Tag Archives: nagababu

Yandamuri Veerendranath: నాగబాబుని గారు అని పిలవాలా..? రామ్ చరణ్ ను, చిరంజీవి భార్యని అలా అన్నందుకు లెంపలు వేసుకోవాలా?

Yandamuri veerendranath: ప్రముఖ నవల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇకపోతే యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు యండమూరి కథ అందించడం ఆయన సినిమాలకు పలు సలహాలు సూచనలు చేసినట్లు పలు ఇంటర్వ్యూలలో సందర్భంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా యండమూరి యువతలో ప్రోత్సాహాన్ని నింపుతూ ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.అయితే గతంలో యండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ ముఖకవళికలు గురించి కామెంట్ చేయడంతో చిరంజీవి బాధపడ్డారని దాంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి.కానీ మనస్పర్థలు రాలేదని రామ్ చరణ్ కామెంట్ చేసినందుకు చిరంజీవి బాధపడ్డారని తెలిసిందంటూ యండమూరి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఏక వచనంతో సంబోధించడం…


ఇకపోతే నాగబాబు గారి విషయంలో కూడా కామెంట్ చేసినందుకు యండమూరి పట్ల మనస్పర్థలు వచ్చాయి. అలాగే ఒక సభాముఖంగా చిరంజీవి భార్య సురేఖ గారిని సురేఖ అని ఏక వచనంతో సంబోధించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ.. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి రావడం సర్వసాధారణం అయితే వాటిని రికార్డ్ చేసే టెలికాస్ట్ చేసే వాళ్ళు వేరే విధంగా ఫోకస్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి.అయితే రామ్ చరణ్ ను, చిరంజీవి భార్యను అలా అన్నందుకు నేను లెంపలు వేసుకోవాలా…అని యండమూరి ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావించారు

Nagababu: నాగబాబు రాజకీయాలు వరుణ్ తేజ్ కెరీయర్ కి బ్రేక్ వేస్తుందా..వరుణ్ కి గుదిబండలా మారిన నెగిటివిటీ!

Nagababu: సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ రెండింటికి ఎంత మంచి అనుబంధం ఉన్న ఈ రెండింటిని వేరువేరుగా చూడటమే ఎంతో మంచిది. ఇలా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా కుటుంబం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. అయితే ఈ పార్టీని విజయవంతంగా చిరంజీవి ముందుకు నడపలేక పోయారు.

Nagababu: నాగబాబు రాజకీయాలు వరుణ్ తేజ్ కెరీయర్ కి బ్రేక్ వేస్తుందా..వరుణ్ కి గుదిబండలా మారిన నెగిటివిటీ!

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పడంతో నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించి ప్రజల ముందుకు వచ్చారు. ఇక జనసేన పార్టీకి చిరంజీవి దూరంగా ఉన్నప్పటికీ, నాగబాబు మాత్రం పార్టీ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ తరపున నాగబాబు పలుసార్లు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

Nagababu: నాగబాబు రాజకీయాలు వరుణ్ తేజ్ కెరీయర్ కి బ్రేక్ వేస్తుందా..వరుణ్ కి గుదిబండలా మారిన నెగిటివిటీ!

ఈ విధంగా నాగబాబు వ్యవహారశైలి పూర్తిగా తన కొడుకు వరుణ్ తేజ్ కెరియర్ పై పడుతుందని తెలుస్తోంది. నాగబాబు మాట్లాడే మాటలు కారణంగా ఓ వర్గం వారు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన సినిమాలను చూడకూడదని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన సినీ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో తన కెరియర్ కు తన తండ్రి బ్రేక్ వేస్తున్నారని చెప్పవచ్చు.

ప్రమాదంలో వరుణ్ కెరియర్…

హీరోగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ కి తన తండ్రి కారణంగా తన కెరియర్ ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది. అందుకు ఉదాహరనే గని ఫలితం అంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఈ సినిమా విడుదలకు ముందు నాగబాబు వ్యాఖ్యల వల్ల ఓ వర్గం వారు ఈ సినిమాని చూడకూడదని ఫిక్స్ అయ్యారు. అయితే గని సినిమా విడుదలైన తర్వాత మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి నాగబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వరుణ్ తేజ్ కి గుదిబండగా మారిపోయిందని చెప్పాలి.

Nagababu :మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన నాగబాబు”హైయర్ పర్పస్” అంటూ సెటైర్స్..!

మెగా ఫ్యామిలీ వర్సస్ మంచు ఫ్యామిలీ.. ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఇరు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకూ నాగబాబు.. మోహన్ బాబు.. విష్ణు ల కామెంట్లు చూసాం.. గత కొద్దిరోజులుగా వాళ్ళు సైలెంట్ అయిపోయారు.

అయితే తాజగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా మంచు మనోజ్ పరోక్షంగా నాగబాబుపై సెటైర్లు వేశారు. మా ఎలక్షన్స్ సందర్బంగా మంచు విష్ణుపై నాగబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మనోజ్ మండిపడ్డారు. నాగబాబుకు హైయ్యర్ పర్పస్ లేదని అందువల్లే తమతో గొడవలు పడుతున్నాడని పరోక్షంగా కామెంట్ చేసాడు. దీనితో మరోసారి నిప్పురాజుకుంది.

ఈ నేపధ్యంలో హైయర్ పర్పస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక తాజగా ఈ వ్యాఖలపై నాగబాబు కూడా స్పందించారు. తాజగా “ఆస్క్ మీ..” పేరిట తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపద్యంలో ఓక అభిమాని.. ‘‘ఇన్ని రోజుల తర్వాత ఆస్క్‌ మీ పెట్టడానికి కారణం ఏంటి సార్‌?’’ అంటూ ప్రశ్నించారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ ‘‘హైయర్‌ పర్పస్‌ కోసం’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మంచు మనోజ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ గానే నాగబాబు అలా వ్యాఖ్యానించారని భావిస్తున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగుతుందా లేదా అనేది వేచి చూడాలి..

నిహారిక ఇంస్టాగ్రామ్ నేనే డిలీట్ చేసాను.. ఆ పని చేయడం వల్లే.. : నాగబాబు

మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. బుల్లితెర రారాజు గా పది సంవత్సరాలు ఏలిన నాగబాబు ఇప్పటికీ టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు.. ఇక మాటల్లో వెటకారం జోడించి మాట్లాడటంలో నాగబాబు దిట్ట. ఈ నేపధ్యంలో కొన్ని వివాదాలు కూడా కొనితెచ్చుకుంటారు మెగా బ్రదర్. తాజాగా సోషల్ మీడియాలో అయన అభిమానులతో చిట్ చాట్ నిర్వచించారు నాగబాబు.

ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు అయన మార్క్ వెటకారం, హాస్యం జోడించి తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఒక అభిమాని “నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏమయింది? ఎందుకు డిలీట్ చేసింది ? ఆమె పై వచ్చిన రూమర్స్ మీద మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్” అంటూ ప్రశ్నలు సంధించారు.

దీనిపై నాగబాబు స్పందిస్తూ “నిజానికి నేనే కోడింగ్ నేర్చుకుని నేనే హ్యాక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేసాను. మళ్ళి డీకోడింగ్ నేర్చుకుని రీయాక్టివేట్ చేస్తాను..” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.. గతకొన్ని రోజుల క్రితం నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డెలీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జిమ్ లో నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. దానిపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయట. అందువల్లె ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిందంటూ ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి..

నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ఇదేనా.. లేక వేరే ఏమయినా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఇప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ నేపధ్యంలో నాగబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగబాబు కూడా అసలు విషయాన్ని పక్కనపెట్టి ఫన్నీ అన్సర్ ఇచ్చి కఫ్యూజ్ చేసారు.

Manchu Manoj: మెగా బ్రదర్ నాగబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంచు మనోజ్…!

Manchu Manoj:మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగాబ్రదర్ నాగబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Manchu Manoj: మెగా బ్రదర్ నాగబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంచు మనోజ్…!

ఇక ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఇరు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు.ఇకపోతే ఈ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఈ వేదికపై మాట్లాడిన పరోక్షంగా నాగ బాబు పై సెటైర్లు వేశారు.

Manchu Manoj: మెగా బ్రదర్ నాగబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంచు మనోజ్…!

మా ఎన్నికల గురించి మాట్లాడుతూ మా కుటుంబానికి మద్దతు తెలిపిన వారి పట్ల మరొక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారని అయినా వాటి గురించి మేము ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ అని అన్నారు. అది కూడా నిజమే కదా వాళ్లకు ఎలాంటి హయ్యర్ పర్పస్ లేదు అంటూ మాట్లాడారు.

జనాలకు ఏదో ఒకటి చేయాలి….

అయితే ఆ వ్యక్తి ఫ్యామిలీలో ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా హయ్యర్ పర్పస్ కోసం జీవించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమీ లేకుండా ఉండిపోయారని మంచు మనోజ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంచు మనోజ్ కచ్చితంగా మెగాబ్రదర్ నాగబాబు గురించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. మరి ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్లలో.. నా సపోర్టు ఆమెకే: నాగబాబు

బిగ్ బాస్ రియాల్టీ షోకి సినీ ప్రముఖులు మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందులో ఏదో ఒక కంటెస్టెంట్ కు మద్దతు ఇస్తుంటారు. వాళ్లకు సపోర్టు చేస్తూ పోస్టులు.. వీడియోలు చేస్తుంటారు. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా అవినాష్ కు జబర్దస్త్ టీం మొత్తం పెద్ద సపోర్టుగా నిలిచారు. రామ్ గోపాల్ వర్మ్ అయితే అరియానాకు సపోర్టు చేసిన విషయం తెలిసిందే.

వాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల కోసం చేసిన ప్రచారం మామూలుగా లేదు. ప్రతీ ఒక్కరు వాళ్లు అనుకున్న కంటెస్టెంట్ కు సపోర్టుగా నిలవాలని కోరారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్ అవుతోంది. అందులోకి 19 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంతమంది చాలామందికి తెలియదు.

మరికొంత మంది యాంకర్లుగా, డ్యాన్సర్ గా, టీవీ సీరియల్ ల్లో నటించిన వారు ఉన్నారు. మిగతావారు దేనిలో ఒకదాంట్లో ప్రావీణ్యం ఉన్నా అంతగా పాపులారిటీ లేని వాళ్లు ఉన్నారు. అయితే అందులో జబర్దస్త్ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక్ సింగ్ కూడా ఉన్నారు. ఆమెకు తన సపోర్టు ఎక్కువగా ఇస్తున్నట్లు ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగా వ్యాహరించిన నాగబాబు చెప్పుకొచ్చారు.

తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి తేజ) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక సింగ్ టైటిల్ గెలుస్తారా.. లేదా అనేది తెలియదు కానీ.. తన మద్దతు మాత్రం ఆమెకు ఉంటుందని చెప్పారు. ఆమె కష్టాల్లో ఉన్న సమయంలో ఓ కామెడీ షోలో ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఆమెది శ్రీకాకులం జిల్లాగా చెప్పుకొచ్చారు. దయచేసి ఆమెకు సపోర్టుగా నిలవాలని నాగబాబు కోరారు.

జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు.. షాక్ లో పవన్ ఫ్యాన్స్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నాగబాబు ప్రశంసించడం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖల నుంచి జగన్ కు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సినీ రంగం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కరోనా వల్ల నష్టపోయిన సినీ పరిశ్రమకు భారీగా రాయితీలను ప్రకటించారు.

జగన్ రాయితీలను ప్రకటించడంపై నాగబాబు స్పందిస్తూ జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో శూన్యం ఏర్పడిందని జగన్ తన నిర్ణయం ద్వారా శూన్యాన్ని పూఢ్చేశారని వెల్లడించారు. జగన్ సర్కార్ చొరవ తీసుకోవడం వల్ల సినిమా రంగానికి జవసత్వాలు చేకూరుతాయని నాగబాబు అన్నారు.

సీఎం జగన్ రాయితీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతిస్తోందని నాగబాబు అన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ ఆదుకున్నారని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్‌ నెలల చార్జీలను రద్దు చేయడంతో జగన్ సర్కార్ పై అదనంగా 3 కోట్ల రూపాయల భారం పడనుంది.

అయితే నాగబాబు జగన్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. నాగబాబు జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని కామెంట్లు చేస్తారు. జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేసి నాగబాబు పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి కారణం అదే!

డిసెంబర్ 9న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ లో ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 9న నిహారిక చైతన్యల వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులతో పంచుకున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు నిహారిక పెళ్లి వేడుక వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. తాజాగా నిహారిక సంగీత్ వీడియోను షేర్ చేశారు. ఇందులో మెగా హీరోలు, నిహారిక, చైతన్య, చేసిన డాన్సులు చూడవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో  ‘నిశ్చయ్‌’ డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి గల కారణాలను కూడా నాగబాబు తమ అభిమానులతో పంచుకున్నారు.

‘నిశ్చయ్‌’ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని తెలిపారు.కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వేడుకను నిర్వహించాము. అంతేకాకుండా మెగాహీరో లైన బన్నీ, చరణ్ వివాహానికి వేలసంఖ్యలో అతిథులు రావడంతో వారి పెళ్లిని మేము ఎంజాయ్ చేయలేక పోయామని, అందుకోసమే నిహారిక వివాహాన్ని డెస్టినేషన్ రూపంలో ప్లాన్ చేసినట్టు ఆయన తెలిపారు.

ఈ వివాహానికి నిహారిక_చైతన్య ఇష్ట ప్రకారమే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశామని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి ఏర్పాట్లను వరుణ్ తేజ్ దగ్గరుండి చేశారని ఆయన తెలిపారు. పెళ్లి తర్వాత నూతన దంపతులు పలు ఆలయాలను దర్శిస్తున్నారు.పెళ్లి అయిన వెంటనే అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తిరుమలకు చేరుకుని వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నిహారిక దంపతులతో పాటు చైతన్య తల్లిదండ్రులు, నిహారిక తల్లి పద్మజ తిరుమల ఆలయానికి చేరుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నిర్మాతలను డబ్బు కోసం టార్చర్ చేసిన ప్రకాశ్ రాజ్..?

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నిన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఊసరవెళ్లితో పోల్చి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ విమర్శల గురించి పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం హింసించాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ చరిత్ర తనకు తెలుసంటూ విమర్శలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీకి పవన్ మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టడంతో మాటల యుద్ధం మొదలైంది. నిన్న ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడంతో ఈరోజు ట్విట్టర్ ద్వారా నాగబాబు ప్రకాశ్ రాజ్ పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు, పార్టీలకు ఉపయోగపడటం కోసం రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయని తెలిపారు.

విస్తృత ప్రయోజనాల కోసమే పవన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాడని నాగబాబు అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లో ప్రకాశ్ రాజ్ డొల్లతనం తనకు అర్థమైందని కామెంట్లు చేశారు. బీజేపీ నిర్ణయాలను విమర్శించడంలో తప్పు లేదని నాగబాబు అన్నారు. మంచి చేసినా మెచ్చుకోలేని కుసంస్కారం ప్రకాశ్ రాజ్ ది అంటూ నాగబాబు మండిపడ్డారు.

ఏపీకి జనసేన పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను ఖచ్చితంగా చెప్పగలనని.. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం ఎన్నిరకాలుగా హింసించాడో తనకు తెలుసని నాగబాబు అన్నారు. ప్రకాశ్ రాజ్ మంచి మనిషిగా మారాలని ఆ తరువాత కామెంట్లు చేయాలని నాగబాబు చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ వల్లే ఎన్ని విమర్శలు చేసినా ప్రకాశ్ రాజ్ ని ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు.

బొమ్మ అదిరింది వివాదం.. నాగబాబు, శ్రీముఖికి జగన్ ఫ్యాన్స్ షాక్..?

ఈ మధ్య కాలంలో కామెడీ షోలలో ప్రముఖులను ఇమిటేట్ చేసి కామెడీ పండించటం కామన్ అయిపోయింది. సదరు సెలబ్రిటీలు ఆ స్కిట్లను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం సీరియస్ గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షోలో ఏపీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ ఒక స్కిట్ టెలీకాస్ట్ అయింది.

ఈ స్కిట్ పై జగన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్లు సద్దాం, రియాజ్‌లను, శ్రీముఖిని, జడ్జీ నాగబాబును కూడా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కమెడియన్ రియాజ్ ఇప్పటికే స్పందించి క్షమాపణ కోరాడు. మొన్న ప్రసారమైన తొలి ఎపిసోడ్ పై జగన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. రేటింగ్స్ పెంచుకోవడం కోసం ప్రముఖులను టార్గెట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సరికాదని సూచనలు చేస్తున్నారు.

జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఆ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది షో ను మొదలుపెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాబట్టడంలో అదిరింది షో ఫ్లాప్ అయింది. దీంతో షోకు బొమ్మ అదిరింది అని పేరు మార్చి యాంకర్ ను కూడా మార్చేశారు. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ పేరుతో రౌడీ బోయ్స్, గల్లీ బాయ్స్ టీంలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, జగన్, చంద్రబాబులను ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేశారు.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే సరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలలో ఈ విషయం గురించే చర్చ చెబుతోంది. షోలో విమర్శలు చేసి సోషల్ మీడియాలో సారీ చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఏకంగా షోను ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.