Allu Arjun: సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంతో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇకపోతే తాజాగా భారత ప్రభుత్వం 69వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ జాతీయ అవార్డుల జాబితాలో భాగంగా తెలుగు సినిమాలు సత్తా చాటుకున్నాయి. పుష్ప సినిమా ఏకంగా ఆరు విభాగాలలో జాతీయ అవార్డులను అందుకోవడం విశేషం అదేవిధంగా ఉత్తమ జాతీయ చిత్రంగా ఉప్పెన సినిమా అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ జాతీయ నటుడుగా అల్లు అర్జున్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.
ఈ విధంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకోవడంతో అల్లు కాంపౌండ్ లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఇంటికి పుష్ప కుటుంబ సభ్యులందరూ చేరుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యారు.
Allu Arjun: సంతోషంతో ఎమోషనల్ అయినా సుకుమార్…
అల్లు అర్జున్ ఇంటికి చిత్ర బృందం చేరుకోవడంతో పెద్ద ఎత్తున సంతోషం వెల్లు విరిసింది. ఈ క్రమంలోనే సుకుమార్ బన్నీని కౌగిలించుకొని సంతోషంలో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా చిత్ర బృందం మొత్తం అల్లు అర్జున్ ఇంట్లో చేసుకున్నటువంటి సంబరాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Rashmika: సాధారణంగా సినిమా సెలబ్రిటీల మీద అందరికీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వారు ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పొరపాటున మాట్లాడిన మాటల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది.
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. అలాగే తమిళ్ భాషలో హీరోయిన్ గా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో ఎనిమిది తమిళ సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫర్హానా సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తానే బాగా నటించేదానినని తెలిపినట్టు రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ తను మాట్లాడిన మాటలలో అటువంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.
Rashmika: వివరణ ఇవ్వాల్సిన పనిలేదు..
ఇక సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వివాదంపై రష్మిక కూడా స్పందించింది. ఈ క్రమంలో రష్మిక స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేసింది. ఈ నోట్ లో ” హాయ్ లవ్.. ఇప్పుడే జరిగినదంతా చూశాను. నీ మాటలు వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీపై నాకున్న ప్రేమ గౌరవం గురించి నీకు తెలుసు. ఫర్హనా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చావు. ఆల్ ది బెస్ట్… అంటూ లవ్ ఎమోజి సెండ్ చేసింది. దీంతో ఈ వివాదానికి చెక్ పడింది.
Aishwarya Rajesh: తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు పొందిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల రష్మీక గురించి ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. ఇటీవల మీడియా ముందుకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర రష్మిక బదులు తనకు బాగా సెట్ అయ్యేదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తనే బాగా నటించేదాన్ని అని ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలు చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్లపై ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇస్తూ.. ఓలేఖ విడుదల చేసింది హీరోయిన్ ఐశ్వర్య.
తాను మాట్లాడిన మాటలను తప్పుగా తీసుకొని రష్మిక ని కించపరిచినట్లు రూమర్లు క్రియేట్ చేస్తున్నారని ఈ నోట్ లో తెలిపింది. తాను రష్మికని కించపరిచినట్లు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనని తెలుగు సినిమాలలో ఎటువంటి పాత్రలలో నటించాలని ఉంది అని ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకు సమాధానంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో గౌరవం. తెలుగులో అవకాశాలు వస్తాయి తప్పకుండా చేస్తాను.
Aishwarya Rajesh: రూమర్లను ఆపి వేయండి…
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని.. ఆ పాత్ర నాకు సరిగ్గా సెట్ అవుతుందని చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని నేను రష్మికను కించపరుస్తూ మాట్లాడినట్లుగా రూమర్స్ క్రియేట్ చేశారు. అంతేకానీ రష్మిక నటన గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. రష్మిక నటన పై నాకు ఎంతో అభిమానం ఉంది. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకండి అంటూ విన్నవించుకుంది. దీంతో ఐశ్వర్య రాజేష్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది.
Pushpa Movie: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.
ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కు కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక పుష్ప సినిమా చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా సీనియర్ నటి విజయలక్ష్మి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయలక్ష్మి తన బాల్యం గురించి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తనని ఎప్పుడు కోడలా కోడలా అంటూ పిలిచేవారని ఈమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమా ఏది అని ప్రశ్నించారు.
Pushpa Movie:
ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ పుష్ప సినిమా చూశానని తెలిపారు. మరి అందులో నటించిన హీరో ఎవరు అని ప్రశ్నించగా సినిమా చూశాను కానీ అందులో ఉన్న హీరో ఎవరో నాకు తెలియదు అంటూ ఈమె వెల్లడించారు.అయితే ఇలా విజయలక్ష్మి సమాధానం చెప్పడంతో పుష్ప సినిమాలో నటించింది మరి ఎవరో కాదు మీ సినిమాలలో మీ సహనటుడిగా నటించిన అల్లు రామలింగయ్య గారి మనవడు అంటూ అని చెప్పుకొచ్చారు.ఈ మాటలు విన్న అనంతరం విజయలక్ష్మి ఈ మధ్యకాలంలో ఏ హీరోలు చూసిన రామానాయుడు మనవడు నాగేశ్వరరావు మనవడు ఎన్టీఆర్ మనవడు అంటూ చెబుతున్నారని విజయలక్ష్మి సమాధానం చెప్పారు.అయితే అల్లు అర్జున్ గురించి తన సినిమా గురించి విజయలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pushpa Movie: అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదల అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభం చేయాల్సిన ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన నటి గురించి అందరికీ సుపరిచితమే ఈమె పలు సీరియల్స్ లోనూ అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేశారు. ఇలా అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన ఈమె పేరు కల్పలత. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తనకు పుష్ప సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో తెలియజేశారు.
ఈ సందర్భంగా పుష్ప సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తాను కూడా ఆడిషన్స్ లో పాల్గొన్నానని తెలిపారు. ఈ సినిమాలో మొత్తం చిత్తూరు స్లాంగ్ మాట్లాడాలి.తనకు రాకపోయినా ఎంతో కష్టపడి చిత్తూరు యాసలో మాట్లాడానని కల్పలత తెలిపారు. ఇలా ఆడిషన్స్ అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు తనకు ఫోన్ కాల్ రాలేదని వెల్లడించారు.
Pushpa Movie: ఆ కోరిక కూడా తీరింది.
ఇలా ఫోన్ కాల్ రాకపోవడంతో తను కూడా సినిమాపై ఆశలు వదులుకున్నానని అయితే ఆడిషన్స్ జరిగిన ఆరు నెలలకు తనకు ఈ సినిమాలో సెలెక్ట్ అయినట్లు ఫోన్ కాల్ వచ్చిందని,అలా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని ఈమె తెలిపారు. ఇక కొడుకులు లేని తనకు అల్లు అర్జున్ కొడుకు పాత్రలో నటించడంతో ఆ కోరిక కూడా తీరిపోయిందని ఈ సందర్భంగా కల్పలత పుష్ప సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.
Allu Arjun: టాలివుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
మరోక వైపు ప్రేక్షకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన అవార్డు దక్కింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ రెండవసారి ఇలా బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది అంటూ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేశాడు.
ఈ విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన పట్ల నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణంరాజు వంటి గొప్ప నటుడు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అల్లు అర్జున్ మాత్రం ఆయన మృతి పట్ల సంతాపం తెలపకుండా అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ పోస్ట్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజు మృతి పట్ల అల్లు అర్జున్ సంతాపం తెలుపలేదు.
Allu Arjun:బుద్ధుందా అంటూ మండపడిన ఫ్యాన్స్.
రెబల్ స్టార్ అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది నెటిజన్స్ ఏకంగా అల్లు అర్జున్ కి కొంచమైనా బుద్ధి ఉందా? అంటూ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తన ప్రవర్తనతో అల్లు అర్జున్ తన అభిమానుల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే చివరికి ఈయన ట్వీట్ డిలీట్ చేయడమే కాకుండా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
Puspha Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయి బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది.
Puspha Movie: పుష్ప చూస్తున్నప్పుడు వణికిపోయాను…ఎంతగానో ఆకట్టుకుంది.. పుష్ప పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్!
ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమాపై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తండ్రిగా ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. బాహుబలి, త్రిబుల్ ఆర్, బజరంగీ భాయ్ వంటి అద్భుతమైన చిత్రాలకు కథను అందించిన రచయితగా విజయేంద్రప్రసాద్ మంచి గుర్తింపు పొందారు.
Puspha Movie: పుష్ప చూస్తున్నప్పుడు వణికిపోయాను…ఎంతగానో ఆకట్టుకుంది.. పుష్ప పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్!
సినిమా విజయవంతం కావాలంటే కథ కీలకమైనది. అలాంటి కథను అందించడంలో విజయేంద్రప్రసాద్ సహజ సిద్ధుడు. ఈ సందర్భంగా ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కథను అందించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుందని తెలిపారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు తనకు ఎంతగానో నచ్చుతాయని ఆయన వెల్లడించారు. కథను చెప్పడంలో సుకుమార్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక సినిమాకి మరొక సినిమాకి సుకుమార్ ఎంతో కొత్తదనం చూపిస్తారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా చూస్తూ నేను వణికిపోయాను. ఆ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుందంటూ విజయేంద్రప్రసాద్ పుష్ప సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఒక రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్రప్రసాద్ మరో సినిమా గురించి ఇలా మాట్లాడటంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పటికీ పుష్ప మానీయా కనబడుతుంది.
ఇక హిందీలో ఏమాత్రం ప్రమోషన్ లేకుండా, విడుదలైన ఈ సినిమా ఏకంగా వంద కోట్లను రాబట్టి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో ప్రేక్షకులు పుష్ప సినిమాని బాగా ఆదరించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతోమంది పుష్ప సినిమాలు పాటలకు డాన్సులు చేస్తూ పుష్పరాజ్ డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా క్రికెటర్లు రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, బ్రావో, శిఖర్ ధావన్ వంటి వారు కూడా పుష్ప డైలాగులు చెబుతూ వీడియోలను షేర్ చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ వేదికగా ప్రీమియర్ లీగ్ జరుగుతుండగా… క్రికెటర్స్ సిక్స్ కొట్టినప్పుడు ఫోర్ కొట్టినప్పుడు లేదా వికెట్ తీసినప్పుడు తగ్గేదే లే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇలా వీరందరూ పుష్ప వీడియోలు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేయడంతో పుష్ప సినిమా విపరీతంగా నచ్చిందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ నిజానికి ఈ సినిమా ఓటు హక్కులను అమెజాన్ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెజాన్ ఇలా క్రికెటర్లకు డబ్బులు చెల్లించి ప్రమోషన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా స్క్రిప్టు ప్రకారమే జరిగిందని వాదన తెరపైకి వచ్చింది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఎంతోమంది థియేటర్లలో చూడటానికి ఆసక్తి కనబరచడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయినప్పటికీ హిందీలో మాత్రం ఎలాంటి ప్రమోషన్ లేకుండా విడుదల చేసిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ రికార్డులను సృష్టిస్తూ బన్నీ క్రేజ్ అమాంతం పెంచేశాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా పై ప్రముఖ ఫిలిం క్రిటిక్ కేఆర్ కే స్పందిస్తూ అల్లు అర్జున్ పై ప్రశంశలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ..బాలీవుడ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే ఎంతో మంది సూపర్ స్టార్స్ కు ఈ సినిమా ఒక చెంప పెట్టు లాంటిది వారు నటించిన సినిమాలు 25 కోట్లు కూడా వసూలు చేయలేకపోతున్నాయని విమర్శించారు.
బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో పుష్ప సినిమానే ఒక నిదర్శనం అని వరుస త్వీట్లు పెట్టారు. ఇక సినిమాను హిందీలో డిస్ట్రి బ్యూట్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీశ్ షాకు బన్నీ పుష్ప సినిమా బంగారు గని మరోసారి ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Film #Pushpa has done approx ₹100Cr business in Hindi circuit. Huge congratulations to @alluarjun for such a great achievement! It’s a slap on the face of Bollywood stars.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” సినిమా మేనియా ఇప్పట్లో తగ్గేట్లు కనిపించడంలేదు. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, సుకుమార్ డైరెక్షన్, దేవీశ్రీ ప్రసాద్ మెస్మరైజ్ మ్యూజిక్… ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్గా నటించారు.
david warner daughters dancing for allu arjun pushpa movie song
కాగా సునీల్, అనసూయ ముఖ్యపాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ సినిమాకి కేవలం ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్కు చెందిన చాలా మంది అగ్ర హీరోలు పుష్ప చిత్రాన్ని వీక్షించినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
david warner daughters dancing for allu arjun pushpa movie song
ఈయనకు ఇండియన్ సినిమాలన్న పాటలన్న చాలా ఇష్టం. అందుకే వీలుచిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు. అలాగే గతంలో మహేశ్బాబు, అల్లు అర్జున్, విజయ్లను ఇమిటేట్ చేస్తూ అలరించాడు. గతంలో అల వైకుంఠపురం చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్కు వార్నర్ చేసిన డ్యాన్స్ వీడియో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రారా సామి అంటున్న డేవిడ్ వార్నర్ కూతుళ్ళు !
ఇటీవలే వార్నర్ పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ శ్రీవల్లి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. ఆ సాంగ్ కి అల్లు అర్జున్ ఎలా డాన్స్ చేశాడో..అలాగే వార్నర్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా వార్నర్ కూతుర్లు రా రా సామి పాటకు క్యూట్ గా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. తన క్యూట్ స్టెప్పులతో ఈ చిన్నారులు అందరి మనసులు దోచుకుంటున్నారు.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net