Tag Archives: New rules

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

Telangana: తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. జోనల్‌ బదలాయింపుల దృష్ట్యా సాధారణ బదిలీలు చేపట్టవద్దని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులు అనేవి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేపట్టింది.

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

దీనిలో భాగంగానే పరస్పర బదిలీలు పరిశీలనలోకి తీసుకుంది. ఇది కనుక అనుమతిస్తే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు , కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వర్చువల్ సమీక్షలో దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చిటట్లు సమాచారం.

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

2018 సంవత్సరంలో చివరిసారిగా తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ప్రతీ సంవత్సరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని.. సాధారణ బదిలీలు చేపట్టాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏ సంవత్సరం కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం జరగుతాయని అశించినా ఫలితం లేదు.


దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి..

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా బదలాయింపులు జరగడంతో.. నెల రోజుల వ్యవధిలోనే 70 వేల మందికి బదిలీలు జరిగాయి. దీనిలో కూడా భార్య భర్తలకు సంబంధించి బదిలీల సమస్యలు ఉంది. వీటిపై ప్రభుత్వానికి ఎన్నో వినతులు వచ్చాయి. ఈ అంశాలను కూడా పరిష్కరించాల్సి ఉంది. అంతే కాదు బదిలీలు అయిన వారిలో కూడా సీనియార్టీని ఖరారు చేయాలి.. ఈ సమస్యలు అనేది జిల్లా స్థాయిలో లేకున్నా.. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని పోస్టుల్లోకి బదిలీ అయిన వారికి.. భార్యాభర్తలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. వారిని ఒకవేళ ఒకే చోటు నియమిస్తే మాత్రం.. అప్పటికే అక్కడ ఉన్నవారిని సీనియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

6 Air Bags In Car: ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్‌లో తెలిపారు. 2019 జులై 1 నుండి డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ , ఫ్రంట్ కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది జనవరి 1 నుండి అమలులోకి తీసుకురావాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇప్పటికే ఆదేశించిందని గడ్కరీ వరుస ట్వీట్‌లలో తెలిపారు.

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

ముందు మరియు వెనుక రెండు కంపార్ట్‌మెంట్లలో కూర్చున్న ప్రయాణికులకు ఫ్రంటల్ , లాటరల్ ఢీకొనే ప్రభావాన్ని తగ్గించడానికి.. వాహనం విభాగంలో 4 అదనపు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు. కొత్తగా ప్యాసింజర్ వాహనాల్లో రెండు వైపులా లేదా సైడ్ టోర్సో ఎయిర్‌బ్యాగ్‌లు.. అవుట్‌బోర్డ్ ప్రయాణికులందరినీ కవర్ చేసే రెండు వైపులా కర్టెన్, ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా అమర్చబడిందని ఆయన తెలిపారు.

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

గతంలో కంటే.. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నాడు. ఇక వాహనం ధర ఎంత.. ఎక్కువ ధర పెట్టి తీసుకున్న వాహనాలకు కాకుండా.. తక్కువ ధర వెచ్చించి తీసుకున్న వాహనాలకు కూడా ఇలాంటి ఎయిర్ బ్యాగ్స్ అమర్చాలని.. చివరగా.. ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా చూసుకోవాలని అతడు చెప్పాడు.


భారత్ లోనే ప్రమాదాల సంఖ్య ఎక్కువ..

ఇక ఈ సంవత్సరం జనవరి 1 నుంచి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసని విషయం తెలిసిందే. అయితే ఇది డ్రైవర్ అతడి పక్క కూర్చున్న ఫ్రంట్ కో-ప్యాసింజర్ భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈ కొత్త వాహనాలకు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే కొత్త నిబంధన.. సైడ్ ఇంపాక్ట్‌ల విషయంలో కూడా ప్రయాణీకులకు భద్రతను అందిస్తుందన్నారు.
ప్రతీ సంవత్సరం కారు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది చనిపోతున్నారు. ఇలాంటి వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారత్ లోనే ప్రమాదాల ఎక్కువగా జరుగుతన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలతో పాటు కొంతమందికి తీవ్ర గాయాలు అవున్నాయి. ప్రమాదాల వెనుక ట్రాఫిక్ ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నప్పటికీ.. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి.

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

Call Recordings:. టెలీ కమ్యూనికేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి కాకుండా రెండేళ్ల పాటు కాల్ రికార్డింగుల డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది కేంద్రం. గతంలో ఇది ఒకే ఏడాది మాత్రమే ఉంది. టెలికాం సంస్థలతో పాటు కమర్షియల్, ఇతరత్రా కాల్స్ వివరాల రికార్డులను మెయింటెన్ చేయాలని.. ఇందుకోసం ఏకీకృత లైసెన్స్ ఒప్పందంలో సవరణలు
చేసింది.

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

భద్రత పరంగా వచ్చిన అభ్యర్థనల మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.  కాల్ రికార్డ్ వివరాలతో పాటు, ఎక్స్ ఛేంజ్ వివరాలను, ఐపీ వివరాలను రెండేళ్ల పాటు భద్రపరచాలని ఆదేశించింది. సాధారణ కాల్స్ తో పాటు ఇంటర్నెట్ కాల్స్ డేటాను రికార్డ్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది.

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

ఇది కేవలం విధానపరమైన నిర్ణయం అని .. రెండేళ్ల పాటు రికార్డులు ఉంటే.. భద్రతా పరమైన విషయాలకు కీలకంగా మారుతాయని.. రెండేళ్ల డాటా తమకు అవసరమని.. భద్రతా సంస్థలు తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

12 నెలలు కోరితే.. 18 నెలలు ఉంచారు:

గతంలో ప్రభుత్వ కాల్ రికార్డులను 12 నెలల వరకు ఉంచాలని కోరితే.. మేం 18 నెలల వరకు ఉంచామని.. ఇప్పుడు ఆ నియమాలను మార్చారని.. చట్టబద్దమైన సంస్థలు కోరితే డేటాను మరింత కాలం ఉంచుతామని.. మిగిలినవన్నింటినీ కేవలం 45 రోజుల్లో తొలగిస్తామని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలిపారు. కాల్ డేటాను టెక్స్ రూపంలో టెలికాం సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎవరికి కాల్ చేశారు. ఏంఏం మాట్లాడరనేది ఇందులో టెక్స్ రూపంలో భద్రపరుస్తామని తెలిపారు. అయితే దీని వల్ల వినియోగదారుడికి నష్టం ఉండదని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.

నేటి నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి.. అగ్గిపెట్టె ధరలతో సహా మరికొన్ని..

నేటి నుంచి ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన నిబంధనలు మారే అవకాశం ఉంది. అవేంటంటే.. పదవీ విరమణ పొందిన వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ కేంద్రాలలో సమర్పించాలి. ఈ సమర్పణకు చివరి తేదీ నవంబర్ 30, 2021. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. లేదంటే.. మీ పెన్షన్ రద్దు చేయబడుతుంది.

ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లకు వడ్డీ రేటును తగ్గించింది. ఖాతాలో రూ.10 లక్షల కంటే తక్కువ డిపాజిట్ ఉన్నవాళ్లకు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లకు 5 బేసిస్ పాయింట్లకు తగ్గించింది.

ఈ నిబంధన నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకు షాకింగ్ అనే చెప్పాలి. నేటి నుంచి మొదలయ్యే ఈఎంఐ లావాదేవీలపై ప్రెసెసింగ్ ఫీజులను వసూలు చేయనుంది. SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1, 2021లోపు ఏదైన ప్రొడక్ట్ పై ఈఎంఐ ఉంటే.. దానికి ఇది వర్తించదు.

ఇక అగ్గి పెట్టెల ధరలు ఈ రోజు నుంచి పెరగనున్నాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత అగ్గిపెట్టె ధరలు పెరగనున్నాయి. దీనిని రూ.1 నుంచి రూ.2 వరకు పెంచారు. అగ్గిపెట్టె ధరలు చివరిసారిగా 2007లో బాక్స్‌కు 50 పైసల నుండి రూ.1కి పెంచారు. ఇక ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చేవి. కానీ గత కొన్ని నెలల నుంచి మాత్రం 1 నుంచి 15 తేదీ మధ్యలో సవరిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి ఎల్పీజీ నిబంధనల్లో మార్పులు వస్తాయని తెలుపుతున్నారు.

వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు షాక్.. ఉద్యోగం ఉండాలంటే ఆ పనికి ఒప్పుకోవాలి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి ఇది బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీనిలో భాగంగానే ఓ కంపెనీ తమ ఉద్యోగుకలు షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల ఇళ్ళల్లో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఒక వేళ కెమెరాలు పెట్టేందుకు అంగీకరించకుంటే ఉద్యోగం నుంచి కూడా తీసేయడానికి వెనకాడటం లేదు. దీంతో ఈ కంపెనీ తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. టెలీ పర్ఫార్మెన్స్ అనే ఓ ప్రముఖ కాల్ సెంటర్ కంపెనీ ఉద్యోగుల ఇళ్లలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి, రికార్డ్ చేయడానికి ఏఐ-ఆధారిత కెమెరాలను ఇన్‌ స్టాల్ చేస్తామని ప్రకటించింది.

కొలంబియాలో వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కెమెరాల ఏర్పాటుపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబసభ్యుల సమ్మతికి సంబంధించి సంతకం కూడా తీసుకుంటారట. 3.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ బీపీఓ కంపెనీ.. భారత్ లో 70 వేల మంది ఉన్నారు. కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారంతో ఆందోళన చెందుతున్నారు. తాము బెడ్ రూంలో పని చేస్తాం.. అయితే బెడ్ రూంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా.. అంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి తమ కంపెనీ సిస్టంలో లాగిన్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి.. భద్రతా కారణాల వల్లనే తాము ఈ పని చేస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ప్రైవసీకి తమ సంస్థ కట్టుబడి ఉందని.. ఇతర సమాచారం సేకరించాల్సిన అవసరం తమకు లేదని ఈ సంస్థ వెల్లడించింది.

రేషన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే నష్టపోయే ఛాన్స్..?

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెల నుంచి రేషన్ పొందాలంటే మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను రేషన్ డీలర్ కు తెలియజేయాలి. ఓటీపీ అథంటికేషన్ ద్వారా మాత్రమే ఫిబ్రవరి నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుంది. సాధారణ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు ఉన్నవాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.

కరోనా విజృంభణ వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేసింది. అయితే బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపడుతోంది. నివేదికల ప్రకారం రేపటి నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధన గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాలు ఆధార్ కార్డు నంబర్ కు మొబైల్ ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని వారు సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. అవగాహన ఉన్నవాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. వన్ టైమ్ పాస్ వర్డ్ చెప్పలేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

మనలో చాలామంది పోస్టాఫీస్ లో అకౌంట్ ను కలిగి ఉంటారు. బ్యాంకులతో సమానంగా పోస్టాఫీస్ లు కొత్తకొత్త స్కీమ్ ల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ లలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మినిమమ్ బ్యాలన్స్ కు సంబంధించిన నిబంధనలు మారడంతో పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న కస్టమర్లపై నిబంధనల ప్రభావం పడనుంది.

ఇకపై పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్న కస్టమర్లు ఖచ్చితంగా మినిమం బ్యాలన్స్ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మినిమం బ్యాలన్స్ లేకపోతే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్నవాళ్లు మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటివరకు మినిమం బ్యాలన్స్ పోస్టాఫీస్ అకౌంట్లలో ఉంచని వాళ్లు డిసెంబర్ 11 నుంచి కనీసం 500 రూపాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎవరైతే కనీసం 500 రూపాయలు మినిమం బ్యాలన్స్ ఉంచరో వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మినిమం బ్యాలన్స్ లేకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మినిమం బ్యాలెన్స్ ఉండకపోతే జరిమానా రూపంలో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జీల నగదు కూడా ఖాతాలో లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవాళ్లకు ఏటీఎం, చెక్ బుక్, మొబైల్ బ్యాంకింగ్ తో పాటు ఇతర సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ లు సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు 4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తేనే వడ్డీని పొందవచ్చు. కనీసం ఒక లావాదేవీనైనా గడిచిన మూడు సంవత్సరాల్లో చేసి ఉంటే పోస్టాఫీస్ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉంటుంది.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు..?

మనలో చాలామంది ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి బస్సు, కారు, ఇతర వాహనాలతో పోలిస్తే రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఐఆర్సీటీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. రైలు ప్రయాణికులు ఇకపై రైలు బయలుదేరే కొన్ని నిమిషాల ముందు కూడా టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.

తాజాగా రైల్వే శాఖ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. రైల్వే శాఖ ప్రీకోవిడ్ సిస్టమ్ ను మళ్లీ అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటివరకు రైలు బయలుదేరే రెండు గంటల ముందు చార్ట్ ను ప్రిపేర్ చేయగా ప్రస్తుతం రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు కూడా చార్ట్ ప్రిపేర్ అవుతుంది. దేశంలో గతంలో పోలిస్తే నమోదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వే శాఖ మళ్లీ సెకండ్ రిజర్వేషన్ చార్ట్ ను అమలులోకి తెచ్చింది.

జోనల్ రైల్వేస్ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్న తరుణంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. మరోవైపు రైలు సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం పండగల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. క్రమంగా రైళ్ల సర్వీసులను పెంచే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి రైళ్ల సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగులకు, వ్యాపారులకు అలర్ట్.. ఐటీ రిటర్న్స్ లో కొత్త నిబంధనలు..

ఆదాయపు పన్ను శాఖ 2020 – 2021 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. నూతన నిబంధనల్లో 50 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించి ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సాధారణ రిటర్న్ ఫామ్ ను ప్రధానంగా స్థిరాస్తుల నుంచి ఆదాయం, వడ్డీ పొందే వాళ్ల కోసం, జీతం మరియు పెన్షన్ తీసుకునే వాళ్ల కోసం రూపొందించింది.

అసెసీ ఆదాయంలో భార్య, మైనర్లు సంపాదించే ఆదాయాన్ని పొందుపరచాలని పేర్కొంది. విదేశాల్లో సైనింగ్ అథారిటీ ఉన్నా, ఇతర కంపెనీల నుంచి వడ్డీని పొందుతున్నా, అన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్లు గతేడాదిలో ఉన్నా సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. గుర్రపు పందేలు, లాటరీలు, వ్యవసాయం నుంచి 5 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందేవారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు.

హౌజ్ ప్రాపర్టీ నుంచి నష్టాలు, ఇతర ప్రాపర్టీల నుంచి నష్టాలు పొందుతున్న వారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. ఎవరైనా కోటి రూపాయల మొత్తాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటినా, ఫారిన్ టూర్ బిల్లు రెండు లక్షల రూపాయలు దాటినా ఫామ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

ఈక్విటీ షేర్ల అమ్మకంతో వచ్చిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను వేరుగా చూపించడంతో పాటు ఏ1, బీ1 క్యాపిటల్ గెయిన్స్ ను కలిపి చూపకుండా విడిగా చూపాల్సి ఉంటుంది. మరోవైపు 2018 – 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్, జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ కు గడువును ఆదాయపు పన్ను శాఖ రెండు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.