Tag Archives: post viral

Jagapathi Babu: హీరో కాకపోయి ఉంటే కచ్చితంగా ఆ జాబు కొట్టేవాడిని.. జగపతిబాబు పోస్ట్ వైరల్!

Jagapathi Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు ఒకరు. ఈయన హీరోగా ఒకానొక సమయంలో ఎన్నో కుటుంబ ప్రేమ కథ చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలలో నటించడంతో జగపతిబాబుకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా మారిపోయారు.

ఈ విధంగా జగపతిబాబు ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు. అయితే క్రమక్రమంగా ఈయనకు అవకాశాలు తగ్గిపోవడంతో జగపతిబాబు కూడా సినిమా ఇండస్ట్రీకి కొంత కాలం పాటు దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈయనకు హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించే అవకాశం వచ్చింది.

ఇలా బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా అయ్యారు ఈయన హీరోగా కంటే ప్రస్తుతం విలన్ గాని ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పాలి.

సూపర్ పోలీస్ అయేవాడిని..
ప్రస్తుతం జగపతిబాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మరొక పోస్ట్ కూడా చేశారు. తాను కనుక సినిమాలలోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యే వాడిననీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోలీసులు ఎలా అయితే లా అండ్ ఆర్డర్ ను గడగడ లాడిస్తున్నారో నేను కూడా అలాంటి పోలీస్ అయ్యే వాడిని మీరేమంటారు అంటూ పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Kalyan Dev: నీరాకతో ఎంతో ప్రత్యేకం.. కూతురు పట్ల ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్!

Kalyan Dev: మెగా డాటర్ శ్రీజను రెండో వివాహం చేసుకొని మెగా అల్లుడికి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు కళ్యాణ్ దేవ్. శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ తో తనకు ఎంతో ఘనంగా వివాహం చేశారు. ఇలా వీరిద్దరూ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వెళ్లిపోయారు.

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇద్దరు కూడా గద రెండు సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నారు. ఇక వీరి కుమార్తె నవిష్క మాత్రం అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వస్తుంటారు. ఇలా తన కూతురితో గడిపిన క్షణాలన్నింటిని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తుంటారు.

భార్యకు దూరమైన తన కూతురి కోసం కళ్యాణ్ ఎంతో పరితపిస్తున్నారని చెప్పాలి. ఇక శ్రీజకు దూరంగా ఉంటున్నటువంటి ఈయన కెరియర్ పై కూడా భారీగానే దెబ్బ పడింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో ఈయన కూడా పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు దీంతో ఇండస్ట్రీకి కూడా కళ్యాణ్ దూరమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె తన వద్దకు వచ్చారు.

పుట్టినరోజు ప్రత్యేకం…

తన కూతురు సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నటువంటి ఈయన అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…ఇలా నువ్వు రావడంతో నా బర్త్ డే ప్రత్యేకంగా మారింది.. నీతో ఇలా మెమోరీస్‌ను క్రియేట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంటుందంటూ కూతురిపై పోస్ట్ వేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

https://www.instagram.com/reel/C3NVRzDPhZV/?utm_source=ig_embed&ig_rid=34310aad-8b44-4275-9f11-e683d48d55dd

RGV: శ్రీదేవి ఫోటోను చూసి ఏడ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ ట్వీట్ వైరల్?

RGV: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.

ఒకరకంగా చెప్పాలి అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడుగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇదంతా మొన్నటి వరకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. అసలేం జరిగింది రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో ఏం రాసుకోవచ్చారు అన్న విషయానికి వస్తే… దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే.

శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది..

ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని కూడా తెలిపారు ఆర్జీవి. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఒక శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నీకు కూడా ఏడుపు వస్తుందా!ఏం తాగి పోస్ట్ చేశావా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2cmRZ_pDqb/?utm_source=ig_embed&ig_rid=51e4d1ee-b28d-4e64-9ea0-04154e2752f2

Samantha: వీటి వల్లే ఆస్పత్రి పాలయ్యాను.. సమంతకు పువ్వులంటే అంత భయమా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు ఇండస్ట్రీలో దాదాపు పుష్కర కాలం పాటు అగ్ర తారగా ఓ వెలుగు వెలిగినటువంటి సమంత అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవలే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. త్వరలోనే తన నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈమె త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఒక ఫ్లవర్ బొకేతో పాటు ఉన్నట్టు వంటి ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి సమంత ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది.

ఎమర్జెన్సీ రూమ్..


సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో సమంతకి పూలంటే ఎలర్జీ అని, గతంలో పూల వల్లే సామ్ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈమెకు పువ్వులు అంటే అలర్జీ అంటూ ఇదివరకు ఓ సందర్భంలో కూడా ఈమె వెల్లడించారు.

https://www.instagram.com/p/C2ExkZnpfYi/?utm_source=ig_web_copy_link

Samantha: సమంత మళ్ళీ ప్రేమలో పడిందా… ఆ పోస్టుకు అర్థం అదేనా…పోస్ట్ వైరల్!

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ అంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఎంతో బిజీ హీరోయిన్గా గడిపినటువంటి సమంత ఏడాది పాటు ఎలాంటి ఒత్తిడి ఆందోళన లేకుండా గడపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో తన స్నేహితులతో కలిసి పలు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా తరచూ ఫోటోలను షేర్ చేయడం డాన్స్ వీడియోలను షేర్ చేయడం చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే సమంత ఇప్పటికే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక సమంత రెండో పెళ్లి గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక సమంత నేడు కాకపోయినా రేపైనా ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా సమంత ప్రేమలో పడింది అంటూ ఓ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha: ఊహించని ప్రేమ కూడా ఉంటుంది…


సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే ఈమె నిజంగానే ప్రేమలో ఉందా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అన్న సందేహం కలగక మానదు. మరి ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేశారు అనే విషయానికి వస్తే… ఎక్కువగా ద్వేశించే మనుషులు, మాటలు చూసి ఉంటావేమో గానీ.. మనం ఊహించని దాని కంటే  ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది అంటూ ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. దీంతో సామ్ మళ్లీ ప్రేమలో పడిందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Samantha: మరోసారి ప్రేమలో పడిన సమంత… ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవాలన్నా నటి… పోస్ట్ వైరల్!

Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నటి సమంత. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లతోపాటు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

నాగచైతన్యతో ప్రేమలో ఉన్నటువంటి ఈమె పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లయిన కొంతకాలానికి తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత ఆ బాధ నుంచి బయటపడి తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ఆ తర్వాత ఈమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి కారణంగా దాదాపు నాలుగైదు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ కనుక చూస్తే ఈమె తిరిగి మరి ప్రేమలో పడ్డారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే గత కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి ఈమె దిగిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Samantha: చావు నుంచి మనల్ని ఏది కాపాడలేదు…

చిలి దేశానికి చెందిన ప్రముఖ రచయిత రాసినటువంటి ఒక కొటేషన్ ను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు… ఇందులో భాగంగా ఈమె చావు నుండి మనల్ని ఏది కాపాడలేనప్పుడు ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవడమే అంటూ ఓ కొటేషన్ షేర్ చేశారు. దీంతో సమంత తిరిగి ప్రేమలో పడిందా అందుకే ఇలాంటి కొటేషన్స్ షేర్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anupama Parameswaran: ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ అందరికీ షాక్ ఇచ్చిన అనుపమ… వైరల్ అవుతున్న పోస్ట్!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ తాజాగా కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. గతంలో క్రికెటర్ భూమ్రాతో కలిసి ఈమె ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.

భూమ్రా తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో వీరి గురించే వచ్చే వార్తలకు పులి స్టాప్ పడింది. ఇలా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ వేలికి ఉంగరం ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Anupama Parameswaran: పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపుతున్నారా…


అనుపమ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ప్లాస్టిక్ కవర్ ను తన వేలికి ఉంగరం లా చుట్టుకుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇది చూసిన వారందరూ ఈమె నిశ్చితార్థం చేసుకోబోతున్నారా అందుకే ఇలా హిట్ ఇచ్చారా అంటూ కామెంట్ చేయడం మరికొందరు మాత్రం అమ్మడికి పెళ్లి పై గాలి మళ్ళి అంటూ ఈ ఫోటో పై కామెంట్ చేస్తున్నారు అయితే ఈ ఫోటో మాత్రం ఈమె సరదాగా పోస్ట్ చేశారని అర్థమవుతుంది.

Nagababu: చేతిలో కత్తి పట్టి శాంతి అహింస అంటూ సంచలన పోస్ట్ చేసిన నాగబాబు… పోస్ట్ వైరల్!

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా గుర్తింపు పొందిన నాగబాబు కొంతకాలం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఎలక్షన్ల సమయం సమీపించటంతో పార్టీని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టి దగ్గరుండి తానే అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదాలకు దారితీస్తోంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న నాగబాబు మరొసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

ఇక తాజాగా వేట కొడవలి చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం” అంటూ రెచ్చగొట్టేలా పోస్ట్ షేర్ చేశాడు. అయితే నాగబాబు ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పోస్టర్ షేర్ చేశాడా? లేక కావాలనే వైసిపి పార్టీ నాయకులను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అన్నది తెలియాల్సి ఉంది.

Nagababu: నాగబాబు పోస్టుతో రెచ్చిపోతున్న జనసైనికులు…

ఇదిలా ఉండగా నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన జనసైనికులు కూడా మీ వెనక మేమున్నాం అంటూ తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నాగబాబు చేసిన పోస్ట్ రెచ్చగొట్టేలా ఉంటాయి. అయితే ఇలా పబ్లిక్ లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటంతో కొందరు నాగబాబు పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక కీలకమైన పదవిలో అంటూ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడం సరైన పద్దతి కాదు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Samantha: అవే మనల్ని దూరం చేస్తాయి… చైతన్య వ్యాఖ్యలపై స్పందించిన సమంత… పోస్ట్ వైరల్!

Samantha: టాలీవుడ్ క్రేజీ కపుల్స్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కూడా వీరి గురించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య తన విడాకులకు గల కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మా ఇద్దరి మధ్య గొడవలు పెద్దవయ్యా అని అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. నిజానికి సమంత చాలా మంచి అమ్మాయి ఇప్పటికీ తన జ్ఞాపకాలను నేను గౌరవిస్తానని, అన్ని ఆనందాలకు సమంత అర్హురాలు అంటు నాగ చైతన్య తన గురించి గొప్పగా చెప్పారు.

ఇలా నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి అయితే తాజాగా సమంత సైతం సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ కొటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పోస్ట్ షేర్ చేస్తూ… మనమంతా ఒక్కటే కేవలం అహంకారం భయాలు అవే మనల్ని దూరం చేస్తాయి అంటూ పోస్ట్ చేశారు.

Samantha: ఈగో వీరిద్దరిని దూరం చేసిందా…

ఇలా సమంత నాగచైతన్య చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలాంటి కొటేషన్స్ షేర్ చేయడంతో నాగచైతన్య వ్యాఖ్యలకు స్పందిస్తూ సమంత ఈ కొటేషన్ షేర్ చేశారని అర్థమవుతుంది.అయితే వీరిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని కానీ ఈగో కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనీ వీరి పోస్టులు చూస్తేనే అర్థమవుతుంది.

Anchor Rashmi: బర్త్ డే పార్టీలో యాంకర్ రష్మి రచ్చ… వైరల్ అవుతున్న పోస్ట్..?

Anchor Rashmi: అందాల యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తాజాగా రష్మి తన పుట్టిన రోజుని స్నేహితులతో కలిసి చాలా గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ ఏడాదికి రష్మి 26 పూర్తి చేసుకొని 27 వ వసంతంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బర్త్ డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తూ రష్మి గౌతమ్‌ రచ్చ చేసింది.

మెడలో గోల్డ్ కలర్‌ దండ ధరించి రెచ్చిపోయింది. పుట్టినరోజు నాడు రష్మి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా చిందులేస్తు, కొంటె పనులు, చిలిపి పనులు చేస్తూ సందడి చేసింది. ఫ్రెండ్స్ తో డాన్సులు, ముద్దులతో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేసిందీ. ప్రస్తుతం రష్మి బర్తడే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలలో రష్మి మోకాళ్ల పైకున్న బ్లూ కలర్ టాప్‌లో తన థైస్‌ అందాలను చూపించింది.దీంతో ఈ డ్రెస్ లో రష్మి చాలా హాట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రష్మి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ‘ ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్‌ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను.

Anchor Rashmi: వారే నా జీవితంలో ప్రధాన స్తంభాలు…

నా బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో ప్రధాన స్తంభాలు అని తనకు తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకుంది. ఇక రష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులతో పాటు నేటిజెన్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.