Tag Archives: Tollywood Actor

Kamal Kamaraju: పోలిసులకు అడ్డంగా దొరికిపోయిన టాలివుడ్ నటుడు కమల్ కామరాజు.. వైరల్ అవుతున్న పోస్ట్..!

Kamal Kamaraju: ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు ఆ తర్వాత చత్రపతి, గోదావరి కాటమరాయుడు వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల కమల్ కామరాజు చేసిన పని వల్ల పోలిసులకు అడ్డంగా దొరికిపోయాడు.

సాధారణంగా పోలీసులకు సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అనే వ్యత్యాసం ఉండదు తప్పు చేస్తే వారు ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ పోలీసులకు చిక్కి వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల నటుడు కమల్ కామరాజు కూడా చట్ట వ్యతిరేకమైన పనిచేసి పోలీసులకు దొరికిపోయాడు. అయితే తాను పోలీసులకు దొరికిపోయిన విషయాన్ని కామరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తాజాగా కమల్ కామరాజు ట్వీట్ చేస్తూ…అందరికీ చెప్తాను. ఇవాళ ఉదయమే బైక్ మీద వెళుతూ 60లో వెళ్లాల్సిన నేను రోడ్డు ఖాళీగా ఉందని ఆత్రుత ఆపుకోలేక 80లో వెళ్లాను. ఇలా ఉదయమే నా బైక్ స్పీడు పెంచి పోలిసులకు దొరికిపోయాను. ఇంత ఉదయమే నేను స్పీడుగా వెళ్తున్నా కూడా పోలీసులు పట్టుకుని నాకు చలాన్‌ పంపినందుకు హైదరాబాద్‌ పోలీసులకు ధన్య వాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

Kamal Kamaraju: చలనా వేసిన ట్రాఫిక్ పోలీసులు..

ఈ మేరకు రోడ్డు మీద స్పీడుగా వెళ్తున్న తన బైక్ ఫొటోను కూడా పోస్టు చేశాడు. మొత్తానికి చట్ట నియమాలను అతిక్రమించి అతివేగంగా వెళ్ళటం వల్ల ఇలా పోలీసులకు చిక్కి చలానా కట్టాడు. ఈయనే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పోలీసులకు చిక్కి జరిమానా కట్టడమే కాకుండా అరెస్టు కూడా అయ్యారు.

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

Naresh: సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ఏదో విషయంలో వివాదాస్పదం అవుతున్నాడు. గతంలో కామెడీగా క్రేజ్ సంపాదించుకున్న నరేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ‘ మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు మద్దతు తెలుపుతూ… తెగ హంగామా చేశాడు నరేష్. మంచు ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి పెద్ద మోహన్ బాబే అంటూ.. తెగ హడావుడి చేశారు. 

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే మరోసారి నరేష్ పేరు తెరపైకి వచ్చింది. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి.. నరేష్‌, ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. ఆమె మీద గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై నరేష్‌ స్పందిస్తూ.. రమ్యకు, తనకు ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు.

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.  నరేష్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట్లో తల్లి విజయ నిర్మల చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు.

ఆ తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. మూడో పెళ్లిగా ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే వీరికి కూడా విడాకులు అయ్యాయని..

మూడో పెళ్లి కూడా పెటాకులు..

మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను  వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం రమ్యకు కూడా విడాకులు ఇచ్చాడని.. నెలనెల మెయింటనెన్స్ చెల్లిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

Sushanth: టాలీవుడ్, హాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విడిపోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాడు. టాలీవుడ్ లో ఎంతో రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన ఒక్కసారిగా అటు అభిమానులతో పాటు.. సినీ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

వీళ్ల కంటే ముందు కూడా ఎంతో మంది జంటలు విడిపోడం గమనార్హం. ప్రస్తుతం ఇటీవల జేడీ చక్రవర్తి దంపతులు కూడా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రేమలో ఉంటూ.. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోతుంటారు. ఇలా అన్యోన్యంగా ఉండాల్సిన జంటలు ఎన్నో విడిపోయాయి కూడా.

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

ఇదంతా ఇలా ఉంటే.. సెలబ్రిటీల విడాకులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక దీనిలో కొంతమంది అబ్బాయిలది తప్పు ఉందని అంటుంటే.. మరికొంతమంది అమ్మాయిలది తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘‘మళ్లీ మొదలైంది’’ మూవీ ఈ నెల 11వ తేదీన ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ అనేవి ఉంటాయని..


ఈ సినిమా అంతా డైవర్స్ తీసుకున్న దంపతుల గురించి చెప్పే చిత్రం. వాళ్లు ఎందుకు విడిపోతున్నారు.. విడిపోయిన తర్వాత ఎవరిపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.. సమాజం వాళ్ల గురించి ఏమనుకుంటుంది అనే విషయాలను చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనిలో సుశాంత్ , నిఖిల్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రేకప్ గురించి తన అభిప్రాయం అడుగుతున్నారని.. మొన్నే నాకు పెళ్లి అయిందని అప్పుడే బ్రేకప్ అంటే కష్టం అంటూ కామెంట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం తన వైవాహిక జీవితం బాగుందని చెప్పాడు. దీనిపై సుశాంత్ మాట్లాడుతూ.. బ్రేకప్స్ గురించి మాట్లాడేంత అర్హత తనకు లేదని.. ఎందుకంటే..తనకు పెళ్లి కాలేదని.. కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ అనేవి ఉంటాయని అది సహజం అని చెప్పాడు. ఇక బ్రేకప్ లాంటివి జరిగితే మనిషి బెటర్ అవుతాడని కామెంట్ చేశాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయన్నాడు. ప్రస్తుతం నిఖిల్, సుశాంత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

Mahesh Babu:సూపర్ స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్​​ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్​ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. చిన్నప్పటి నుంచి సోద‌రుడితో అత్యంత స‌న్నిహితంగా ఉండేవారు మ‌హేష్. ఆ విషయ్లను పలు సంధార్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. మహేష్ కు కోవిడ్ వచ్చిన కార‌ణంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి వచ్చింది. దీంతో సోద‌రుడిని చివ‌రి చూపు కూడా చూసుకోలేక‌పోయారు. ఈ విషయం ఘట్టమనేని అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది.

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్​ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్​ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. రమేశ్​ బాబు చనిపోయినప్పుడు మహేష్ భావోద్వేగంగా ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే. ఇక రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

Mahesh Babu:రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో బోరున ఏడ్చేసిన మహేష్ బాబు… అన్నయ్య ఇక లేడంటూ !

రమేశ్ బాబు – మహేష్ బాబు సినీ ప్రయాణం

ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి పలు సినిమాలు చేశారు. బ‌జార్ రౌడీ, ముగ్గురు కొడుకులు సినిమాల్లో ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి యాక్ట్ చేశారు. తండ్రి బాట‌లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు రమేష్ బాబు. తెలుగు సినిమా చరిత్ర‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్ర‌లో క‌నిపించారు. నటుడిగా అదే ఆయ‌న తొలి సినిమా. మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించారు. రమేశ్ బాబు మృతి ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని లోటు అనే చెప్పాలి.

Nani:నన్నుపెళ్లి చేసుకుంటావా అని నాని ని అడిగిన వేశ్య… రిప్లై తో షాక్ ఇచ్చాడుగా ?

Nani:నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ” శ్యామ్ సింగరాయ్ “. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. డిసెంబర్ 17 న రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగుతో పాటు… తమిళ్, కన్నడ భాషలలో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో నాని అప్ కమింగ్ యంగ్ డైరెక్టర్ గా, శ్యామ్ సంగ రాయ్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో పవర్ ఫుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా కూడా మెప్పించాడు.

నన్నుపెళ్లి చేసుకుంటావా అని నాని ని అడిగిన వేశ్య… రిప్లై తో షాక్ ఇచ్చాడుగా ?

థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఈ చిత్రం ప్రసారం అవుతుంది. కాగా ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది చిత్రబృందం.

నన్నుపెళ్లి చేసుకుంటావా అని నాని ని అడిగిన వేశ్య… రిప్లై తో షాక్ ఇచ్చాడుగా ?

ఆరోజు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటున్న నాని …

శ్యామ్ సింగ రాయ్ గా నాని… వేశ్యలందరితో కూర్చుని ఉంటాడు. వారి కోసం నాని ఓ కవిత రాసి వినిపిస్తాడు. అప్పుడు ఒక వేశ్య… ‘ఇంత తెలిసిన నువ్వు మరి నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతుంది. దీనికి శ్యామ్ ” కచ్చితంగా చేసుకుంటాను… నిన్ను ప్రేమించిన రోజు ” అని సమాధానమిస్తాడు. ఈ సీన్ కూడా సినిమాలో ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిని సినిమా నుంచి ఈ సీన్ ని తొలగించడానికి గల కారణాలు చిత్ర బృందానికే తెలియాలి

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

Harish Uthaman: హరీష్ ఉత్తమన్ ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు తెరకు మాత్రం ఈయన ఒక పేరుమోసిన విలన్ గా అందరికీ పరిచయమే. ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ తాజాగా రెండవ వివాహం చేసుకున్నారు.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీష్ ఉత్తమన్ మలయాళ నటి చిన్ను కురువిల్లను జనవరి 20న కేరళలోని మవెలిక్కర వద్ద ఉన్న రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రెండో పెళ్ళి చేసుకున్నాడు.కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

హరీష్ ఉత్తమన్ ఇదివరకే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌ పుర్‌ను 2018 లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం అయిన ఏడాది కూడా గడవకముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విడాకులతో విడిపోయారు.

గౌరవం చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ..

ఈ క్రమంలోనే హరీష్ తిరిగి చిన్ను కురువిల్లను రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా హరీష్ ఉత్తమన్ రెండవ వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు ఆయనకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరీష్ ఉత్తమన్ 2013వ సంవత్సరంలో గౌరవం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, మలుపు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, ఎక్స్ ప్రెస్ రాజా, కవచం, వంటి ఎన్నో సినిమాలలో విలన్ గా ప్రేక్షకులను సందడి చేశారు.

Narasimha Raju : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రా కమల్ హాసన్‌.. నరసింహరాజు..!

Narasimha Raju : జానపద, పౌరాణిక చిత్రాలు అంటే వెంటనే గుర్తకువచ్చే తెలుగు కథానాయకుడు నరసింహ రాజు. 70వ దశకంలో చాలా వరకు విజయవంతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు ఈయన. 1974లో నీడలేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నరసింహ రాజు ఆ తరువాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని సినిమాతో మంచి క్రేజున్న హీరోగా గుర్తింపు పొందారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో కమలహాసన్‌కు ఉన్నంత స్టార్‌డమ్ ఉండేది నరసింహ రాజుకు. తెలుగు చిత్ర పరిశ్రమలో నరసింహరాజును ఆంధ్రా కమల్ హాసన్‌గా పేరు సంపాదించుకున్నారు. 

సుమారు 110 చిత్రాల్లో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తెలుగు తెరపై తన ఛరిష్మాను కొనసాగించారు ఈయన. దాదాపు ఆయన అప్పట్లో నటించిన అన్ని సినిమాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. చాలా మంది ప్రముఖ నటులతో సమానంగా నటించారు. జగన్మోహినితోపాటు పునాదిరాళ్లు, పున్నమినాగు, నీడలేని ఆడది, ఇలా చాలా సినిమాలు ఆయన సినీ జర్నీలో మైలురాయిగా నిలుస్తాయి. ఈయన నటించిన పౌరానికమే కాదు ఆధ్యాత్మికమైన సినిమాలు ప్రేక్షకాధరణ పొందాయి. 
అయితే కొంత కాలం సినీ ఇండస్ట్రీకి దూరం కావడంతో మంచి అవకాశాలను పోగొట్టుకున్నారు.

Narasimha Raju : పున్నమి నాగు చిత్రంలో చిరంజీవి తో కలిసి నటించిన నరసింహరాజు

పున్నమి నాగు సినిమాలో నరసింహ రాజుతో సమానంగా నటించిన చిరంజీవి ప్రస్తుతం మెగాస్టార్‌గా స్టార్‌డమ్‌ సంపాదించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడం వల్ల ఆయన అంతటి క్రేజ్‌ను సంపాదించుకోలేకపోయారు. తరువాత బుల్లతెరపైన సీరియళ్లలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఎండమావులు, పంజరం, సుందరకాండ వంటి సీరియల్స్ మంచి ప్రేక్షాధరణ పొందాయి.

అప్పట్లో జానపద బ్రహ్మగా పేరుతెచ్చుకున్న బి.విఠలాచార్య జగన్మోహిని సినిమాను తన సొంత బ్యానెర్‌పై రూపొందించారు. ఇందులో హీరోగా నరసింహ రాజు  నటించారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి వేరే జానపద చిత్రాలు లేకపోవడం ఈ చిత్రంలో నటించిన కళాకారులు ఉత్తమ ప్రతిభను చూపించడంతో జగన్మోహిని చిత్రం బంపర్ హిట్‌ను సాధించింది. అప్పటికీ నరసింహ రాజుకు హీరో ఇమేజ్ లేదు. కానీ ఈ సినిమా హిట్‌తో ఆయన ఫేట్ మొత్తం మారిపోయింది. పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దెయ్యాలు, భక్తి వంటి ఇతివృత్తాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. దెయ్యం వలలో పడిన భర్తగా నరసింహరాజు నటన ఆధ్యంతం అందరినీ అలరిస్తుంది. హీరోయిన్ ప్రభ కూడా తెరకు కొత్త కావడంతో ఈ చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. పి.సుశీల, ఎస్‌.జానకి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అప్పటి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపాయనడంలో సందేహం లేదు.

అప్పట్లో తమిళంలో సూపర్‌ హిట్ సాధించిన చిత్రం అపూర్వ రాగంగళ్. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్, జయసుధ నటించారు. ఈ చిత్రం తమిళంలో హిట్ కావడంతో ఇదే సినిమాని దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తూర్పు పడమర టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో సత్యనారాయణ, నరసింహరాజు, శ్రీవిద్య, మాధవిలు, జయసుధ నటించారు. బేతాళ కథల్లో జవాబులేని ఆఖరి ప్రశ్న వంటి కథాంశంతో తెరకెక్కి ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. బాలచందర్ మిగతా చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఓ పజిల్ సినిమా. శ్రీ రమణ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. 

ఇందులో శివరంజనీ, స్వరములు ఏడైనా రాగాలెన్నో వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. 1980లో వచ్చిన పున్నమినాగు సినిమాలోనూ తన నట విశ్వరూపాన్ని చూపించారు. చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్ర దారులుగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ కలెక్షన్‌లను రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆధ్యంతం అలరించింది. ఇలాంటి చాలా చిత్రాల్లోనే నరసింహ రాజు నటించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఆస్పత్రిలో చేరిన హీరో అడివి శేష్.. ఏమైందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలయ్యాడు. గత కొద్దిరోజుల నుంచి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న నటుడు క్రమంగా అతని శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అడివి శేష్ ను సరైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అడివి శేష్ అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలయ్యాడన్న విషయం తెలియడంతో అభిమానులు కొంతవరకు ఆందోళన చెందుతూ అతడికి ఏం కాకుండా క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

అయితే ప్రస్తుతం అడవిశేషు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది… వైద్యులు ఏమంటున్నారు అనే విషయం గురించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే నటుడు అడివి శేష్ మేజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ముంబై టెర్రర్ దాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అదే విధంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు గూడచారి సీక్వెల్ గా గూడచారి 2, హిట్ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా హిట్ 2 చిత్రాలలో అడివి శేష్ నటించబోతున్నారు.

ఆ కారణం వల్లే నాకు, తారక్ మధ్య దూరం పెరిగింది.. ఇబ్బంది పెట్టొద్దంటూ: రాజీవ్ కనకాల

సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య స్నేహం ఏర్పడి వారితో పాటుగానే స్నేహం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో స్నేహంగా ఉన్నవారిలో రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలలో చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరు కలిసి వెండితెరపై కనిపించకపోవడంతో వీరి స్నేహం పై పలు సందేహాలను వ్యక్తం చేశారు.

తారక్ కనకాల మధ్య ఏం జరిగింది..? ఎందుకు దూరంగా ఉంటున్నారని అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల తాజాగా నటించిన “నారప్ప” సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ తారక్ తో తనకు ఏర్పడిన విభేదాలపై స్పందించారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ…

తారక్ తో నాకు విభేదాలు ఏర్పడ్డాయి అన్న విషయం నేను కూడా విన్నాను అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా రాజీవ్ స్పష్టం చేశాడు. నేను హీరోగా కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఎన్టీఆర్ సినిమాలలో చేయలేకపోతున్నానని తెలిపారు. తారక్ తన సినిమాలలో నన్ను తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నేను సినిమాల్లో నటించడం తనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. భావిస్తాడు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించే సినిమాలలో నన్ను పెట్టుకోవాలని చూస్తాడు. నా కోసం స్క్రిప్టులో మార్పులు చేయాల్సి వస్తోంది నాకోసం దర్శకనిర్మాతలకు ఇబ్బంది పెట్టొద్దంటూ ఎన్టీఆర్ తో చెప్పడం వల్లే తన సినిమాలలో నేను కనిపించడం లేదని ఈ సందర్భంగా రాజీవ్ కనకాల చెప్పారు. ఇంతకు తప్పితే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ సందర్భంగా అభిమానులకు వివరణ ఇచ్చారు.