Tag Archives: trivikram srinivas

Trivikram Srinivas: ఆ విషయం పట్టుతప్పుతున్న త్రివిక్రమ్.. వాళ్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా?

Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలతో అభిమానులను వరుసగా డిసప్పాయింట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం సినిమాతో కూడా మరోసారి డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీను చూసిన ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ చాలా డిసప్పాయింట్ చేశాడని ఒక విషయంలో గురూజీ పట్టు తప్పుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడు అనే పేరు ఉంది.

కానీ గత రెండు మూడు సినిమాల నుంచి ఈ విషయంలో ఆయన కష్టపట్టుతప్పుతున్నాడు. అంతేకాకుండా సెకండ్ హీరోయిన్ లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నాడు అన్న సందేహాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో రాజీ అనే మర్దరి పాత్ర కోసం మీనాక్షి చౌదరి తీసుకున్న విషయం తెలిసిందే. అక్క ఈ సినిమాలో మీనాక్షి ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఫ్యాన్స్ ని ఫుల్ గా డిసప్పాయింట్ చేసిన గురూజీ..

ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా సెకండ్ హీరోయిన్ విషయంలో కూడా ఆయన దారుణంగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమా విషయంలోనే కాకుండా త్రివిక్రమ్ గత రెండు సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయింది. అరవింద సమేత మూవీలో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక అల వైకుంఠపురములో చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. మరి తదుపరి సినిమాల విషయంలో అయినా ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది అంటూ పలువురు అభిమానులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు.

Poonam Kaur: ఆ విషయంలో గురూజీ మంచి సమర్థుడే… త్రివిక్రమ్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్?

Poonam Kaur: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమాని త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారంగా చేసుకుని రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన దేనినైనా చేయగల సమర్థుడు అంతేకాకుండా దాని నుంచి ఎలాగా తప్పించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అంటూ కామెంట్ లు చేశారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా చేయగల నైపుణ్యం ఉన్నవారు.

కొంతమంది గుడ్డిగా నమ్ముతారు..

కొంతమంది ఆయనని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రజలకు సహాయం చేయడానికి రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం భారీగా సహాయం చేసిందని అది ఎందుకో ఇప్పటికి నాకు అర్థం కాదు అంటూ ఈమె గురూజీ త్రివిక్రమ్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఈమె పరోక్షంగా పవన్ పై కూడా సెటైర్స్ వేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Bro Movie: బ్రో సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ నిండా ముంచేసిన త్రివిక్రమ్… అందుకే కలెక్షన్స్ తగ్గిపోయాయి?

Bro Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పవన్ సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.త్రివిక్రమ్ సినిమా ప్లాన్ అయినప్పటికీ వందల కోట్ల రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే సహజంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులు అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది నిజానికి ఈ సినిమా తమిళంలో ఎంతో మంచి హీట్ అందుకుంది. ఇలా తమిళంలో ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి వినోదయం సీతం సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా తెలుగుకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్టుగా స్క్రీన్ పై డైలాగ్స్ త్రివిక్రమ్ రాశారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా డైలాగ్స్ రాయలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది ఏదో తనకు 15 కోట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ కు ఇంత రెమ్యూనరేషన్ వచ్చింది డైలాగ్స్ రాయాలంటే రాయాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ ఈ సినిమాకు పని చేశారని అర్థమవుతుంది.

Bro Movie: పవన్ ను ముంచేసిన త్రివిక్రమ్…


ఇందులో పెద్దగా చెప్పుకోదగ్గ పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఏమీ లేవు స్క్రీన్ ప్లే కూడా పెద్దగా సెట్ అవ్వలేదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ డైలాగ్స్ రాయలేదని ఏదో రాయాలంటే రాసాము అనే విధంగానే డైలాగ్స్ రాశారని తెలుస్తుంది.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వంటి ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు ఆ అంచనాలను చేరుకోకపోవడానికి త్రివిక్రమ్ కారణమని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో డైలాగ్స్ పెద్దగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేయడమే కాకుండా సినిమా కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయని తెలుస్తోంది.

Trivikram: పవన్ కళ్యాణ్ తో స్నేహం కోట్ల రూపాయల లాభం పొందుతున్నటువంటి త్రివిక్రమ్!

Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈ సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. ఇలా పలు భాషలలో హిట్ అయినటువంటి సినిమాలను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకులు వేరైనా కూడా ఆ సినిమాలను తెలుగు వర్షన్ కి మార్చడం కోసం అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్స్ కోసం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా తన సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎంపిక చేసుకోవడానికి కారణం త్రివిక్రమ్ తో తనకు ఉన్నటువంటి స్నేహం మాత్రమేనని చెప్పాలి.

ఈ విధంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోనూ త్రివిక్రమ్ హస్తం ఉంటుంది. ఇలా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేయడంతో భారీగానే రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తే సుమారు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.

Trivikram: 20 కోట్ల రెమ్యూనరేషన్…


ఇలా సినిమా కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరించినందుకు ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి ఉన్నటువంటి స్నేహం కారణంగా ఏకంగా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని తెలుస్తుంది.

Samyuktha Menon: ఇదేం పోయేకాలం సంయుక్త… పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో ప్రేమాయనమా?

Samyuktha Menon: సంయుక్త మీనన్ పరిచయం అవసరం లేని పేరు.మలయాళీ ముద్దుగుమ్మగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం తెలుగులో మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకుని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

సంయుక్త మీనన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఫైర్ పెట్టుకుంది అంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో లేదో తెలియదు కానీ ఈ వార్తల ద్వారా ఈమె ఫేమస్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరో వార్త ద్వారా ఈమె సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందని సమాచారం.

Samyuktha Menon: విడాకుల తీసుకున్న హీరోతో ఎఫైర్…


కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోతో ఈమె సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ హీరోతో ఈమె ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి అయితే ఆ హీరోకి ఇదివరకే విడాకులు కూడా జరగడం గమనార్హం. ఇలా విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ ప్రేమలో పడటం ఏంటి అంటూ అందరూ పెద్ద ఎత్తున ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది.

Gunturu kaaram: గుంటూరు కారం సినిమాని ఫస్ట్ ఛాయిస్ మహేష్ కదా… మరి ఆ హీరో ఎవరో తెలుసా?

Gunturu kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ చూస్తేనే సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన గ్లింప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇలా ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా మహేష్ బాబు నటిస్తూ ఉండగా ఈ సినిమాకు మాత్రం మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదని ఈ సినిమా కథను వేరే హీరో రిజెక్ట్ చేస్తేనే ఆ కథతో మహేష్ బాబు సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.మరి గుంటూరు కారం సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా ఈ సినిమా కథను ఎన్టీఆర్ కోసం రాసారట.

Gunturu kaaram: ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్…


ఎన్టీఆర్ RRRసినిమా తర్వాత కొరటాల సినిమా కాకుండా ఈ సినిమాలోని నటించాల్సి ఉంది అయితే స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ కాస్త సందేహాలను వ్యక్తపరుస్తూ కొన్ని మార్పులు చేయమని చెప్పారట. త్రివిక్రమ్ మార్పులు చేసిన ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారని తెలుస్తుంది. మరి గుంటూరు కారం ప్రేక్షకులను మెప్పించగలరా లేదా తెలియాల్సి ఉంది.

Mahesh Babu: కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న మహేష్…. అసలు కారణం ఇదేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో ఉండబోతున్నారని తాజాగా విడుదల చేసిన గ్లింప్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా గంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నట్లు మనకు తెలిసిందే ఇక రాజమౌళి సినిమా అంటేనే ఆయన సినిమా విషయంలో చాలా స్టిక్ గా ఉంటారన్న సంగతి మనకు తెలుసు.రాజమౌళి సినిమా నుంచి ఏదైనా పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ ప్రకటించే వరకు ఆ హీరో లుక్ బయటకు లీక్ అవ్వకుండా చూసుకుంటారు.

ఇలా రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఇతర సినిమాలలో నటించే అవకాశం అస్సలు ఇవ్వరు కనుక మహేష్ బాబు కూడా పూర్తిగా రెండు మూడు సంవత్సరాలు పాటు రాజమౌళి సినిమాకు మాత్రమే పరిమితం కావలసి ఉంటుందని తెలుస్తుంది.ఇలా రాజమౌళి సినిమాతో రెండు మూడేళ్లు బిజీగా ఉండే మహేష్ ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సిందేనని అందుకే ఈయన కొన్ని రోజులపాటు తన ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Mahesh Babu: రాజమౌళి సినిమాతో బిజీ…


రాజమౌళి సినిమా అంటే హీరోలకు శిక్షణ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అదొక ఆర్మీ క్యాంపు లాగా హీరోలు భావిస్తుంటారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా పూర్తిగా తన మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుందని,తన సినిమాకు భారీగా కష్టపడాలని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత మహేష్ బాబు ఇతర సినిమాలు చేయకూడదని ఫిక్స్ అవుతూ ఇతర సినిమాలకు బ్రేక్ ఇచ్చారని సమాచారం.

Bandla Ganesh: ఆ గురూజీ భార్యాభర్తలను కూడా విడగొట్టగలరు… వైరల్ అవుతున్న బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: సినీ నటుడుగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో వివాదాస్పద ట్వీట్ల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసే ట్విట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఈయన వరుస ట్వీట్స్ చేయడం అందరిని ఆలోచనలలోకి పడేసింది.

ఇండస్ట్రీలో నిర్మాత కావాలి అంటే గురూజీకి భారీ గిఫ్ట్ ఇస్తే చాలు నిర్మాత అయిపోతారు అంటూ ఈయన కామెంట్ చేశారు. అలాగే భార్యాభర్తలను విడగొట్టాలన్న తండ్రి కొడుకులను విడగొట్టాలన్న, గురు శిష్యులను విడగొట్టాలన్న గురూజీకే సాధ్యమవుతుంది అంటూ బండ్ల గణేష్ చేసినటువంటి ట్వీట్ వైరల్ అయ్యాయి. ఇలా బండ్ల గణేష్ వరుసగాటు ట్వీట్స్ చేయడంతో ఈయన పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసే ట్వీట్ చేస్తున్నారని అర్థమవుతుంది.

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య దూరం రావడానికి పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని తెలుస్తుంది. అందుకే ఈయన తరచూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు విడిపోయారా అదే విషయాన్ని బండ్ల గణేష్ చెబుతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh: పవన్ రేణు దేశాయ్ విడిపోవడానికి త్రివిక్రమ్ కారణమా….


ఇక ఎంతోమంది పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు ఇలా పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరు తనకు దూరమవుతూ వస్తున్నారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే తనతో పర్మినెంట్గా సన్నిహితంగా ఉంటున్నారని అయితే వీరందరూ దూరం కావడానికి త్రివిక్రమ్ కారణమంటూ పరోక్షంగా బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sreeleela: అది నాకు వ్యసనంగా మారిపోయింది… నటి శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

Sreeleela: వెండితెరకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం అరుడజనుకు పైగా సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఒకరు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే బోయపాటి రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి శ్రీ లీల సరదాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు.

Sreeleela: కెమెరా ముందు ఉండటమే ఇష్టం…


తాను ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే వచ్చాను అయితే తనకు మంచి పాత్రలలో నటించే అవకాశాలు రావాలని మాత్రమే తన కోరుకుంటాను గానీ సినిమా మొత్తం తనపైనే ఆధారపడి ఉండాలని అసలు అనుకోనని తెలియజేశారు. ఇక ఇంట్లో ఖాళీ సమయంలో తనకు ఏమాత్రం పాలు పోదని తనకు ఇంట్లో ఉండటం కన్నా షూటింగ్ లొకేషన్లో ఉండడమే చాలా ఇష్టమని శ్రీ లీల తెలిపారు.తాను ఎప్పుడు కెమెరా ముందు ఉండడమే తనకు ఇష్టం అదే తనకు ఒక వ్యసనంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా సినిమాలపై ఈమెకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: సముద్ర తీరాన ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎక్కడో తెలుసా..?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులో కోట్ల విలువ చేసే ఖరీదైన బంగ్లాలో నివాసం ఉంటున్న మహేష్ బాబు తాజాగా మరొక ఖరీదైన విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆ విల్లా రిజిస్ట్రేషన్ కోసమే దుబాయ్ కి
పయనమైనట్లు సమాచారం. మహేష్ బాబుకు ఇష్టమైన ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ బాబు కొంత తీరిక దొరికితే చాలు కుటుంబంతో కలిసి విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మహేష్ బాబుకి దుబాయ్ అంటే చాలా ఇష్టం అందువల్ల ఏడాదికి రెండుసార్లైనా దుబాయ్ కి వెళ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

Mahesh Babu: విల్లా రిజిస్ట్రేషన్ కోసమే వెళ్లారా …


అయితే దుబాయ్ కి వెళ్ళినప్పుడు తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలన్న కారణంతో దుబాయిలో ఒక ఖరీదైన విల్లా అని మహేష్ బాబు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అది కూడా సముద్ర తీరాన ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో విలాసవంతమైన విల్లానీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్ లోనే మహేష్ బాబు ఇలా విల్లా కొనుగోలు చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. తరచూ దుబాయ్ కి వెళ్లటమే కాకుండా నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా దుబాయిలో సెటిల్ అవ్వటంతో . మహేష్ బాబు కూడా అందరికీ వీలుగా దుబాయిలోనే విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విల్లా రిజిస్ట్రేషన్ కోసం మహేష్ బాబు కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్లినట్లు సమాచారం.