Tag Archives: nani

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

Shyam Singha Roy: రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాన్ చేసని వ్యాఖ్యలపై అప్పుడు రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అతడు టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి సపోర్టుగా నానీ కూడా మాట్లాడటం విశేషం. ఈ వివాదం కారణంగానే టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారిపోయింది.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ దాఖలు చేసింది.

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

ఈ వివాదంపై ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు స్పందించి.. వారి వారి వెర్షన్ వినిపించారు. మరో సారి నానీ కూడా తనదైన శైలిలో టికెట్ల వ్యవహారంపై విరుచుకుపడ్డాడు. రేపు నానీ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో నానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై స్పందించాడు. ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని ఆకస్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

థియేటర్ అంటే.. 10 మందికి ఉపాధి కల్పిస్తుంది.. దీని కంటే కూడా థియేటర్ పక్కన కిరాణ కొట్టు పెట్టి అమ్ముకునే వాటికి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయని అన్నాడు. టికెట్ ధరలను పెంచినా.. వాటిని కొని చూసే సామర్థ్యం ప్రేక్షకుల దగ్గర ఉందని అన్నాడు. ప్రభుత్వం కావాలనే వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం తాను ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెబుతూనే.. ఉదాహరణలు చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

Nani: ‘నాన్న నువ్వు సింహంలా ఉన్నావ్’..నానీ షేర్ చేసిన వీడియో వైరల్..!

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పుష్ప మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు. కలెక్షన్లలో ఈ సినిమా గత రికార్డులను చెరిపేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల అవుతుందని తెలిసి కూడా నానీ నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్ చిత్ర సభ్యులు ధైర్యంగా ఈ శుక్రవారం సినిమాను విడుదల చేస్తున్నారు.

Nani: ‘నాన్న నువ్వు సింహంలా ఉన్నావ్’..నానీ షేర్ చేసిన వీడియో వైరల్..!

కథపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను తీశామని.. సినిమా అద్బుతంగా వచ్చిందని.. చెబుతూ.. ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిజీగా ఉన్న ఈ బృందం.. నానీ కూడా వాళ్లతో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా నానీ తన కొడుకు అర్జున్‌తో కలిసి తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

శ్యామ్ సింఘరాయ్’ స్టార్ షేర్ చేసిన వీడియోలో అర్జున్ తన తండ్రితో మీసంతో నువ్వు సింహంలా కనిపిస్తున్నావు నాన్న అని అర్జున్ చెప్పడం కనిపించింది. అర్జున్ తన తండ్రి మీసాలు తిప్పుతూ నాని రాబోయే చిత్రం ‘శ్యామ్ సింఘా రాయ్’ టైటిల్ ట్రాక్‌ని కూడా జపిస్తాడు. ఈ వీడియోను నాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

Nani: ‘నాన్న నువ్వు సింహంలా ఉన్నావ్’..నానీ షేర్ చేసిన వీడియో వైరల్..!

నాని ‘శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న విడుదల కానుంది. ప్రస్తుతం నానీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండగా.. అతను ఈ సినిమాలో డ్యూయల్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటించింది. మరోవైపు, నాని సరసన కృతి శెట్టి యూత్‌ఫుల్ రోల్‌లో కనిపించనుండగా, ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న శ్యామ్ సింగరాయ్ టీం..ఎగబడ్డ జనం..!

గ్రీన్ఇండియా చాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు శ్యామ్ సింగరాయ్ టీమ్. హీరో నాని తో పాటు హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి కలసి పార్క్ లో మొక్కలు నాటారు.

వీరితో పాటు శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్ బోయిన పల్లి వెంకట్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని మొక్కలు నాటారు. దీనిలో భాగంగా నానీ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని నాని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. చుట్టు పక్కల పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని.. పర్యావరణంపై కూడా ఓ కన్ను వేసి ఉంచాలన్నారు.
మొక్కలు నాటి.. వాటని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అంటూ సూచించాడు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.

సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. మొక్కలు నాటిన తరువాత గ్రీన్ ఇండియా ఈ వెంట్ కు సంబంధించిన బుక్ ను అందుకున్నారు శ్యామ్ సింగరాయ్ టీమ్. వృక్షవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి నిర్వాహకులు అందజేశారు.

వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ ను నాని, సాయి పల్లవి, కృతిశెట్టి అభినందించారు. ఆ చుట్టుపక్కల అంతా హడావిడిగా తయారయ్యింది. హీరో, హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు సినీ బృందం.

హీరో నాని చేసిన ఆ పనికి తాను బాధపడ్డాను.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తమన్..

సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసినా.. ఆ సినిమాలోని పాటలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయే అందరికీ తెలిసిందే.

అలా అతడు ప్రస్తుతం తన సంగీతంతోనే తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. సౌత్ లోనే అతడి హవా కొనసాగుతోంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్న తమన్ ఇటీవల విడుదలైన నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. అతడు ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే నానికి నచ్చలేదు.. దీంతో గోపీసుందర్ ర్ తో చేయించుకున్నారని తెలిపారు.

ఇక తనకు బాలీవుడ్ కు ఉన్న సంబంధాన్ని గురించి తెలిపాడు. బాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా చేయడం వేరు.. సౌత్ లో సంగీతం అందించడం వేరు అని అన్నాడు. బాలీవుడ్ లో సంగీతం ఒక్కడే అందిచడం అనేది ఉండదని.. ఒక్క సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేస్తారన్నారు. అంతే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరొకకు ఇస్తారంటూ చెప్పాడు.

ఒకే సినిమాకు సంబంధించి మొత్తం సంగీతం అనేది ఒక్క దర్శకుడికి ఇస్తేనే బాగా చేయగలం.. ఇలా ఇద్దరు ముగ్గురికి ఇస్తే సంగీతం కంపోజ్ చేయడం తన వల్ల కాదు అని.. అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి సౌత్ కు వచ్చినట్లు చెప్పాడు. అతడు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను గుర్తు చేశాడు.

బాలయ్య టాక్ షోలో రోజా.. ఉత్కంఠభరితంగా మారనున్న ఎపిసోడ్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి వెండితెరపై ప్రేక్షకులను అలరించారు. మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో ఈ షో కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ లుగా మోహన్ బాబు ఫ్యామిలీ వచ్చారు.

రెండవ ఎపిసోడ్ కి జస్ట్ గా నాచురల్ స్టార్ నాని వచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఈ షోకి అతిధులుగా క్రేజీ సెలబ్రిటీలు రాబోతున్నారు అంటూ వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తదుపరి ఎపిసోడ్ కి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నట్టు సమాచారం. ఆ తరువాత ఎపిసోడ్ కూడా గెస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణతో కలసి వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన బాలయ్య లక్కీ హీరోయిన్ రోజా ఈ షోకి అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది. బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

ఇవే కాకుండా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి సినిమాలలో కూడా నటించింది. అందువల్లే బాలకృష్ణ,రోజా ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ రోజాకు బాలకృష్ణ అంటే అభిమానం. ఇక పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు ఆమె బాలకృష్ణ పై కూడా విమర్శలు చేయటం అనేది చాలా సార్లు చూసి ఉన్నాయి.తెల్ల వీరిద్దరూ పాల్గొనడంతో బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేదాని గురించి ఎంతో ఉత్కంఠత ఏర్పడింది.

పుష్ప సినిమా విషయంలో యూటర్న్ తీసుకున్న అల్లు అర్జున్.. చిక్కుల్లో పడ్డ నాని!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు కరోనా కారణం చేత వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం చేత సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోని జనవరి నెలలో RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం అయింది.

ఈ క్రమంలోనే డిసెంబర్ 25వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం వెల్లడించినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రాన్ని డిసెంబర్ 17వ తేదీకి మార్చుకున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎలాంటి సినిమాలు విడుదల లేకపోవడంతో డిసెంబర్ 24వ తేదీ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.

అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా 17వ తేదీ కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం 25 వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక జరిగితే పూర్తిగా అల్లు అర్జున్ పుష్ప సినిమా నాని సినిమాను చిక్కుల్లో పడేసినట్టు అవుతుంది.

ఇక డిసెంబర్ 24వ తేదీ నాని సినిమా విడుదల కాకపోతే మరో రెండు నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి నెలలో స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు వరుసగా విడుదల కావడంతో ఖచ్చితంగా మరో రెండు నెలల వరకు నాని తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పుష్ప సినిమా 25వ తేదీ కూడావిడుదల కాలేకపోతే నాని సినిమా యధా విధిగా విడుదలవుతుంది లేదంటే మరోసారి నాని తన సినిమాను వాయిదా వేసుకుంటాడా లేదంటే అల్లు అర్జున్ ను ఢీ కొడతాడా తెలియాల్సి ఉంది.

అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్యను సర్ ప్రైజ్ చేసిన నాని..!

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇంతవరకూ వెండితెరపై ఎంతోమంది ప్రేక్షకులను ఆలరించిన బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు.

ఈ షో తొలి ఎపిసోడ్ ను మంచు మోహన్ ఫ్యామిలీతో చిత్రీకరించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమైన ఈ షో భారీగా రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి షో తోనే ఆన్లైన్ వేదికపై బాలయ్య మార్క్ ఏంటో కనిపించింది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నానితో కలసి చిందులు వేశారు బాలకృష్ణ.

ఇక ఈ ఎపిసోడ్లో బాలకృష్ణకు నాని ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్ప్రైస్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. అయితే నాని ఇచ్చిన ఆ సర్ప్రైజ్ ఏమిటంటే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ సహాయంతో ఆ అమ్మాయికి చికిత్స జరిగిందని నాని తెలిపాడు. అయితే కొన్నేళ్ల తర్వాత సహాయం పొందిన చిన్నారిని తెలుసుకున్నందుకు బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిన్నారి ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

ఈ ఎపిసోడ్ ని చూసిన అభిమానులు ఎప్పుడో 2011 జరిగిన సంఘటన ఇవాళ నాని గుర్తు చేస్తే తప్పా బయటకు రాలేదు. బాలకృష్ణ చాలామందికి తెలియకుండా ఎన్నో ప్రాణాలను నిలబెట్టాడు. అతను చేసిన సహాయాన్ని ఎవరికీ తెలియనివ్వడు. అంతేకాకుండా తన సహాయం వల్ల ఒక జీవితం బాగుపడితే చాలు అని సంతోషిస్తాడనీ నెటిజన్స్ బాలయ్య ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నానితో బాలయ్య అనుబంధం ఎప్పటిదో తెలుసా.. ఓ రేంజిలో ఉండనున్న రెండో ఎపిసోడ్..!

నందమూరి బాలయ్య వెండతెరపై తన డైలాగ్స్, నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండతెరపైనే కాకుండా ఇటీవల అతడు తొలిసారిగా డిజిటల్ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో తొలి ఎపిసోడ్‌కు మంచు మోహ‌న్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించి ఆహాలో టెలికాస్ట్ కూడా అయిన విషయం తెలిసిందే.

దీనిని దీపావళి కానుకగా ప్రసారం చేశారు. ఈ రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురి పేర్లు వినిపించగా చివ‌ర‌కు నాని రెండో ఎపిసోడ్ కు గెస్ట్‌గా వ‌చ్చారు. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఈ షో నవంబర్ 12 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనిలో నాని, బాలయ్యకు మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి.

దీనిలో బాలయ్య నాని.. నీవు గల్లీ క్రికెట్ ఆడుతావా అని అడుగుతా.. దానికి నాని అవును అని సమాధానం ఇస్తాడు. తాను సెట్‌లో క్రికెట్ ఆడుతానంటూ బాల‌య్య చెప్పాడు. ప్రోమో చూస్తుంటే ఇది కూడా మంచి ఎంట‌ర్‌టైన్ అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి అనుబంధం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.

నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. ఇందులో అత‌ని చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా ఉంది. దీంతో బాలయ్యతో ఎపిసోడ్ ఓ రేంజిలో ఉండనుందనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ విషయమై నెటిజన్లు బాలయ్యతో నాని అనుబంధం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

బాలయ్య టాక్ షోలో రెండవ అతిథిగా నాచురల్ స్టార్ నాని.. ప్రోమో వైరల్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టాక్ షోలో ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. మొదటి ఎపిసోడ్ కి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రశ్నలకు అదిరిపోయే మోహన్ బాబు సమాధానాలు అత్యంత ప్రేక్షకులకు ఈ కార్యక్రమంపై ఎంతో ఆతృతను కలుగజేస్తాయి.

ఇలా మొదటి ఎపిసోడ్ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా ఎవరు రాబోతున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు జరిగాయి.ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ వేదికపైకి రాగానే ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా రాబోయే వ్యక్తి మీ నుంచి వచ్చాడు అంటూ నానిని వేదికపైకి ఆహ్వానించాడు. అయితే అప్పటికి నాని రాకపోయేసరికి నాని ఎక్కడ అంటూ బాలకృష్ణ అడుగగా జనాల మధ్యలో నుంచి నాని వస్తూ మీరే కదా మీ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడంతో అక్కడి నుంచే వచ్చాను అంటూ నాని తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ నానితో ఎంతో సరదాగా మాట్లాడుతూ నీకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చా అంటూ ప్రశ్నించారు. దీంతో తనకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చని చెప్పడంతో బాలకృష్ణ కూడా తనకి క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టమని క్రికెట్ గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు వేదికపై క్రికెట్ ఆడి ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా నాని బాలయ్య చెప్పిన ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ తన డైలాగులను తనకే చెప్పారు. ఇక సాయంత్రం ఉయ్యాలకు నువ్వు ఎలా రిలాక్స్ అవుతావని బాలకృష్ణ నానిని అడగడంతో సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతానని చెప్పగా పులిహోర కథలు చెప్పకు అంటూ బాలకృష్ణ పంచ్ వేశారు. ఇలా మొత్తానికి వీరిద్దరి మధ్య ఎంతో సరదాగా ఈ ప్రోమో సాగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందా…!

బుల్లితెర ప్రసారమయ్యే రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈక్రమంలోనే తెలుగు మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అప్పట్లో అధిక రేటింగ్స్ సంపాదించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అలాగే మొదటి సీజన్ విజయవంతం కావడంతో రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా కొనసాగీ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించి ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది.

ఇక సీజన్ 3 నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన అటువంటి సీజన్-3, 4 ఎంతో విజయవంతమయ్యాయి అత్యధిక రేటింగ్స్ ను సాధించాయి. ఇలా నాలుగవ సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు ఐదవ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమయింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా ఒకేసారి 19 మందిని హౌస్ లోకి పంపించారు. సీజన్ ఫైవ్ గత సీజన్లతో పోలిస్తే ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయబోతున్నారని చెప్పినప్పటికీ ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరుస్తోందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ప్రేక్షకులను సందడి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే రేటింగ్స్ కూడా అమాంతం పడిపోయాయి. ఇక వారాంతంలో నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడినప్పటికీ వారిని అడగాల్సిన ప్రశ్నలు తప్ప ఇతర ప్రశ్నలు వేస్తూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మాత్రం ఎలాంటి కిక్ ఇవ్వలేదని ఈ కార్యక్రమం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మరి మిగతా వారాలలో అయినా బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తారో లేకపోతే ఇలాగే కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.