Tag Archives: women

ఓ వైపు భర్తతో కాపురం చేసి.. మరో వైపు ప్రియుడితో రాసలీలు సాగించింది.. చివరకు ఏమైందంటే..?

ఇద్దరు పిల్లల తల్లి… 22 ఏళ్ల కాపురం.. అయినా సంతోషకరమైన జీవితాన్ని వదిలి తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందో మహిళ. ఆ మహిళ కోసం అటు భర్త, ఇటు ప్రియుడు నాకంటే నాకంటూ కొట్టుకుంటున్న ఘటన హైదరాబాద్, హన్మకొండ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ టీచర్స్ కాలనీలో ఉంటున్న లంకా శశికాంత్ (42), భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యవతి(35) భార్య భర్తలు. వీరిద్దరికి ఒక కుమారుడు(16), కుమార్తె (13) ఉన్నారు.

శశికాంత్ కు, దుర్గా సుశీలకు 1999లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పిన సుశీల ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె ఉడాయించింది.  భార్య కోసం చాలా చోట్ల వెతికినా ఆమె జాడ కనిపించలేదు. చివరకు ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యప్రసాద్ తో వెళ్లిపోయిందని తెలిసింది.

భార్య బంగారం, నగలుతో పారిపోయిందని స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో శశికాంత్ ఫిర్యాదు చేశారు. అయితే వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిచారు. కాగా తనకు పెళ్లి కాలేదని.. శశికాంత్ తన  భర్త కాదని, అక్క చనిపోతే చుట్టం చూపుగా వచ్చానని.. ఈ పిల్లలు నాకు పుట్టలేదని సమాధానం ఇచ్చింది సుశీల. అయితే పోలీసులు విచారణ జరపగా.. దుర్గా సుశీల, శశికాంత్ భార్యే అని తేలింది.

ఇదిలా ఉంటే ప్రియుడు సత్యప్రసాద్ తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్ లో కాపురం పెట్టి.. సహ జీవనం చేయసాగారు. కాగా ఈనెల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో సుశీలను, సత్య వరప్రసాద్ పెళ్లి చేసుకోవడం కొసమెరుపు. ఈ క్రమంలో మళ్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. తన పిల్లలకు తల్లి ప్రేమ కావాలని.. నా భార్యను నాకు అప్పగించండి అని వేడుకున్నాడు. కాగా ఇదిలా ఉంటే రెండో భర్త సత్య వర ప్రసాద్ తన భార్య సుశీల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని.. కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం వెతుకుతున్నారు.

ఎంతో మంది మహిళలకు స్పూర్తి యాంకర్ సుమ.. దగ్గుపాటి రానా..!

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ లో లీడ్ రోల్ లో కనిపించనుంది. జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా తన నటనను వెండితెరపై చూపించనుంది. సుమ భర్త రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తున్నా.. సుమ మాత్రం ఇప్పటి వరకు బుల్లి తెరకే పరిమితమైంది.

తన వాక్చాతుర్యంతో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. సుమ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం జయమ్మ పంచాయతీ టీజర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రం టీజర్ ను రానా ఆదివారం విడుదల చేశారు. సుమగారు నటించిన జయమ్మ పంచాయతీ పెద్ద హిట్ కావాలిని ఆయన కోరుకున్నారు. ఇలాగే సినిమాలు, షోలు చేస్తూ.. మరిన్ని భాషల్లో నటించాలని ఆయన అన్నారు. సుమ ఎందరో మహిళలకు స్పూర్తి అంటూ చెప్పుకొచ్చాడు. సుమ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నానని తెలిపారు. ఇదో విభిన్న కథా చిత్రమని ఆమె వెల్లడించారు.

ఈ సినిమాకు 18 రోజులు పనిచేయాలనుకున్నా… 40 రోజులు పనిచేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కీరవాణి ఒక్క ఫోన్ కాల్ తోనే సినిమాకు మ్యూజిక్ అందిచారని ఆయనకు థాంక్స్ చెప్పింది. ఇక డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సుమ గారిని విధే పరిచయం చేసిందన్నారు. ఈ సినిమా ఆమె వల్లే జరుగుతుందని వెల్లడించారు. ఈ సినిమా తర్వాత సుమను అంతా జయమ్మగా పిలుస్తారనన్నారు.

వివాహితతో ఎస్సై రాసలీలలు.. ఆ సమయంలో వారిద్దరు మునిగితేలుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త..!

వివాహేతర సంబంధాలు ఎంత దూరం దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణికావేశంలో ఏమైనా చేస్తుంటారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబపెద్ద దిక్కు లేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా..మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఇక వాళ్లు చెప్పే మాటలు సామాన్య ప్రజలు వింటారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది.

తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహితతో స్థానిక ఎస్సై వివాహాతేర సంబంధం సాగించాడు. దీంతో ఓ రోజు అతడిని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నషేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

అతడు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలు కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె భర్త స్థానికులు, స్నేహితుల సహాయంతో తెలుసుకున్నాడు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. అలా అతడు బయటకు వెళ్తున్నట్లు చెప్పి.. పక్కే సమీపంలో కాపు కాశాడు. దీంతో ఆ మహిళ అనుకున్నట్లుగానే ఎస్సైకి ఫోన్ చేసి.. ఇంటికి రప్పించింది.

ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి దవాఖానకు తరలించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎస్సై షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

అఘోరాను పెళ్లి చేసుకున్న మహిళ.. ఎక్కడో తెలుసా..?

మనం చూడటానికి వింతరూపంలో కనిపిస్తారు అఘోరాలు. ఒంటి నిండా బూడిద రాసుకొని.. జుట్టు మొత్తం శరీరం అంతా కలిసేట్లు.. కొంతమంది బట్టలు ధరించకుండా ఉంటారు. వీళ్లను చూస్తే కొంతమందికి వణుకు పుడుతుంది. చిన్న పిల్లలు అయితే భయపడి పోతుంటారు. అయితే తాజాగా అఘోరా విషయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది.

ఏమైందంటే.. ఓ అఘోరాను.. ఓ మహిళ వివాహం చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా.. అరియమంగళానికి చెందిన మణికందన్ అనే అతడు అఘోరాగా మారాడు. అతడు కాశీలో అఘోరాగా ఉపాసన చేశాడు. తర్వాత కొన్నాళ్లకు స్వగ్రామం వచ్చి కాళీమాత విగ్రహం ఏర్పాటు చేశాడు.

అందులోనే పూజలు చేస్తూ ఉండేవాడు. అతడికి అప్పటికే కోల్ కత్తాకు చెందిన మహిళను వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. ఇతడి దగ్గర ప్రియాంక అనే ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటూ ఉంది. దీంతో ఆమె అతడిపై మోజుతో తాజాగా వివాహం చేసుకుంది.

ప్రియాంక శరీరం కూడా అఘోరాలాగే ఉంది. అతడు తాళి కట్టగానే పూజారి, అక్కడ ఉన్న తోటి అఘోరాలు ఆశీర్వదించారు. అక్కడ ఈ పెళ్లి వేడుకు ఓ పండగలా జరిపించారు అఘోరాలు. కళ్యాణం అనంతరం మరోసారి యజ్ఞం నిర్వహించి వారి స్టైల్లో హోమానికి నమస్కరించారు.

టవల్ తో కట్టేసి.. నలుగురు కలిసి.. ఆమెపై అత్యంత దారుణానికి పాల్పడ్డారు..

రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు తెచ్చినా.. పిరిస్థితుల్లో మార్పు రాలేదు. మహిళ బయట అడుగుపెట్టింది మొదలు.. ఇంటికి తిరిగి వచ్చేదాక రక్షణ లేకుండా పోతోంది. దీంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహిత అర్ధరాత్రి కాలకృత్యాల కోసం నది ఒడ్డుకు వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన నలుగురు దుర్మార్గులు.. ఆ వివాహితను టవల్‌తో కట్టేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లా నిమపారాలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కాలకృత్యాలకు ఆమె ఇంటి సమీపంలోని కాలువ ఒడ్డుకు వెళ్లింది. ఆమె ఒటరిగా వెళ్లింది గమనించిన కొందరు ఆమెను ఫాలో అయ్యారు. ఒంటరిగా ఉన్నది చూసి.. ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. టవల్ తో కట్టేసి.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఘోరానికి పాల్పడ్డారు.

ఎంతకూ ఆమె ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు వెళ్లి చూడగా.. షాక్ అయ్యారు. సంఘటనా ప్రదేశంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలితో పాటు… కుటుంబసభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపాడు.

ప్రేమించాడు.. శారీరకంగా దగ్గర అయ్యాడు.. పెళ్లి చేసుకోమంటే ఇలా చేశాడు..

ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులు మోస పోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి .. చివరకు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసే మోసగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.

అలాంటి వారికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ.. పెజ్జోనిపేటకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

మొదట్లో తన తోటి మహిళలతో స్నేహం చేసిన సదరు యువతి.. తర్వాత తన క్లాస్ కు చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తోటి విద్యార్థి సుహృద్‌. ప్రేమిస్తున్నట్లు వెంట పడ్డాడు. ఆమె మొదట నిరాకరించింది. పెళ్లి చేసకుంటానని నమ్మించాడు.

తర్వాత ఆమెను తీసుకొని బయట తిరగడం ప్రారంభించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైగికంగా దగ్గరయ్యాడు. తర్వాత ఓ రోజు సదరు యువతి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. ఒత్తిడి ఎక్కువగా రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ.. తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని తెలుసుకొని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఢిల్లీలో దారుణం.. పట్టపగలు మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు..

దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేయడానికైనా వెనకాడం లేదు దుండగులు. పట్టపగలు ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా గొంతకోసి చంపేశాడు. సదరు మహళ కూరగాయల బండి పెట్టుకొని జీవిస్తుంది. రాజపురిలోని సోమ్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. దీనికి సబంధించి వీడియో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.

ఢిల్లీలోని డాబ్రి ప్రాంతంలో రద్దీగా ఉండే రాజపురిలోని సోమ్ బజార్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. రాజపురిలోని సోమ్ బజార్ రోడ్డులో విభ (30) అనే మహిళ ఇద్దరు పిల్లలతో చిన్న కూరగాయల షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె దగ్గరకు దిలీప్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొని డబ్బులు చెల్లించలేదు. వాటిని తాను అప్పుగా తీసుకున్నాని పేర్కొన్నాడు.

అప్పు చెల్లించాలని ఆ మహిళ ప్రశ్నించడంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతుకోసినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవ అనంతరం తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది. దీంతో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు.

ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడి పట్టుకొని చితక్కొట్టారు. ఆమెను అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిదంటూ వైద్యులు వెల్లడించారు. అక్కడ జరిగిన ఈ ఉదంతం మొత్తం సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. గాయపడిని ఆ నిందితుడిని పోలీసులు మొదట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంతో నిండిపోయింది. బాధిత మమిళ చిన్న పిల్లలు అనాథలుగా మారారు.

చూడటానికి ఆమె హీరోయిన్ లా కనిపిస్తుందా.. ? ఆమె చేసిన పని ఏంటో తెలుసా..

సమాజంలో సంపాదించాలంటే ఎన్నో రకాల దారులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ దారుల్లో కూడా చెడు ఉంటుంది.. మరికొన్ని మంచి కూడా ఉంటాయి. మంచి దారులు ఎంచుకొని ముందుకు వెళ్తే.. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది.

అయితే ఇక్కడ ఓ మహిళ ఓ డాక్టర్ ను బెదిరించి డబ్బులను డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె లాల్ సలామ్ అనే మావోయిస్టు పేరుతో ఆ డాక్టర్ కు బెదిరింపు లేఖ రాశారు. ఆ మనిషిని చూస్తే మనం అలా ఊహించలేము.

ఇక్కడ కనిపించే ఫొటోలో కనిపించే మహిళే ఇలాంటి ఘనకు పాల్పండింది. ఆమె చూస్తుంటే హీరోయిన్ లా ఉన్నారు. కానీ ఇలాంటి దారిని ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. ఆమె చేసే నేరం గురించి తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక సామాన్య మహిళ మావోయిస్టు అంటూ చెప్పి.. ఒక డాక్టర్ కు లేఖ రాసి రూ.50 లక్షలు ఇవ్వమని డాక్టర్ కు బెదిరింపు లేఖ రాయడం కలకలం స్పష్టించింది.

రూ.50 లక్షలు ఇవ్వకపోతే నిన్ను.. నీ కొడుకును కూడా చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. మొదట కంగారు పడిపోయిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. వివరాలను ఆరా తీయగా.. ఆమె యూట్యూబ్ లో చూసి డాక్టర్ ను ఎలా బెదిరించాలో నేర్చుకున్నట్లు తెలిపారు. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరిచారు.

కనుబొమ్మలు అందంగా కనిపించాలా అయితే .. ఈ చిట్కాలను పాటించండి..

మహిళ అందాన్ని ఎక్కువగా కనుబొమ్మలు పెంచుతాయి. అవి ఒత్తుగా ఉంటే చూసే వారికి మంచిగా అనిపిస్తుంటుంది. తీరైన, ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి అందాన్ని తీసుకొస్తాయి. చాలా వరకూ అందరికీ అలా దృఢమైన కనుబొమ్మలు ఉండవు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు పొందొచ్చు.

కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు లేదా మూడుసార్లు పెట్రోలియం జెల్లీ(వాజిలైన్)‌ని అప్లై చేయాలి. అయితే, కేవలం రాసి అలా ఉంచకుండా కాస్తా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. ఇదే కాకుండా కనుబొమ్మలు పెరగడానికి ఆముదం రాయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

ఆముదంలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల మీ ఐబ్రోస్ ఒత్తుగా, స్ట్రాంగ్ గా పెరుగుతాయి. విటమిన్ ఇ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది.

కాబట్టి రోజూ రాత్రి ఈ ఆయిల్‌ని అప్లై చేసి కాస్తా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అవి ఒత్తుగా పెరగాలంటే.. మెంతుపిండి, ఆల్మడ్ ఆయిల్, ఉల్లి రసం మరియు కలబంద జెల్ కూడా అప్లై చేయవచ్చు. కానీ ఏది పూసిన కళ్లను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.

పెళ్ళి పేరుతో తనను మోసం చేసాడంటూ.. హీరో ఆర్యపై చీటింగ్ కేసు..

ఎన్నో అంచనాలపై వచ్చిన ‘సార్పట్ట’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. అంచనాలకు దగ్గట్టూ రానిస్తోంది. విమర్శకులు సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్య.. అతడి భార్య సాయేషా సైగల్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

దీంతో ఆ ఇంట రెండు పండగలు ఒక్కసారే వచ్చినట్లు అయింది. ఇటు సినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి సంతోషంలో ఉండగా.. ఇలా అమ్మాయి పుట్టడంతో కుటుంబం మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్యపై జర్మనీకి చెందిన తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని..అంతే కాకుండా తన వద్ద రూ.70 లక్షల వరకు వసూలు చేశాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో కంప్లైంట్ చేసింది.

వాళ్లిద్దరు ఒకరినొకరు చేసుకున్న వాట్సాప్ చాట్ ను కూడా చూపించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.

అతడు సాయేషా లవ్ చేసింది ఎప్పుడంటే.. నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్​ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్​లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వారి మధ్య లవ్ పుట్టుకొచ్చింది. తర్వాత వీళ్లిద్దరు కలిసి 2019 మార్చి 10న పెళ్లి చేసుకున్నారు. ఆర్య వివాహ అనంతరం ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ సినిమా చేశారు. సాయేషా గర్భం దాల్చిన విషయం ఆమె ప్రసవించిన తర్వాత హీరో విశాల్ చెప్పే వరకు ఎవరకీ తెలియదు.