Tag Archives: Rishabh Shetty

Varaha Rupam: వరాహ రూపం పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిన సింగర్ శ్రీ లలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Varaha Rupam: రిషబ్ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వంలో నటించిన కాంతార సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇలా అన్ని భాషలలోనూ ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వరాహ రూపం పాట ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.

ఈ విధంగా ఒక సినిమాలో హిట్ అయిన పాటలను చాలామంది కవర్ సాంగ్స్ చేస్తూ మరింత ఫేమస్ అవుతారు. ఈ క్రమంలోనే వరాహ రూపం సాంగ్ ను కవర్ సాంగ్ చేస్తూ ఫేమస్ అయినటువంటి వారిలో సింగర్ శ్రీ లలిత ఒకరు. ఈ పాటను ఈమె సరికొత్త ఇన్స్ట్రుమెంట్ తో రీ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచారు. మరి ఈ శ్రీ లలిత ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

శ్రీ లలిత తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంగీత నేపథ్యం ఉన్నవాళ్లు కావడం విశేషం అయితే చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో మక్కువ ఉన్నటువంటి శ్రీ లలితకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఈమె ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, స్వరాభిషేకం,స్వర్ణ నీరాజనం సరిగమ లిటిల్ చాంప్ వంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని తన స్వరాన్ని అందరికీ వినిపించారు.

Varaha Rupam: సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో సందడి చేసిన శ్రీ లలిత…

అయితే అప్పుడు ఈమె చిన్నగా ఉండటం వల్ల పెద్దగా ఎవరు తనని గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రస్తుతం వరాహ రూపం అనే పాటను రీ క్రియేట్ చేయడంతో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాటకు ఏకంగా 3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇలా కజు అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పాట అనంతరం ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇప్పటివరకు ఎన్నో సిగ్గింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో సందడి చేసిన ఈమెకు ఇప్పటివరకు సినిమా అవకాశాలు రాలేదు. అయితే ఈ వరాహ రూపం పాట ద్వారా ఈమెకు అవకాశాలు వస్తాయి అనడంలో ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

Rishabh Shetty: కాంతారలోని కోలం అరుపులు దయచేసి బయట ఎవరూ చేయొద్దు.. ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి !

Rishabh Shetty:ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏదైనా సినిమా చర్చలకు దారితీసింది అంటే అది కాంతార సినిమా అని చెప్పాలి.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమాను కర్ణాటక తుళునాడులోని కోలా, కంబా సంప్రదాయ ఆచారాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో ఒక వ్యక్తికి దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఆ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చినప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ శబ్దంపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆ శబ్దాన్ని ఇమిటేట్ చేయకండి అంటూ ఈయన ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.

అది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్ అని ఇది ఒక ఆచారం ఆధ్యాత్మిక నమ్మకం. ఇది చాలా సున్నితమైన అంశం ఇలా ప్రేక్షకులు బయట కూడా ఈ శబ్దాన్ని చేయటం వల్ల ఆచారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరూ కూడా ఈ శబ్దాన్ని చేయకండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అభిమానులకు చిన్న విన్నపం చేశారు.

Rishabh Shetty: నిజ సంఘటనల ఆధారంగా..

ఇక ఈ సినిమాని రిషబ్ శెట్టి తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఇక ఈ సినిమాలో ఒక మనిషిలోకి దేవుడు ఆవహించే సమయంలో ఎలా ఉంటారనే విషయాన్ని చాలా దగ్గరగా చూపించడంతో ప్రతి ఒక్కరి ఒళ్ళు జలదరించేలా డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించారు.ఈ విధంగా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఎంతో మంది శనీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Rishabh Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి లవ్ స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు.. భారీ సినిమాని తలపిస్తుందిగా !!

Rishabh Shetty: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ చిత్ర పరిశ్రమలో చూసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి పేరు మారుమోగిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కాంతార అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ హీరో గురించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన లవ్ స్టోరీ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ప్రేమ వివాహం అని వీరి ప్రేమలో ఎన్నో ట్విస్టులు దాగి ఉన్నాయని తెలుస్తోంది. నిజంగా వీరి లవ్ స్టోరీ వింటే అచ్చం ఒక సినిమాని తలపించేలా వీరి లవ్ స్టోరీ ఉంది.మరి రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి ఎలా పరిచయమయ్యారు వీరి పెళ్లి ఎలా జరిగిందనే విషయానికి వస్తే..

రిషబ్ శెట్టి 2016 వ సంవత్సరంలో ఒక సినిమా ఈవెంట్లో భాగంగా ప్రగతి శెట్టిని చూశారు. ఇలా తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్న రిషబ్ శెట్టి వెంటనే ఫేస్ బుక్ ఓపెన్ చేసి ప్రగతి శెట్టి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో రిషబ్ ఏమాత్రం ఆలోచించకుండా తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి అనంతరం ప్రేమగా మారింది.

Rishabh Shetty: అడ్డుపడిన ప్రగతి కుటుంబ సభ్యులు..

ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి తెలియజేశారు అయితే ప్రగతి కుటుంబ సభ్యులు రిషబ్ శెట్టితో తన వివాహం జరగడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇలా రిషబ్ శెట్టితో పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కేవలం ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అన్న ఒక్క కారణంతోనే వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇలా ప్రగతి కుటుంబ సభ్యులు తమ పెళ్ళికి అంగీకరించకపోయిన ఆమె బలవంతంగా తన తల్లిదండ్రులను ఒప్పించి 2020వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.

Rishabh Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Rishabh Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలోనే కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఈయన 1983 జులై 7న కర్ణాటకలోని కుందాపూర్ లో జన్మించారు. ఈయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయనకు మరో సోదరుడు కూడా ఉన్నారు. ఫిలిం డైరెక్షన్లో డిప్లమో చేసినటువంటి రిషబ్ శెట్టి కెరియర్ మొదట్లో ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి 2010 సంవత్సరంలో నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి ఈయన దర్శకత్వంపై ఇష్టం ఉండటంతో మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా కీరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు.

Rishabh Shetty: డైరెక్షన్ పై మక్కువతోనే…

ఇలా ఈ సినిమాతో సక్సెస్ కావడంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఇక రిషబ్ శెట్టి2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.

Kantara: కాంతార సినిమా ఓటీటీలో వచ్చేది అప్పుడేనా… ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ?

Kantara: డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ మీడియాలో ప్రసారం కాగా మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో ప్రసారమవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో కాంతార సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇలా థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కానుందని తెలుస్తుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని డిజిటల్ మీడియాలో చూడటం కోసం ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా నవంబర్ రెండవ వారం లేదా మూడవ వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం కానుందని తెలుస్తోంది.

Kantara: భారీగా లాభ పొందిన డిస్ట్రిబ్యూటర్లు…

ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. రెండు కోట్ల రూపాయలకు అల్లు అరవింద్ కొనుగోలు చేయగా ఏకంగా ఈ సినిమా కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు కాంతార సినిమా కాసుల వర్షం కురిపించిందని చెప్పాలి.

Sapthami Gowda: కాంతార సినిమా హీరోయిన్ సప్తమి గౌడ గురించి ఈ విషయాలు తెలుసా?

Sapthami Gowda: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు వినపడుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కాంతార. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ భాషలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా అక్టోబర్ 15 వ విడుదల అయింది.

తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ పొందడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలు నటి సప్తమి గౌడకు ఇది రెండవ సినిమా.ఇలా రెండవ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సప్తమి గౌడమాట్లాడుతూ ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి తనని సంప్రదించి కథ చెప్పినప్పుడు ఇందులో నాకు ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పినప్పటికీ నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అందుకు రిషబ్ శెట్టి గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.

Sapthami Gowda: నేషనల్ రైడ్ స్విమ్మర్..

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 1996 జూన్ 8న బెంగుళూరులో జన్మించారు. తన తండ్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారట. ఇక ఈమె సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.పాప్ కార్న్ మంకీ టైగర్  తన మొదటి సినిమా కాగా రెండవ సినిమా కాంతారా సినిమా కావడం విశేషం. ఇక ఈమె నేషనల్ వైడ్ స్విమ్మర్ గా పేరుపొందారు. ఇక బుక్స్ చదవడం, ట్రావెలింగ్ చేయడం ఈమె హాబీ అని తెలుస్తుంది.

Kantara Movie: కాంతార సినిమాలో చూపించిందంతా నిజమేనా? ఆ తెగవారు ఆత్మలతో నిజంగానే మాట్లాడతారా..?

Kantara Movie: కాంతార ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరే వినబడుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే ఇలా దేవుళ్ళ ఆత్మతో మాట్లాడేవారు ఉంటారా వారు చెప్పినవే జరుగుతాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటుంది.

నిజానికి రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో గత కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. కర్ణాటకలోని బంట్ అనే తెగవారు నివసించేవారు. వీరి భాష తులు. అయితే ప్రస్తుతం ఈ తెగ వారందరూ కూడా వివిధ రకాలుగా విడిపోయి మతాలు మార్చుకున్న వారు ఉన్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుష్క శెట్టి, కృతి శెట్టి, రిషబ్ శెట్టి, నేహా శెట్టి, రక్షిత్ శెట్టి, శిల్పా శెట్టి శ్రీనిధి శెట్టి ఇలా వీరందరి పూర్వీకులు కూడా ఇదే తెగకు చెందిన వారే.

ఈ విధంగా ప్రస్తుత కాలంలో ఈ తెగకు చెందినవారు వివిధ ప్రాంతాలలో ఉండే మతాలు మార్చుకున్నప్పటికీ వీరందరూ కలిసి ఇప్పటికీ ఎంతో నమ్మకంగా “కంబళ” అనే నృత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ నృత్యాన్ని మనం కాంతార సినిమాలో చూసాము. ఈ తెగకు చెందినవారు ఈ డాన్స్ చేస్తూ వారి కులదైవాన్ని పూజించడం వల్ల వారి కుటుంబంలో మరణించిన పూర్వీకుల ఆత్మ వారిని ఆవహించి జరగబోయేది చెబుతారని అలాగే ఆ కుటుంబ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తారు.

Kantara Movie: నిజ సంఘటన ఆధారంగా..

ఈ విధంగా రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో మూడు దశాబ్దల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దారు అయితే ఈ సినిమాలో చూపించినది మొత్తం నిజ సంఘటన ఆధారంగా మాత్రమే జరిగినదని నిజంగానే ఆ తెగ వారికి ఆత్మలు ఆవహిస్తాయని ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి అంతరించిపోతున్న వారి కలను బయటకు పెట్టారు. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అన్ని భాషలలోనూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుందని చెప్పాలి.