Tag Archives: rape

“రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి..” అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. “రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి” అంటూ ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వరదల నష్టం గురించి చర్చ జరగాలని కర్నాటక అసెంబ్లీ లో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఎమ్మెల్యేలను ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో స్పీకర్ మాట్లాడుతూ “నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నిటినీ ఆస్వాదిస్తూ అవును, అవును అంటూ ఉండాలి” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ “రేప్ తప్పనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి. మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా వ్యఖ్యానించడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు సామాన్యులు.

బాలికపై వృద్ధుడి అత్యాచారం.. విషయం బయటకు రావడంతో..ఇలా!

ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో మాత్రం బయం లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా కనిపడితే చాలు.. మగవాళ్ల కళ్లు కామంతో మూసుకుని పోతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు..

దీంతో తన కోసమే వచ్చినట్టుగా మహిళలపై లైంగికదాడి చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.. అయితే చివరికి అత్యాచార నిందితులకు చావే శరణ్యం అవుతున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం…

హన్మకొండ జిల్లా వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన 69 ఏళ్ల భిక్షపతి విద్యా సంస్థలో సూపింటెండెంట్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. అతడి ఇంటి పక్కనే ఓ దివ్యంగుడు ఉంటున్నాడు. అతడికి ఓ కూతురు ఉంది. ఈ మధ్య ఆమె తల్లి పుట్టింటికి వెళ్లింది. వారిద్దరి మధ్య కలహాలు రావడంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటుంది. దీంతో ఆ బాలికకు అన్నీ తానై చూసుకుంటున్నాడు.

దీనినే అదునుగా భావించిన ఆ వృద్ధుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమెను ఆ దివ్యాంగులు ఏమైదంని అడగ్గా.. విషయం చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

12 ఏళ్ల బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్.. గర్భవతిని చేసి చివరకు..

అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. సైదాబాద్ ఘటన మరువకముందే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఇలా బాలికలకు, మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై కన్నేసి.. అత్యాచారం చేసి.. ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బోదన్ రోడ్‌‌‌‌ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్.. తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు.

ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రలు మందలించారు.

ఆమె 6 నెలల గర్భవతి అని తేలింది. దీంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. అభం శుభం తెలియని తన బిడ్డపై ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పొలంలో కనిపించిన స్కూల్ యూనిఫామ్.. ఏంటని వెళ్లి చూస్తే షాక్ అయిన స్థానికులు..!

ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ మానవమృగాలు మాత్రం రోజురోజుకు రెచ్చిపోయి చిన్నపిల్లలు పండు ముసలి వాళ్ళు అని తారతమ్యం లేకుండా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఇలా అత్యాచార ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా కొందరు మానవ మృగాలు అదేస్థాయిలో రెచ్చిపోయి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వారం రోజుల క్రితం జరిగిన హైదరాబాద్ ఘటన మరవకముందే అలాంటి ఘటన ఆగ్రాలో మరొకటి చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన ఆగ్రాలోని అలీఘర్‌లోని టప్పల్ ప్రాంతంలో ప్రాంతంలో చోటు చేసుకుంది.

స్థానిక కథనం ప్రకారం… ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరి పొలంలో స్కూల్ యూనిఫామ్ కనిపిస్తుండడంతో స్థానికులు ఆ వరిపొలంలోకి వెళ్లిచూడగా ఎనిమిదేళ్ల చిన్నారి అచేతనంగా పడి ఉండటం చూసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.

అయితే ఉదయం 9 గంటల సమయంలో బాలిక పాఠశాలకు వెళ్లిందని, అయితే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వరి పొలంలో మధ్యాహ్నం బాలిక శవమై కనిపించదని బాలిక బంధువులలో ఒకరు తెలిపారు. బాలిక మృతదేహం ఉన్న చోట నుంచి 100 మీటర్ల దూరంలో తన స్కూల్ బ్యాక్ పడి ఉందని, ఆ బాలిక స్కూలుకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే పాపను ఎవరో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సొంత బాబాయ్ బాలికపై అత్యాచారం చేశాడు.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా..

పాఠశాలలు దేశంలోని చాలా రాష్ట్రాలలో మొదలు అయ్యాయి. ఉదయం పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. ఇలా వాళ్లే స్కూల్ వద్ద వదిలి పెట్టి.. మళ్లీ సాయంత్రం వెళ్లి పిక్ అప్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ఓ ఇంట్లో పని ఎక్కువగా ఉండటంతో ఓ తల్లి తన పాపను పాఠశాల వద్ద దింపి రావడానికి ఆ పాపకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని సహాయం అడిగింది.

అలాగే ఆ బాలికను తీసుకెళ్లిన అతడు.. దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మండ్య నగరంలో దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు ఓ పాప ఉంది. పాఠశాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. తనకు వేరే పని ఉందని.. పాపకు బాబాయ్ వరుస అయ్యే 32 ఏళ్ల సల్మాన్ ను సహాయం అడిగింది. అతడు అలాగే అని అక్కడ నుంచి తీసుకెళ్లాడు.

తన అన్న కూతురును పాఠశాలకు తీసుకెళ్లకుండా నేరుగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశారు. సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ముఖంపై గాయాలు ఉండటం గమనించారు. ఆ బాలికను గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. ఈ దారుణానికి పాల్పడింది బాబాయ్ అంటూ చెప్పింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని ఆరోజే అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానికంగా మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలిన డిమాండ్ చేశారు.

16 ఏళ్ల మైనర్ బాలికపై.. ఐదుగురు యువకుల అత్యాచారం.. చివరకు ఆ బాలిక..!

ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.

ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.

ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్రాప్ లో పడిన ఉపాధ్యాయురాలు.. రూంకి రమ్మని ఆ యువకుడు ఎంత పని చేశాడో తెలుసా..?

కొన్ని ఘటనలు వింటుంటే ఇలా ఎందుకు చేస్తారో.. అలా అవ్వడానికి గల కారణం ఏంటో అర్థం కాదు. సమాజంలో మోసాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా.. చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి వాటికి బలైపోతున్నారు. ఇలా ఓ టీచర్ కు మాయమాటలు చెప్పి ఓ యువకుడు ఆమెను అన్నీ విధాలా వాడుకొని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. చేసేది లేక ఆమె చిరవకు పోలీసులను ఆశ్రయించింది. ఇటు డబ్బు పోయి.. అటు పరువు పోయి.. చివరకు ఆమెకు కన్నీళ్లు తప్ప ఏమి మిగల్లేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బన్స్‌వారాలోని ఘాటోల్‌లో మొబైల్ షాప్ నడిపేవాడు 27 ఏళ్ల ముస్తఫా షేక్ అనే యువకుడు. ఓ రోజు ఫేస్ బుక్ లో వెతికి టీచర్ గా పనిచేస్తున్న 39 ఏళ్ల మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె దానిని నాలుగు రోజుల తర్వాత అంగీకరించింది. ఆ రోజు నుంచి ఏవో మాయమాటలు చెప్పి స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ఓ రోజు హైటెక్ డ్రామా ఆడాడు. ఆ డ్రామానే ఆమె పాలిట శాపంగా మారింది.

ఓ రోజు చనిపోతున్నట్లు కాల్ చేశాడు.. ఎందుకు అని ఆమె అడగ్గానే.. నాకు పిల్లలు, భార్య ఉన్నారని.. ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. అందుకే ఇలాంటి పని చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అతడి మాటలకు ఆ టీచర్ కరిగిపోయింది. అప్పుడు కొంత డబ్బును సాయం చేసింది. ఆ తర్వాత ఓ రోజు కలవాలంటూ.. తన రూంకి తీసుకెళ్లాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిందని చెప్పి.. కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఆమెతో తాపించాడు.

మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెను పూర్తిగా వివస్తను చేసి.. వీడియోలు.. ఫోటోలు తీశాడు. ఆమెకు సోయి వచ్చేసరికి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆమె దగ్గర డబ్బులను వసూలు చేశాడు. దాదాపు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అతడిని ఎలాగైనా వదిలించుకునేందుకు అతడికి మరో రూ.5 లక్షలు ఇచ్చింది. అది తీసుకున్న వ్యక్తి మళ్లీ అదే పనిగా.. రూంకి రమ్మనడం.. బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడు పరారయ్యడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భార్యపై అత్యాచారం చేసేందుకు ప్రేరేపించిన భర్త..! అతడి స్నేహితులతో..!

వాళ్లకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు దాటింది. అయితే వీరివురి కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ వివాదాన్ని మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భర్త తన భార్యతో నీచాతినీచమైన పని చేయించినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బజార్ శుక్లా పట్టణంలో శ్రావణ్ కుమార్ తన భార్య నివసిస్తున్నారు.

అతడికి తన భార్య తరఫును బంధువులకు ఓ వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి కేసు కూడా కోర్టులో పెండింగ్ ఉంది. అయితే ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఏ భర్త చేయని పని చేశాడు ఈ కసాయి భర్త. ఓ రోజు తన స్నేహితులను ఇంటికి పిలిపించాడు.

అతడి ఎదురుగానే ఆమెపై అత్యాచారం చేసేందుకు శ్రావణ్ కుమార్ మరియు అతడతి స్నేహితులను ప్రేరేపించినట్లు ఆమె చెప్పింది. వచ్చిన వాళ్లళ్లో ఒకరు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత తనపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు కూడా వెనుకాడలేదని పోలీసులకు తెలిపింది. అ సమయంలో తాను గట్టిగా అరవడంతో చుట్టుపక్కన ఉండే స్థానికులు రాగా.. వారు అక్కడ నుంచి పారిపోయినట్లు చెప్పింది.

ఆ సమయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు.. కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. అందుకే అమేథి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు ఆమె పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సింగ్‌కు తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా దినేష్ సింగ్ కోరారు. ఈ వ్యవహారం అంతా ఆస్తికి సంబంధించినదిగా తెలుస్తోంది.

బర్రెపై అత్యాచారం.. చివరకు కామాంధుడికి అనూహ్య ఘటన..

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నాయి. వాయివరుసలు మరిచి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.

అంతటి అవమానీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. జరిగింది ఏటంటే.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ అతడు అదే పని చేశాడు. ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది.

దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై షేక్‌ షఫీ వివరాల ప్రకారం అతడు కూలీ పనికి వెళ్తుంటాడని చెప్పారు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక అతడి మెడకు గట్టిగా బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు.

పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.