ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. తమిళనాడులోని చెన్నై, అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద దుమారాన్ని రేపే అవకాశముంది.

జూన్ 22న తమిళనాడులోని మధురై జిల్లా మురుగన్ భక్తుల సదస్సు (Murugan Devotees Conference) లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై కూడా హాజరయ్యారు. అయితే, ఈ సభ ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అభియోగాల ప్రకారం, సభ నిర్వహణలో సార్వజనిక నిబంధనలు ఉల్లంఘించారని, పబ్లిక్ ఆర్డర్కు హాని కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం, అధికార స్థానం దృష్ట్యా ఈ కేసు తీవ్ర రాజకీయ చర్చనీయాంశంగా మారింది.
ఇకపై పవన్కల్యాణ్, అన్నామలై ఇలా రాజకీయంగా కలసి పని చేయడంపై తమిళనాడు అధికార వర్గాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు పవన్ అభిమానులు మాత్రం ఇది కావాలని చేసిన రాజకీయ కుట్రగా అభిప్రాయపడుతున్నారు.
పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది..


































