Connect with us

Featured

అజిత్, దేవయానీలను గదిలో బందించి మరీ ఇబ్బంది పెట్టింది ఎవరు..? వారు చేసిన తప్పేంటి !!

Published

on

చాలామంది సినీ నిర్మాతలు వారు నిర్మించే సినిమాలకోసం బయట ఫైనాన్స్ తీసుకొని సినిమా నిర్మించడం పరిపాటే. అయితే సినిమా హిట్ అయితే పరవాలేదు… కాకపోతేనే బాధ, వారు తీసుకున్న అప్పులు తీర్చలేక, అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరికి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో చూశాం. ఇకపోతే కొన్నాళ్ల కిందట కాలివుడ్ పరిశ్రమపై ఇలాంటి మాఫియా పంజా విసిరింది.

చాలా సంవత్సరాలుగా మదురై అంబు మా ఫి యా ఆ చిత్ర పరిశ్రమను కలిచివేసింది. ఈ మా ఫి యా చేసిన ఆకృత్యాలకు అనేక మంది నటులు దర్శక, నిర్మాతలు బలయ్యారు. ఇకపోతే తమిళ సినీ నిర్మాత అశోక్ కుమార్ బలవాన్మరణం కారణంగా తమిళ పరిశ్రమలో వీరు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ కారణాలకు కారకుడు సినీ ఫైనాన్షియర్ అన్బు చెజియాన్ కారణమని తేలింది. దీంతో అతనిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు అజ్ఞాతం లోకి జారుకున్నాడు. అయితే ఇతనిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు ఏర్పాటు చేయగా 2011లో అతనిని, అతని సహచరులు మురళి రామకృష్ణుని కూడా బలవంతపు వసూళ్లు నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. దీని ప్రధాన కారణం నిర్మాత అశోక్ కుమార్ బలవాన్మరణం చేసుకోవడానికి కారణం అన్బు చెజియాన్ అని అందులో ప్రస్తావించడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

అయితే ఈ ఫైనాన్సియర్ వల్ల కేవలం దర్శక, నిర్మాతలు మాత్రమే కాకుండా అనేక మంది నటీనటులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ లిస్టులో తమిళ స్టార్ హీరో అయిన అజిత్, హీరోయిన్ గా బాగా పేరు పొందిన దేవయాని లతో సహా అనేకమంది సుప్రసిద్ధ నటీనటులు ఈయన వలలో చిక్కారు. అయితే వీరి ఆకృత్యాలకు అశోక్ కుమార్ కంటే ముందు సీనియర్ నిర్మాత జి. వెంకటేశ్వరన్ కూడా బలవాన్మరణం పొందారు. ఈయన కూడా ఈ ఫైనాన్స్ ము ఠా దగ్గర అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో నుంచి తేరుకోలేక మే 3, 2003 న ప్రాణాలు తీసుకున్నారు. ఇది తమిళ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషయం గురించి అప్పటి అన్నాడిఎంకె ప్రభుత్వానికి అనేకమంది కంప్లైంట్ చేసిన, ఫైనాన్స్ ము ఠా కి అన్నాడీఎంకేతో సంబంధాలు ఉండడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

అయితే వీరి ఉచ్చులో తమిళ స్టార్ నటుడు అజిత్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది ఎలా అంటే కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత బాల నిర్మించిన నాన్ కడవుల్ చిత్రంలో ఆయన మొదటగా నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నారు. అయితే ఈ సినిమా కోసం అజిత్ కు ముందే కొన్ని డబ్బులు కూడా ఇచ్చారు. అయితే సినిమా నుండి అజిత్ తప్పుకోవడంతో ఒప్పందం ప్రకారం సినిమాల్లో నటించడానికి తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు అజిత్ అంగీకరించాడు. అయితే ఈ విషయంలో అన్బు చెజియాన్ జోక్యం చేసుకొని ఇంకా వడ్డీ వేసి ఇవ్వాలని అజిత్ ని ఓ రూమ్ లో బంధించి తమిళ పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించారు. ఈ చర్యతో తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక ఆ తర్వాత కొంతమంది సినీ పెద్దల జోక్యంతో ఆ సమస్య అంతటితో ముగిసిపోయింది.

ఇక ఆ తర్వాత సుప్రసిద్ధ నటి దేవయాని కూడా వీరి వలలో చిక్కుకుంది. ఈవిడ కూడా వాడి దగ్గర డబ్బులు తీసుకొని వారి అప్పు తీర్చలేక తన దగ్గర డబ్బు లేకపోవడంతో చివరికి సీరియల్స్ లో కూడా నటించింది. అయితే మరణించిన నిర్మాత అశోక్ కుమార్ కు అన్బు చెజియాన్ ను పరిచయం చేసింది మాత్రం దర్శకుడు బాలా. దీనికి కారణం బాల దర్శకత్వంలో శశి కుమార్ నిర్మాణంలో తెర కెక్కించిన సినిమాతో అశోక్ సహా నిర్మాత గా ఉన్నారు. అయితే ఆ చిత్ర నిర్మించడానికి డబ్బులు అవసరం పడడంతో దర్శకుడు బాల, అశోక్ కుమార్ కు అన్బు చెజియాన్ కు పరిచయం చేశాడు. ఇలా పరిచయం చేయడం ద్వారానే చనిపోయిన నిర్మాత ఫైనాన్స్ తీసుకున్నారు. ఇలా మొదలైన వారి పరిచయం ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఆయన దగ్గర మరి కొన్ని సార్లు కూడా వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వడ్డీ మా ఫి యా చేతిలో పడితే వారి జీవితాలను గొల్ల చేసుకోవాల్సిందే తప్పించి, ఆ ఊబిలో నుంచి బయటికి రాలేరు. కాబట్టి ఏదైనా అప్పు తీసుకునే ముందు ఇచ్చేవారు ఎలాంటి వారు ఒకటికి రెండు సార్లు కచ్చితంగా తెలుసుకున్న తనే వారి దగ్గరనుండి డబ్బులు తీసుకోండి. లేకపోతే జీవితాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!