోవడంతో సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోని ఈ విషయం గురించి లక్ష్మీ ప్రసన్నను ప్రశ్నించగా తాను ఎలాంటి రియాలిటీ షో లలో చేయలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక మనోజ్ టీం కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది.మనోజ్ ఎలాంటి రియాల్టీ షోలలో నటించలేదని ఆరోజు సారథి భార్య ఫోన్ చేయడంతోనే తన ఇంటికి వెళ్లారు తప్ప తను ఎలాంటి షోలలో చేయలేదని తెలిపారు.

Manchu Lakshmi -Manoj: గొడవను కవర్ చేయడానికేనా…

ప్రస్తుతం మనోజ్ తన సినిమాలు తన వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారని మనోజ్ టీం వెల్లడించారు.మరి ఇదంతా చూస్తుంటే విష్ణు ఆరోజు చేసిన గొడవను కప్పిపుచ్చుకోవడానికి ఇలా రియాలిటీ షో అంటూ మరొక వీడియోని షేర్ చేశారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Manchu Lakshmi: అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మంచు లక్ష్మి… ఏం చెప్పారో తెలుసా?

Manchu Lakshmi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటిది వారి మధ్య జరిగే గొడవలు ఇక సోషల్ మీడియాలో సంచలనంగా మారుతాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మంచి ఫ్యామిలీలో నిన్న జరిగిన గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ పై కూడా దాడికి ప్రయత్నించారు. అయితే ఈ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా బంధువుల ఇళ్లకు వచ్చి కూడా కొడుతుంటారు అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. అయితే ఈ వీడియో పై మోహన్ బాబు గారు స్పందించడంతో వెంటనే మనోజ్ వీడియో డిలీట్ చేశారని తెలుస్తుంది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు మనోజ్ విష్ణు మధ్య గొడవలకు కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.ఇక ఈ గొడవ గురించి మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Manchu Lakshmi: గొడవ గురించి నాకు తెలియదు…

నాకు ఈ గొడవ గురించి అసలు ఏ మాత్రం తెలియదు ఈ రోజు మా ఇంట్లో లంచ్ ప్రోగ్రాం ఉంది. నేను ఆ పనిలో బిజీగా ఉన్నాను ఆ విషయం గురించి పూర్తిగా తెలియకుండా నేను ఏమీ మాట్లాడను అంటూ మంచు లక్ష్మి మనోజ్, విష్ణు గొడవ గురించి స్పందిస్తూ ఇలా బదులిచ్చారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi: బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి… వీడియో వైరల్!

Manchu Lakshmi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి బాసు వేర్ ఇస్ ద పార్టీ అనే సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ పాట విడుదలైన మరు క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అత్యధిక వ్యూస్ రాబట్టింది.ఇకపోతే ఈ సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుండడంతో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ పాటకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ అద్భుతమైన స్టెప్పులతో రెచ్చిపోయే డాన్స్ చేశారు.

ఇక ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మంచు లక్ష్మితో పాటు రంగస్థలం మహేష్ కూడా డాన్స్ చేశారు.ఇక ఈ వీడియోని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్పుడప్పుడు తనకు మెగాస్టార్ చిరంజీవి గారి పాటలకు డాన్స్ వేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Lakshmi: సంక్రాంతి బరిలో బాలయ్య…. చిరు

ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే చిరంజీవికి పోటీగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కావడంతో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. మరి ఈ సంక్రాంతి ఎవరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.