Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు తన భార్య అలేఖ్యరెడ్డి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. జనవరి 27వ తేదీ పాదయాత్రలో భాగంగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

ఈ విధంగా ఈయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించడంతో ఒక్కసారిగా ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది.ఇలా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తారకరత్నతో కలిసి చివరిగా తిరుమల వెళ్ళినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ నీతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు ఒక్కసారి నీ గొంతు వినాలని ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక తారకరత్న పెద్దకర్మ తర్వాత ఈమె గత ఏడాది సందర్భంగా తన భర్త తనకు రాసినటువంటి లవ్ లెటర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

Tarakaratna Wife: నిన్ను చాలా మిస్ అవుతున్నా…
ఇలా తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేక తరచు కంటతడి పెట్టుకుంటున్నటువంటి అలేఖ్య రెడ్డి గురించి తన పెద్ద కుమార్తె నిషిక చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే నిషిక తన తల్లి గురించి చెబుతూ అమ్మ నువ్వు చాలా బాధలో ఉన్నావు ఇంకొకసారి ఏడిస్తే నేను నీకు గుడ్ బై చెప్తా అని రాసి ఉన్నటువంటి పోస్టును అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.































