Tag Archives: photos

Nayanatara-Mehreen: లేడి సూపర్ స్టార్ తో మెహ్రీన్..బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో వైరల్..!

Nayanatara-Mehreen: కొద్దిగా విరామం దొరికితే చాలు నయనతార.. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో టూర్ కు చెక్కెస్తోంది. గతంలో కూడా వీరిద్దరు సమయం దొరికినప్పుడల్లా విదేశాల్లో విహరిస్తున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల ఓనం పండగ  ఏకంగా ప్రైవేట్ జెట్ లో కేరళ వెళ్లిన ఈ  జంట అక్కడే పండగనను సెటబ్రేట్ చేసుకుంది.

Nayanatara-Mehreen: లేడి సూపర్ స్టార్ తో మెహ్రీన్..బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో వైరల్..!

తాజాగా న్యూ ఇయర్ వేడుకల కోసం వీరిద్దరు దుబాయ్ కి వెళ్లారు. అక్కడ బుర్జ్ ఖలీఫా ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆఫిక్స్ కూడా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని ఇటు నయనతార కానీ.. అటు విఘ్నేష్ శివన్ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. వీరి పెళ్లి పై మాత్రమ ఎప్పటికప్పుడు రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Nayanatara-Mehreen: లేడి సూపర్ స్టార్ తో మెహ్రీన్..బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో వైరల్..!

తాజాగా ‘ఎఫ్ 3’ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా.. నయనతారతో దిగిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల దుబాయ్ వెళ్లిన మెహ్రీన్.. ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన సమయంలో నయనతార తారసపడింది. దీంతో ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.


లేడీ సూపర్‌స్టార్ నయనతారను కలవడం బాగుందంటూ..

ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. ‘‘ చివరికి లేడీ సూపర్‌స్టార్ నయనతారను కలవడం చాలా బాగుంది” అంటూ రాసుకొచ్చింది. దుబాయ్ లో నయనతార, విఘ్నేష్ శివన్, మెహ్రిన్ కలిసి టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మెహ్రీన్ షేర్ చేసిన ఈ పిక్ లో నయన్ ఎరుపు రంగు పోల్కా చుక్కల స్కర్ట్ తో మెస్మరైజింగా ఉండగా… మెహ్రీన్ హుడీ, డెనిమ్ స్కర్ట్ లో వావ్ అనిపించేలా ఉంది.  ఇదిలా ఉంటే నయన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రానున్న ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ మళయాళ, రెండు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.

Anchor Anasuya: మేకప్ లేకుండా నిజస్వరూపం చూపించిన అనసూయ.. పెద్ద స్కామ్ అంటూ నెటిజెన్స్ కామెంట్!

Anchor Anasuya: అనసూయ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఇటు బుల్లి తెరపై అటు వెండితెరపై వెలిగిపోతుంది ఈ భామ. జబర్థస్త్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా టీవీలో షోలతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ… ప్రస్తుతం వెండితెరపై కూడా మెరుస్తోంది. 

టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా రాణిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో నటించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా మెరుస్తోంది. ఇప్పటికే తన అందచందాలతో, ఐటెం సాంగ్స్ లతో ఫ్యాన్స్ ను అలరించింది.

తాజాగా ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించింది. ద్రాక్షాయణి క్యారెక్టర్ లో సునీల్ కు భార్యగా నటించింది. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ తో అలరించింది. ఇదే కాకుండా రానున్న రోజుల్లో పలు క్రేజీ కాంబినేషన్లలో సినిమాల్లో నటిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్..

ఇదిలా ఉంటే తాజాగా మేకప్ లేకుండా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్లు బాగానే స్పందిస్తున్నారు. మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. అనసూయ పెద్ద స్కామ్ చేసిందని… ఇన్నాళ్లు మేకప్ లో తన అందాన్ని దాచేసిందని కామెంట్లు పెడుతున్నారు. 38 సంవత్సరాల్లో కూడా అనసూయ అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్లపై అనసూయ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Sukumar-Balakrishna: సుకుమార్ ఇంట్లో బాలయ్య ఫొటో..ఎందుకో తెలుసా.. !

Sukumar-Balakrishna: పుష్ప సినిమా ఇచ్చిన కిక్ తో డైరెక్టర్ సుకుమార్ సంతోషంగా ఉన్నారు. పుష్ప సినిమాకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సీఫీస్ వద్ద కలెక్షన్లతో దమ్ము రేపుతోంది పుష్ప మూవీ. దీంతో సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల బాలకృష్ణ టాక్ షో ’ అన్ స్టాపబుల్‘ కు గెస్ట్ గా వచ్చారు.

Sukumar-Balakrishna: సుకుమార్ ఇంట్లో బాలయ్య ఫొటో..ఎందుకో తెలుసా.. !

సుకుమార్ తో పాటు.. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్న కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ లుగా వచ్చారు.  ఇప్పటికే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘ షో ఆహాలో విజయవంతంగా స్ట్రీమ్ అవుతోంది.

Sukumar-Balakrishna: సుకుమార్ ఇంట్లో బాలయ్య ఫొటో..ఎందుకో తెలుసా.. !

ఇప్పటికే మోహన్ బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, రాజమౌళి లతో షో నిర్వహించిన బాలయ్య.. తాజాగా పుష్ప సినిమా టీంతో టాక్ షో చేశారు. దీంట్లో బాలకృష్ణ, సుకుమాణ మధ్య ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ షోలో తాను బాలకృష్ణ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చానని సంచలన కామెంట్లు చేశారు.

ఓ వైపు బాలకృష్ణ ఫోటో.. మరో వైపు చిరంజీవి ఫొటో…

మా ఊర్లో అప్పట్లో రెండే వర్గాలు ఉండేవని ఒకటి బాలకృష్ణ వర్గం కాగా.. మరొకటి చిరంజీవి వర్గం అని అన్నారు. మా ఇంట్లో కూడా ఇలానే ఉండేదని అని చెప్పారు. మా ఇంట్లో  మొత్తం నలుగురు అన్నదమ్ములం అని.. అందరి కన్నా చిన్నవాడిని నేనని చెప్పారు. పెద్దన్నయ్య బాలకృష్ణ అభిమాని కాగా.. ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి అభిమానులు అని చెప్పారు. ఇంట్లో ఓ వైపు బాలకృష్ణ ఫోటో ఉంటే మరోవైపు చిరంజీవి ఫోటో ఉండేదని.. ఎవరి సినిమా విడుదలైనా.. ఇంట్లో గొడవలు తప్పకపోయేవని చెప్పుకొచ్చారు సుకుమార్. మా పెద్దన్నయ్య మిమల్ని కలిశానంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారని.. ఒక్కసారి నా తరపున పెద్దన్నయ్యకు ఐలవ్యూ చెప్పాలని సుకుమార్ బాలయ్యను కోరారు. తాను చూసిన బాలయ్యబాబు సినిమాలు హిట్ అయ్యాయని అన్నారు. దీంతో బాలకృష్ణ… నాతో సినిమాలు తీయకుండానే హిట్ కొట్టావని చమత్కరించారు.

వైన్ గ్లాస్ తో సురేఖవాణి.. పెళ్లి చేసుకుంటానన్న నెటిజన్..!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించిన సురేఖా వాణి ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈమెకు దాదాపు 40 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. అయినా ఈ తరం వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. కుర్ర హీరోయిన్స్‌తో పోటీ ప‌డే లుక్స్ ఆమె సొంతం అంటూ..సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చేసిన నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఆమె కుమార్తె కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ఆమె కంటే కూడా.. సురేఖా వాణి అందంగా క‌న‌ప‌డుతున్నార‌ని కొంద‌రు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో .. వీళ్లిద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసిన హంగామా ఈమెకు మ‌రింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.
గోవాలో జ‌రుపుకునే పార్టీల‌కు సురేఖా వాణి వెళ్లినా, బాత్ ట‌బ్‌లో నుంచి ఆమె షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఫొటోల‌ను నెట్టింట షేర్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ తీరును బట్టే సురేఖా వాణికి ఉన్న క్రేజ్ తెలిసిపోతుంది. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫొటో వైరల్ గా మారింది. ఇంత‌కీ ఆమె షేర్ చేసిన ఫొటో ఏంటంటే.. చేతిలో వైన్ గ్లాస్‌తో ఉన్న ఫొటో. ఆ గ్లాస్ లో రెడ్ వైన్ ఉంది.. దానిని చేతితో పట్టుకొని ఉన్న ఫొటోను చూసిన నెటిజ‌న్స్ ఇక కామెంట్స్ రూపంలో తమదైన శైలిలో స్పందిస్తూ రెచ్చిపోయారు.

ఈ కామెంట్లలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అయింది. సురేఖ వాణిని తాను పెళ్లి చేసుకుంటా అని కామెంట్ పెట్టాడు. అయితే మరో నెటిజన్ దీనిపై మీరు అందంగా ఉన్నారంటూ చెప్పాడు. బీర్ తాగితే పొట్ట పెరుగుతుంది.. తాగొద్దు మేడం అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఈ కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

మంచు లక్ష్మీకి యాక్సిటెంట్..రక్తం కారుతున్న ఫొటోలు వైరల్..ఏమైందంటే..?

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ వాబు.. నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి.

ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్‌ చేస్తూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో చేస్తున్నట్లు.. అవి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాటయట. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్టు చేశారు. అందులో ఆమె గాయపడ్డట్లు కనిపించింది. ఆమె చేతి వేళ్ల నుంచి రక్తం కారుతోంది. చేతి వేళ్లకు బలంగా దెబ్బతగిలిట్లు కనిపిస్తోంది. ఇక ఆమె జీన్స్ మొత్తం చినిగిపోయింది. గాయం కారణంగా ఆమె జీన్స్ చినిగిపోయి కనిపించింది.

మోకాలి వద్ద ఆమెకు తీవ్రగాయం అయింది. వీటికి సంబంధించి ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టు చేశారు. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఏమైంది అంటూ.. కామెట్ల రూపంలో ఆమెను అడిగారు. అయితే ఆమెకు నిజంగా గాయాలు కాలేదట.. రియల్ యాక్సిడెంట్ కాదట. రీల్ యాక్సిటెంట్ మాత్రమే. ఆమె తన షూటింగ్ లో భాగంగా ఆమె మేకప్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మళయాలంలో మోహన్ లాల్ సినిమాలో నటిస్తున్నారు.

ఆమె ఫైట్ సీన్ లో ఇలా మేకప్ వేసుకోవాల్సి వచ్చిందనే ఆమె వివరణ ఇచ్చారు. మొదట ఆ ఫొటోలు పోస్టు చేసి.. తర్వాత ఆందోళన చెందుతున్నారని.. మళ్లీ మరో పోస్టు షేర్ చేశారు. ఓకే… ఓకే… నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోనివి. రియల్ యాక్సిడెంట్ కాదు. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారని తెలిసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. లవ్ యు ఆల్ అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.

విరుష్క దంపతుల వేడుకోలు.. వద్దన్న పని చేసిన మీడియా ప్రతినిధులు..

అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ ఈ సంవత్సరంలో ఒక పాపకు జన్మనిచ్చి.. తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వామిక జనవరి 2021లో ముంబైలో జన్మించింది. ఈ జంట ఇటీవలే తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా వాళ్లు తమ కూతురు వామికతో మీడియా కంట పడ్డారు.

మొదటి సారి విరాట్ కోహ్లీ తన కూతురును ప్రత్యక్షంగా బయట ప్రపంచానికి చూపించారు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో వామిక ఫొటోలను షేర్ చేస్తున్నా.. ఇలా మాత్రం బయటకు తీసుకురాలేదు. ఇలా వారిద్దరితో కలిసి.. వామిక ఉండే ఫొటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

రాబోయే భారత క్రికెట్ సిరీస్ కోసం అనుష్క, విరాట్ , వామిక దక్షిణాఫ్రికాకు బయలుదేరినప్పుడు.. వాళ్ల కుటుంబం విమానాశ్రయంలో ఉండగా.. మీడియా ఎయిర్‌పోర్ట్‌‌లో క్రికెటర్ల ఫొటోలను క్లిక్ చేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలో విరాట్ తన కూతురును ఎత్తుకొని వెళ్తుండగా.. దయచేసి బేబీని క్లిక్ చేయవద్దు.. ఫొటోలు తీయకండి.. అని విరాట్ వేడుకున్నాడు.

కానీ అప్పటికే చాలామంది విరాట్ కూతురు ఫొటోలను తీశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు విరాట్ దంపతులు తమ కూతురు ఫొటోను షేర్ చేసేవాళ్లు.. కానీ ఇలా మీడియా ద్వారా వామికా ఫొటోలు వైరల్ కావడం మొదటి సారి. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. తన క్లీన్ స్లేట్ ఫిలింజ్ బ్యానర్‌పై బాబిల్ ఖాన్ నటించిన ఖలా, సాక్షి తన్వర్ నటించిన మై చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. దీని తర్వాత సినిమా కోసం ఎలాంటి సంతకాలు చేయలేదు అనుష్క శర్మ.

ప్రెస్ మీట్ లో ఇబ్బందిగా రష్మిక.. జర్కిన్ తో అలా కవర్ చేసింది.. వేసుకోవడం ఎందుకు ఇబ్బంది పడటం ఎందుకు అంటున్న నెటిజన్స్

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప: ది రైజ్ – పార్ట్ 1 . ఈ చిత్రం నేడు ఉదయమే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు పుష్ప నిర్మాతలు చేయగలిగినదంతా చేశారు.

తెలంగాణ , తమిళనాడు పర్యటనల అనంతరం సిబ్బంది నిన్న సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు . అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు. అల్లు అర్జున్ , అతని సహచరులు ఊహించిన దాని కంటే కొంచెం ఆలస్యంగా లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ వార్తలపై బెంగళూరు జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు.

దీనికి అల్లు అర్జున్ క్షమాపణ కూడా చెప్పిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ విమానం టేకాఫ్ కాలేకపోయిందని వివరిస్తూ.. క్షమించండి అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. అక్కడ ఆమె తన పొట్టి డ్రెస్ ల వల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపించింది.

ఆ వేదిక పై ఉన్నంత సేపు ఈ అమ్మడు బ్లేజ‌ర్‌ని కాళ్ల‌పై వేసుకొని క‌వ‌ర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి నెటిజన్ల నుంచి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మందన్నా కావాలని బి-గ్రేడ్ నటిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంత షో చేయాల్సిన అవసరం లేదని మరికొంతమంది ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలతో పాటు నెటిజన్ల కామెంట్ కూడా వైరల్ అవుతోంది .

లంగా ఓనీలో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫోటో వైరల్!

యాంకర్ శ్రీముఖి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై యాంకర్ గా దూసుకుపోతోంది.యాంకర్ తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ఈమె అభిమానులు ఈమెను ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా విభిన్నమైన డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవలే శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో కూడా శ్రీ ముఖి నటించింది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్ లో కళ్ళు చెదిరేలా లంగా వోనీలో కనిపించి కనువిందు చేసింది. లంగా వోని ధరించి అందుకు తగ్గట్టుగా ఆభరణాలు ధరించడంతో శ్రీముఖి అందం మరింత రెట్టింపు అయినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో రాములమ్మ చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

దృశ్యం 2 పాప బయట ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.. ఫోటోలు వైరల్!

వెంకటేష్ మీనా ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దృశ్యం. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా దృశ్యం 2 సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ మీనా పెద్ద కూతురు అంజు పాత్రలో నటి కృతిక జయకుమార్ నటించారు.

ఈ సినిమాలో కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా అంజు పాత్రలో ఎంతో అద్భుతంగా, అమాయకంగా నటించిన కృతిక జయకుమార్ బయట ఎలా ఉంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే. గ్లామరస్ డ్రెస్సులో ఎంతో అందంగా ఉన్నటువంటి ఈమె ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈమె ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే ఈమె ఇలా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.

మలయాళ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయి మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే కృతిక జయరాం తన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. బామ్మగా అలరించిన ఈమె ఎంత బాగుందో చూడండి..!

మనకు దాదాపు బామ్మ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నటి నిర్మలమ్మ. ఆమె అసలు పేరు రాజమణి. ఆమె మొదట 1943లో పదహారేళ్ల వయస్సులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.

ఆమె అలనాటి స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, యస్వీ రంగారావుల దగ్గర నుంచి నేటి స్టార్లు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. ఆమె మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు. వయస్సు మీద పడిన తర్వాత కూడా ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు.

చివరగా స్నేహం కోసం సినిమా తర్వాత నటించడం మానేశారు. తర్వాత ఆమె 2009లో స్వర్గీయులు అయ్యారు. ఇదంతా ఇలా ఉండగా.. ఆమె యుక్త వయస్సులో ఎలా ఉండేదో తెలుసా.. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 10 వరకు చదుకున్న ఈ నిర్మలమ్మ నాటకాల్లో మంచి పాత్రలు పోషించేవారట.

ఇంట్లో వాళ్లు నాటకాలు వేయడానికి సపోర్టు చేసేవారు కాదట.. కానీ పెద్దనాన్న మాత్రం సపోర్టు ఇచ్చేవారట. అలా ఆమె ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. ఆ యుక్త వయస్సులో ఉన్నప్పుడు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిర్మ‌ల‌మ్మ‌ చాలా అందంగా కనిపించారు. మరెందుకాలస్యం ఆ ఫొటోలను మీరూ చూసేయండి.