Tag Archives: vishal

Vishal: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో విశాల్.. ఏమన్నారంటే?

Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విశాల్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఇకపోతే తాజాగా విశాల్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆగస్టు 29వ తేదీ విశాల్ తన 46వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజుకు వేడుకలలో భాగంగా ఈయన చెన్నైలోని కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ ను కట్ చేశాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన తల్లి ఈ మార్కెట్లోనే కూరగాయలు పువ్వులు కొనుగోలు చేస్తూ ఉంటారని తెలియజేశారు అనంతరం ఈ వేడుకలలో భాగంగా ఈయన విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు.

గత కొంతకాలంగా హీరో విజయ్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి స్పందించినటువంటి విశాల్ విజయ్ రాజకీయాలలోకి వస్తే తప్పకుండా తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు.

Vishal: మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను…


ఇలా విజయ్ రాజకీయాలలోకి వస్తే తన మద్దతు ఉంటుందంటూ విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పుట్టినరోజు సందర్భంగా విశాల్ కీల్పాక్ లోని అనాధ ఆశ్రమానికి వెళ్లి అక్కడ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారితో పాటు కొంత సమయం గడిపి ఈయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

Mohan Babu: సినిమా పేరే కాదు.. విశాల్ కి కూడా చాలా పొగరు… మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Mohan Babu: మంచు ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా లేదా ఏ ఈవెంట్లో అయినా పాల్గొని మాట్లాడారు అంటే అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు మంచు ఫ్యామిలీ నేటిజన్ల ట్రోలింగ్ కు గురవుతూ వచ్చింది. తాజాగా మంచు మోహన్ బాబు సైతం హీరో విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక జరగడంతో మోహన్ బాబుకు విశాల్ ఫోన్ చేసి అంకుల్ మీరు నా సినిమా ఈవెంట్ కు రావాలి అని అడగడంతో వచ్చానని తెలిపారు.తాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇతర సినిమా ఈవెంట్లకు హాజరు కాలేదని కేవలం తన ఫ్యామిలీ సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరవుతున్నానని తెలిపారు.

ఇక విశాల్ తండ్రి గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఇకఈ వేడుకలో భాగంగా మోహన్ బాబు విశాల్ గురించి మాట్లాడుతూ తనకు పొగరు ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఏ సందర్భంలో మోహన్ బాబు విశాల్ గురించి అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే…

Mohan Babu: విశాల్ కి కాస్త పొగురు ఉందని నాకు తెలుసు…

విశాల్ హీరోగా నటించిన పందెంకోడి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని మోహన్ బాబు తెలిపారు.తాను ఎంతో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటారు. ప్రేమ చదరంగం పొగరు వంటి సినిమాలు కూడా ఇదే కోవకు చెందాయని మోహన్ బాబు తెలిపారు. వాస్తవానికి విశాల్ కి కూడా పొగరు ఉందని నాకు తెలుసు మనిషికి పొగరు ఉండాలి అయితే ఆ పొగరు ఇతరులకు హాని చేసేలా ఉండకూడదు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు విశాల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Hero vishal: సీఎం జగన్ అంటే ఇష్టం…కుప్పం రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్!

Hero vishal: కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ తాజాగా లాఠీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా హీరో విశాల్ తిరుపతిలోని పలు కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు విశాల్ సమాధానాలు చెప్పారు. అయితే ఓ విద్యార్థి హీరో విశాల్ ను ప్రశ్నిస్తూ మీకు రాజకీయాలలో ఏ నాయకుడు అంటే ఇష్టం అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తనకు జగన్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. అదేవిధంగా కుప్పం రాజకీయ ఎంట్రీ గురించి కూడా విశాల్ మాట్లాడారు.
తనకు కుప్పంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని అయితే తాను రాజకీయాలలోకి మాత్రం రావడంలేదని స్పష్టత ఇచ్చారు.

Hero vishal: సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదు…


ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదని ఈయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ తాను చాలా సంతోషంగా ఉన్నానని, రాజకీయాలలోకి వచ్చే ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా విశాల్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actress Trisha: ఘనంగా సీరియల్ నటి త్రిష ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Actress Trisha: బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష అనంతరం పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో పలు సీరియల్స్ లో సందడి చేసిన ఈమె రీసెంట్గా మనసిచ్చి చూడు సీరియల్ లో కూడా రేణు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ విధంగా మనసిచ్చి చూడు సీరియల్ లో నటి కీర్తి భట్ కి చెల్లెలి పాత్రలో నటించిన త్రిష ఈ సీరియల్ తర్వాత ఇతర సీరియల్స్ లో కనిపించలేదు.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుండడంతో ఏ సీరియల్స్ లోను కనిపించలేదంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఈమె స్పందించలేదు అయితే తాజాగా నిశ్చితార్థం చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Trisha: చూడముచ్చటగా ఉన్న త్రిష విశాల్ దంపతులు..

ఇలా నటి త్రిష విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటి త్రిష నిశ్చితార్థానికి మనసిచ్చి చూడు సీరియల్ టీం మొత్తం హాజరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ త్రిష నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi -Vishal: చిరంజీవి ఫ్యామిలీకి విశాల్ ఫ్యామిలీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Chiranjeevi -Vishal: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది.ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా మెగాస్టార్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి గారికి యంగ్ హీరో విశాల్ కి మధ్య ఓ రిలేషన్ ఉంది. అయితే ఆ రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

విశాల్ తండ్రి జీకే రెడ్డి పలు తమిళ, తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసారు.ఇలా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న ఈయన అనంతరం నిర్మాతగా మారి తన కొడుకు విశాల్ ను సందెకోళి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. లింగస్వామి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది అయితే ఇది విశాల్ కి రెండవ సినిమా. ఈ సినిమాని తెలుగులో పందెంకోడి పేరుతో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా విజయం సాధించడంతో విశాల్ హీరోగా వచ్చే సినిమాలన్నీ కూడా ఆయన తండ్రి నిర్మాణంలోనే వచ్చాయి.ఇకపోతే ఈయన విశాల్ హీరో కాకముందు పలు తెలుగు తమిళ సినిమాలను కూడా నిర్మించారు ఈ క్రమంలోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఎస్పీ పరశురామ్ అనే సినిమాకి కూడా విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

Chiranjeevi -Vishal: డిజాస్టర్ గా పరుశురాం..

తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎస్పీ పరశురాం సినిమాని విశాల్ తండ్రి జీకే రెడ్డితో పాటు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా విశాల్ తండ్రితో మెగాస్టార్ చిరంజీవికి ఓ నిర్మాతగా మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి.

ఇంటి కోసం దాచుకున్న డబ్బులను .. పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తా: విశాల్

సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదహారు సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్వర్గీయులైన విషయం తెలిసిందే. దానికి కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో పునీత్‌ సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు.

పునీత్ తో తమకున్న అనుబంధాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన మంచి పనులను కొనియాడారు. ఇందులో భాగంగా విశాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ మరణ వార్త వినగానే షాక్ కు గురయ్యానని.. కళ్ల నుంచి నీరు ఆగలేదని.. ఆ వార్తను తాను జీర్ణించుకోలేకపోయానని విశాల్ చెప్పాడు.

పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన కార్యక్రమాలు ఎవ్వరికీ తెలియదని.. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన సేవా కార్యక్రమాల్లో తాను భాగం కావాలనుకుంటున్నానని తెలిపారు. అందులో భాగంగా పునీత్‌ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను.. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తానన్నారు.

సినిమాల్లో ఇన్ని రోజుల నుంచి తాను నటిస్తున్నప్పడికీ సొంత ఇల్లు అనేది లేదని.. ఇప్పటికీ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నానని చెప్పారు. సొంత ఇంటి కోసం డబ్బులు దాచుకున్నానని.. ప్రస్తుతం ఆ డబ్బులనే పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానన్నారు. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని విశాల్‌ అన్నారు. ఈ సభపైనే శరత్ కుమార్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

పునీత్ బాధ్యతలను తీసుకున్న హీరో విశాల్.. వారందరినీ నేనే చదివిస్తా అంటూ..?

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖులు తేరుకోలేకపోతున్నారు. ఎంతో మంచి నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రేక్షకుల మదిలో విశేష ఆదరణ సంపాదించుకున్న పునీత్ మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉండగా పునీత్ మరణం పై హీరో విశాల్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే విశాల్ నటించిన “ఎనిమి” సినిమా నవంబర్ 4వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో విశాల్ నటుడు పునీత్ ను గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పునీత్ నటుడిగా మాత్రమే కాకుండా 1,800 మంది పిల్లలను చదివిస్తూ వారి బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎన్నో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే పునీత్ మరణం తనని ఎంతో కృంగదీసిందని, పునీత్ తనకు ఒక మంచి మిత్రుడన్న విషయాన్ని ఈ సందర్భంగా విశాల్ వెల్లడించారు.

ఇక తన మిత్రుడి మరణానంతరం తన మిత్రుడి బాధ్యతలను తాను తీసుకుంటున్నానని ఇకపై 1800 మంది పిల్లల చదువులను, వారి బాగోగులను తాను చూసుకుంటానని ఈ సందర్భంగా విశాల్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు హీరో విశాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలపాలైన హీరో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని యాక్షన్ సీన్లకు హీరోలు కాకుండా వారి స్థానంలో వారికి డూప్ పెట్టి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా తమిళ స్టార్ హీరోలైన ఆర్య, విశాల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆర్య డూప్ లేకుండా యాక్షన్ సీన్ కోసం జంపింగ్ చేస్తుండగా గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్య, విశాల్ అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మొదటగా వరుడు సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్య ప్రస్తుతం విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు “ఎనిమీ”అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెన్నైలో షూటింగ్ చేస్తుండగా ఆర్య ఎలాంటి డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలైనట్లు చిత్రబృందం తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పూర్తవ్వగానే తిరిగి ఆర్య షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్రబృందం తెలిపారు. అంతేకాకుండా ఆర్య అల్లు అర్జున్ తో ఇదివరకే వరుడు సినిమాలు విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే, అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం ఆర్య ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారనే సమాచారం వినబడుతోంది.