సినీ ప్రపంచమంటేనే అందని ఆకాశం లాంటిది. ఆ ఆకాశానికి ఆశల నిచ్చెనలేస్తూ అందుకోలేని తీరాలకోసం పరుగులు పెట్టే నవ కధానాయికల బలహీనతలను ఆసరాగా చేసుకుని కోరిక తీరిస్తేనే అవకాశమిస్తామంటూ వేధించే సినీరంగ ప్రముఖుల కోసం మీటూ ఉద్యమం మొదలైంది. కాస్త లేటైనా లేటెస్ట్ గా మొదలైన ఈ ఉద్యమంలో శ్రీరెడ్డి.. గాయత్రి గుప్తా..

శ్రీ దత్తా వంటి కొందరు కధానాయికలు మీడియా ముందుకొచ్చి తమ మనోభావాలను వెల్లడించారు. తాజాగా ఈ వివాదానికి తెరలేపుతూ మరో వర్ధమాన కధానాయిక మీడియా ముందు తన నోరు విప్పింది.. వివరాల్లోకి వెళ్తే..
తమిళనటి పూర్ణితయే ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కళ్యాణి పేరుతో ఈమె తమిళంలో సినిమాలు చేసింది. జయం సినిమా తమిళ రీమేక్లో సదా చెల్లి పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది.

ఆ పాత్ర పేరు కళ్యాణి కావడంతో ఇక అదే తన పేరుగా తర్వాత సినిమాలకు కాంటిన్యు చేసింది. ఇన్బా, కాత్తి కాప్పల్, ఎస్ఎమ్ఎస్, పెరుంతూ తదితర సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీ కి దూరమైపోయింది. తెలుగులో మళ్లీ మళ్లీ అనే సినిమా కూడా చేసింది. అయితే అవకాశాలు వస్తున్న సమయంలో ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యావని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.. దీనికి సమాదానంగా ఆమె అవకాశాలు ఇస్తామని అంతా పిలుస్తున్నారు.. మంచి సినిమాలు కదా చేద్దాం అని వెళితే చివరికి వాళ్లు మా కోరిక తీరిస్తేనే నీకు సినిమాలో ఛాన్సిస్తామంటూ అసభ్యకరంగా మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది ఆని చెబుతోంది కళ్యాణి. అందుకే తాను సినిమాలు చేయాలనే ఆలోచన వదులుకున్నానని చెప్పింది. గతంలో ఆమె తల్లిని కూడా ఇలాగే వేధించేవారని.. అందుకే ఆమె కూడా సినిమాలకు దూరమైపోయిందని చెప్పిందామె.

కమిట్మెంట్ కానీ లేకపోయుంటే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తాను షాలిని, హన్సిక స్థాయికి ఎదిగి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది కళ్యాణి. కానీ కొందరు కమిట్మెంట్ పేరుతో తన కెరీర్ నాశనం చేసారని ఆవేదన చెందింది కళ్యాణి. తాజాగా వెలుగులోకి వచ్చిన కళ్యాణి హాట్ హాట్ కామెంట్స్ తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. చూద్దాం.. మరి ఈమె రియాక్షన్ కు మీటూ ఉద్యమ సభ్యుల యాక్షన్ ఎలా వుంటుందో..?!☺️



























